Political News

మునుపటిలా జగన్ పదునైన ప్రసంగాలు చేయాలి

ఎన్నికల్లో ప్రసంగిస్తున్నట్లు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి భావిస్తుండొచ్చుగానీ, ప్రసంగాల్ని ఆయన చదువుతున్నట్లుగా వైసీపీ క్యాడర్ సైతం అసహనం వ్యక్తం చేసే పరిస్థితి వచ్చేసిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఒకప్పటిలా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రసంగాల్లో పస వుండటంలేదన్నది నిర్వివాదాంశం.

ప్రసంగాల్ని ఎవరో రాసిస్తోంటే, వాటిని తప్పుల్లేకుండా చదవడానికీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నానా తంటాలూ పడుతున్నారు. వాస్తవానికి, స్థానిక సమస్యల్ని ప్రస్తావించే క్రమంలో పార్టీల అధినేతలు, ఆయా అంశాల్ని ముందుగానే స్లిప్ మీద రాయించుకుని, వాటిని చదువుతుంటారు.

ఇతరత్రా సాధారణ విషయాల్నీ, రాజకీయ ప్రత్యర్థులపై విమర్శల్నీ.. తమంతట తామే.. అప్పటికప్పుడు తమ మాటలకు పదును పెట్టి విమర్శించేస్తుంటారు. అయితే, జగన్ మోహన్ రెడ్డి విషయంలో ఈ ‘చదువుడు’ కార్యక్రమం ఈ మధ్య వైసీపీ శ్రేణుల్ని బాగా ఇబ్బంది పెడుతోంది.
టీడీపీ అధినేత చంద్రబాబుని విమర్శించాలన్నా, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ని విమర్శించాలన్నా, చివరికి బీజేపీ ఏపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరిని విమర్శించాలన్నా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్క్రిప్టు చదవడం తప్పనిసరైపోతోంది. పోనీ, ఆ స్క్రిప్టు చదవడం అయినా సరిగ్గా వుంటోందా.? అంటే, అదీ లేదాయె.

పాలకొల్లు, గాజువాక, భీమవరం నియోజకవర్గాల్లో పవన్ ఓడిపోయారనీ, పిఠాపురంలోనూ ఓడిపోతారనీ వైఎస్ జగన్ తాజాగా చదివిన ప్రసంగం అందర్నీ విస్మయానికి గురిచేసింది. వైసీపీ శ్రేణులే ఈ ప్రసంగంతో అవాక్కయ్యారనడం అతిశయోక్తి కాదు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో బస్సు యాత్ర సందర్భంగా వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు, వైసీపీ మద్దతుదారులు సమర్థించుకోలేని విధంగా మారాయి.

ఇకనైనా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రసంగాల్ని చదవడం మానేస్తే మంచిదనీ, మునుపటిలా వైఎస్ జగన్, పదునైన ప్రసంగాలు చేయాలని వైసీపీ మద్దతుదారులే సోషల్ మీడియా వేదికగా అభిప్రాయపడుతున్నారు.

This post was last modified on April 19, 2024 11:21 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

శ్రీను వైట్ల సినిమా మామూలుగా ఉండదట

ఒక ఢీ.. ఒక రెడీ.. ఒక కింగ్.. ఒక దూకుడు.. ఇలా ఒక దశ వరకు మామూలు హిట్లు ఇవ్వలేదు…

50 minutes ago

నవ్వించి ఏడిపించి ఇప్పుడు భయపెడుతున్నారు

లిటిల్ హార్ట్స్, రాజు వెడ్స్ రాంబాయి లాంటి చిన్న సినిమాలు పెద్ద విజయాలు సాధించడంలో నిర్మాతలు బన్నీ వాస్, వంశీ…

2 hours ago

బీఆర్ఎస్ `విజ‌య్ దివ‌స్‌`… ఇప్పుడే ఎందుకు?

తెలంగాణ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం తొలిసారి `విజ‌య్ దివ‌స్‌` పేరుతో కీల‌క కార్య‌క్ర‌మానికి పిలుపునిచ్చింది. ఈ నెల 9న‌(మంగ‌ళ‌వారం) రాష్ట్ర వ్యాప్తంగా…

2 hours ago

గోవా… ఉన్న క్రేజ్ కూడా పోయినట్లే..

ఒకప్పుడు గోవా అంటే యూత్ కి అదో డ్రీమ్ డెస్టినేషన్. ఫ్రెండ్స్ తో ప్లాన్ వేస్తే ఫస్ట్ గుర్తొచ్చేది గోవానే.…

2 hours ago

నటి రేప్ కేసు – హీరోపై కోర్టు సంచలన తీర్పు

కేరళలో సంచలనం సృష్టించిన నటి కిడ్నాప్ కేసులో హీరో దిలీప్‌కు ఎనిమిదేళ్ల తర్వాత బిగ్ రిలీఫ్ దక్కింది. ఎర్నాకులం కోర్టు…

3 hours ago

అర్ధరాత్రి షోలు…150 కోట్లు… సినిమా హిట్టే

ఇటీవలే విడుదలైన బాలీవుడ్ మూవీ దురంధర్ అన్ని విషయాల్లో సోషల్ మీడియా టాపిక్ గా మారిపోయింది. రిలీజ్ ముందువరకు ఏమంత…

3 hours ago