Political News

బాబు అలా.. లోకేష్ ఇలా.. ఎలాగబ్బా?

రాజకీయంగా పెద్ద చర్చనీయాంశం అయిన టాపిక్ విషయంలో ఒక పార్టీలో ఉన్న ముఖ్య నేతలు అందరూ ఒకే స్టాండ్ మీద నిలబడడం.. ఒకే విధంగా స్వరం వినిపించడం అవసరం. అలా కాకుండా ముఖ్య నేతల్లో ఒకరు ఒకలా, ఇంకొకరు మరోలా స్పందిస్తే జనాల్లోకి వేరే సంకేతాలు వెళ్తాయి.

ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద జరిగిన రాయి దాడి విషయంలో ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం స్పందిస్తున్న తీరు కొంచెం చిత్రంగానే ఉంది. జగన్ మీద రాయి దాడి నిజంగా జరిగిందా.. దీని వెనుక కోడి కత్తి తరహా డ్రామా ఉందా.. అనే విషయంలో రకరకాల సందేహాలు రేకెత్తుతున్న మాట వాస్తవం.

ఐతే ఈ విషయంలో తెలుగుదేశం పార్టీ ఒక స్టాండ్ తీసుకుని దాని ప్రకారమే వ్యవహరించాల్సింది. ఐతే ఆ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఈ విషయంలో రాజకీయాల ప్రస్తావన లేకుండా హుందాగా ఒక ట్వీట్ పెట్టారు. జగన్‌పై దాడిని ఖండిస్తూ ఇలాంటి పరిణామాలు జరగకుండా చూడాలని ఈసీని కోరారు. జగన్‌పై దాడి వెనుక ఏం జరిగి ఉన్నా ఒక బాధ్యతాయుతమైన రాజకీయ నాయకుడు స్పందించాల్సిన తీరు ఇదే.

కానీ చంద్రబాబు తనయుడు నారా లోకేష్ మాత్రం వేరే రూట్ తీసుకున్నారు. జగన్‌పై దాడి అంతా ఒక నాటకం అంటూ ఆయన ట్వీట్లు వేస్తున్నారు. ఐతే జగన్‌‌పై దాడిని అనుమానిస్తే అనుమానించవచ్చు. కానీ అది నారా లోకేష్ స్థాయి నాయకుడు చేయాల్సిన పని లేదు. ముందుగా ఆయన ఈ దాడిని ఖండిస్తూ ఒక ట్వీట్ వేయాలి.

ఈ దాడి వెనుక డ్రామా ఉందేమో అని అనుమానించే పని వేరే వాళ్లకు అప్పగించాల్సింది. ద్వితీయ స్థాయి నాయకత్వం ఈ పని చూసుకుని ఉండొచ్చు. నిజానికి టీడీపీలో చాలామంది ఈ పనిలోనే ఉన్నారు. కానీ ఓవైపు చంద్రబాబు హుందాగా ట్వీట్ వేసి జగన్‌పై దాడిని ఖండిస్తుంటే.. ఇంకోవైపు లోకేష్ ఇలాంటి ట్వీట్లు వేయడం ఆయన స్థాయికి తగని పనిలా కనిపిస్తోంది. ఒకే విషయం మీద తండ్రీ కొడుకులు డిఫరెంట్ స్టాండ్ తీసుకోవడం చూసేవారికి బాగా అనిపించడం లేదు.

This post was last modified on April 14, 2024 6:05 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

కేంద్రంలో వైసీపీ వాయిస్ క‌ట్‌…?

కేంద్రంలోను.. ఢిల్లీ రాజకీయాల్లోనూ ఇప్ప‌టి వ‌ర‌కు వైసీపీ కొంత మేర‌కు హ‌వా చెలాయిస్తున్న విష‌యం తెలిసిందే. అధికారంలో ఉన్న‌ప్పుడు ఇప్పుడు…

3 minutes ago

అదే చెక్క‌కుర్చీ… అదే టేబుల్‌… ఐదోసారి సీఎం!

దేశంలోని ఏ రాష్ట్రంలో అయినా.. ఏ నాయ‌కుడు అయినా.. ఒక్క‌సారి ముఖ్య‌మంత్రి అయితే చాలు.. కూర్చునే కుర్చీ నుంచి తిరిగే…

2 hours ago

సింగల్ స్క్రీన్ VS మల్టీప్లెక్స్… ఏది రైటు?

ఓ పాతిక సంవత్సరాలు వెనక్కు వెళ్తే హైదరాబాద్ లో అత్యధిక శాతం సింగల్ స్క్రీన్లు ఉండేవి. టోలి చౌకి నుంచి…

3 hours ago

దురంధర్ పోటీ సినిమాకు ఘోర అవమానం

గత ఏడాది డిసెంబర్ దురంధర్ విడుదలతో మొదలుపెట్టి మార్చిలో రిలీజైన దురంధర్ ది రివెంజ్ దాకా పాకిస్థాన్ జనాలు, మీడియా…

5 hours ago

ప్రీమియర్ రేట్లు నిర్ణయించుకున్న పెద్ది ?

జూన్ 4 విడుదల కాబోతున్న పెద్ది కోసం ఎదురు చూపులు మాములుగా లేవు. రెండు నెలలుగా డ్రైగా ఉన్న బాక్సాఫీస్…

6 hours ago

త‌మిళ రాజ‌కీయాల్లో పుష్ప సోఫా రచ్చ

గ‌త ప‌ది రోజులుగా త‌మిళనాడు రాజ‌కీయాలు దేశ‌వ్యాప్తంగా ఎంత చ‌ర్చ‌నీయాంశం అవుతున్నాయో తెలిసిందే. ఎన్నిక‌ల్లో అతి పెద్ద పార్టీగా టీవీకే…

7 hours ago