Political News

ఏపీలో కేసులు అందుకే పెరుగుతున్నాయా?

ఏపీలో కరోనా పాజిటివ్ కేసులు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. రోజువారీగా వెల్లడిస్తున్న కేసుల లెక్క చూసినోళ్లంతా అవాక్కు అవుతున్నారు. పక్కనున్న తెలంగాణలో కేసుల సంఖ్య పరిమితంగానే బయటకు వస్తుంటే.. అందుకు భిన్నమైన పరిస్థితి ఏపీలో ఎందుకు ఉందన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. తెలంగాణతో పోలిస్తే.. ఏపీలో కేసుల నమోదు అంతకంతకూ పెరగటం వెనుక పలు వాదనలు వినిపిస్తున్నప్పటికీ వాస్తవం మాత్రం వేరుగా ఉందని చెప్పాలి.

తెలంగాణతో పోలిస్తే.. ఏపీలో కరోనా పరీక్షలు ఎక్కువగా నిర్వహిస్తుండటం కూడా కేసులు వెలుగుచూడటానికి కారణంగా చెప్పొచ్చు. ప్రస్తుతం ఏపీలో రోజూ ఎనిమిదివేల మందికి కరోనా పరీక్షల్ని నిర్వహిస్తున్నారు. రానున్న రోజుల్లో ఆ సంఖ్యను పదివేల మంది వరకూ తీసుకెళ్లాలన్న యోచనలో ఉన్నారు. దక్షిణ కొరియా నుంచి దిగుమతి చేసుకున్న కిట్లతో ఎక్కువ పరీక్షలు జరుపుతున్నామని ఆ రాష్ట్రానికి చెందిన పలువురు కీలక అధికారులు చెబుతున్నారు.

దేశ వ్యాప్తంగా ప్రతి పదిలక్షల మంది జనాభాకు 451 మందికి మాత్రమే కరోనా నిర్దారణ పరీక్షలు నిర్వహిస్తున్నారు. దీనికి భిన్నంగా ఏపీలో మాత్రం ప్రతి పదిలక్షల మంది జనాభాకు 1274 మందికి పరీక్షల్ని నిర్వహిస్తుండటం గమనార్హం. ఈ కారణంతోనే కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయని చెప్పక తప్పదు.

ఆదివారం సాయంత్రం నాటికి ఏపీ వ్యాప్తంగా 68,034 టెస్టులు చేయించగా 1097 పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. అంటే.. మొత్తం పరీక్షల్లో 1.6 శాతం మాత్రమే నిర్దారణ కేసులు కావటం గమనార్హం. జాతీయ సగటు చూస్తే ఇది 4.21 శాతంగా ఉంది.

పైకి చూసేందుకు ఏపీలో ఎక్కువగా కేసులు నమోదైనట్లు కనిపిస్తున్నా.. వాస్తవంలో మాత్రం అందుకు భిన్నమైన పరిస్థితి నెలకొందన్నది మర్చిపోకూడదు. చాలా రాష్ట్రాల్లో కరోనా టెస్టులు పరిమితంగా చేయిస్తుండటంతో.. కేసుల నమోదు తక్కువగా నమోదవుతున్నాయి. ఇందుకు భిన్నంగా ఏపీలో ఎక్కువ పరీక్షలు చేయిస్తుండటంతో పాజిటివ్ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి.

This post was last modified on April 27, 2020 2:08 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

పాకిస్థాన్‌లో నో రిలీజ్… అయినా అక్క‌డ‌ బ్లాక్‌బ‌స్ట‌ర్

కొన్నేళ్ల నుంచి భార‌త్‌, పాకిస్థాన్ సంబంధాలు అంతంత‌మాత్రంగా ఉండ‌గా.. ఈ ఏడాది ఆరంభంలో ప‌హ‌ల్గాం ఉగ్ర‌దాడి త‌ర్వాత అవి పూర్తిగా…

4 hours ago

ఫ్లో లో క‌థేంటో చెప్పేసిన హీరో

కొంద‌రు ఫిలిం మేక‌ర్స్ త‌మ సినిమా క‌థేంటో చివ‌రి వ‌ర‌కు దాచి పెట్టాల‌ని ప్ర‌య‌త్నిస్తారు. నేరుగా థియేట‌ర్ల‌లో ప్రేక్ష‌కుల‌ను ఆశ్చ‌ర్య‌ప‌ర‌చాల‌నుకుంటారు.…

5 hours ago

విదేశీ యూనివ‌ర్సిటీల డాక్టరేట్లు వదులుకున్న చంద్రబాబు

ఏపీ సీఎం చంద్ర‌బాబుకు ప్ర‌ముఖ దిన‌ప‌త్రిక `ఎక‌న‌మిక్ టైమ్స్‌`.. ప్ర‌తిష్టాత్మ‌క వ్యాపార సంస్క‌ర్త‌-2025 పుర‌స్కారానికి ఎంపిక చేసిన విష‌యం తెలిసిందే.…

7 hours ago

బంగ్లా విషయంలో భారత్ భద్రంగా ఉండాల్సిందేనా?

బంగ్లాదేశ్‌లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు భారత్‌కు పెద్ద తలనొప్పిగా మారాయి. 1971 విముక్తి యుద్ధం తర్వాత మన దేశానికి ఇదే…

8 hours ago

ఆమెకు ‘ఏఐ’ మొగుడు

ప్రేమ ఎప్పుడు ఎవరి మీద పుడుతుందో చెప్పలేం అంటారు. కానీ జపాన్ లో జరిగిన ఈ పెళ్లి చూస్తే టెక్నాలజీ…

8 hours ago

ఖర్చు పెట్టే ప్రతి రూపాయి లెక్క తెలియాలి

ప్ర‌భుత్వం త‌ర‌ఫున ఖ‌ర్చుచేసేది ప్ర‌జాధ‌న‌మ‌ని సీఎం చంద్ర‌బాబు తెలిపారు. అందుకే ఖ‌ర్చు చేసే ప్ర‌తి రూపాయికీ ఫ‌లితాన్ని ఆశిస్తాన‌ని చెప్పారు.…

9 hours ago