సాధారణంగా ఎన్నికలు వచ్చాయంటే ఆయా నియోజకవర్గాల్లో పోటీ చేసే అభ్యర్థులను పార్టీలు ప్రకటిస్తాయి. పోటీ చేసే స్థానం ఖరారైన తర్వాతే నాయకులు నామినేషన్కు రంగం సిద్ధం చేసుకుంటారు. కానీ ఈ సీనియర్ నేత మాత్రం ఇంకా పోటీ చేసే స్థానంపై క్లారిటీ రాకముందే నామినేషన్ వేసేందుకు రెడీ అవుతున్నారు. అందుకు డేట్ కూడా ఫిక్స్ చేసుకున్నారు. ఆ నాయకుడే రఘురామ కృష్ణరాజు. గత లోక్సభ ఎన్నికల్లో నరసాపురం నుంచి వైసీపీ ఎంపీగా గెలిచిన రఘురామ ఆ తర్వాత రెబల్గా మారిన సంగతి తెలిసిందే. ఇటీవల ఆయన టీడీపీలో చేరి పోటీకి సిద్ధమవుతున్నారు.
రఘురామ టీడీపీలో అయితే చేరారు కానీ ఏపీ అసెంబ్లీ స్థానానికి పోటీ చేస్తారా? లేదా ఎంపీగా లోక్సభ ఎన్నికల బరిలో దిగుతారా? అన్నదానిపై ఇంకా స్పష్టత రాలేదు. కానీ ఆయనేమో ఈ నెల 22న నామినేషన్ వేస్తున్నా అని ప్రకటించేసుకున్నారు. మరి ఆ నామినేషన్ ఎమ్మెల్యే ఎన్నికల కోసమా? లేదా ఎంపీగా నిలబడటానికి అంటే ఆయనే సమాధానం ఇవ్వలేకపోతున్నారు. ఇంకా ఎటూ తేల్చుకోలేదని, ఏ స్థానంలో పోటీ చేయాలన్న దానిపై సందిగ్ధత కొనసాగుతుందని రఘురామ చెబుతున్నారు.
నిజానికి నరసాపురంలోనే రఘురామ పోటీ చేయాలనుకున్నారు. కానీ టీడీపీ, జనసేన, బీజేపీతో పొత్తులో భాగంగా ఆ పార్లమెంట్ నియోజకవర్గం బీజేపీకి వెళ్లింది. ఆ పార్టీ నుంచి నిలబడేందుకు రఘురామ చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. దీంతో అక్కడ బీజేపీ అభ్యర్థిగా శ్రీనివాస్ వర్మను ప్రకటించారు. దీంతో రఘురామ టీడీపీలో చేరారు. ఆయన్ని నరసాపురంలోనే నిలబెట్టేందుకు బాబు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఏలూరు ఎంపీ స్థానాన్ని బీజేపీకి ఇచ్చి.. నరసాపురాన్ని తీసుకోవాలని చూస్తున్నారు. కానీ దీనిపై ఇంకా బీజేపీ అధిష్ఠానం నుంచి ఎలాంటి స్పందన రాలేదు.
ఒకవేళ అది జరగకపోతే ఉండి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి రఘురామను పోటీ చేయించే ఛాన్స్ ఉంది. కానీ అక్కడ టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజు ఇప్పటికే ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ఈ నేపథ్యంలో రఘురామ ఎక్కడి నుంచి ఏ పదవికి పోటీ చేస్తారన్నది బీజేపీ తీసుకునే నిర్ణయం మీదే ఆధారపడి ఉంది. ఈ రెండు మూడు రోజుల్లో దీనిపై ఓ స్పష్టత వచ్చే అవకాశముంది.
బాలీవుడ్లో దీపికా పదుకొనే, ఆలియా భట్ లాంటి హై ప్రొఫైల్ హీరోయిన్ల పోటీని తట్టుకుని చాలా ఏళ్లుగా టాప్లో కొనసాగుతున్న…
జింబాబ్వే పర్యటన కోసం ఎంపిక చేసిన భారత జట్టులో ఎడమచేతి వాటం బ్యాటర్లదే ఆధిపత్యం నడుస్తోంది. కుర్రాడు వైభవ్ సూర్యవంశీతో…
ఇటీవలే విడుదలైన నాగబంధంకు అంత ఓపెనింగ్స్ వస్తాయని ఊహించినవాళ్లు చాలా తక్కువ. ఎంత విజువల్ ఎఫెక్ట్స్ తో తీసిన సినిమా…
రెండు సంవత్సరాలకు పైగా మోక్షం కోసం ఎదురు చూస్తున్న విశ్వంభర విడుదలకు ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి. ఇప్పటికే ఆలస్యం వల్ల హైప్…
కాపు నాయకుడు, మాజీ ఎమ్మెల్యే.. దివంగత వంగవీటి మోహన్రంగా కుమార్తె ఆశాలత త్వరలోనే జనసేన పార్టీ తీర్థం పుచ్చు కోనున్నారా?…
ఫుట్బాల్ ప్రపంచాన్ని దశాబ్దాల పాటు శాసించిన క్రిస్టియానో రొనాల్డో శకం కన్నీటితో ముగిసింది. 2026 ఫిఫా వరల్డ్ కప్ ప్రీ…