అవి 2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు. టీడీపీ నుంచి కాంగ్రెస్లోకి వచ్చి కొడంగల్ అసెంబ్లీ స్థానానికి పోటీ చేసిన రేవంత్ రెడ్డి ఓటమి పాలయ్యారు. అప్పుడు ఎవరైనా ఊహించి ఉంటారా.. రేవంత్ రెడ్డి తెలంగాణ సీఎం అవుతారని, రాష్ట్రంలో కాంగ్రెస్ ముఖ చిత్రంగా మారతారని. కానీ రేవంత్ సవాళ్లను దాటి నిలబడ్డారు. 2019 లోక్సభ ఎన్నికల్లో మల్కాజిగిరి నుంచి విజయదుందుభి మోగించారు. టీపీసీసీ అధ్యక్షుడిగా 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ను విజయతీరాలకు చేర్చారు. ముఖ్యమంత్రి పీఠం అధిరోహించారు. ఇప్పుడు ఇదంతా ఎందుకు అంటారా? ప్రస్తుతం లోక్సభ ఎన్నికల్లోనూ తెలంగాణలో కాంగ్రెస్ మెజారిటీ స్థానాలు గెలిచేలా ఒక్కడే సైన్యమై రేవంత్ సాగబోతున్నారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో రేవంత్ దూకుడు చూశాం. తన సొంత నియోజకవర్గం కొడంగల్లో ఎప్పటికప్పుడూ పరిస్థితి పర్యవేక్షిస్తూనే.. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా సుడిగాలి పర్యటనలు చేశారు. ఇతర నియోజకవర్గాల్లో తమ అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేశారు. ఒక్క రోజులో రెండు మూడు సభల్లో పాల్గొన్నారు. ఇతర అగ్రశ్రేణి నేతలంతా తమ నియోజకవర్గాలకే పరిమితమవుతే రేవంత్ మాత్రం పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లే బాధ్యతను తీసుకున్నారు. పార్టీని గెలిపించుకున్నారు.
ఇప్పుడు లోక్సభ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణపై కాంగ్రెస్ అధిష్ఠానం స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఇక్కడ అధికారంలో ఉండటంతో వీలైనన్ని ఎక్కువ లోక్సభ స్థానాలు గెలవాలని చూస్తోంది. రేవంత్ కూడా 17 స్థానాలకు 15 చోట్ల కాంగ్రెస్ను గెలిపించేలని లక్ష్యంగా పెట్టుకున్నారు. మరోసారి ప్రచారాన్ని పరవళ్లు తొక్కించేందుకు సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్లో రేవంత్కు ఉన్న చరిష్మానే వేరు. కార్యకర్తల్లో కసి నింపి, వాళ్ల రక్తాన్ని మరిగిస్తూ పార్టీ కోసం పని చేసేలా రేవంత్ చేస్తున్నారు. అందుకే పార్టీ కార్యకర్తల్లో రేవంత్పై ఎనలేని ప్రేమ కలుగుతోంది. ఇప్పుడు లోక్సభ ఎన్నికల ప్రచారం కోసం ఆయన నియోజకవర్గాల పర్యటనకు సిద్ధమవుతున్నారు. మరోసారి సుడిగాలి పర్యటనలు చేయబోతున్నారు. తనపై, పార్టీపై ప్రజల ఆదరణను మరోసారి ఓట్ల రూపంలోని మార్చేందుకు అడుగులు వేస్తున్నారు.
కొందరు స్టార్ హీరోయిన్లు కెరీర్ మంచి ఊపులో కొనసాగుతున్న టైంలోనే వ్యక్తిగత జీవితంలో సెటిల్ అవ్వాలని చూస్తుంటారు. ఈ క్రమంలో…
మొన్నామధ్య విడుదలైన యాక్షన్ కింగ్ అర్జున్ డబ్బింగ్ సినిమా 'బ్లాస్ట్ జోన్' తెలుగు రాష్ట్రాల్లో బాగానే ఆడింది. ప్రమోషన్లు పెద్దగా…
పవన్ కళ్యాణ్ స్వయంగా ట్విట్టర్ ఖాతాలో ఈ ఫొటోను పోస్ట్ చేశారు. ఈ ఫొటోలో పవన్ కళ్యాణ్తో పాటు కనిపిస్తున్నది…
సోషల్ మీడియాలో ఇప్పుడో టాపిక్ హాట్ డిస్కషన్ గా మారింది. హైదరాబాద్ కు చెందిన ఒక ప్రేక్షకుడు బుక్ మై…
ఏపీలో తీవ్ర చర్చనీయాంశంగా మారిన గాదె సాయికృష్ణ అదృశ్యం కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే ఈ…
వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం రెడ్డి ప్రస్తుతం వెంటిలేటర్ పై ఉన్నారు.…