బామ్మర్దులు అంటే బావ బతుకు కోరుతరు అని అంటారు. సాలే బౌనే ఏక్ తరఫ్ .. సారీ దునియా ఏక్ తరఫ్ అన్న నానుడి కూడా ఉంది. కానీ రాజకీయాల్లో ఈ నానుడి నిజం కాదు అనడానికి ఆంధ్రప్రదేశ్ గృహనిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ కు ఆయన బామ్మర్ధులు, బంధుగణం ఇచ్చిన షాక్ నిదర్శనం. ఎన్నికల సమయంలో కొందరు నేతలు కండువాలు మార్చడం కామన్. కానీ సొంత బామ్మర్దులే పార్టీ మారడం ఎవరికైనా ఇబ్బందికర పరిణామమే.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న జోగి రమేష్ బామ్మర్దులు పామర్తి దుర్గాప్రసాద్, పామర్తి దుర్గారావు, పామర్తి వెంకటేశ్వరరావులతో పాటు మరో 40 మంది బంధువర్గం ఇబ్రహీంపట్నంలో జోగి రమేష్ ఇంటి ఎదుట ఏర్పాటు చేసిన సభా వేదిక ద్వారా మైలవరం టీడీపీ అభ్యర్థి వసంత క్రిష్ణప్రసాద్ సమక్షంలో టీడీపీ తీర్ధం పుచ్చుకోవడం గమనార్హం. రాష్ట్ర మంత్రిగా కొనసాగుతున్న రమేష్ కు ఈ సమయంలో ఈ పరిణామాలు ఒక పట్టాన మింగుడుపడవనే చెప్పాలి.
This post was last modified on April 19, 2024 4:38 pm
సెలబ్రిటీలు ఏదైనా విషయం గురించి స్పందిస్తే చాలు దాన్ని చిలవలు పలవలు చేయడానికో టీమ్ సోషల్ మీడియాలో రెడీగా ఉంటుంది.…
సినిమా విడుదల ఎప్పుడో తేలకుండానే పైరసీ బారిన పడిన జన నాయకుడు గొడవ రకరకాల మలుపులు తిరుగుతోంది. ముందు లాయర్ తరపున…
సౌత్ మ్యూజిక్ లో సెన్సేషన్ అంటే అనిరుధ్ రవిచందర్ పేరే ముందు గుర్తొస్తుంది. తను పని చేస్తున్నాడని తెలిస్తే చాలు…
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ పార్టీని ప్రక్షాళన చేసే దిశగా అడుగులు పడుతున్నాయి. పార్టీలో సంస్థాగతంగా పనిచేస్తున్న వారిని గత…
2029 పార్లమెంటు ఎన్నికల నాటికి దేశంలో నియోజకవర్గాలను పునర్విభజించాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్న విషయం తెలిసిందే. ఇటు అసెంబ్లీ,…
అమెరికా - ఇరాన్ దేశాల మధ్య నెలకొన్న చర్చల ప్రతిష్టంభన ప్రపంచ దేశాలను పెను సంక్షోభంలోకి నెట్టే దిశగా మారుతోందా?…