Political News

ఏపీలో కేసులు అందుకే పెరుగుతున్నాయా?

ఏపీలో కరోనా పాజిటివ్ కేసులు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. రోజువారీగా వెల్లడిస్తున్న కేసుల లెక్క చూసినోళ్లంతా అవాక్కు అవుతున్నారు. పక్కనున్న తెలంగాణలో కేసుల సంఖ్య పరిమితంగానే బయటకు వస్తుంటే.. అందుకు భిన్నమైన పరిస్థితి ఏపీలో ఎందుకు ఉందన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. తెలంగాణతో పోలిస్తే.. ఏపీలో కేసుల నమోదు అంతకంతకూ పెరగటం వెనుక పలు వాదనలు వినిపిస్తున్నప్పటికీ వాస్తవం మాత్రం వేరుగా ఉందని చెప్పాలి.

తెలంగాణతో పోలిస్తే.. ఏపీలో కరోనా పరీక్షలు ఎక్కువగా నిర్వహిస్తుండటం కూడా కేసులు వెలుగుచూడటానికి కారణంగా చెప్పొచ్చు. ప్రస్తుతం ఏపీలో రోజూ ఎనిమిదివేల మందికి కరోనా పరీక్షల్ని నిర్వహిస్తున్నారు. రానున్న రోజుల్లో ఆ సంఖ్యను పదివేల మంది వరకూ తీసుకెళ్లాలన్న యోచనలో ఉన్నారు. దక్షిణ కొరియా నుంచి దిగుమతి చేసుకున్న కిట్లతో ఎక్కువ పరీక్షలు జరుపుతున్నామని ఆ రాష్ట్రానికి చెందిన పలువురు కీలక అధికారులు చెబుతున్నారు.

దేశ వ్యాప్తంగా ప్రతి పదిలక్షల మంది జనాభాకు 451 మందికి మాత్రమే కరోనా నిర్దారణ పరీక్షలు నిర్వహిస్తున్నారు. దీనికి భిన్నంగా ఏపీలో మాత్రం ప్రతి పదిలక్షల మంది జనాభాకు 1274 మందికి పరీక్షల్ని నిర్వహిస్తుండటం గమనార్హం. ఈ కారణంతోనే కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయని చెప్పక తప్పదు.

ఆదివారం సాయంత్రం నాటికి ఏపీ వ్యాప్తంగా 68,034 టెస్టులు చేయించగా 1097 పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. అంటే.. మొత్తం పరీక్షల్లో 1.6 శాతం మాత్రమే నిర్దారణ కేసులు కావటం గమనార్హం. జాతీయ సగటు చూస్తే ఇది 4.21 శాతంగా ఉంది.

పైకి చూసేందుకు ఏపీలో ఎక్కువగా కేసులు నమోదైనట్లు కనిపిస్తున్నా.. వాస్తవంలో మాత్రం అందుకు భిన్నమైన పరిస్థితి నెలకొందన్నది మర్చిపోకూడదు. చాలా రాష్ట్రాల్లో కరోనా టెస్టులు పరిమితంగా చేయిస్తుండటంతో.. కేసుల నమోదు తక్కువగా నమోదవుతున్నాయి. ఇందుకు భిన్నంగా ఏపీలో ఎక్కువ పరీక్షలు చేయిస్తుండటంతో పాజిటివ్ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి.

Satya

Recent Posts

థియేటర్ ప్రకటనలు ఆరోగ్యాన్ని భోదిస్తున్నాయి

ఏదైనా థియేటర్ వెళ్ళినప్పుడు సినిమా ప్రారంభానికి ముందు జనాన్ని ఇబ్బంది పెడుతున్నవి స్మోకింగ్ యాడ్సే. వాటి వెనుక మంచి ఉద్దేశం…

8 minutes ago

రెచ్చగొడితే రచ్చే.. లంక బౌలర్లను ఉతికారేసిన వైభవ్!

పదిహేనేళ్ల కుర్రాడే కదా అని స్లెడ్జింగ్ చేస్తే రిజల్ట్ ఎంత దారుణంగా ఉంటుందో శ్రీలంక బౌలర్లకు ప్రాక్టికల్ గా అర్థమైంది.…

41 minutes ago

రాందేవ్ బాబాకు ధీటుగా చంద్రబాబు

జూన్ 21.. ప్రపంచ యోగా దినోత్సవం. భారత్ లో రూపుదిద్దుకున్న ఈ ప్రాచీన యోగా విద్యను యావత్తు ప్రపంచం ఆనుసరించడం…

1 hour ago

బాక్సాఫీస్‌కు మంచి రోజులొచ్చాయి

2026లో టాలీవుడ్ బాక్సాఫీస్ మోతెక్కిపోతుందనే సంకేతాలు కనిపించాయి ఆరంభంలో. ‘మన శంకర వరప్రసాద్ గారు’తో పాటు ‘అనగనగా ఒక రాజు’,…

2 hours ago

థియేట‌ర్లు, షోలు పెంచుకుంటున్న బంగారం

ఈ రోజుల్లో చిన్న‌, మిడ్ రేంజ్ సినిమాల‌కు రిలీజ్రోజు ఇచ్చిన థియేట‌ర్ల‌ను జ‌నంతో నింప‌డ‌మే క‌ష్టమైపోతోంది. జ‌నం థియేట‌ర్ల‌కు రావ‌డం…

2 hours ago

కూట‌మికి రెండేళ్లు ఓకే… చేయవలసినవి ఇంకా ఉన్నాయి

ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం రెండేళ్ల పాల‌న‌ను పూర్తి చేసుకుంది. మూడో ఏడాదిలోకి అడుగులు వేసింది. ప్ర‌భుత్వం ఏం చేయాల‌న్నా.. మ‌రో…

4 hours ago