పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో దేశమంతటా రాజకీయ వేడి రాజుకుంది. ఇక ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు కూడా ఉండటంతో ఇక్కడ ఆ హీట్ ఇంకా ఎక్కువగానే ఉంది. మరోవైపు తెలంగాణలోనూ పార్లమెంట్ స్థానాల్లో ఆధిపత్యం కోసం కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ ఢీ అంటే ఢీ అనడంతో పోరు రసవత్తరంగా సాగుతోంది. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో రాజకీయం ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ అంశం చుట్టూనే తిరుగుతోందనే చెప్పాలి. గత తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీకి మద్దతుగా, ప్రత్యర్థి నాయకులను దెబ్బకొట్టేందుకు బీఆర్ఎస్ ఫోన్ ట్యాపింగ్ కుట్రకు తెరలేపిందనే ఆరోపణలున్నాయి. ఈ వ్యవహారంలో విచారణ కొనసాగుతోంది.
మరోవైపు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఫోన్ను ట్యాపింగ్ చేసే కుట్ర జరుగుతుందనే ఆరోపణ ఏపీ రాజకీయాల్లోనూ కలకలం రేపింది. గుర్తు తెలియని ఏజెన్సీల ద్వారా పెగాసెస్ సాఫ్ట్వేర్ను వాడి లోకేశ్ ఫోన్ను ట్యాప్ చేస్తున్నట్టు యాపిల్ కంపెనీ నుంచి వార్నింగ్ రావడం హాట్ టాపిక్గా మారింది. దీంతో ఈ విషయాన్ని టీడీపీ నేతలు తీవ్రంగా పరిగణిస్తున్నారు. తాడేపల్లి ప్యాలెస్ ఆదేశాలతోనే టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులతో పాటు న్యాయమూర్తులు, ఎన్నికల సంఘం అధికారుల ఫోన్లనూ ట్యాప్ చేస్తున్నారని టీడీపీ నేతలు ఆరోపించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ, నిఘా విభాగాధిపతి ప్రమేయం లేకుండా ఈ ట్యాపింగ్ జరిగే అవకాశమే లేదని అంటున్నారు. దీనిపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు.
అటు తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసులో వెలుగులోకి వస్తున్న విషయాలు సంచలనం రేకెత్తిస్తున్నాయి. తాజాగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, మెదక్ లోక్సభ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి డబ్బునే ఎక్కువగా తరలించారని పోలీసుల విచారణలో వెల్లడైంది. దీంతో కాంగ్రెస్, బీజేపీ నాయకులు బీఆర్ఎస్పై విమర్శల దాడిని మరింత పెంచారు. ఈ నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ ఫోన్ ట్యాపింగ్ల కలకలం రాజకీయంగా ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో చూడాలి.
This post was last modified on April 14, 2024 7:07 am
తెలంగాణలో పార్టీ ఫిరాయింపుల కేసు వ్యవహారం ఆసక్తి రేపిన సంగతి తెలిసిందే. బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ కు 10…
సోషల్ మీడియాలో చాలా అలెర్ట్ గా ఉండాలి. ముఖ్యంగా సెలబ్రిటీలు బిజీగా షెడ్యూల్స్ లో ఏ మాత్రం ఏమరుపాటుగా ఉన్నా…
థియేటర్లకు సరైన సినిమాలు వస్తే రావడానికి ప్రేక్షకులు సిద్ధంగా ఉన్నారు. ఎటొచ్చి వాళ్ళను కనీస స్థాయిలో మెప్పించే కంటెంట్ ఉన్నవి…
తెలంగాణలో రెండు రాజ్యసభ స్థానాలకు పోటీ చేసిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు అభిషేక్ మను సింఘ్వీ, వేం నరేందర్ రెడ్డిలు..…
వంటగ్యాస్ కొరత కారణంగా దేశవ్యాప్తంగా చిన్న హోటళ్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. హోటళ్లకు సరఫరా అయ్యే కమర్షియల్ సిలిండర్ల పంపిణీని…
రాష్ట్రంలోని పలు మున్సిపల్ సంస్థల్లో పాలకవర్గాల గడువు ముగియడంతో అక్కడ స్పెషల్ ఆఫీసర్ల పాలన అమల్లోకి రానుంది. మున్సిపల్ కార్పొరేషన్లు,…