టీడీపీ, బీజేపీ, జనసేన పొత్తులో భాగంగా విశాఖపట్నం లోక్ సభ స్థానం తెలుగుదేశం పార్టీకి కేటాయించారు. ఈ మేరకు అక్కడి నుండి టీడీపీ అభ్యర్థిగా శ్రీ భరత్ ను ప్రకటించడం, అతను ప్రచారం చేసుకోవడం జరుగుతున్నది. అయితే బీజేపీ పార్టీలో సీనియర్ నేతగా ఉన్న జీవీఎల్ నరసింహారావు అక్కడి నుండి పోటీ చేసే ప్రయత్నాలను ఇప్పటికీ వదులుకోలేదని ఢిల్లీ బీజేపీ వర్గాలు చెబుతున్నాయి.
ఆంధ్రాలో కీలక బీజేపీ నేతగా ఉన్న జీవీఎల్ కు జాతీయ స్థాయి బీజేపీ నాయకులతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఉత్తరాది బీజేపీ నాయకుల వద్ద తన పోటీ అంశాన్ని ప్రస్తావించిన జీవీఎల్ తాజాగా పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డాను కలుసుకోవడం హాట్ టాపిక్ గా మారింది. సరిగ్గా ఎన్నికలకు కేవలం 25 రోజులు మాత్రమే ఉన్న నేపథ్యంలో జీవీఎల్ విశాఖలో టీడీపీ అభ్యర్థికి అంటీముట్టనట్లుగా ఉండి ఢిల్లీలో చక్కర్లు కొట్టడం విశాఖ రాజకీయవర్గాలలో చర్చకు తెరలేపింది.
బీజేపీ ఆంధ్రప్రదేశ్ లో 10 శాసనసభ, 6 లోక్ సభ స్థానాలలో పోటీ చేస్తుంది. అయితే పొత్తులో భాగంగా వచ్చిన స్థానాలలో కూడా టీడీపీ నేతలు వచ్చి బీజేపీ తరపున పోటీ చేస్తుండడం, బీజేపీకి ఇచ్చిన స్థానాలను పదే పదే మారుస్తుండడం, ఇందులో బీజేపీ సీనియర్లకు సమాచారం ఇవ్వకుండా బీజేపీ అధ్యక్షురాలిగా ఉన్న పురంధేశ్వరి ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని బీజేపీ నేతలు గుర్రుగా ఉన్నారు. ఈ నేపథ్యంలో తాజాగా జీవీఎల్ ఢిల్లీ స్థాయిలో విశాఖ పోటీకి ప్రయత్నాలు చేస్తుండడాన్ని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.
This post was last modified on April 16, 2024 2:53 pm
నిఖిల్ ఎంత గ్యాప్ వస్తున్నా లెక్క చేయకుండా అత్యధిక సమయం కేటాయించిన ప్యాన్ ఇండియా మూవీ స్వయంభు. ఇప్పటికే విపరీతమైన…
తెలుగులో సినిమాలు చేస్తున్నంత వరకు సగటు గ్లామర్ హీరోయిన్లలో ఒకరి లాగే ఉండేది తాప్సి పన్ను. కానీ తర్వాత బాలీవుడ్కు…
నిధి అగర్వాల్ పేరుకు బాలీవుడ్ హీరోయినే కానీ.. ఆమె తెలుగు వారికే ఎక్కువ చేరువ అయింది. కెరీర్లో ఎక్కువ సినిమాలు ఇక్కడే…
ముంబై పుణె ఎక్స్ప్రెస్వేలో ఎన్నడూ లేని విధంగా ఒక ఊహించని ఘటన చోటుచేసుకుంది. ఒక గ్యాస్ ట్యాంకర్ బోల్తా పడటంతో…
అఖిల్ లెనిన్ ఏ ముహూర్తంలో మొదలుపెట్టారో కానీ బ్రేకుల మీద బ్రేకులు పడుతూనే ఉన్నాయి. షూటింగ్ మొదలుపెట్టినప్పుడు శ్రీలీల హీరోయిన్…
అంబటి రాంబాబును అడ్డు పెట్టుకుని కాపులను మరోసారి వైసీపీ తనవైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తోందా? కుల రాజకీయాలు, కాపు రాజకీయాలకు…