టీడీపీ సీనియర్ నేత గంటా శ్రీనివాసరావు వరుసగా అయిదోసారి ఎమ్మెల్యేగా గెలవాలనే లక్ష్యంతో సాగుతున్నారు. ఈ సారి భీమిలి నుంచి పోటీ చేస్తున్న ఆయన విజయంపై ధీమాతో కనిపిస్తున్నారు. తన రాజకీయ జీవితంలో ఓటమన్నదే లేకుండా సాగుతున్న మాజీ మంత్రి గంటా మరోసారి విజయ గంట మోగించాలని చూస్తున్నారు. ఈ సారి భీమిలీలో వైసీపీ సిటింగ్ ఎమ్మెల్యే అవంతి శ్రీనివాసరావు నుంచి గంటా శ్రీనివాసరావుకు గట్టి పోటీ ఎదురవుతుందనే అంచనాలు కలుగుతున్నాయి.
1999లో అనకాపల్లి లోక్సభ నియోజకవర్గం నుంచి టీడీపీ తరపున పోటీ చేసిన గంటా శ్రీనివాసరావు ఎంపీగా గెలిచారు. 2004లో చోడవరం ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ప్రజారాజ్యంలో చేరి 2009లో అనకాపల్లి నుంచి ఎమ్మెల్యేగా నెగ్గారు. ప్రజారాజ్యం కాంగ్రెస్లో విలీనం కావడంతో తిరిగి టీడీపీలో చేరిన గంటా.. 2014లో భీమిలీలో జయకేతనం ఎగురవేశారు. ఇక 2019లో విశాఖ నార్త్ నుంచి ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఈ సారి మళ్లీ భీమిలీ నుంచి బరిలో దిగారు. మరోసారి భీమిలి ప్రజలు తనను ఆదరిస్తారనే నమ్మకంతో గంటా సాగుతున్నారు. మరోవైపు సిటింగ్ ఎమ్మెల్యేగా ఉన్న వైసీపీ నేత అవంతిపై వ్యతిరేకత కూడా తనకు కలిసొస్తుందని గంటా విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.
విశాఖ నార్త్ నుంచి భీమిలీకి వచ్చిన టీడీపీ నాయకుణ్ని ప్రజలు నమ్మరంటూ అవంతి ప్రచారం చేస్తున్నారు. కానీ గతంలో భీమిలీలో తాను గెలిచిన విషయాన్ని గుర్తు చేస్తూ, తాను ఇక్కడి వాడినే అంటూ గంటా రేసులో దూసుకెళ్తున్నారనే చెప్పాలి. కింది స్థాయి నుంచి వైసీపీ నేతలనూ తనవైపు తిప్పుకోవడంలో గంటా సక్సెస్ అవుతున్నారు. బలాన్ని పెంచుకుంటూ మరోసారి విజయం దిశగా సాగుతున్నారు. నియోజకవర్గంలోని పరిస్థితులు, అక్కడ జనాల నాడీని బట్టి ఈ సారి భీమిలీలో తెలుగు దేశం జెండా ఎగరడం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
This post was last modified on April 27, 2024 2:42 pm
ఒకప్పుడు తెలుగు సినిమాల మీద తమిళ చిత్రాలు స్పష్టమైన ఆధిపత్యం చూపించేవి. అక్కడ ఎంతోమంది మేటి దర్శకులు ఉండేవాళ్లు. కొత్త…
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మరో టెస్ట్ ఎదురు కానుందా? మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం చూస్తున్న నేపథ్యంలో ఆయన ఎవరిని…
ఎంతో గొప్ప పేరు సంపాదించిన లెజెండరీ డైరెక్టర్లలో చాలామంది 70 ఏళ్ల వయసు రాగానే సినిమాలు ఆపేస్తుంటారు. ఆదూర్ గోపాలకృష్ణన్…
సూపర్ స్టార్ రజనీకాంత్, దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ కాంబోలో తెరకెక్కుతున్న జైలర్ 2 విడుదల ముందు అనుకున్న ప్రకారమైతే…
దేశంలో కీలక రాష్ట్రాలైన పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళలతో పాటు మరో రెండు రాష్ట్రాలు అసోం, పుదచ్ఛేరి అసెంబ్లీ ఎన్నికల…
పెద్ద హీరోలకు సామాన్య ప్రేక్షకుల్లోనే కాదు.. ఇండస్ట్రీలోనూ అభిమానులుంటారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్కు అలాంటి ఫ్యాన్స్ ఇండస్ట్రీలో చాలామందే ఉన్నారు.…