Political News

ఎన్నిక‌ల ఎఫెక్ట్‌: ఉగాది పూజ‌ల్లో తొలిసారి భార‌తి!

ఎన్నిక‌ల వేళ ఆసక్తిక‌ర ప‌రిణామం చోటు చేసుకుంది. గ‌తంలో ఎప్పుడూ లేని విధంగా ఏపీ సీఎం జ‌గ‌న్ స‌తీమ‌ణి వైఎస్ భార‌తి.. ఉగాది పూజ‌ల్లో పాల్గొన్నారు. పండితుల వేద ఆశీర్వ‌చ‌నం తీసుకున్నారు. నెత్తిన అక్ష‌త‌లు కూడా జ‌ల్లించుకున్నారు. ఇవ‌న్నీ పూర్తిగా హిందూ సంప్ర‌దాయానికి చెందిన‌వ‌నే విష‌యం తెలిసిందే. అయితే.. ఆమె ఎప్పుడూ.. ఇలా హిందూపూజ‌ల్లో నేరుగా పాల్గొన‌లేదు. సంక్రాంతి వంటి సంబ‌రాల్లో పాల్గొన్నా.. జ‌గ‌న్ ఒక్క‌రే పండితుల నుంచి ఆశీర్వాదం తీసుకున్నారు.

ఇక‌, వివిధ మ‌తాచార్య‌లు క‌లిసినా.. జ‌గ‌న్ ఒక్క‌రినే ఆశీర్వ‌దించి వెళ్లిపోతారు. కానీ, తాజాగా ఉగాది వేడుక ల్లో వైఎస్ భార‌తి పాల్గ‌న‌డ‌మే కాకుండా.. హిందూ సంప్ర‌దాయం ప్ర‌కారం ఆశీర్వ‌చ‌నం తీసుకోవ‌డం అక్ష త‌లు వేయించుకోవ‌డం గ‌మ‌నార్హం. ప్ర‌స్తుతం మేం సైతం సిద్ధం ఎన్నికల ప్ర‌చారంలో ఉన్న సీఎం జ‌గ‌న్ ఉమ్మ‌డి గుంటూరు జిల్లా శావల్యాపురం మండలం గంటావారిపాలెం వద్ద క్యాంపులో విశ్రాంతి తీసుకుంటున్నారు.

ఈ క్ర‌మంలో ఉగాది సందర్భంగా అక్క‌డే ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించారు. అనంత‌రం వేద పండితులు ఆశీర్వ‌చ‌నాలు అందించారు. ఈ సంద‌ర్భంగా పండితులు అందించిన ఉగాది పచ్చడిని సీఎం దంపతు లు స్వీక‌రించారు.(గ‌తంలో భార‌తి ఇలా తీసుకోక‌పోవ‌డం గ‌మ‌నార్హం.) అనంత‌రం. పండితులు సీఎం దంప‌తుల‌కు శాలువా కప్పి, అక్ష‌తలు చల్లి ఆశీర్వాదం ప‌లికారు. కార్యక్రమంలో పాల్గొన్న నరసరావుపేట ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్, వినుకొండ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

కొస‌మెరుపు: గ‌తంలో ఎన్న‌డూ లేని విధంగా ముఖాన బొట్టు పెట్ట‌డం.. ఆశీర్వ‌చ‌నం తీసుకోవ‌డం.. వంటివాటిని రికార్డు చేసి మ‌రీ మీడియాకు విడుద‌ల చేయ‌డం గ‌మ‌నార్హం. మొత్తంగా ఎన్నిక‌ల నేప‌థ్యంలో అంద‌రినీ మ‌చ్చిక చేసుకోవాల‌న్న ఏకైక ల‌క్ష్యంతోనే ఇలా చేశార‌న్న వాద‌న వినిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం. దీనిపై బీజేపీ నాయ‌కులు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.

This post was last modified on April 9, 2024 6:11 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

పరాశక్తి పండగ చేసుకుంటుంది కానీ

సెన్సార్ చిక్కుల్లో పడి నానా యాతన పడ్డ సినిమాల్లో జన నాయకుడుకి మోక్షం దక్కలేదు కానీ పరాశక్తి సంకెళ్లు తెంచుకుంది.…

3 minutes ago

చంద్రబాబు – పవన్‌లకు పని తగ్గిస్తున్న జగన్..!

వైసీపీ అధినేత జగన్ మారుతాడేమో, ప్రజల్లో ఆయనపై సానుభూతి పెరుగుతుందేమో అని కూటమి నాయకులు పలుసార్లు భావిస్తూ వచ్చారు. అందుకే…

3 hours ago

ఇంగిత జ్ఞానం లేని వ్యక్తి.. జ‌గ‌న్‌ పై బాబు సీరియ‌స్

వైసీపీ అధినేత జ‌గ‌న్‌పై సీఎం చంద్ర‌బాబు తీవ్ర స్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పించారు. వైసీపీ పాల‌న‌తో రాష్ట్రం పూర్తిగా విధ్వంస‌మైందని అన్నారు.…

4 hours ago

అమరావతిపై జగన్‌కు 5 ప్రశ్నలు..!

అమరావతి రాజధానిపై వైసీపీ అధినేతగా జగన్ చేసిన తాజా వ్యాఖ్యల నేపథ్యంలో ఆయనపై మరోసారి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాజధాని విషయంలో…

6 hours ago

జ‌గ‌న్ రోడ్డున ప‌డేస్తే.. కూట‌మి ఆదుకుంది!

వైసీపీ అధినేత జ‌గ‌న్ హ‌యాంలో ఓ కుటుంబం రోడ్డున ప‌డింది. కేవ‌లం మాస్క్ అడిగిన పాపానికి ప్రభుత్వం క‌క్ష‌పూరితంగా వ్య‌వ‌హ‌రించి…

6 hours ago

కోనసీమకు ప్రభుత్వం గుడ్ న్యూస్

కోనసీమ జిల్లా వాసులు ఎంతో పవిత్రంగా, ప్రతిష్టాత్మకంగా నిర్వహించుకునే పండుగ జగ్గన్నతోట ప్రభల తీర్థం. ఇది తరతరాలుగా సంప్రదాయబద్ధంగా కొనసాగుతూ…

6 hours ago