ఏపీలో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల సమయంలో పార్టీలు, నాయకుల దృష్టి మెగా స్టార్.. చిరంజీవి పై పడింది. ఆయనను మచ్చిక చేసుకునేందుకు నాయకులు, పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. అయితే.. ఆయన ఎవరు వచ్చి ఏం అడిగినా ఓకే.. నేనున్నా అని చెబుతున్నారు. తాజాగా బీజేపీ అభ్యర్థి, అనకాపల్లి పార్లమెంటు స్థానం నుంచి బరిలో ఉన్న సీఎం రమేష్.. హైదరాబాద్లోని నివాసంలో చిరంజీవిని కలుసుకున్నారు. ఇది మర్యాద పూర్వకం కాదని.. తర్వాత ఆయనే ప్రకటించారు. రాజకీయ పరమైన అవసరం కోసమే అన్నయ్యను కలిసినట్టు చెప్పారు.
అనకాపల్లి పార్లమెంటు స్థానంలో గెలిచేందుకు చిరు సాయం కోరినట్టు సీఎం రమేష్ వెల్లడించారు. వాస్తవానికి సీఎం రమేష్ బీజేపీ నాయకుడిగా ఉన్నారు. అయినప్పటికీ.. ఆయన చిరు సాయం కోరడం వెనుక అనకాపల్లి పార్లమెంటు సెగ్మెంట్లో రెండు నుంచి మూడు అసెంబ్లీ స్థానాల్లో కాపుల ప్రాబల్యం ఉంది. ఇక్కడ నుంచి ఎవరు గెలిచినా.. కాపుల మద్దతు చాలా అవసరం. ఈ నేపథ్యంలోనే సీఎం రమేష్ చిరంజీవిని కలుసుకున్నట్టు తెలుస్తోంది. అదేవిధంగా మెగా ఫ్యామిలీ అభిమానులు కూడా ఎక్కువగా ఉన్నారు. గతంలోనూ ఇక్కడ ప్రజారాజ్యం బలమైన పోటీ ఇచ్చింది. దీంతో మెగా మద్దతు కోసం రమేష్ స్వయంగా రంగంలోకి దిగి ఉంటారని పరిశీలకులు చెబుతున్నారు.
ఇదిలావుంటే.. చిరంజీవిపై ప్రజర్ పెరిగిందని పరిశీలకులు భావిస్తున్నారు. ఆయనను కాంగ్రెస్ పార్టీ తమ వాడిగా నే ఇటీవల ప్రకటించింది. చిరంజీవి మా పార్టీలోనే ఉన్నారు. ప్రధాన కార్యదర్శిగా ఆయనకు బాధ్యతలు కూడా ఉన్నాయి. ప్రాథమిక సభ్యత్వం కూడా ఉంది అని ఏపీకి చెందిన కీలక నాయకుడు గిడుగు రుద్రరాజు తెలిపారు. అంటే.. కాంగ్రెస్ ఆయనను ఓన్ చేసుకోవడం ద్వారా ఏపీలో ప్రబావం చూపించాలనే వ్యూహంతో ఉన్నట్టు తెలుస్తోంది.
ఇక, జనసేనకు ఇటీవల పవన్ రూ5 కోట్ల వరకు విరాళం ఇచ్చారు. దీంతో మెగా స్టార్ తమకు విరాళం ఇవ్వడమే కాదని.. పిఠాపురం వంటి పవన్ పోటీ చేస్తున్న కీలక నియోజకవర్గాల్లోనూ ప్రచారం చేయాలన్న డిమాండ్లు ఆ పార్టీ నుంచి వినిపిస్తున్నాయి. మొత్తంగా.. చిరంజీవిపై పార్టీలకు అతీతంగా నాయకులు ఒత్తిడి పెడుతున్నారనేది స్పష్టంగా తెలుస్తోంది. మరి చిరు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో.. ఎవరి వైపు మొగ్గు చూపుతారో చూడాలి. లేకపోతే.. గత రెండు ఎన్నికల్లో మాదిరిగానే ఆయన తటస్థంగా ఉండిపోతారా అనేది తెలియాల్సి ఉంది.
This post was last modified on April 17, 2024 12:16 pm
ఒక ఢీ.. ఒక రెడీ.. ఒక కింగ్.. ఒక దూకుడు.. ఇలా ఒక దశ వరకు మామూలు హిట్లు ఇవ్వలేదు…
లిటిల్ హార్ట్స్, రాజు వెడ్స్ రాంబాయి లాంటి చిన్న సినిమాలు పెద్ద విజయాలు సాధించడంలో నిర్మాతలు బన్నీ వాస్, వంశీ…
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం తొలిసారి `విజయ్ దివస్` పేరుతో కీలక కార్యక్రమానికి పిలుపునిచ్చింది. ఈ నెల 9న(మంగళవారం) రాష్ట్ర వ్యాప్తంగా…
ఒకప్పుడు గోవా అంటే యూత్ కి అదో డ్రీమ్ డెస్టినేషన్. ఫ్రెండ్స్ తో ప్లాన్ వేస్తే ఫస్ట్ గుర్తొచ్చేది గోవానే.…
కేరళలో సంచలనం సృష్టించిన నటి కిడ్నాప్ కేసులో హీరో దిలీప్కు ఎనిమిదేళ్ల తర్వాత బిగ్ రిలీఫ్ దక్కింది. ఎర్నాకులం కోర్టు…
ఇటీవలే విడుదలైన బాలీవుడ్ మూవీ దురంధర్ అన్ని విషయాల్లో సోషల్ మీడియా టాపిక్ గా మారిపోయింది. రిలీజ్ ముందువరకు ఏమంత…