తెరవెనుక బీజేపీ ఏం చేస్తుంది ? లోక్ సభ ఎన్నికల తర్వాత ఏఏ రాష్ట్రాలలో ప్రభుత్వాలను కూలుస్తుంది ? తన అనుకూల ప్రభుత్వాలను ఏర్పాటు చేసేలా ప్రోత్సహిస్తుంది ? అన్నది ఎంత వరకు నిజమో కానీ రాజకీయ నాయకులు, మీడియా, సోషల్ మీడియాలో మాత్రం పెద్ద ఎత్తున ఏదో జరగబోతుంది అన్న ప్రచారం సాగుతున్నది.
దేశంలో రెండో అతిపెద్ద జాతీయ పార్టీగా ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్, తెలంగాణలలో మాత్రమే అధికారంలో ఉన్నది. ఇటీవల రాజస్థాన్, చత్తీస్ ఘడ్ లలో అధికారాన్ని కోల్పోయింది. ఇక జార్ఖండ్ రాష్ట్రంలో సంకీర్ణ భాగస్వామిగా ఉంది. తమిళనాడులో మిత్రపక్షంగా ఉన్నా ప్రభుత్వంలో భాగస్వామి కాలేదు. ఈ నేపథ్యంలో ఈ లోక్ సభ ఎన్నికల తర్వాత బీజేపీ కర్ణాటక, తెలంగాణ ప్రభుత్వాలను పడగొడుతుందని ఉహాగానాలు పెద్దఎత్తున వస్తున్నాయి. బీజేపీ నేతల ప్రసంగాలు కూడా ఈ ఆరోపణలకు బలం చేకూరుస్తున్నాయి. అందుకే రేవంత్ మోడీని భడే బాయ్ అంటూ రాజీకి వస్తున్నాడని అంటున్నారు.
తాజాగా బీజేపీ నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ మాట్లాడుతూ ‘‘తెలంగాణలో బీజేపీ గనక 12 లోక్ సభ స్థానాలలో విజయం సాధిస్తే రేవంత్ రెడడి ముఖ్యమంత్రి కుర్చీని ఇక ఆ శ్రీరాముడే కాపాడాలని, అసలు ఆయన ఆగస్ట్ వరకు ముఖ్యమంత్రిగా ఉంటాడో ? ఉండడో ? కూడా తెలియదని’’ అన్నాడు. ఆగస్టులో రుణమాఫీ, డిసెంబరులో చెరుకు ఫ్యాక్టరీ తెరుస్తా, ఆరు గ్యారంటీలు అమలుచేస్తా అని రేవంత్ అంటున్నాడని, అసలు ఆయన అధికారంలో ఉంటాడా ? అని అరవింద్ ఎద్దేవా చేశాడు. మరి లోక్ సభ ఎన్నికల తర్వాత ఏం జరగబోతుందో వేచిచూడాలి.
This post was last modified on April 19, 2024 11:08 am
అక్కినేని నాగేశ్వరరావు మనవడు సుమంత్ను చూస్తే పెద్ద స్టార్ కావడానికి అవసరమైన అన్ని లక్షణాలు ఉన్నట్లే కనిపిస్తాడు. ఆరడుగుల ఆజానుబాహుడు,…
పోలవరం జిల్లా ఈర్లపల్లి గ్రామానికి చెందిన 10వ తరగతి విద్యార్ధిని ముర్రం శివాని ఆత్మహత్య చేసుకుంది. దీనికి సంబంధించిన కారణాలు…
తెలంగాణలో ఆక్రమ కట్టడాలకు సింహ స్వప్నంగా మారిన హైడ్రా విధానంపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. తమ మాటంటే హైడ్రాకు…
వైసీపీ నేత, ఫైర్ బ్రాండ్ నాయకుడు, మాజీ మంత్రి జోగి రమేష్ ఫ్యామిలీలో కోడలు చేసిన ఆరోపణలు పెను కుదుపునకు…
సినిమాల్లో రాజకీయ అంశాలు పెట్టాలంటే ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాల్సిన పరిస్థితులున్నాయి ప్రస్తుతం. తమ నాయకుల మీద పొలిటికల్ కౌంటర్లు వేస్తే…
జన నాయకుడు సినిమా ఎలా ఉందనేది మళ్ళీ చెప్పనవసరం లేదు. విజయ్ ఇమేజ్ పుణ్యమాని రెండు వందల కోట్లు దాటేసింది…