కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. మార్పులు అనివార్యం. ఈ విషయం ఇప్పుడు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు తెలిసొచ్చినట్లే కనిపిస్తోంది. ఒకప్పుడు ఉద్యమాలు చేసి తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలకంగా వ్యవహరించిన కేసీఆర్.. అధికారంలోకి వచ్చాక ఉద్యమాలను అణచివేశారు. ఇక ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న ఆయన కాంగ్రెస్ పార్టీ పథకాలు అమలు చేయకపోతే పోరుబాట పడతానని హెచ్చరిస్తున్నారు. తాను అధికారంలో ఉన్నప్పుడు ధర్నాచౌక్నే ఎత్తేసిన కేసీఆర్.. ఇప్పుడు దీక్షలకు సై అంటున్నారు.
ఏ పార్టీ అధికారంలో ఉన్నా, ఏ ప్రభుత్వ పాలనలోనైనా ప్రజలకు కొన్ని విషయాల్లో వ్యతిరేకత వస్తుంది. కొన్ని డిమాండ్లు నెరవేర్చుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. సమస్యల పరిష్కారం కోసం ఆందోళన చేయాల్సి వస్తుంది. ప్రజాస్వామ్య దేశంలో శాంతియుతంగా నిరసన వ్యక్తం చేసే హక్కు అందరికీ ఉంది.
అందుకు 2000 నుంచి హైదరాబాద్లోని ఇందిరాపార్కు సమీపంలో ధర్నాచౌక్ వేదికగా మారింది. ఇక్కడ ఆందోళన చేస్తే అది ప్రభుత్వానికి తెలుస్తుందనే నమ్మకం ప్రజల్లో ఉంది. కానీ కేసీఆర్ మొదటి సారి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ ధర్నాచౌక్నే రద్దు చేశారు. 2017లో హైదరాబాద్ నగరంలో శాంతి భద్రతల రక్షణ కోసమే ధర్నాచౌక్ను ఎత్తివేస్తున్నట్లు కేసీఆర్ ప్రభుత్వం పేర్కొంది. నగరం బయట ఆందోళనలు చేసుకోవాలంది.
కానీ కేసీఆర్ తీరుపై అన్ని వర్గాల నుంచి తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది. హైకోర్టు కూడా మొట్టికాయలు వేసింది. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో ధర్నాచౌక్ను కొనసాగించాల్సి వచ్చింది. అయినా ఎప్పటికప్పుడూ కేసీఆర్ ప్రభుత్వం అక్కడ ఆందోళనలు, నిరసనలపై ఆంక్షలు పెట్టింది. ఇక వరి కొనుగోళ్లపై కేంద్రంలోని బీజేపీ సర్కారు వైఖరికి వ్యతిరేకంగా కేసీఆర్ అండ్ కో ధర్నాచౌక్లోనే ధర్నా చేసిన సంగతి తెలిసిందే.
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ధర్నాచౌక్లో ఆంక్షలు ఎత్తివేసింది. ఇప్పుడిక కేసీఆర్ ఏమో కాంగ్రెస్ పాలన వైఫల్యాలపై ఆందోళన చేస్తా అని చెబుతున్నారు. దళిత బంధు చెక్కుల్ని వెనక్కి తీసుకోవడంపై దళిత బిడ్డలతో కలిసి అంబేడ్కర్ విగ్రహం దగ్గర దీక్ష చేస్తా అని ప్రకటించారు. కానీ కేసీఆర్.. తమ సమస్యల పరిష్కారం కోసం ఆర్టీసీ కార్మికులు ఉద్యమం చేస్తే దయ లేకుండా తొక్కేసింది నిజం కాదా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అందుకే అధికారం ఉందనే గర్వం పనికిరాదని అంటున్నారు.
This post was last modified on April 15, 2024 10:52 am
నాకు డబ్బులే కావాలనుకుంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకునే వాడ్ని, రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఇప్పుడు గొప్పలు చెప్పుకుంటున్న వాళ్లకు…
ఇండియాస్ నంబర్ వన్ డైరెక్టర్ రాజమౌళి దగ్గర దర్శకత్వ విభాగంలో పని చేయాలని కాబోయే డైరెక్టర్ కావాలనుకున్న ప్రతి వ్యక్తికీ…
అనుకున్నట్టే ది ప్యారడైజ్ ట్రైలర్ రావడం లేదు. రిలీజ్ డేట్ సెప్టెంబర్ 24 మీద చాలా ఒత్తిడి ఉండటంతో ఇప్పటికిప్పుడు…
తెలుగు సినిమాల వింటేజ్ అభిమానుల ప్రధాన సమస్య ఒకటే. చాలా క్లాసిక్ మూవీస్, బ్లాక్ బస్టర్స్ సరైన రీతిలో ఆన్…
ఇప్పటిదాకా అన్ని భాషల్లో కలిపి కొన్ని వందల హారర్ సినిమాలు వచ్చి ఉంటాయి. హాలీవుడ్ ఈవిల్ డెడ్ తో మొదలుపెట్టి…
బాలీవుడ్ లో సంచలన వసూళ్లు నమోదు చేస్తున్న హనుమాన్ అంశ్ తెలుగులో సెప్టెంబర్ 18 విడుదల కానుంది. ఆశ్చర్యం కలిగించే…