బీజేపీ గురించి అందరికీ తెలిసిందే.! మరి, ఈ బీజేవైసీపీ ఏంటి.? భారతీయ జనతా పార్టీలో వైసీపీ మద్దతుదారుల గురించే ఈ బీజేవైసీపీ ప్రస్తావన వస్తోంది.! పురంధరీశ్వరి అంటే, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు. ఆమె గతంలో కేంద్ర మంత్రిగా కూడా పని చేశారు.
2024 ఎన్నికల నిమిత్తం, అత్యంత వ్యూహాత్మకంగా బీజేపీ అధినాయకత్వం పురంధీశ్వరిని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలిగా నియమించింది. అప్పటినుంచీ, పార్టీని సమన్వయం చేసుకుంటూ వెళుతున్నారు దగ్గుబాటి పురంధీశ్వరి. అయితే, టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడితో పురంధీశ్వరికి వున్న బంధుత్వం నేపథ్యంలో బీజేపీలోని వైసీపీ వర్గం, ఆమెకు వ్యతిరేకంగా పావులు కదుపుతోంది.
ఈ బీజేవైసీపీ వర్గం ఎంతకు తెగించిందంటే, రాజమండ్రి లోక్ సభ నియోజకవర్గంలో పురంధీశ్వరిని ఓడించేందుకు వ్యూహ రచన చేసేంతలా.! ఈ బీజేవైసీపీ వర్గానికి, వైసీపీ నుంచి ఫండింగ్ అందుతోందన్న అనుమానాలు లేకపోలేదు.
సోషల్ మీడియా వేదికగా ఈ బీజేవైసీపీ మద్దతుదారులు చేస్తున్న యాగీతో, కూటమికి ఏమైనా నష్టం వుంటుందా.? అంటే, కూటమికి మొత్తంగా కలిగే నష్టమేమీ వుండకపోవచ్చుగానీ, కూటమి తరఫున పోటీ చేసే బీజేపీ అభ్యర్థులకు మాత్రం నస్టం గణనీయంగానే వుండొచ్చు.
టీడీపీ మీద ఈ బీజేవైసీపీ మద్దతుదారులు విమర్శలు చేస్తే అది వేరే లెక్క. కానీ, ఏకంగా ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరిని ఓడించే కుట్ర అంటే ఆషామాషీ వ్యవహారం కాదు. ఫక్తు వైసీపీ కార్యకర్తల కంటే ఎక్కువగా ఈ బీజేవైసీపీ కార్మికులు బీజేపీకి వ్యతిరేకంగా పని చేస్తున్నారు. అలాగే, కూటమి అభ్యర్థులందరిపైనా ఈ బీజేపీ వైసీపీ వర్గం జుగుప్సాకరమైన దాడి చేస్తోంది సోషల్ మీడియా వేదికగా.
తనపై జరుగుతున్న దుష్ప్రచారం అలాగే కూటమిపై ఏపీ బీజేపీలోని ఓ వర్గం చేస్తున్న దుష్ప్రచారంపై ఇప్పటికే పురంధేశ్వరి, బీజేపీ అధినాయకత్వానికి ఫిర్యాదు కూడా చేసినట్లు తెలుస్తోంది.
This post was last modified on April 22, 2024 2:16 pm
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…