ఏపీలో అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలకు సంబంధించిన నామినేషన్ల పర్వం ప్రారంభమైంది. గురువారం ఉదయం ప్రారంభమైన ఈ నామినేషన్ల సందడి.. ఈ నెల 25వ తేదీ వరకు కొనసాగనుంది. అయితే.. రాష్ట్రంలోతొలి రోజే నామినేషన్లు వేసేందుకు చాలా మంది నాయకులు రెడీ అయ్యారు. వారం పరంగా గురువారం రావడం.. తిథి పరంగా దశమికావడంతో నాయకులు.. ఎక్కువ మంది ఉత్సాహంగా ముందుకు కదిలారు. వీరిలో చాలా మంది పార్టీల కీలక నాయకులే ఉండడం గమనార్హం.
అయితే.. తొలి అసెంబ్లీ నామినేషన్ మాత్రం.. టీడీపీ సీనియర్ నాయకుడు, సిట్టింగ్ ఎమ్మెల్యే, అనంతపు రం జిల్లా ఉరవకొండ నియోజకవర్గంలో మరోసారి అదృష్టం పరిశీలించుకుంటున్న పయ్యావుల కేశవ్ది కావడం గమనార్హం. ఈయన తర్వాత.. పలువురు నామినేషన్లు దాఖలు చేశారం.. మధ్యాహ్నం 1 గంట సమయానికి దాదాపు 40 మంది నామినేషన్లు దాఖలు చేశారు. వీరిలో సమాజ్వాదీ పార్టీ నేత(దర్శి) ఉండడం విశేషం.
ఇక, పార్లమెంటు ఎన్నికలకు సంబంధించి కూడా.. పలువురు నామినేషన్లు దాఖలు చేశారు. తొలి నామినే షన్ కడప పార్లమెంటు టీడీపీ అభ్యర్థి.. చదిపిరాళ్ల భూపేష్ కావడం గమనార్హం. తర్వాత స్థానంలో యుగతులసి పార్టీ(వైటీపీ) కి చెందిన శంభాన శ్రీనివాసరావు ఉన్నారు. ఈయన విజయనగరం పార్లమెంటు స్థానం నుంచి రెండు సెట్ల నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. అదేవిధంగా విశాఖ పట్నం పార్లమెంటు స్థానానికి ఇండిపెండెంటుగా.. వడ్డి హరిగణేష్ నామినేషన్ వేశారు. మొత్తంగా చూస్తే.. తొలిరోజు మంచిదని భావించిన నాయకులు చాలా త్వరత్వరగానే పనికానిచ్చేస్తుండడం గమనార్హం.
This post was last modified on April 18, 2024 3:52 pm
బాక్సాఫీస్ పరిణామాలు సస్పెన్స్ థ్రిల్లర్ తరహాలో మలుపులు తిరుగుతున్నాయి. డిసెంబర్ 5 అఖండ 2 వాయిదా పడింది. క్రిస్మస్ కు…
తెలుగు రాజకీయాల్లో కొడాలి నానిది ఓ డిఫరెంట్ స్టైల్. ప్రత్యర్ధులపై దూకుడుగా మాట్లాడే ఆయన వైసీపీ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు.…
పెట్టుబడిదారులకు ఏపీ స్వర్గ ధామంగా మారుతుందని.. మంత్రి నారా లోకేష్ తెలిపారు. అమెరికా పర్యటనలో ఉన్న మంత్రి.. పెట్టుబడి దారులతో…
డిసెంబరు 5 నుంచి వాయిదా పడ్డ నందమూరి బాలకృష్ణ కొత్త చిత్రం ‘అఖండ-2’ను మరీ ఆలస్యం చేయకుండా వారం వ్యవధిలోనే…
స్టార్ హీరోలను ఫ్యాన్స్ దేవుళ్లుగా భావించడం నిజమేమో అనిపిస్తుంది కొన్ని సంఘటనలు చూస్తే. స్వంత అభిమానిని హత్య చేసిన కేసులో…
అభిమానుల దశాబ్దాల నిరీక్షణకు బ్రేక్ వేస్తూ వెంకటేష్ - త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ సందర్భంగా…