ఏపీలో అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలకు సంబంధించిన నామినేషన్ల పర్వం ప్రారంభమైంది. గురువారం ఉదయం ప్రారంభమైన ఈ నామినేషన్ల సందడి.. ఈ నెల 25వ తేదీ వరకు కొనసాగనుంది. అయితే.. రాష్ట్రంలోతొలి రోజే నామినేషన్లు వేసేందుకు చాలా మంది నాయకులు రెడీ అయ్యారు. వారం పరంగా గురువారం రావడం.. తిథి పరంగా దశమికావడంతో నాయకులు.. ఎక్కువ మంది ఉత్సాహంగా ముందుకు కదిలారు. వీరిలో చాలా మంది పార్టీల కీలక నాయకులే ఉండడం గమనార్హం.
అయితే.. తొలి అసెంబ్లీ నామినేషన్ మాత్రం.. టీడీపీ సీనియర్ నాయకుడు, సిట్టింగ్ ఎమ్మెల్యే, అనంతపు రం జిల్లా ఉరవకొండ నియోజకవర్గంలో మరోసారి అదృష్టం పరిశీలించుకుంటున్న పయ్యావుల కేశవ్ది కావడం గమనార్హం. ఈయన తర్వాత.. పలువురు నామినేషన్లు దాఖలు చేశారం.. మధ్యాహ్నం 1 గంట సమయానికి దాదాపు 40 మంది నామినేషన్లు దాఖలు చేశారు. వీరిలో సమాజ్వాదీ పార్టీ నేత(దర్శి) ఉండడం విశేషం.
ఇక, పార్లమెంటు ఎన్నికలకు సంబంధించి కూడా.. పలువురు నామినేషన్లు దాఖలు చేశారు. తొలి నామినే షన్ కడప పార్లమెంటు టీడీపీ అభ్యర్థి.. చదిపిరాళ్ల భూపేష్ కావడం గమనార్హం. తర్వాత స్థానంలో యుగతులసి పార్టీ(వైటీపీ) కి చెందిన శంభాన శ్రీనివాసరావు ఉన్నారు. ఈయన విజయనగరం పార్లమెంటు స్థానం నుంచి రెండు సెట్ల నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. అదేవిధంగా విశాఖ పట్నం పార్లమెంటు స్థానానికి ఇండిపెండెంటుగా.. వడ్డి హరిగణేష్ నామినేషన్ వేశారు. మొత్తంగా చూస్తే.. తొలిరోజు మంచిదని భావించిన నాయకులు చాలా త్వరత్వరగానే పనికానిచ్చేస్తుండడం గమనార్హం.
This post was last modified on April 18, 2024 3:52 pm
సినిమా విడుదల ఎప్పుడో తేలకుండానే పైరసీ బారిన పడిన జన నాయకుడు గొడవ రకరకాల మలుపులు తిరుగుతోంది. ముందు లాయర్ తరపున…
సౌత్ మ్యూజిక్ లో సెన్సేషన్ అంటే అనిరుధ్ రవిచందర్ పేరే ముందు గుర్తొస్తుంది. తను పని చేస్తున్నాడని తెలిస్తే చాలు…
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ పార్టీని ప్రక్షాళన చేసే దిశగా అడుగులు పడుతున్నాయి. పార్టీలో సంస్థాగతంగా పనిచేస్తున్న వారిని గత…
2029 పార్లమెంటు ఎన్నికల నాటికి దేశంలో నియోజకవర్గాలను పునర్విభజించాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్న విషయం తెలిసిందే. ఇటు అసెంబ్లీ,…
అమెరికా - ఇరాన్ దేశాల మధ్య నెలకొన్న చర్చల ప్రతిష్టంభన ప్రపంచ దేశాలను పెను సంక్షోభంలోకి నెట్టే దిశగా మారుతోందా?…
భారత రాష్ట్రపతి ద్రౌపదిముర్ముతో ఏపీ మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ భేటీ అయ్యారు. పార్టీకి చెందిన…