బీజేపీ గురించి అందరికీ తెలిసిందే.! మరి, ఈ బీజేవైసీపీ ఏంటి.? భారతీయ జనతా పార్టీలో వైసీపీ మద్దతుదారుల గురించే ఈ బీజేవైసీపీ ప్రస్తావన వస్తోంది.! పురంధరీశ్వరి అంటే, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు. ఆమె గతంలో కేంద్ర మంత్రిగా కూడా పని చేశారు.
2024 ఎన్నికల నిమిత్తం, అత్యంత వ్యూహాత్మకంగా బీజేపీ అధినాయకత్వం పురంధీశ్వరిని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలిగా నియమించింది. అప్పటినుంచీ, పార్టీని సమన్వయం చేసుకుంటూ వెళుతున్నారు దగ్గుబాటి పురంధీశ్వరి. అయితే, టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడితో పురంధీశ్వరికి వున్న బంధుత్వం నేపథ్యంలో బీజేపీలోని వైసీపీ వర్గం, ఆమెకు వ్యతిరేకంగా పావులు కదుపుతోంది.
ఈ బీజేవైసీపీ వర్గం ఎంతకు తెగించిందంటే, రాజమండ్రి లోక్ సభ నియోజకవర్గంలో పురంధీశ్వరిని ఓడించేందుకు వ్యూహ రచన చేసేంతలా.! ఈ బీజేవైసీపీ వర్గానికి, వైసీపీ నుంచి ఫండింగ్ అందుతోందన్న అనుమానాలు లేకపోలేదు.
సోషల్ మీడియా వేదికగా ఈ బీజేవైసీపీ మద్దతుదారులు చేస్తున్న యాగీతో, కూటమికి ఏమైనా నష్టం వుంటుందా.? అంటే, కూటమికి మొత్తంగా కలిగే నష్టమేమీ వుండకపోవచ్చుగానీ, కూటమి తరఫున పోటీ చేసే బీజేపీ అభ్యర్థులకు మాత్రం నస్టం గణనీయంగానే వుండొచ్చు.
టీడీపీ మీద ఈ బీజేవైసీపీ మద్దతుదారులు విమర్శలు చేస్తే అది వేరే లెక్క. కానీ, ఏకంగా ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరిని ఓడించే కుట్ర అంటే ఆషామాషీ వ్యవహారం కాదు. ఫక్తు వైసీపీ కార్యకర్తల కంటే ఎక్కువగా ఈ బీజేవైసీపీ కార్మికులు బీజేపీకి వ్యతిరేకంగా పని చేస్తున్నారు. అలాగే, కూటమి అభ్యర్థులందరిపైనా ఈ బీజేపీ వైసీపీ వర్గం జుగుప్సాకరమైన దాడి చేస్తోంది సోషల్ మీడియా వేదికగా.
తనపై జరుగుతున్న దుష్ప్రచారం అలాగే కూటమిపై ఏపీ బీజేపీలోని ఓ వర్గం చేస్తున్న దుష్ప్రచారంపై ఇప్పటికే పురంధేశ్వరి, బీజేపీ అధినాయకత్వానికి ఫిర్యాదు కూడా చేసినట్లు తెలుస్తోంది.
This post was last modified on April 22, 2024 2:16 pm
మోహన్ లాల్ వయసు ప్రస్తుతం 66 సంవత్సరాలు. ఇంకో నాలుగేళ్లు పోతే ఏడు దశాబ్దాలు పూర్తి చేసుకోబోతున్నారు. ఇంత ఏజ్…
భర్త ఎవరితోనో సంబంధం పెట్టుకుంటాడు. భార్యకు అనుమానం వస్తుంది. విషయం రూఢి చేసుకుంటుంది. భర్తను జాగ్రత్తగా గమనిస్తూ.. పరాయి మహిళతో…
ఎట్టకేలకు మాజీ రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి రాజకీయ పార్టీ పెట్టనున్నట్లు ప్రకటించారు. గత కొన్ని రోజులుగా జరుగుతున్న ప్రచారానికి…
మిగతా దక్షిణాది రాష్ట్రాలతో పోలిస్తే ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో టికెట్ల ధరలు ఎక్కువ. పైగా పెద్ద సినిమాలు రిలీజైనపుడు అదనపు…
ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబుకు మైకు పట్టడం బాగా తెలుసు. ఆయన మైకు అందుకుంటే.. వినేవారికైనా బోర్ కొడు…
మన తెలుగు ప్రేక్షకులు నిండు మనసుతో భాష భేదం లేకుండా కంటెంట్ బాగుంటే చాలు వసూళ్లు ఇచ్చి మరీ బ్లాక్…