Political News

దమ్మాలపాటి పై ఏసిబి ఇన్ సైడర్ ట్రేడింగ్ కేసు.. సంచలనం

తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో అడిషనల్ అడ్వకేట్ జనరల్ గా పనిచేసిన దమ్మాలపాటి శ్రీనివాస్ పై ఏసిబి కేసు నమోదు చేసింది. అమరావతి రాజధాని ప్రాంతంలో ఇన్ సైడర్ ట్రేడింగ్ పెద్ద ఎత్తున జరిగిందనే ఆరోపణలపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది.

సిట్ విచారణ చేయించాలని ప్రభుత్వం అనుకోగానే టిడిపి నేతలు కోర్టులో కేసు వేశారు. ప్రస్తుతం ఈ విషయం కోర్టు విచారణలో ఉంది. ఇదే సమయంలో సిబిఐతో విచారణ చేయించాలని రాష్ట్రప్రభుత్వం కేంద్రప్రభుత్వానికి సిఫారసు చేసింది. ఈ విషయమై ఇంకా కేంద్రం ఏ నిర్ణయం తీసుకోలేదు.

ఇంతలో ప్రభుత్వం గతంలో నియమించిన ఏసిబి విచారణ ఒక్కసారిగా జోరందుకుంది. ఇన్ సైడర్ ట్రేడింగ్ పై అంతర్గతంగా విచారణ జరిపిన మంత్రివర్గ ఉపసంఘం ఆరోపణలకు తగ్గ ఆధారాలను కూడా సేకరించిందని తెలుస్తోంది. ఆధారాలతో టిడిపి హయాంలో ఎవరెవరు ఎంతెంత భూములు కొన్నారు ? ఏఏ గ్రామాల్లో కొన్నారు ? ఎంత ధరకు, ఎవరి పేరుపై కొన్నారు ? అనే విషయాలపై డీటైల్డ్ గా రిపోర్టిచ్చింది. ఇందులో భాగంగానే దమ్మాలపాటికి 2016, 17 సంవత్సరాల్లో కొనుగోలు చేసిన భూములు వివరాలు కూడా ఉన్నాయి.

ప్రభుత్వంలో కీలక స్ధానంలో ఉన్న దమ్మాలపాటి తన స్ధానాన్ని దుర్వినియోగం చేసి భారీ ఎత్తున భూములు కొన్నట్లు ఏసిబి ఆయనపై కేసు నమోదు చేసింది. వివిధ సెక్షన్ల క్రింద కేసులు నమోదు చేసిందంటే అరెస్టు ఖాయమని అర్ధమైపోయింది.

అయితే, అతను అక్రమ కేసులతో అరెస్టు చేయాలని చూస్తున్నారని… దమ్మాలపాటి హైకోర్టులో పిటీషన్ వేశారు. తనపై ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోకుండా రక్షణ కల్పించాలని, ఏసిబి తనను అరెస్టు చేయకుండా ముందస్తు ఆదేశాలు ఇవ్వాలని పిటీషన్లో కోరటం గమనార్హం.

సరే దమ్మాలపాటి పిటిషన్లో ఏమున్నా ముందైతే ఏసిబి కేసు నమోదు చేసింది. అరెస్టు సంగతే తెలియాలి. చూద్దాం ఏం జరుగుతుందో. మొత్తం మీద ఇన్ సైడర్ ట్రేడింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిలో దమ్మాలపాటితోనే ఏసిబి కేసు నమోదు చేయటం ఆసక్తిగా మారింది. ఇది ఏపీలో కొత్త రాజకీయ కలకలానికి దారితీసింది.

Satya

Recent Posts

13 ఏళ్ల బాలుడు బాబు గారితో ఫోటో కోసం…

సినిమాల్లో వేషం కోసం చెన్నయ్ వెళ్లారు.. అభిమాన హీరోని కలిసి ఎందుకు హైదరాబాదు వెళ్లారు.. అనే వార్తలను తరచూ వింటూ…

7 hours ago

టికెట్ రేట్లు చేస్తున్న మేలు అర్థమవుతోందా

లెనిన్ సూపర్ హిట్టయిపోయింది. బ్లాక్ బస్టర్ దారిలో ఉంది. పదేళ్లకు పైగా విజయం కోసం మొహం వాచిపోయిన అఖిల్ అభిమానులకు…

8 hours ago

పోల‌వ‌రంపై చంద్ర‌బాబు శ‌ప‌థం

పోల‌వ‌రం ప్రాజెక్టును ఆరు నూరైనా పూర్తి చేస్తామ‌ని సీఎం చంద్ర‌బాబు శ‌ప‌థం చేశారు. గోదావ‌రి జిల్లాల్లో ప‌ర్య‌ట‌న‌కు వ‌చ్చిన ఆయ‌న…

10 hours ago

నాగార్జున 101 ఫిక్సయిందా?

అక్కినేని నాగార్జున కెరీర్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న 100వ సినిమా కోసం అభిమానులు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. కానీ…

10 hours ago

ఇప్పుడున్న రాజకీయాల్లో ఎన్టీఆర్‌ ఇమ‌డ‌గ‌ల‌రా?

జూనియ‌ర్ ఎన్టీఆర్‌.. రాజ‌కీయ రంగ ప్ర‌వేశంపై త‌ర‌చుగా ప్ర‌చారం జ‌రుగుతూనే ఉంది. ఆయ‌న‌కు అను కూలంగా ఏపీలోనూ కొన్ని ప్రాంతాల్లో…

11 hours ago

చిరు దిగాడు… పంచాయితీ ముగిసింది

తెలుగు టాప్ కొరియోగ్రాఫ‌ర్ల‌యిన జానీ మాస్ట‌ర్, శేఖ‌ర్ మాస్ట‌ర్ ప‌ర‌స్ప‌రం అరుచుకుంటూ ఒక‌రి మీదికి ఒక‌రు దూసుకువెళ్తున్న వీడియో తాజాగా…

11 hours ago