Political News

ఎన్నిక‌ల ఎఫెక్ట్‌: ఉగాది పూజ‌ల్లో తొలిసారి భార‌తి!

ఎన్నిక‌ల వేళ ఆసక్తిక‌ర ప‌రిణామం చోటు చేసుకుంది. గ‌తంలో ఎప్పుడూ లేని విధంగా ఏపీ సీఎం జ‌గ‌న్ స‌తీమ‌ణి వైఎస్ భార‌తి.. ఉగాది పూజ‌ల్లో పాల్గొన్నారు. పండితుల వేద ఆశీర్వ‌చ‌నం తీసుకున్నారు. నెత్తిన అక్ష‌త‌లు కూడా జ‌ల్లించుకున్నారు. ఇవ‌న్నీ పూర్తిగా హిందూ సంప్ర‌దాయానికి చెందిన‌వ‌నే విష‌యం తెలిసిందే. అయితే.. ఆమె ఎప్పుడూ.. ఇలా హిందూపూజ‌ల్లో నేరుగా పాల్గొన‌లేదు. సంక్రాంతి వంటి సంబ‌రాల్లో పాల్గొన్నా.. జ‌గ‌న్ ఒక్క‌రే పండితుల నుంచి ఆశీర్వాదం తీసుకున్నారు.

ఇక‌, వివిధ మ‌తాచార్య‌లు క‌లిసినా.. జ‌గ‌న్ ఒక్క‌రినే ఆశీర్వ‌దించి వెళ్లిపోతారు. కానీ, తాజాగా ఉగాది వేడుక ల్లో వైఎస్ భార‌తి పాల్గ‌న‌డ‌మే కాకుండా.. హిందూ సంప్ర‌దాయం ప్ర‌కారం ఆశీర్వ‌చ‌నం తీసుకోవ‌డం అక్ష త‌లు వేయించుకోవ‌డం గ‌మ‌నార్హం. ప్ర‌స్తుతం మేం సైతం సిద్ధం ఎన్నికల ప్ర‌చారంలో ఉన్న సీఎం జ‌గ‌న్ ఉమ్మ‌డి గుంటూరు జిల్లా శావల్యాపురం మండలం గంటావారిపాలెం వద్ద క్యాంపులో విశ్రాంతి తీసుకుంటున్నారు.

ఈ క్ర‌మంలో ఉగాది సందర్భంగా అక్క‌డే ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించారు. అనంత‌రం వేద పండితులు ఆశీర్వ‌చ‌నాలు అందించారు. ఈ సంద‌ర్భంగా పండితులు అందించిన ఉగాది పచ్చడిని సీఎం దంపతు లు స్వీక‌రించారు.(గ‌తంలో భార‌తి ఇలా తీసుకోక‌పోవ‌డం గ‌మ‌నార్హం.) అనంత‌రం. పండితులు సీఎం దంప‌తుల‌కు శాలువా కప్పి, అక్ష‌తలు చల్లి ఆశీర్వాదం ప‌లికారు. కార్యక్రమంలో పాల్గొన్న నరసరావుపేట ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్, వినుకొండ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

కొస‌మెరుపు: గ‌తంలో ఎన్న‌డూ లేని విధంగా ముఖాన బొట్టు పెట్ట‌డం.. ఆశీర్వ‌చ‌నం తీసుకోవ‌డం.. వంటివాటిని రికార్డు చేసి మ‌రీ మీడియాకు విడుద‌ల చేయ‌డం గ‌మ‌నార్హం. మొత్తంగా ఎన్నిక‌ల నేప‌థ్యంలో అంద‌రినీ మ‌చ్చిక చేసుకోవాల‌న్న ఏకైక ల‌క్ష్యంతోనే ఇలా చేశార‌న్న వాద‌న వినిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం. దీనిపై బీజేపీ నాయ‌కులు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.

This post was last modified on April 9, 2024 6:11 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

‘ధూరందర్’ దర్శకుడు… మాములోడు కాదు

బాలీవుడ్‌లో స్టార్ పవర్ కంటే కేవలం కథను నమ్మి సినిమాలు తీసే దర్శకులు చాలా తక్కువ మంది ఉంటారు. అందులో…

19 minutes ago

పరాభవ నామ సంవత్సరం అర్థం ఇదే..

నేడు ఉగాది సందర్భంగా కొత్త తెలుగు సంవత్సరం పరాభవ నామ సంవత్సరంగా ప్రారంభమవుతోంది. అయితే “పరాభవం” అనే పదం వినగానే…

28 minutes ago

ఉగాది రోజు కూటమి కొలువుల కానుక

ఉద్యోగార్థులకు ఉగాది కానుకగా రాష్ట్ర ప్రభుత్వం జాబ్ క్యాలెండర్‌ను విడుదల చేసింది. మొత్తం 10,060 పోస్టులతో ఈ క్యాలెండర్‌ను విడుదల…

32 minutes ago

దేవికి ఎల్లమ్మ అంత నచ్చిందా

స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ హీరో అవుతాడని చాలా ఏళ్ల ముందే ప్రచారం జరిగింది. సుకుమార్ లాంటి అగ్ర…

5 hours ago

జీతం తీసుకొని సభకు రారా కేసీఆర్ సారు

రాష్ట్రంలో ప్ర‌తిప‌క్షం.. బాధ్య‌తాయుతంగా వ్య‌వ‌హ‌రించ‌డం లేద‌ని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నాయ‌కుడు కేసీఆర్‌.. ప్ర‌జ‌లుక‌డుతున్న ప‌న్నుల‌తో…

9 hours ago

‘మహేష్’ వివాదంపై స్పందించిన శ్రీలీల

ఇటీవల ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ప్రి రిలీజ్ ఈవెంట్ సందర్భంగా జరిగిన ఒక పరిణామానికి సంబంధించి ఓ వీడియో సోషల్…

11 hours ago