Political News

జ‌న‌సేనదే ‘విజ‌యం!’

సార్వ‌త్రిక ఎన్నిక‌ల స‌మ‌యంలో జ‌న‌సేనకు భారీ ఉర‌ట ల‌భించింది. అది కూడా ఏపీలో నోటిఫికేష‌న్ వెలువ‌డి.. నామినేష‌న్ల ప‌ర్వానికి రెండు రోజులు గ‌డువు ఉన్న నేప‌థ్యంలో జ‌న‌సేన‌కు భారీ విజ‌యం ద‌క్కింది. ఆ పార్టీకి కేంద్ర ఎన్నిక‌ల సంఘం ప్ర‌క‌టించిన గాజు గ్లాసు గుర్తును తాజాగా ఏపీ హైకోర్టు క‌న్ఫ‌ర్మ్ చేసింది. జ‌న‌సేన‌కు గాజు గ్లాసు గుర్తునే నిర్ధారిస్తున్న‌ట్టు కోర్టు పేర్కొంది. దీంతో ఇప్పటి వ‌ర‌కు డోలాయ‌మానంలో ప‌డిన జ‌న‌సేన‌కు ఊపిరి పీల్చుకున్న‌ట్ట‌యింది. నామినేష‌న్ల‌కుముందు భారీ విజ‌యం కూడా ద‌క్కింది.

ఏం జ‌రిగింది?

ఏపీలో అసెంబ్లీ, పార్ల‌మెంటు ఎన్నిక‌లు జ‌రుగుతున్న స‌మ‌యంలో జ‌న‌సేన పార్టీ ఎన్నిక‌ల గుర్త‌యిన గాజు గ్లాసును త‌మ‌కు కేటాయించాల‌ని రాష్ట్రీయ ప్ర‌జా కాంగ్రెస్‌(ఆర్ పీసీ) కేంద్ర ఎన్నికల‌సంఘాన్ని కోరింది. అయితే.. ముందుగా వ‌చ్చిన వారికి ముందుగానే గుర్తును కేటాయిస్తామ‌న్న కేంద్ర ఎన్నిక‌ల సంఘం.. దీనిని జ‌న‌సేన‌కు కేటాయిస్తున్న‌ట్టు పేర్కొంది. దీనిపై ఆర్ పీసీ.. హైకోర్టును ఆశ్ర‌యించింది. ఈ క్ర‌మంలో పిటిషనర్‌ తరఫున న్యాయవాది ఎంవీ రాజారామ్‌ వాదనలు వినిపించారు. ఈసీ నిబంధనలకు విరుద్ధంగా జనసేనకు గాజుగ్లాసు గుర్తు కేటాయించిందన్నారు.

జనసేన తరఫున సీనియర్‌ న్యాయవాది వేణుగోపాలరావు వాదనలు వినిపిస్తూ.. నిబంధనల ప్రకారమే గుర్తు కేటాయింపు జరిగిందన్నారు. ఈసీ తరఫున సీనియర్‌ న్యాయవాది అవినాశ్‌ దేశాయ్‌, న్యాయవాది శివదర్శిన్‌ వాదనలు వినిపిస్తూ.. ‘జనసేన’ ముందుగా దరఖాస్తు చేసుకుందని తెలిపారు. అసెంబ్లీ కాలపరిమితి ముగియడానికి ఆరు నెలల ముందు ఫ్రీ సింబల్‌ గుర్తుల కోసం దరఖాస్తు చేసుకోవాలన్నారు.

ఇలా చూస్తే.. గత డిసెంబరు 12న తాము దరఖాస్తుల ఆహ్వానాన్ని ప్రారంభించగా అదేరోజు జనసేన దరఖాస్తు చేసిందన్నారు. పిటిషనర్‌ పార్టీ (రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్‌) డిసెంబరు 20న దరఖాస్తు చేయగా అది 26న అందిందన్నారు. దీనిపై వాద‌న‌లు పూర్త‌యిన నేప‌థ్యంలో ఈ నెల 5న తీర్పును రిజ‌ర్వ్ చేసిన హైకోర్టు.. తాజాగా తీర్పును వెలువ‌రించింది. రాష్ట్రీ య ప్ర‌జా కాంగ్రెస్ పార్టీ దాఖ‌లు చేసిన పిటిష‌న్‌ను కొట్టివేసింది. గాజు గ్లాసు గుర్తును జ‌న‌సేన‌కే కేటాయిస్తూ. .కేంద్ర ఎన్నిక‌ల సంఘంతీసుకున్న నిర్ణ‌యాన్ని కోర్టు స‌మ‌ర్థించింది. దీంతో జ‌న‌సేన ప్ర‌స్తుత ఎన్నిక‌ల్లో గాజు గ్లాసు గుర్తుపైనే పోటీ చేసేందుకు అవ‌కాశం ఏర్ప‌డింది.

This post was last modified on April 16, 2024 2:38 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఆ సీక్వెల్… నా వల్ల కాదు బాబోయ్

అటు తమిళం, ఇటు తెలుగు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న భారీ చిత్రాల్లో ‘యుగానికి ఒక్కడు’ ఒకటి. కార్తికి స్టార్ ఇమేజ్ తీసుకొచ్చిన…

4 minutes ago

నాడూ మూడే!… నేడూ మూడే!

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మూడు అనే అంకె అంటే చాలా ఇష్టంగానే ఉన్నట్టుంది. కనీసం రాజధాని కూడా…

4 hours ago

మోడీ ముందు జ‌గ‌న్ మ‌రింత‌ ప‌లుచ‌న‌!

ప్ర‌స్తుతం ఎవ‌రు ఔన‌న్నా.. కాద‌న్నా.. దేశానికే కాదు.. దేశంలోని రాజ‌కీయాల‌కు కూడా ప్ర‌ధాని మోడీ పెద్ద‌దిక్కుగా మారారన్నది వాస్త‌వం. ఆయ‌న‌ను…

4 hours ago

రాముడి పాత్ర వద్దన్న రణబీర్

ఒక పెద్ద సినిమాలో రాముడి పాత్రను పోషించడం ఏ నటుడికైనా అరుదైన అవకాశమే. దాన్ని లైఫ్ టైం ఛాన్స్‌లాగే ఫీలవుతారు ఎవ్వరైనా. ‘ఆదిపురుష్’ ఫలితం…

5 hours ago

దళిత క్రైస్తవుల విషయంలో జగన్ కన్నా షర్మిలే బెటర్?

వైసీపీ అధినేత, తన బ్రదర్ జగన్‌పై ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల మరోసారి విమర్శలు గుప్పించారు. దళిత క్రైస్తవులకు రిజర్వేషన్…

5 hours ago

గుణశేఖర్ గారు లాజిక్ మిస్సయ్యారు

ఒక్కడు, చూడాలని ఉంది లాంటి అద్భుతమైన బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దర్శకుడు గుణశేఖర్ కొత్త మూవీ యుఫొరియా ఫిబ్రవరిలో విడుదలైన…

6 hours ago