దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికల ఫీవర్ పట్టుకుంది. పెరుగుతున్న ఎండల కంటే కూడా రాజకీయ వేడి రోజురోజుకూ పెరుగుతోంది. ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు కూడా ఉండటంతో ఆ ఎఫెక్ట్ ఇంకా ఎక్కువగానే ఉంది. ఇక తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలతో పాటు కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక కూడా హాట్ టాపిక్గా మారింది. ఇక్కడ విజయం కోసం మూడు ప్రధాన పార్టీలు కసరత్తుల్లో మునిగిపోయాయి. ఇప్పటికే కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ తమ అభ్యర్థులను ప్రకటించి సమరానికి సై అంటున్నాయి.
2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో దివంగత నేత సాయన్న తనయ లాస్య నందిత బీఆర్ఎస్ నుంచి గెలిచారు. అప్పుడు కాంగ్రెస్ నుంచి దివంగత ప్రజాగాయకుడు గద్దర్ కూతురు వెన్నెల, బీజేపీ నుంచి శ్రీగణేష్ పోటీ చేశారు. ఇటీవల రోడ్డు ప్రమాదంలో లాస్య నందిత కనుమూయడంతో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. ఇప్పుడు ఈ ఎన్నిక కోసం లాస్య నందిత సోదరి నివేదితను బీఆర్ఎస్ రంగంలోకి దించింది. బీజేపీ నుంచి వచ్చిన శ్రీగణేష్ కాంగ్రెస్ నుంచి పోటీకి సిద్ధమయ్యారు. ఇక బీజేపీ తమ అభ్యర్థిగా వంశ తిలక్ను ప్రకటించింది.
ఇక్కడ సానుభూతితో పాటు బలమైన క్యాడర్ కారణంగా బీఆర్ఎస్ మరోసారి గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. సిటింగ్ స్థానాన్ని చేజార్చుకోవద్దని కేసీఆర్ పట్టుదలతో ఉన్నారు. మరోవైపు గత ఎన్నికల్లో రెండో స్థానంలో నిలిచిన శ్రీగణేష్ ఈ సారి మాత్రం వదలకూడదనే లక్ష్యంతో సాగుతున్నారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ నుంచి ఆయన పోటీ చేయడం కలిసొచ్చే అంశం. ఇక రాజకీయాలకు కొత్త అయిన తిలక్ను బీజేపీ ఎంపిక చేసింది. తిలక్కు ఉన్న రాజకీయ కుటుంబ నేపథ్యమే అందుకు కారణం. తిలక్ తండ్రి టీవీ నారాయణ పద్మశ్రీ పురస్కారం పొందారు. తల్లి సదాలక్ష్మి తొలి డిప్యూటీ స్పీకర్గా, మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. ఇప్పుడు మూడు పార్టీల అభ్యర్థుల ఖరారు కావడంతో కంటోన్మెంట్లో పోరు మరింత హోరెత్తనుంది. మరి విజయం దక్కేది ఎవరికో చూడాలి.
This post was last modified on April 25, 2024 1:22 pm
జూనియర్ ఎన్టీఆర్, దర్శకుడు ప్రశాంత్ నీల్ కలయికలో తెరకెక్కుతున్న డ్రాగన్ (ప్రచారంలో ఉన్న టైటిల్) షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ కు…
సెలబ్రిటీలు చిన్న వాళ్ళైనా పెద్దోళ్ళయినా ఏదైనా మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి ఉందిప్పుడు. సోషల్ మీడియా జమానాలో చిన్న టంగ్…
అభిమానుల్లోనే కాదు సినీ ప్రియుల్లోనూ విపరీతమైన అంచనాలు మోస్తున్న సినిమా పెద్ది. చికిరి చికిరి ఛార్ట్ బస్టర్ పుణ్యమాని హిందీలోనూ…
హైదరాబాద్లోని పంజాగుట్ట పోలీసులు యూట్యూబర్ అన్వేష్ (నా అన్వేషణ)పై లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ప్రస్తుతం అన్వేష్ విదేశాల్లో ఉన్నారని…
ఏపీ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి నానాటికీ తీసికట్టుగా మారుతోందా? .. పార్టీ నాయకులు దీనస్థితిలో ఉన్నారా? అంటే.. ఔననే సమాధానమే…
గత ఏడాది లిటిల్ హార్ట్స్ సినిమా సక్సెస్ మీట్లో నటుడు, నిర్మాత బండ్ల గణేష్ చేసిన వ్యాఖ్యలు ఎంత దుమారం…