Political News

దమ్మాలపాటి పై ఏసిబి ఇన్ సైడర్ ట్రేడింగ్ కేసు.. సంచలనం

తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో అడిషనల్ అడ్వకేట్ జనరల్ గా పనిచేసిన దమ్మాలపాటి శ్రీనివాస్ పై ఏసిబి కేసు నమోదు చేసింది. అమరావతి రాజధాని ప్రాంతంలో ఇన్ సైడర్ ట్రేడింగ్ పెద్ద ఎత్తున జరిగిందనే ఆరోపణలపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది.

సిట్ విచారణ చేయించాలని ప్రభుత్వం అనుకోగానే టిడిపి నేతలు కోర్టులో కేసు వేశారు. ప్రస్తుతం ఈ విషయం కోర్టు విచారణలో ఉంది. ఇదే సమయంలో సిబిఐతో విచారణ చేయించాలని రాష్ట్రప్రభుత్వం కేంద్రప్రభుత్వానికి సిఫారసు చేసింది. ఈ విషయమై ఇంకా కేంద్రం ఏ నిర్ణయం తీసుకోలేదు.

ఇంతలో ప్రభుత్వం గతంలో నియమించిన ఏసిబి విచారణ ఒక్కసారిగా జోరందుకుంది. ఇన్ సైడర్ ట్రేడింగ్ పై అంతర్గతంగా విచారణ జరిపిన మంత్రివర్గ ఉపసంఘం ఆరోపణలకు తగ్గ ఆధారాలను కూడా సేకరించిందని తెలుస్తోంది. ఆధారాలతో టిడిపి హయాంలో ఎవరెవరు ఎంతెంత భూములు కొన్నారు ? ఏఏ గ్రామాల్లో కొన్నారు ? ఎంత ధరకు, ఎవరి పేరుపై కొన్నారు ? అనే విషయాలపై డీటైల్డ్ గా రిపోర్టిచ్చింది. ఇందులో భాగంగానే దమ్మాలపాటికి 2016, 17 సంవత్సరాల్లో కొనుగోలు చేసిన భూములు వివరాలు కూడా ఉన్నాయి.

ప్రభుత్వంలో కీలక స్ధానంలో ఉన్న దమ్మాలపాటి తన స్ధానాన్ని దుర్వినియోగం చేసి భారీ ఎత్తున భూములు కొన్నట్లు ఏసిబి ఆయనపై కేసు నమోదు చేసింది. వివిధ సెక్షన్ల క్రింద కేసులు నమోదు చేసిందంటే అరెస్టు ఖాయమని అర్ధమైపోయింది.

అయితే, అతను అక్రమ కేసులతో అరెస్టు చేయాలని చూస్తున్నారని… దమ్మాలపాటి హైకోర్టులో పిటీషన్ వేశారు. తనపై ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోకుండా రక్షణ కల్పించాలని, ఏసిబి తనను అరెస్టు చేయకుండా ముందస్తు ఆదేశాలు ఇవ్వాలని పిటీషన్లో కోరటం గమనార్హం.

సరే దమ్మాలపాటి పిటిషన్లో ఏమున్నా ముందైతే ఏసిబి కేసు నమోదు చేసింది. అరెస్టు సంగతే తెలియాలి. చూద్దాం ఏం జరుగుతుందో. మొత్తం మీద ఇన్ సైడర్ ట్రేడింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిలో దమ్మాలపాటితోనే ఏసిబి కేసు నమోదు చేయటం ఆసక్తిగా మారింది. ఇది ఏపీలో కొత్త రాజకీయ కలకలానికి దారితీసింది.

This post was last modified on September 16, 2020 9:43 am

Share
Show comments
Published by
satya

Recent Posts

ఎన్నిక‌ల‌కు ముందే ఆ రెండు ఖాయం చేసుకున్న టీడీపీ?

రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నిక‌ల పోరు ఎలా ఉందో అంద‌రికీ తెలిసిందే. వైసీపీ వ‌ర్సెస్ కూట‌మి పార్టీల మ‌ధ్య నిప్పులు చెరుగుకునే…

59 mins ago

సైడ్ ఎఫెక్ట్స్ మాట నిజమే.. కోవిషీల్డ్!

కరోనా వేళ అపర సంజీవిగా పేరు ప్రఖ్యాతుల్ని సొంతం చేసుకున్న వ్యాక్సిన్లలో బ్రిటిష్ ఫార్మా దిగ్గజం ఆస్ట్రాజెనెకా తయారు చేసిన…

2 hours ago

తారక్ హృతిక్ జోడి కోసం క్రేజీ కొరియోగ్రాఫర్

జూనియర్ ఎన్టీఆర్ హృతిక్ రోషన్ కలయికలో రూపొందుతున్న మల్టీ స్టారర్ వార్ 2 షూటింగ్ ప్రస్తుతం ముంబైలో జరుగుతోంది. తారక్…

2 hours ago

పుష్ప 2 ఖాతాలో అరుదైన ఘనత

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్ కాంబోలో తెరకెక్కుతున్న పుష్ప 2 ది రూల్ విడుదల కోసం అభిమానులు…

3 hours ago

ఏక్ష‌ణ‌మైనా.. ఢిల్లీలో రాష్ట్ర‌ప‌తి పాల‌న‌.. రంగం రెడీ?

దేశ రాజ‌ధాని ఢిల్లీ కూడా ఒక రాష్ట్ర‌మేన‌ని అంద‌రికీ తెలిసిందే. ఇక్క‌డ చిత్ర‌మైన ప‌రిస్థితి ఉంది. ఇది కేంద్ర పాలిత…

4 hours ago

మృణాల్‌కు ముద్దు భయం

ఈ మధ్యే ‘ఫ్యామిలీ స్టార్’ మూవీతో పలకరించింది మృణాల్ ఠాకూర్. తెలుగులో చేసిన గత రెండు చిత్రాలతో పోలిస్తే.. ఇందులో…

13 hours ago