నందమూరి బాలకృష్ణ పబ్లిక్లోకి వచ్చాడంటే చాలు.. అక్కడ్నుంచి ఒక వార్త కామన్. అభిమానులు అత్యుత్సాహం ప్రదర్శించడం.. వారి మీద బాయల్య చేయి చేసుకోవడం మామూలే. ఇప్పటికే ఇలా చాలాసార్లు జరిగింది. ఇంకో నెల రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో బాలయ్య బస్సు యాత్రకు రెడీ అయ్యారు.
బాలయ్య అన్స్టాపబుల్ అని బస్సు మీద రాయించి.. ‘స్వర్ణాంధ్ర సాకార యాత్ర’ పేరుతో ఆయన ఎన్నికల ప్రచారానికి రెడీ అయ్యారు. తాను ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న అనంతపురం జిల్లాలో ఆయన శుక్రవారం తన యాత్రను మొదలుపెట్టారు. రెండో రోజే ఒక అభిమాని మీద చేయి చేసుకోవడంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
బస్సు యాత్రలో భాగంగా కదిరి ప్రాంతానికి వెళ్లిన బాలయ్యను చూసేందుకు అభిమానులు ఎగబడ్డారు. బాలయ్య జనం మధ్య ఉండగా ఒక అభిమాని మీదికి వస్తూ బాలయ్యతో సెల్ఫీ దిగే ప్రయత్నం చేశాడు. దీంతో బాలయ్యకు కోపం కట్టలు తెంచుకుంది. అభిమానిని పక్కకు నెడుతూ చేయి చేసుకున్నాడు. ఇది ప్రత్యర్థులకు ఆయుధంగా మారింది. మరోసారి బాలయ్య దురుసు ప్రవర్తన అంటూ సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.
కానీ అభిమానులు మాత్రం ఎప్పట్లాగే దీన్ని సమర్థిస్తున్నారు. బాలయ్య బౌన్సర్లు, వేరే సెక్యూరిటీ లేకుండా బయటికి వస్తారని.. అభిమానులు అతి చేస్తే వారికి ఇలాగే సమాధానం చెబుతాడని.. ఫ్యాన్స్ కూడా ఈ విషయాన్ని సీరియస్గా తీసుకోరని.. బాలయ్య ఈ విషయాన్ని లైట్ తీసుకోవాలని అంటున్నారు.
This post was last modified on April 13, 2024 4:31 pm
నాకు డబ్బులే కావాలనుకుంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకునే వాడ్ని, రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఇప్పుడు గొప్పలు చెప్పుకుంటున్న వాళ్లకు…
ఇండియాస్ నంబర్ వన్ డైరెక్టర్ రాజమౌళి దగ్గర దర్శకత్వ విభాగంలో పని చేయాలని కాబోయే డైరెక్టర్ కావాలనుకున్న ప్రతి వ్యక్తికీ…
అనుకున్నట్టే ది ప్యారడైజ్ ట్రైలర్ రావడం లేదు. రిలీజ్ డేట్ సెప్టెంబర్ 24 మీద చాలా ఒత్తిడి ఉండటంతో ఇప్పటికిప్పుడు…
తెలుగు సినిమాల వింటేజ్ అభిమానుల ప్రధాన సమస్య ఒకటే. చాలా క్లాసిక్ మూవీస్, బ్లాక్ బస్టర్స్ సరైన రీతిలో ఆన్…
ఇప్పటిదాకా అన్ని భాషల్లో కలిపి కొన్ని వందల హారర్ సినిమాలు వచ్చి ఉంటాయి. హాలీవుడ్ ఈవిల్ డెడ్ తో మొదలుపెట్టి…
బాలీవుడ్ లో సంచలన వసూళ్లు నమోదు చేస్తున్న హనుమాన్ అంశ్ తెలుగులో సెప్టెంబర్ 18 విడుదల కానుంది. ఆశ్చర్యం కలిగించే…