Political News

రేవంత్ ను ఆ శ్రీరాముడే కాపాడాలి

తెరవెనుక బీజేపీ ఏం చేస్తుంది ? లోక్ సభ ఎన్నికల తర్వాత ఏఏ రాష్ట్రాలలో ప్రభుత్వాలను కూలుస్తుంది ? తన అనుకూల ప్రభుత్వాలను ఏర్పాటు చేసేలా ప్రోత్సహిస్తుంది ? అన్నది ఎంత వరకు నిజమో కానీ రాజకీయ నాయకులు, మీడియా, సోషల్ మీడియాలో మాత్రం పెద్ద ఎత్తున ఏదో జరగబోతుంది అన్న ప్రచారం సాగుతున్నది.

దేశంలో రెండో అతిపెద్ద జాతీయ పార్టీగా ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్, తెలంగాణలలో మాత్రమే అధికారంలో ఉన్నది. ఇటీవల రాజస్థాన్, చత్తీస్ ఘడ్ లలో అధికారాన్ని కోల్పోయింది. ఇక జార్ఖండ్ రాష్ట్రంలో సంకీర్ణ భాగస్వామిగా ఉంది. తమిళనాడులో మిత్రపక్షంగా ఉన్నా ప్రభుత్వంలో భాగస్వామి కాలేదు. ఈ నేపథ్యంలో ఈ లోక్ సభ ఎన్నికల తర్వాత బీజేపీ కర్ణాటక, తెలంగాణ ప్రభుత్వాలను పడగొడుతుందని ఉహాగానాలు పెద్దఎత్తున వస్తున్నాయి. బీజేపీ నేతల ప్రసంగాలు కూడా ఈ ఆరోపణలకు బలం చేకూరుస్తున్నాయి. అందుకే రేవంత్ మోడీని భడే బాయ్ అంటూ రాజీకి వస్తున్నాడని అంటున్నారు.

తాజాగా బీజేపీ నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ మాట్లాడుతూ ‘‘తెలంగాణలో బీజేపీ గనక 12 లోక్ సభ స్థానాలలో విజయం సాధిస్తే రేవంత్ రెడడి ముఖ్యమంత్రి కుర్చీని ఇక ఆ శ్రీరాముడే కాపాడాలని, అసలు ఆయన ఆగస్ట్ వరకు ముఖ్యమంత్రిగా ఉంటాడో ? ఉండడో ? కూడా తెలియదని’’ అన్నాడు. ఆగస్టులో రుణమాఫీ, డిసెంబరులో చెరుకు ఫ్యాక్టరీ తెరుస్తా, ఆరు గ్యారంటీలు అమలుచేస్తా అని రేవంత్ అంటున్నాడని, అసలు ఆయన అధికారంలో ఉంటాడా ? అని అరవింద్ ఎద్దేవా చేశాడు. మరి లోక్ సభ ఎన్నికల తర్వాత ఏం జరగబోతుందో వేచిచూడాలి.

This post was last modified on April 19, 2024 11:08 am

Share
Show comments
Published by
satya

Recent Posts

దిల్ రాజు చేతిలో 18 కమిట్మెంట్లు

ఎక్కువ సినిమాలు తీస్తున్న నిర్మాణ సంస్థలు ఏవంటే మనకు వెంటనే గుర్తొచ్చే బ్యానర్లు సితార, మైత్రి, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ…

6 mins ago

అల్లు అర్జున్ వివాదం ఎక్కడి దాకా

ఎన్నికలు ముగిసిపోయి ఫలితాలు ఎలా ఉంటాయోననే ఆసక్తితో జనం ఎదురు చూస్తున్న వేళ కేవలం ఒక్క రోజు మద్దతు కోసం…

2 hours ago

కృష్ణమ్మా….ఎంత పని చేశావమ్మా

సినిమా చిన్నదైనా పెద్దదైనా ఫలితం ఎలా వచ్చినా థియేటర్ కు ఓటిటి మధ్య కనీస గ్యాప్ ఉండటం చాలా అవసరం.…

3 hours ago

భువనగిరి : గెలిస్తే ఒక లెక్క .. ఓడితే మరో లెక్క !

శాసనసభ ఎన్నికలలో అనూహ్యంగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీకి లోక్ సభ ఎన్నికలు పరీక్షగా నిలుస్తున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో…

4 hours ago

ఒక‌రు తీర్థ యాత్ర‌లు.. మ‌రొక‌రు విదేశీ యాత్ర‌లు!

ఏపీలో ఎన్నిక‌లు ముగిసిన త‌ర్వాత‌.. ఒక‌వైపు తీవ్రమైన హింస చెల‌రేగిన విష‌యం తెలిసిందే. ఇదెలా ఉన్నా అధికార, ప్ర‌తిపక్ష నాయ‌కులు…

5 hours ago

పోలీసులు ఏంచేస్తున్నారు.. చంద్ర‌బాబు ఆవేద‌న‌

ఏపీలో జ‌రిగిన సార్వ‌త్రిక ఎన్నిక‌ల పోలింగ్ అనంత‌రం.. ప‌ల్నాడు, తిరుప‌తి, తాడిప‌త్రి ప్రాంతాల్లో చెల‌రేగిన హింస‌పై చంద్ర‌బాబు ఆవేద‌న వ్య‌క్తం…

5 hours ago