Political News

ఇంట్రెస్టింగ్: షర్మిల వైపుకు మహిళా ఓటర్లు.!

కడప లోక్ సభ నియోజకవర్గ పరిధిలో ఆసక్తికరమైన రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. సిట్టింగ్ ఎంపీ, వైసీపీ నేత వైఎస్ అవినాశ్ రెడ్డికి పోటీగా కాంగ్రెస్ పార్టీ నుంచి వైఎస్ షర్మిల ఎన్నికల బరిలోకి దిగిన సంగతి తెలిసిందే.

కాంగ్రెస్ పార్టీ కంటూ ప్రస్తుతం ప్రత్యేకంగా ఓటు బ్యాంకు ఏమీ లేదు. అదెప్పుడో వైసీపీకి బదిలీ అయిపోయింది. అలా బదిలీ అయిపోయిన కాంగ్రెస్ ఓటు బ్యాంకు నుంచి కొంతైనా రాబట్టగలననే విశ్వాసంతో కనిపిస్తున్నారు వైఎస్ షర్మిల.

తన అన్న తనను గోడకేసి కొట్టారనీ, తన బాబాయ్ వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో దోషుల్ని తన అన్నే కాపాడుతున్నారనీ వైఎస్ షర్మిల ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో వైసీపీ మహిళా ఓటర్లలో కొందరు, షర్మిల వైపు ‘సానుభూతి’తో చూస్తున్నారట.

కాంగ్రెస్ పార్టీ తాజాగా కడప లోక్ సభ నియోజకవర్గ పరిధిలో నిర్వహించిన అంతర్గత సర్వేలో ఈ విషయం బయటపడినట్లు తెలుస్తోంది. వైఎస్ షర్మిల గెలిచే అవకాశం లేకపోయినా, వైసీపీ ఓటు బ్యాంకుని ఆమె గట్టిగానే చీల్చే అవకాశం వున్నట్లు తెలుస్తోంది.

ఇదే విషయమై వైసీపీ శ్రేణుల్లో ఒకింత అలజడి కనిపిస్తోంది. పులివెందుల వైసీపీ అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే, ముఖ్యమంత్రి కూడా అయిన వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి కూడా, ఈ విషయమై షర్మిల నుంచి షాక్ తగలబోతోందిట.

దాంతో, పార్టీ కీలక నేతలు వైవీ సుబ్బారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, విజయసాయిరెడ్డిలతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రత్యేకంగా మంతనాలు జరుపుతున్నారట కూడా. వైసీపీకి సంబంధించి కడపలో మహిళా ఓటు బ్యాంకు ఎట్టి పరిస్థితులోనూ చీలిపోకుండా వుండాలంటే, విజయమ్మను తీసుకురావాలనే డిమాండ్ వైసీపీలో పెరుగుతోంది. కానీ, ఆమె అందుకు ఒప్పుకుంటారా.? అన్నదే మిలియన్ డాలర్ క్వశ్చన్.

This post was last modified on April 12, 2024 9:42 pm

Share
Show comments
Published by
satya

Recent Posts

బొత్స ‘ముహూర్తం’ పెట్టారు.. వైవీ ‘స‌మ‌యం’ నిర్ణ‌యించారు!

ఏపీ అధికార పార్టీ వైసీపీలో మాట‌లే కాదు.. ఆశ‌లు కూడా కోట‌లు దాటుతున్నాయి. ఈ నెల 13న జ‌రిగిన పోలింగ్‌లో…

35 mins ago

బాల‌య్య హ్యాట్రిక్ ప‌క్కా.. కానీ చీలే ఓట్లెన్ని?

హిందూపురం.. టీడీపీ కంచుకోట‌ల్లాంటి నియోజ‌క‌వ‌ర్గాల్లో ఇదొక‌టి. ఇక్క‌డ టీడీపీకి ఎదురేలేదు. వ‌రుస‌గా రెండు సార్లు గెలిచిన నంద‌మూరి బాల‌కృష్ణ ఈ…

2 hours ago

హరోంహర….తెలివైన పని చేసెరా

సుధీర్ బాబు గంపెడాశలు పెట్టుకున్న హరోంహర విడుదల వాయిదా పడింది. మే 31 నుంచి జూన్ 14కి వెళ్తున్నట్టు అధికారికంగా…

2 hours ago

పాయల్ వివాదంలో కొత్త మలుపులు

నాలుగేళ్ల క్రితం చేసిన రక్షణ అనే సినిమా నిర్మాతలు ప్రమోషన్ కోసం తనను వేధిస్తున్నారని తీవ్ర ఆరోపణలు చేస్తూ హీరోయిన్…

3 hours ago

ఆ నేత పంతం.. కుమార్తెకు ఎస‌రు పెడుతోందా?

రాజ‌కీయాల్లో అన్ని వేళ‌లా పంతమే ప‌నికిరాదు. ఒక్కొక్క‌సారి ప‌ట్టు విడుపులు కూడా ముఖ్య‌మే. ఈ విష‌యంలో నాయ‌కులు, పార్టీలు కూడా..…

3 hours ago

బ్రహ్మరాక్షస వెనుక ఏం జరుగుతోంది

హనుమాన్ రూపంలో 2024లోనే అతి పెద్ద బ్లాక్ బస్టర్ ఇచ్చిన దర్శకుడు ప్రశాంత్ వర్మ బాలీవుడ్ హీరో రణ్వీర్ సింగ్…

4 hours ago