Political News

దమ్మాలపాటి పై ఏసిబి ఇన్ సైడర్ ట్రేడింగ్ కేసు.. సంచలనం

తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో అడిషనల్ అడ్వకేట్ జనరల్ గా పనిచేసిన దమ్మాలపాటి శ్రీనివాస్ పై ఏసిబి కేసు నమోదు చేసింది. అమరావతి రాజధాని ప్రాంతంలో ఇన్ సైడర్ ట్రేడింగ్ పెద్ద ఎత్తున జరిగిందనే ఆరోపణలపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది.

సిట్ విచారణ చేయించాలని ప్రభుత్వం అనుకోగానే టిడిపి నేతలు కోర్టులో కేసు వేశారు. ప్రస్తుతం ఈ విషయం కోర్టు విచారణలో ఉంది. ఇదే సమయంలో సిబిఐతో విచారణ చేయించాలని రాష్ట్రప్రభుత్వం కేంద్రప్రభుత్వానికి సిఫారసు చేసింది. ఈ విషయమై ఇంకా కేంద్రం ఏ నిర్ణయం తీసుకోలేదు.

ఇంతలో ప్రభుత్వం గతంలో నియమించిన ఏసిబి విచారణ ఒక్కసారిగా జోరందుకుంది. ఇన్ సైడర్ ట్రేడింగ్ పై అంతర్గతంగా విచారణ జరిపిన మంత్రివర్గ ఉపసంఘం ఆరోపణలకు తగ్గ ఆధారాలను కూడా సేకరించిందని తెలుస్తోంది. ఆధారాలతో టిడిపి హయాంలో ఎవరెవరు ఎంతెంత భూములు కొన్నారు ? ఏఏ గ్రామాల్లో కొన్నారు ? ఎంత ధరకు, ఎవరి పేరుపై కొన్నారు ? అనే విషయాలపై డీటైల్డ్ గా రిపోర్టిచ్చింది. ఇందులో భాగంగానే దమ్మాలపాటికి 2016, 17 సంవత్సరాల్లో కొనుగోలు చేసిన భూములు వివరాలు కూడా ఉన్నాయి.

ప్రభుత్వంలో కీలక స్ధానంలో ఉన్న దమ్మాలపాటి తన స్ధానాన్ని దుర్వినియోగం చేసి భారీ ఎత్తున భూములు కొన్నట్లు ఏసిబి ఆయనపై కేసు నమోదు చేసింది. వివిధ సెక్షన్ల క్రింద కేసులు నమోదు చేసిందంటే అరెస్టు ఖాయమని అర్ధమైపోయింది.

అయితే, అతను అక్రమ కేసులతో అరెస్టు చేయాలని చూస్తున్నారని… దమ్మాలపాటి హైకోర్టులో పిటీషన్ వేశారు. తనపై ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోకుండా రక్షణ కల్పించాలని, ఏసిబి తనను అరెస్టు చేయకుండా ముందస్తు ఆదేశాలు ఇవ్వాలని పిటీషన్లో కోరటం గమనార్హం.

సరే దమ్మాలపాటి పిటిషన్లో ఏమున్నా ముందైతే ఏసిబి కేసు నమోదు చేసింది. అరెస్టు సంగతే తెలియాలి. చూద్దాం ఏం జరుగుతుందో. మొత్తం మీద ఇన్ సైడర్ ట్రేడింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిలో దమ్మాలపాటితోనే ఏసిబి కేసు నమోదు చేయటం ఆసక్తిగా మారింది. ఇది ఏపీలో కొత్త రాజకీయ కలకలానికి దారితీసింది.

This post was last modified on September 16, 2020 9:43 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

కర్ణాటకలో తెలుగు కనపడకూడదా?

కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…

35 minutes ago

రష్యా అధ్యక్షుడికి గోంగూర, ఆవకాయ తినిపించిన మోదీ

వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…

2 hours ago

చిరుకి మమ్ముట్టితో పోలిక ముమ్మాటికీ రాంగే

ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…

3 hours ago

మూడున్నర గంటల దురంధర్ మెప్పించాడా

ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…

4 hours ago

అఖండ 2 నెక్స్ట్ ఏం చేయబోతున్నారు

బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…

4 hours ago

`ఏఐ`లో ఏపీ దూకుడు.. పార్ల‌మెంటు సాక్షిగా కేంద్రం!

ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉంద‌ని కేంద్ర ప్ర‌భుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్ప‌త్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…

7 hours ago