Political News

ఏపీలో అధికారం ఎవరిదో చెప్పిన 11 సర్వేలు

దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల సందడి మొదలైన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా లోక్ సభ ఎన్నికలు జరగనుండగా ఏపీతో పాటు మరో నాలుగు రాష్ట్రాలలో శాసనసభ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలోనే రాబోయే ఎన్నికల్లో ఏ పార్టీ ఎన్ని ఎంపీ స్థానాలు దక్కించుకుంటుంది అనే విషయంపై పలు మీడియా సంస్థలతో పాటు పలు సర్వే సంస్థలు జోరుగా సర్వేలు నిర్వహిస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా విడుదలైన ఏబీపీ సీ ఓటర్ సర్వే ఏపీలో బీజేపీ, జనసేన, టీడీపీ కూటమికి పట్టం కట్టింది. మొత్తం 25 లోక్ సభ స్థానాలకు గాను ఏపీలోని ఎన్డీఏ కూటమి 20 స్థానాలను కైవసం చేసుకుంటుందని ఈ సర్వేలో వెల్లడైంది.

అధికార పార్టీ వైసీపీ 5 స్థానాలకు పరిమితం అవుతుందని ఆ సర్వేలో తేలింది. ఎన్డీఏ కూటమికి 47% ఓట్లు, వైసీపీకి 40 శాతం ఓట్లు, కాంగ్రెస్ కు 2 శాతం ఓట్లు, ఇతరులకు 11 శాతం ఓట్లు వస్తాయని తేలింది. గత ఎన్నికల్లో 22 స్థానాలు దక్కించుకున్న వైసీపీ ఈసారి 17 స్థానాలు కోల్పోబోతుందని ఏబీపీ సీ ఓటర్ సర్వేలో తేలింది. అంతేకాదు, ఈ సర్వేతో పాటు మరో 10 సర్వే సంస్థలు కూడా ఏపీలో కూటమి ప్రభంజనం సృష్టించబోతుందని తేల్చి చెప్పాయి. ఇండియా టుడే సర్వేలో కూటమికి 17 సీట్లు రాగా, వైసీపీకి 8 సీట్లు వచ్చాయి.

సీఎన్ఎన్ న్యూస్ సర్వేలో కూటమికి 18 సీట్లు, వైసిపికి 7 సీట్లు…ఇండియా టీవీ సర్వేలో కూటమికి 17 సీట్లు వైసీపీకి 8 సీట్లు, న్యూస్ ఎక్స్ సర్వేలో కూటమికి 18, వైసీపీకి 7, జన్మత్ పోల్స్ సర్వేలో కూటమికి 17, వైసీపీకి 8, స్కూల్ ఆఫ్ పాలిటిక్స్ సర్వేలో కూటమికి 23, వైసీపీకి 2… పీపుల్స్ సర్వేలో కూటమికి 23 వైసీపీకి 2, పయనీర్ పోల్ సర్వేలో కూటమికి 18, వైసీపీకి 7… ఇండియా న్యూస్ సర్వేలో కూటమికి 18, వైసీపీకి 7, జీ న్యూస్ సర్వేలో కూటమికి 17, వైసీపీకి 8 లోక్ సభ స్థానాలు దక్కబోతున్నాయని సర్వేలలో తేలింది. అంటే దాదాపుగా 11 సర్వేలు ఎన్డీఏ కూటమి విజయం సాధిస్తుందని అంచనా వేస్తున్నాయి.

This post was last modified on April 17, 2024 12:11 pm

Share

Recent Posts

డ్రాగన్ అనుకున్న టైంకి రాగలదా

ఇటీవలే ప్రమాదానికి గురై భుజానికి శస్త్ర చికిత్స చేయించుకున్న జూనియర్ ఎన్టీఆర్ పూర్తిగా కోలుకోవడానికి రెండు నుంచి మూడు నెలల…

26 minutes ago

బండ్ల గణేష్ నెట్‌వర్క్… సోషల్ మీడియా చర్చ

నిన్న జరిగిన బండ్ల గణేష్ కూతురి వివాహ వేడుకకు రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి…

43 minutes ago

వెంకీ అట్లూరి… గేమ్ ప్లాన్ మారాలి

విశ్వనాథ్ అండ్ సన్స్ తో దర్శకుడు వెంకీ అట్లూరి దిగ్విజయంగా హ్యాట్రిక్ పూర్తి చేశారు. ఇంత స్థిరంగా బ్యాక్ టు…

1 hour ago

తెలుగు ప్రేక్షకులే కాదు… తెలుగు హీరోలు కూడా…

లోకేష్ కనగరాజ్ హీరోగా వచ్చిన 'డీసీ' సినిమాకు తెలుగు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ దక్కింది. ఆగస్టు 7న రిలీజైన…

2 hours ago

రీమేకులని చెడగొట్టడంలో వీళ్ళ రూటే వేరు

ఓటిటిలు ఇంత విస్తృతంగా పెరిగిన తర్వాత ఏదైనా హిట్ సినిమాని రీమేక్ చేయాలంటే సంవత్సరాలు కాకుండా నెలల్లోనే పూర్తి చేయాలి.…

2 hours ago

కొరటాలకే ఎందుకిలా జరుగుతోంది

దర్శకుడు కొరటాల శివ టైం అంత బాగా నడుస్తున్నట్టు లేదు. ఆచార్య మానని గాయం చేసింది. డిజాస్టర్లు అందరికీ వస్తాయి…

2 hours ago