బీజేపీ గురించి అందరికీ తెలిసిందే.! మరి, ఈ బీజేవైసీపీ ఏంటి.? భారతీయ జనతా పార్టీలో వైసీపీ మద్దతుదారుల గురించే ఈ బీజేవైసీపీ ప్రస్తావన వస్తోంది.! పురంధరీశ్వరి అంటే, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు. ఆమె గతంలో కేంద్ర మంత్రిగా కూడా పని చేశారు.
2024 ఎన్నికల నిమిత్తం, అత్యంత వ్యూహాత్మకంగా బీజేపీ అధినాయకత్వం పురంధీశ్వరిని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలిగా నియమించింది. అప్పటినుంచీ, పార్టీని సమన్వయం చేసుకుంటూ వెళుతున్నారు దగ్గుబాటి పురంధీశ్వరి. అయితే, టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడితో పురంధీశ్వరికి వున్న బంధుత్వం నేపథ్యంలో బీజేపీలోని వైసీపీ వర్గం, ఆమెకు వ్యతిరేకంగా పావులు కదుపుతోంది.
ఈ బీజేవైసీపీ వర్గం ఎంతకు తెగించిందంటే, రాజమండ్రి లోక్ సభ నియోజకవర్గంలో పురంధీశ్వరిని ఓడించేందుకు వ్యూహ రచన చేసేంతలా.! ఈ బీజేవైసీపీ వర్గానికి, వైసీపీ నుంచి ఫండింగ్ అందుతోందన్న అనుమానాలు లేకపోలేదు.
సోషల్ మీడియా వేదికగా ఈ బీజేవైసీపీ మద్దతుదారులు చేస్తున్న యాగీతో, కూటమికి ఏమైనా నష్టం వుంటుందా.? అంటే, కూటమికి మొత్తంగా కలిగే నష్టమేమీ వుండకపోవచ్చుగానీ, కూటమి తరఫున పోటీ చేసే బీజేపీ అభ్యర్థులకు మాత్రం నస్టం గణనీయంగానే వుండొచ్చు.
టీడీపీ మీద ఈ బీజేవైసీపీ మద్దతుదారులు విమర్శలు చేస్తే అది వేరే లెక్క. కానీ, ఏకంగా ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరిని ఓడించే కుట్ర అంటే ఆషామాషీ వ్యవహారం కాదు. ఫక్తు వైసీపీ కార్యకర్తల కంటే ఎక్కువగా ఈ బీజేవైసీపీ కార్మికులు బీజేపీకి వ్యతిరేకంగా పని చేస్తున్నారు. అలాగే, కూటమి అభ్యర్థులందరిపైనా ఈ బీజేపీ వైసీపీ వర్గం జుగుప్సాకరమైన దాడి చేస్తోంది సోషల్ మీడియా వేదికగా.
తనపై జరుగుతున్న దుష్ప్రచారం అలాగే కూటమిపై ఏపీ బీజేపీలోని ఓ వర్గం చేస్తున్న దుష్ప్రచారంపై ఇప్పటికే పురంధేశ్వరి, బీజేపీ అధినాయకత్వానికి ఫిర్యాదు కూడా చేసినట్లు తెలుస్తోంది.
This post was last modified on April 22, 2024 2:16 pm
వైసీపీ పాలనా కాలంలో తిరుమల శ్రీవారి పరకామణిలో 900 డాలర్ల చోరీ జరిగిన విషయం తెలిసిందే. ఈ పరిణామం తిరుమల…
నేటి రాజకీయ నాయకులలో చాలామందిలో పారదర్శకత కోసం భూతద్దం వేసి వెతికినా కనిపించదు. జవాబుదారీతనం గురించి మాట్లడుకునే అవసరం లేదు.…
ప్రభాస్ సినిమా అంటే బడ్జెట్లు.. బిజినెస్ లెక్కలు.. వసూళ్లు అన్నీ భారీగానే ఉంటాయి. కొంచెం మీడియం బడ్జెట్లో తీద్దాం అని…
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్లో 5,757…
అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…