Telangana, April 08 (ANI): Congress leader Ghulam Nabi Azad with RC Khuntia (L), Vijayashanti (2nd L), at an election public meeting in support of Congress Chevella MP candidate Konda Vishweshwar Reddy (R) Manneguda on Sunday. (ANI Photo)
తెలంగాణ రాజకీయాల్లో ఒకప్పుడు ఫైర్బ్రాండ్గా పేరు తెచ్చుకున్న విజయశాంతి ఎక్కడ? సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ రాజకీయాల్లో ఆమె జాడ కనిపించడం లేదు. ప్రస్తుతం కాంగ్రెస్లో ఉన్న రాములమ్మ ప్రచారంలో మాత్రం తళుక్కుమనడం లేదు. పార్టీలు మారినా తనకు కావాల్సిన ప్రాధాన్యత మాత్రం విజయశాంతికి దక్కడం లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పుడు కాంగ్రెస్లోనూ ఇలాంటి పరిస్థితే ఉందని టాక్. విజయశాంతిని ఎవరూ పట్టించుకోవడం లేదనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
బీజేపీతో రాజకీయ జీవితం ప్రారంభించిన విజయశాంతి.. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తల్లి తెలంగాణ పార్టీని స్థాపించారు. ఆ తర్వాత పార్టీని అప్పటి టీఆర్ఎస్లో విలీనం చేశారు. 2009లో మెదక్ ఎంపీగా విజయశాంతి గెలిచారు. 2014లో టీఆర్ఎస్ను వదిలి కాంగ్రెస్లోకి వెళ్లిపోయారు. ఆ ఏడాది అసెంబ్లీ ఎన్నికల్లో మెదక్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 2020లో కాషాయ కండువా కప్పుకున్నారు. 2023లో మళ్లీ కాంగ్రెస్ గూటికి చేరిపోయారు. ఇలా పార్టీలు మారుతూనే ఉన్న తనకు తగిన గుర్తింపు రావడం లేదన్నది రాములమ్మ ఆవేదన అని విశ్లేషకులు చెబుతున్నారు.
ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలో ఉంది. అదే పార్టీలో ఉన్న విజయశాంతి ప్రచార కమిటీ, ప్లానింట్ కమిటీ చీఫ్ కో ఆర్డినేటర్, కన్వీనర్గా బాధ్యతలూ చేపట్టారు. కానీ ఇప్పుడు లోక్సభ ఎన్నికల నేపథ్యంలో విజయశాంతి సైలెంట్ కావడం హాట్ టాపిక్గా మారింది. గత తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె సీటు ఆశించారు. కానీ కాంగ్రెస్ ఇవ్వలేదు. ఇప్పుడు లోక్సభ ఎన్నికల్లోనూ మెదక్ ఎంపీగా బరిలో దిగాలనుకున్నారని తెలిసింది. కానీ ఇప్పుడూ మొండిచేయే ఎదురైంది. ఇక ప్రచారంలోనైనా ఆమె మెరుస్తారేమో అనుకుంటే అదీ జరగడం లేదు. రాహుల్ గాంధీ హాజరైన జనజాతర సభలోనూ రాములమ్మ కనిపించలేదు. అసలు ఆమెను ఆహ్వానించడం మర్చిపోయారని తెలిసింది. ఇక ఎవరైనా అడిగితే ప్రచారానికి వచ్చేందుకు విజయశాంతి సిద్ధంగానే ఉన్నట్లు సమాచారం. మరి ఎన్నికలు దగ్గరపడేకొద్దీ మెదక్లో ఆమె సేవలను కాంగ్రెస్ ఉపయోగించుకుంటుందో లేదో చూడాలి.
This post was last modified on April 18, 2024 5:14 pm
ఎనభై తొంబై దశకంలో సినిమాలు చూసినవాళ్లకు బాగా పరిచయమున్న పేరు నందమూరి కళ్యాణ చక్రవర్తి. స్వర్గీయ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు…
శుక్రవారం ఏదైనా థియేటర్ రిలీజ్ మిస్ అయితే మూవీ లవర్స్ బాధ పడకుండా ఓటిటిలు ఆ లోటు తీరుస్తున్నాయి. ఇంకా…
తెలంగాణకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు, సీపీఐ మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య జీవిత చరిత్ర సినిమాగా రాబోతున్న సంగతి…
బయట తన హీరోలతోనే కాక తన టీంలో అందరితో చాలా సరదాగా ఉంటూ.. క్లోజ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తుంటాడు రాజమౌళి.…
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…