Political News

మార్గ‌ద‌ర్శిలో రోజాకి ఖాతా.. జ‌గ‌న్‌కు షాక్‌!!

ఏపీ సీఎం జ‌గ‌న్ షాక్‌కు గుర‌య్యే వార్త ఇది! ఎందుకంటే.. ఈనాడు అధిప‌తి మార్గ‌ద‌ర్శి ఫైనాన్స్ సంస్థ అధినేత రామోజీరావు అక్ర‌మాలు చేస్తున్నార‌ని.. ప్ర‌జ‌ల‌ను మోసం చేస్తున్నార‌ని.. పేర్కొంటూ.. ఆయ‌న సంస్థ‌ల‌పై దాడులు చేయించ‌డం.. కేసులు పెట్టించ‌డం తెలిసిందే. ఇదిప్ర‌స్తుత న్యాయ‌స్థానాల ప‌రిధి లో ఉంది. అంతేకాదు.. ఈ సంస్థ‌ల‌ను మూసేయాల‌ని కొడాలి నాని, జోగి ర‌మేష్ వంటి వారు సైతం డిమాండ్ చేశారు. ఇక‌, సీఐడీ కేసులు.. మేనేజ‌ర్ల అరెస్టులు కామ‌న్ అయిపోయాయి.

క‌ట్ చేస్తే.. సీఎం జ‌గ‌న్‌, వైసీపీ ప్ర‌భుత్వం ఇంత‌గా మోసాలు చేస్తున్నార‌ని ఆరోపిస్తున్న మార్గ‌ద‌ర్శి చిట్స్ సంస్థ‌లో ఇదే ప్ర‌భుత్వానికి చెందిన కీల‌క మంత్రికి ఖాతా ఉంద‌ని తెలుసా? ఇది ప‌క్కా నిజం. ఆ మంత్రి ఎవ‌రో కాదు.. ఫైర్ బ్రాండ్ నాయ‌కురాలు.. జ‌బ‌ర్ద‌స్త్ రోజా. ఈమె తాజాగా ఉమ్మ‌డి చిత్తూరు జిల్లాలోని న‌గ‌రి నియోజ‌క‌వ‌ర్గం నుంచి నామినేష‌న్ దాఖ‌లు చేశారు. ఈ క్ర‌మంలో ఆమె స‌మ‌ర్పించిన అఫిడ‌విట్‌లో ఈ విష‌యం పేర్కొన్నారు.

మార్గ‌ద‌ర్శిచిట్ ఫండ్స్‌లో త‌న పేరుతో రూ.40 ల‌క్ష‌ల విలువైన చీటీ ఉంద‌ని రోజా త‌న అఫిడ‌విట్‌లో పేర్కొన్నారు. దీనిని 2020లో వేసిన‌ట్టు తెలిపారు. అంటే.. అప్ప‌టికే మార్గ‌ద‌ర్శిపై ప్ర‌భుత్వం నుంచి విమ ర్శ‌లు వ‌స్తున్న విష‌యం తెలిసిందే. ఈ సంస్థ మోసం చేసింద‌ని కూడా స‌ర్కారు పేర్కొంది. అయినా.. రోజా ఇక్క‌డ ఇంత విలువైన చీటీ వేయ‌డం చూస్తే.. జ‌గ‌న్ కు షాక్ కాక మ‌రేం వ‌స్తుంది!!

ప్ర‌స్తుతం ఇది రాష్ట్ర వ్యాప్తంగా చ‌ర్చ‌నీయాంశం అయింది. ఒక‌వైపు ప్ర‌భుత్వం మార్గ‌ద‌ర్శిలో అక్ర‌మాలు జ‌రిగాయ‌ని చెబుతుంటే.. మ‌రోవైపు మంత్రే చీటీలు వేయ‌డం ఆశ్చ‌ర్యంగా అనిపిస్తోంద‌ని అంటున్నారు.

This post was last modified on April 20, 2024 10:37 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

మధుర గాయని ఇక లేరు

భారతీయ సినీ చరిత్రలోనే అత్యుత్తమ గాయనీమణుల్లో ఒకరైన ఆశా భోస్లే ఇక లేరు. అనారోగ్యం కారణంగా ఇటీవల ముంబయిలోని బ్రీచ్…

1 hour ago

సర్దార్ 2 ఎందుకు రావడం లేదు

తెలుగులోనూ మంచి గుర్తింపు ఉన్న తమిళ నటుడు కార్తీ ఫిల్మోగ్రఫీలో సర్దార్ సినిమాది ప్రత్యేక స్థానం. నాలుగేళ్ళ క్రితం 2022లో…

3 hours ago

అఖిల్ అభిమానులు ఈసారి ఒప్పుకోరు

షూటింగ్ ఆలస్యాలు, రిలీజ్ వాయిదాల తర్వాత ఎట్టకేలకు జూన్ 26 విడుదల తేదీని లెనిన్ లాక్ చేసుకున్న సంగతి తెలిసిందే.…

4 hours ago

చెప్పుతెగుద్ది… సీత‌క్క బ్లాస్ట్‌!

తెలంగాణలోని కాంగ్రెస్ ప్ర‌భుత్వంలో మంత్రిగా ఉన్న నాయ‌కురాలు.. గిరిజ‌న నేత సీత‌క్క‌(అన‌సూయ‌) ఒక్క‌సారిగా బ్లాస్ట్ అ య్యారు. `చెప్పుతెగుద్ది` అని…

4 hours ago

మహిళల వీడియోలతో చెలగాటం… ఏఎస్సై సస్పెండ్

పల్నాడు జిల్లా మాచర్ల పోలీస్ స్టేషన్ లో పనిచేస్తున్న పోలీసు అధికారుల అవినీతి అక్రమాలు వరుసగా బయటపడుతున్నాయి. ఇప్పటికే మాచర్ల…

5 hours ago

నియోజకవర్గాల పెంపు: ఒరిగేదేంటి.. జరిగేదేంటి?

దేశవ్యాప్తంగా అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గాల పెంపు వ్యవహారం ఇప్పుడు రాజకీయ పార్టీల మధ్య చర్చకు దారితీసింది. ప్రాంతీయ పార్టీలు వీటికి…

10 hours ago