సీఎం జగన్ పై విజయవాడలో రాయితో దాడి జరిగిన ఘటన సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఈ ఘటనతో రేగిన రాజకీయ దుమారం నేపథ్యంలో వైసీపీ, టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ఇది మరో కోడికత్తి డ్రామా అంటూ టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు ఆరోపిస్తుండగా….సింపతీ పొందేందుకు ఇలా చేయాల్సిన అవసరం జగన్ కు లేదని వైసీపీ నేతలు అంటున్నారు. ఈ క్రమంలోనే ఈ వ్యవహారంపై టీడీపీ అధినేత చంద్రబాబు మునుపెన్నడూ లేని విధంగా స్పందించడం హాట్ టాపిక్ గా మారింది.
ఇది డ్రామా కాదని తాను కూడా ఒప్పుకుంటానని, కానీ, ఆ రాయో ఏదో వచ్చిందో అక్కడ ఉండాలి కదా… ఆ వస్తువు ఉండాలి కదా అని చంద్రబాబు ప్రశ్నించారు. పడిన రాయి మాయమైపోతుందా అని వైసీపీ నేతలకు చురకలంటించారు. కోడి..గుడ్డు…కోడి పిల్ల అంటూ పాత రోజుల్లో కనికట్టు కట్టేవాళ్లని..అదే మాదిరిగా జగన్ పై రాయి కూడా లేటెస్ట్ మ్యాజిక్ అని సెటైర్లు వేశారు. ‘‘జగన్ వచ్చాడు..కరెంట్ ఆఫ్ అయిందట…దానికి నేను బాధ్యుడినట..నీదా నాదా ప్రభుత్వం…నీ ప్రభుత్వంలో నన్నే తిట్టావ్..నా ప్రభుత్వంలో కూడా నన్నే తిట్టావ్…’’అని మునుపెన్నడూ లేని విధంగా చంద్రబాబు చేసిన కామెంట్లు వైరల్ గా మారాయి.
చంద్రబాబుకే కాదు సగటు మనిషికి కూడా ఈ డౌట్ వస్తోంది. పడిన రాయి ఏమైంది…కేట్ బాల్ అని కొందరు….పిల్లెట్ గన్ అని కొందరు అంటున్నారు. పోలీసులేమో చేతితో రాయి విసిరారు అని చెబుతున్నారు. ఇలా తలో మాట చెప్పడంతో ఇది డ్రామా అని ప్రతిపక్ష నేతలు చేస్తున్న కామెంట్లు నిజమేనేమో అనిపిస్తున్నాయి. ఇక, ఇంత టెక్నాలజీ ఉన్నాకూడా నిందితులను పట్టుకోవడంలో జాప్యం జరగడం సందేహాస్పదంగా ఉందని విమర్శలు వస్తున్నాయి.
This post was last modified on April 17, 2024 7:24 am
`క్యాసినో కింగ్`గా గుర్తింపు తెచ్చుకుని వందల కోట్ల రూపాయలను అక్రమంగా ఆర్జించారన్న కేసులు ఎదుర్కొంటున్న చీకోటి ప్రవీణ్కు బీజేపీ కీలక…
ప్రభాస్ కెరీర్లో ‘బాహుబలి-2’ తర్వాత అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచిన ‘కల్కి’ మెజారిటీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. కేవలం రెండు…
గత ఏడాది కుంభమేళా సందర్భంగా కెమెరాల కళ్లలో పడి విపరీతమైన పాపులారిటీ సంపాదించిన అమ్మాయి.. మోనాలిసా. మధ్యప్రదేశ్లోని ఇండోర్కు చెందిన…
ఇరాన్తో యుద్ధం విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రాంగ్ స్టెప్ వేశారా? నాణేనికి ఒక వైపే చూశారా? అంటే..…
దేశంలో గతంలో ఎన్నడూ లేని విధంగా పలు కీలక అంశాలు చోటు చేసుకుంటున్నాయి. ఏకంగా ప్రధాని పైనే గత ఐదేళ్లలో…
ఏపీలో కడుపేదల కోసం పీ 4 ఫార్ములాను రూపొందించి దానిని అమలు చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పుడు కలెక్టర్ల…