కొద్ది రోజుల క్రితం క్రికెటర్ అంబటి రాయుడు, ‘సిద్ధం’ అంటూ ట్వీటేశాడు. ‘ఏంటీ, మళ్ళీ అంబటి రాయుడు వైసీపీలోకి వెళ్ళిపోతున్నాడా.?’ అన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. క్రికెట్కి గుడ్ బై చెప్పి, రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన అంబటి రాయుడు, తొలుత వైసీపీలో చేరాడు. వైసీపీ నుంచి గుంటూరు లోక్ సభ టిక్కెట్ ఆశించినట్లుగా ప్రచారం కూడా జరిగింది.
వైసీపీ గుంటూరు అభ్యర్థి అంబటి రాయుడు.. అంటూ వైసీపీ నేతలే మీడియాకి లీకులు ఇచ్చారు. వైసీపీ సోషల్ మీడియా విభాగం కూడా ఇదే ప్రచారం చేసింది. ఏమయ్యిందో అంబటి, వైసీపీని వీడారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో టచ్లోకి వచ్చారు.
మరోపక్క, క్రికెట్ లీగ్ నేపథ్యంలో రాజకీయాలకు అంబటి రాయుడు రిటైర్మెంట్ ప్రకటించడం గమనార్హం. ఇదంతా చాలా చాలా గందరగోళానికి కారణమయ్యింది కూడా.! ఇంతలోనే, జనసేన పార్టీ తరఫున స్టార్ క్యాంపెయినర్గా అంబటి రాయుడికి అవకాశం దక్కింది.
నాగబాబు, హైపర్ ఆది, అంబటి రాయుడు తదితరులతో కూడిన స్టార్ క్యాంపెయినర్ల లిస్టుని జనసేన పార్టీ తాజాగా ప్రకటించింది. అసలంటూ అంబటి, జనసేన పార్టీలో చేరనే లేదు కదా.? అని వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు. జన సైనికుల్లోనూ ఈ విషయమై కొంత ఆందోళన వుంది.
పోతిన మహేష్ వ్యవహారం తర్వాత, జనసైనికులు ఎవర్నీ నమ్మే పరిస్థితుల్లో లేరు. అంబటి రాయుడు గనుక కీలక సమయంలో ప్లేటు ఫిరాయించేస్తోనో..? అన్న అనుమానం జనసైనికుల్ని కొంత ఇబ్బంది పెడుతోంది. ఇంతకీ, అంబటి రాయుడు మనసులో ఏముంది.? అదైతే ఇప్పుడే చెప్పలేం.
కాగా, జనసేన తరఫున ఎన్నికల ప్రచారం అంటే, కూటమి తరఫున కూడా అంబటి రాయుడు ప్రచారం చేయాల్సి రావొచ్చు. చేస్తాడేమో కూడా.!
This post was last modified on April 10, 2024 6:53 pm
మహేష్ బాబు అభిమానులు ఎప్పుడు గుర్తు తెచ్చుకోకూడదనే డిజాస్టర్ బ్రహ్మోత్సవం. అప్పట్లో దీని మీద వచ్చిన హైప్, ప్రమోషన్ అంత…
వరంగల్-నల్గొండ-ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ను గెలిపించే బాధ్యతను భుజాలకెత్తుకున్న కేటీఆర్ ప్రచారంలో తీరిక లేకుండా ఉన్నారు. సభలు,…
గత ఏడాది అతి పెద్ద బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా రికార్డులు సృష్టించిన బేబీ సంచలనం ఏకంగా దాన్ని హిందీలో…
మహానటిలో సావిత్రిగా తన అద్భుత నటనతో కట్టిపడేసిన కీర్తి సురేష్ మళ్ళీ దాన్ని తలపించే ఇంకో పాత్ర చేయలేదంటేనే ఆ…
'ఎక్కడున్నా భారత్కు తిరిగొచ్చి విచారణకు హాజరవ్వు. తప్పించుకోవద్దని నేను అభ్యర్థిస్తున్నాను. ఏ తప్పూ చేయకపోతే.. ఎందుకు భయపడుతున్నావ్? ఎన్ని రోజులు…
ఏపీలో ఎన్నికలు ముగిసి.. వారం రోజులు అయిపోయింది. ఈ నెల 13న నాలుగో దశ సార్వత్రిక ఎన్నికల పోలింగ్లో భాగంగా…