టీడీపీ సీనియర్ నేత గంటా శ్రీనివాసరావు వరుసగా అయిదోసారి ఎమ్మెల్యేగా గెలవాలనే లక్ష్యంతో సాగుతున్నారు. ఈ సారి భీమిలి నుంచి పోటీ చేస్తున్న ఆయన విజయంపై ధీమాతో కనిపిస్తున్నారు. తన రాజకీయ జీవితంలో ఓటమన్నదే లేకుండా సాగుతున్న మాజీ మంత్రి గంటా మరోసారి విజయ గంట మోగించాలని చూస్తున్నారు. ఈ సారి భీమిలీలో వైసీపీ సిటింగ్ ఎమ్మెల్యే అవంతి శ్రీనివాసరావు నుంచి గంటా శ్రీనివాసరావుకు గట్టి పోటీ ఎదురవుతుందనే అంచనాలు కలుగుతున్నాయి.
1999లో అనకాపల్లి లోక్సభ నియోజకవర్గం నుంచి టీడీపీ తరపున పోటీ చేసిన గంటా శ్రీనివాసరావు ఎంపీగా గెలిచారు. 2004లో చోడవరం ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ప్రజారాజ్యంలో చేరి 2009లో అనకాపల్లి నుంచి ఎమ్మెల్యేగా నెగ్గారు. ప్రజారాజ్యం కాంగ్రెస్లో విలీనం కావడంతో తిరిగి టీడీపీలో చేరిన గంటా.. 2014లో భీమిలీలో జయకేతనం ఎగురవేశారు. ఇక 2019లో విశాఖ నార్త్ నుంచి ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఈ సారి మళ్లీ భీమిలీ నుంచి బరిలో దిగారు. మరోసారి భీమిలి ప్రజలు తనను ఆదరిస్తారనే నమ్మకంతో గంటా సాగుతున్నారు. మరోవైపు సిటింగ్ ఎమ్మెల్యేగా ఉన్న వైసీపీ నేత అవంతిపై వ్యతిరేకత కూడా తనకు కలిసొస్తుందని గంటా విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.
విశాఖ నార్త్ నుంచి భీమిలీకి వచ్చిన టీడీపీ నాయకుణ్ని ప్రజలు నమ్మరంటూ అవంతి ప్రచారం చేస్తున్నారు. కానీ గతంలో భీమిలీలో తాను గెలిచిన విషయాన్ని గుర్తు చేస్తూ, తాను ఇక్కడి వాడినే అంటూ గంటా రేసులో దూసుకెళ్తున్నారనే చెప్పాలి. కింది స్థాయి నుంచి వైసీపీ నేతలనూ తనవైపు తిప్పుకోవడంలో గంటా సక్సెస్ అవుతున్నారు. బలాన్ని పెంచుకుంటూ మరోసారి విజయం దిశగా సాగుతున్నారు. నియోజకవర్గంలోని పరిస్థితులు, అక్కడ జనాల నాడీని బట్టి ఈ సారి భీమిలీలో తెలుగు దేశం జెండా ఎగరడం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
This post was last modified on April 27, 2024 2:42 pm
తాజాగా ఒక ప్రముఖ టీవీ చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన సీఎం జగన్మోహన్ రెడ్డి.. జనసేన అధినేత పవన్…
బీహార్ లో బీజేపీ కోటకు బీటలు వారుతున్నాయి. 2019 ఎన్నికలలో బీజేపీ, జేడీయూ, ఎల్జేపీలతో కూడిన ఎన్డీఏ కూటమి బీహార్…
గతంలో పుష్పలో శ్రీవల్లి పాత్రతోనే ప్యాన్ ఇండియా గుర్తింపు తెచ్చుకున్న రష్మిక మందన్నకు బాలీవుడ్ లో పెద్ద బ్రేక్ ఇచ్చింది…
మొన్న శుక్రవారం విడుదలైన సినిమాల్లో ఏదీ సూపర్ హిట్ అనిపించుకోలేదు. అల్లరి నరేష్ ఆ ఒక్కటి అడక్కు మొదటి రెండు…
ఆస్ట్రేలియాలో చదువుకునేందుకు వెళ్లాలనుకునే విద్యార్థులకు అక్కడ ప్రభుత్వం ఒక షాకింగ్ న్యూస్ చెప్పింది. మే 10 నుండి ఆస్ట్రేలియాలో చదువుకోవాలనుకునే…
ఇంకో రెండు రోజుల్లో విడుదల కాబోతున్న కృష్ణమ్మ హీరో సత్యదేవ్ కు చాలా కీలకం. ఇప్పటికైతే ఈ సినిమాకు తగినంత…