Political News

నీ ప్రభుత్వంలో నన్నే తిట్టావ్.. నా ప్రభుత్వంలో కూడా నన్నే తిట్టావ్..

సీఎం జగన్ పై విజయవాడలో రాయితో దాడి జరిగిన ఘటన సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఈ ఘటనతో రేగిన రాజకీయ దుమారం నేపథ్యంలో వైసీపీ, టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ఇది మరో కోడికత్తి డ్రామా అంటూ టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు ఆరోపిస్తుండగా….సింపతీ పొందేందుకు ఇలా చేయాల్సిన అవసరం జగన్ కు లేదని వైసీపీ నేతలు అంటున్నారు. ఈ క్రమంలోనే ఈ వ్యవహారంపై టీడీపీ అధినేత చంద్రబాబు మునుపెన్నడూ లేని విధంగా స్పందించడం హాట్ టాపిక్ గా మారింది.

ఇది డ్రామా కాదని తాను కూడా ఒప్పుకుంటానని, కానీ, ఆ రాయో ఏదో వచ్చిందో అక్కడ ఉండాలి కదా… ఆ వస్తువు ఉండాలి కదా అని చంద్రబాబు ప్రశ్నించారు. పడిన రాయి మాయమైపోతుందా అని వైసీపీ నేతలకు చురకలంటించారు. కోడి..గుడ్డు…కోడి పిల్ల అంటూ పాత రోజుల్లో కనికట్టు కట్టేవాళ్లని..అదే మాదిరిగా జగన్ పై రాయి కూడా లేటెస్ట్ మ్యాజిక్ అని సెటైర్లు వేశారు. ‘‘జగన్ వచ్చాడు..కరెంట్ ఆఫ్ అయిందట…దానికి నేను బాధ్యుడినట..నీదా నాదా ప్రభుత్వం…నీ ప్రభుత్వంలో నన్నే తిట్టావ్..నా ప్రభుత్వంలో కూడా నన్నే తిట్టావ్…’’అని మునుపెన్నడూ లేని విధంగా చంద్రబాబు చేసిన కామెంట్లు వైరల్ గా మారాయి.

చంద్రబాబుకే కాదు సగటు మనిషికి కూడా ఈ డౌట్ వస్తోంది. పడిన రాయి ఏమైంది…కేట్ బాల్ అని కొందరు….పిల్లెట్ గన్ అని కొందరు అంటున్నారు. పోలీసులేమో చేతితో రాయి విసిరారు అని చెబుతున్నారు. ఇలా తలో మాట చెప్పడంతో ఇది డ్రామా అని ప్రతిపక్ష నేతలు చేస్తున్న కామెంట్లు నిజమేనేమో అనిపిస్తున్నాయి. ఇక, ఇంత టెక్నాలజీ ఉన్నాకూడా నిందితులను పట్టుకోవడంలో జాప్యం జరగడం సందేహాస్పదంగా ఉందని విమర్శలు వస్తున్నాయి.

This post was last modified on April 17, 2024 7:24 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

చిరుకి మమ్ముట్టితో పోలిక ముమ్మాటికీ రాంగే

ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…

59 minutes ago

మూడున్నర గంటల దురంధర్ మెప్పించాడా

ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…

2 hours ago

అఖండ 2 నెక్స్ట్ ఏం చేయబోతున్నారు

బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…

2 hours ago

`ఏఐ`లో ఏపీ దూకుడు.. పార్ల‌మెంటు సాక్షిగా కేంద్రం!

ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉంద‌ని కేంద్ర ప్ర‌భుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్ప‌త్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…

4 hours ago

అధికారంలో ఉన్నాం ఆ తమ్ముళ్ల బాధే వేరుగా ఉందే…!

అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…

7 hours ago

డాలర్లు, మంచి లైఫ్ కోసం విదేశాలకు వెళ్ళాక నిజం తెలిసింది

డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…

10 hours ago