Political News

ఏపీలో కేసులు అందుకే పెరుగుతున్నాయా?

ఏపీలో కరోనా పాజిటివ్ కేసులు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. రోజువారీగా వెల్లడిస్తున్న కేసుల లెక్క చూసినోళ్లంతా అవాక్కు అవుతున్నారు. పక్కనున్న తెలంగాణలో కేసుల సంఖ్య పరిమితంగానే బయటకు వస్తుంటే.. అందుకు భిన్నమైన పరిస్థితి ఏపీలో ఎందుకు ఉందన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. తెలంగాణతో పోలిస్తే.. ఏపీలో కేసుల నమోదు అంతకంతకూ పెరగటం వెనుక పలు వాదనలు వినిపిస్తున్నప్పటికీ వాస్తవం మాత్రం వేరుగా ఉందని చెప్పాలి.

తెలంగాణతో పోలిస్తే.. ఏపీలో కరోనా పరీక్షలు ఎక్కువగా నిర్వహిస్తుండటం కూడా కేసులు వెలుగుచూడటానికి కారణంగా చెప్పొచ్చు. ప్రస్తుతం ఏపీలో రోజూ ఎనిమిదివేల మందికి కరోనా పరీక్షల్ని నిర్వహిస్తున్నారు. రానున్న రోజుల్లో ఆ సంఖ్యను పదివేల మంది వరకూ తీసుకెళ్లాలన్న యోచనలో ఉన్నారు. దక్షిణ కొరియా నుంచి దిగుమతి చేసుకున్న కిట్లతో ఎక్కువ పరీక్షలు జరుపుతున్నామని ఆ రాష్ట్రానికి చెందిన పలువురు కీలక అధికారులు చెబుతున్నారు.

దేశ వ్యాప్తంగా ప్రతి పదిలక్షల మంది జనాభాకు 451 మందికి మాత్రమే కరోనా నిర్దారణ పరీక్షలు నిర్వహిస్తున్నారు. దీనికి భిన్నంగా ఏపీలో మాత్రం ప్రతి పదిలక్షల మంది జనాభాకు 1274 మందికి పరీక్షల్ని నిర్వహిస్తుండటం గమనార్హం. ఈ కారణంతోనే కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయని చెప్పక తప్పదు.

ఆదివారం సాయంత్రం నాటికి ఏపీ వ్యాప్తంగా 68,034 టెస్టులు చేయించగా 1097 పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. అంటే.. మొత్తం పరీక్షల్లో 1.6 శాతం మాత్రమే నిర్దారణ కేసులు కావటం గమనార్హం. జాతీయ సగటు చూస్తే ఇది 4.21 శాతంగా ఉంది.

పైకి చూసేందుకు ఏపీలో ఎక్కువగా కేసులు నమోదైనట్లు కనిపిస్తున్నా.. వాస్తవంలో మాత్రం అందుకు భిన్నమైన పరిస్థితి నెలకొందన్నది మర్చిపోకూడదు. చాలా రాష్ట్రాల్లో కరోనా టెస్టులు పరిమితంగా చేయిస్తుండటంతో.. కేసుల నమోదు తక్కువగా నమోదవుతున్నాయి. ఇందుకు భిన్నంగా ఏపీలో ఎక్కువ పరీక్షలు చేయిస్తుండటంతో పాజిటివ్ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి.

This post was last modified on April 27, 2020 2:08 pm

Share

Recent Posts

కూట‌మి కాన్ఫిడెన్స్ ఏంటి?

వ‌చ్చే ఎన్నికల్లోనూ కూట‌మి విజ‌యం సాధిస్తుంద‌న్న బ‌ల‌మైన సంకేతాలు వ‌స్తున్నాయి. నాయ‌కులు చెప్ప‌డ‌మే కాదు.. క్షేత్ర‌స్థాయిలో జ‌రుగుతున్న కొన్ని ఆన్‌లైన్…

25 minutes ago

రవితేజ పోటీని యష్ తట్టుకోవాలంటే

ఒకపక్క ఇరుముడి విరగాడేస్తోంది. వీకెండ్ టికెట్లు దొరక్క అల్లాడిపోతున్న ప్రేక్షకులు లక్షల్లో ఉన్నారు. ఇచ్చిన థియేటర్లు సరిపోక వేరే సినిమాలవి…

47 minutes ago

టార్గెట్ చేరుకున్న టాక్సిక్ తెలుగు వేడుక

నిన్న హైదరాబాద్ లో జరిగిన టాక్సిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ అయ్యింది. సౌండ్ బార్ల మీద కూర్చున్న…

2 hours ago

మెగా హీరోలు అభిమానులు ఇద్దరూ చెక్ చేసుకోవాలి

సోషల్ మీడియా రాను రాను మరీ సెన్సిటివ్ గా, టాక్సిక్ గా మారిపోతోంది. ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో చూస్తూ…

3 hours ago

ఎండోస్కోపిక్ కెమెరాతో పేపర్ లీక్… బీజేపీ రాష్ట్రంలో సంచలనం

రాయ్ పూర్ లోని ఇందిరా గాంధీ కృషి విశ్వవిద్యాలయం బీఎస్సీ ద్వితీయ సంవత్సరం పరీక్షా పేపర్ లీకేజి వ్యవహారం ఇప్పుడు…

3 hours ago

టీడీపీతో పోల్చుకుంటే.. వైసీపీకి `వ‌ర్గ‌`పోరు…!

పార్టీలు బ‌లంగా ఉండాలంటే.. స‌మాజంలోని ప‌లు వ‌ర్గాల మ‌ద్ద‌తు అవ‌స‌రం. నాయ‌కులు, అధినేత‌లు ఎంత బ‌లంగా ఉన్నా.. స‌మాజంలోని వ‌ర్గాలు…

4 hours ago