కడప లోక్ సభ నియోజకవర్గ పరిధిలో ఆసక్తికరమైన రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. సిట్టింగ్ ఎంపీ, వైసీపీ నేత వైఎస్ అవినాశ్ రెడ్డికి పోటీగా కాంగ్రెస్ పార్టీ నుంచి వైఎస్ షర్మిల ఎన్నికల బరిలోకి దిగిన సంగతి తెలిసిందే.
కాంగ్రెస్ పార్టీ కంటూ ప్రస్తుతం ప్రత్యేకంగా ఓటు బ్యాంకు ఏమీ లేదు. అదెప్పుడో వైసీపీకి బదిలీ అయిపోయింది. అలా బదిలీ అయిపోయిన కాంగ్రెస్ ఓటు బ్యాంకు నుంచి కొంతైనా రాబట్టగలననే విశ్వాసంతో కనిపిస్తున్నారు వైఎస్ షర్మిల.
తన అన్న తనను గోడకేసి కొట్టారనీ, తన బాబాయ్ వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో దోషుల్ని తన అన్నే కాపాడుతున్నారనీ వైఎస్ షర్మిల ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో వైసీపీ మహిళా ఓటర్లలో కొందరు, షర్మిల వైపు ‘సానుభూతి’తో చూస్తున్నారట.
కాంగ్రెస్ పార్టీ తాజాగా కడప లోక్ సభ నియోజకవర్గ పరిధిలో నిర్వహించిన అంతర్గత సర్వేలో ఈ విషయం బయటపడినట్లు తెలుస్తోంది. వైఎస్ షర్మిల గెలిచే అవకాశం లేకపోయినా, వైసీపీ ఓటు బ్యాంకుని ఆమె గట్టిగానే చీల్చే అవకాశం వున్నట్లు తెలుస్తోంది.
ఇదే విషయమై వైసీపీ శ్రేణుల్లో ఒకింత అలజడి కనిపిస్తోంది. పులివెందుల వైసీపీ అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే, ముఖ్యమంత్రి కూడా అయిన వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి కూడా, ఈ విషయమై షర్మిల నుంచి షాక్ తగలబోతోందిట.
దాంతో, పార్టీ కీలక నేతలు వైవీ సుబ్బారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, విజయసాయిరెడ్డిలతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రత్యేకంగా మంతనాలు జరుపుతున్నారట కూడా. వైసీపీకి సంబంధించి కడపలో మహిళా ఓటు బ్యాంకు ఎట్టి పరిస్థితులోనూ చీలిపోకుండా వుండాలంటే, విజయమ్మను తీసుకురావాలనే డిమాండ్ వైసీపీలో పెరుగుతోంది. కానీ, ఆమె అందుకు ఒప్పుకుంటారా.? అన్నదే మిలియన్ డాలర్ క్వశ్చన్.
This post was last modified on April 12, 2024 9:42 pm
తను స్వతహాగా రష్యన్ అయినా.. పుట్టి పెరిగింది రష్యాలోనే అయినా.. పవన్ కళ్యాణ్ను పెళ్లి చేసుకున్నాక పూర్తిగా ఒక తెలుగింటి…
జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ మధ్య ఎంత స్నేహం ఉందో తెలిసిందే. ఆర్ఆర్ఆర్ షూటింగ్, ప్రమోషన్స్ టైంలో కనిపించినంతగా ఇప్పుడు…
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో చాలామంది హాలీవుడ్ సినిమాల నుంచి స్ఫూర్తి పొంది కథలు, సన్నివేశాలు తీర్చిదిద్దుకున్న వాళ్లే. ఇప్పుడు ఇండియా…
అక్కినేని నాగేశ్వరరావు మనవడు సుమంత్ను చూస్తే పెద్ద స్టార్ కావడానికి అవసరమైన అన్ని లక్షణాలు ఉన్నట్లే కనిపిస్తాడు. ఆరడుగుల ఆజానుబాహుడు,…
పోలవరం జిల్లా ఈర్లపల్లి గ్రామానికి చెందిన 10వ తరగతి విద్యార్ధిని ముర్రం శివాని ఆత్మహత్య చేసుకుంది. దీనికి సంబంధించిన కారణాలు…
తెలంగాణలో ఆక్రమ కట్టడాలకు సింహ స్వప్నంగా మారిన హైడ్రా విధానంపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. తమ మాటంటే హైడ్రాకు…