ఎన్నికల వేళ ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఏపీ సీఎం జగన్ సతీమణి వైఎస్ భారతి.. ఉగాది పూజల్లో పాల్గొన్నారు. పండితుల వేద ఆశీర్వచనం తీసుకున్నారు. నెత్తిన అక్షతలు కూడా జల్లించుకున్నారు. ఇవన్నీ పూర్తిగా హిందూ సంప్రదాయానికి చెందినవనే విషయం తెలిసిందే. అయితే.. ఆమె ఎప్పుడూ.. ఇలా హిందూపూజల్లో నేరుగా పాల్గొనలేదు. సంక్రాంతి వంటి సంబరాల్లో పాల్గొన్నా.. జగన్ ఒక్కరే పండితుల నుంచి ఆశీర్వాదం తీసుకున్నారు.
ఇక, వివిధ మతాచార్యలు కలిసినా.. జగన్ ఒక్కరినే ఆశీర్వదించి వెళ్లిపోతారు. కానీ, తాజాగా ఉగాది వేడుక ల్లో వైఎస్ భారతి పాల్గనడమే కాకుండా.. హిందూ సంప్రదాయం ప్రకారం ఆశీర్వచనం తీసుకోవడం అక్ష తలు వేయించుకోవడం గమనార్హం. ప్రస్తుతం మేం సైతం సిద్ధం ఎన్నికల ప్రచారంలో ఉన్న సీఎం జగన్ ఉమ్మడి గుంటూరు జిల్లా శావల్యాపురం మండలం గంటావారిపాలెం వద్ద క్యాంపులో విశ్రాంతి తీసుకుంటున్నారు.
ఈ క్రమంలో ఉగాది సందర్భంగా అక్కడే ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వేద పండితులు ఆశీర్వచనాలు అందించారు. ఈ సందర్భంగా పండితులు అందించిన ఉగాది పచ్చడిని సీఎం దంపతు లు స్వీకరించారు.(గతంలో భారతి ఇలా తీసుకోకపోవడం గమనార్హం.) అనంతరం. పండితులు సీఎం దంపతులకు శాలువా కప్పి, అక్షతలు చల్లి ఆశీర్వాదం పలికారు. కార్యక్రమంలో పాల్గొన్న నరసరావుపేట ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్, వినుకొండ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
కొసమెరుపు: గతంలో ఎన్నడూ లేని విధంగా ముఖాన బొట్టు పెట్టడం.. ఆశీర్వచనం తీసుకోవడం.. వంటివాటిని రికార్డు చేసి మరీ మీడియాకు విడుదల చేయడం గమనార్హం. మొత్తంగా ఎన్నికల నేపథ్యంలో అందరినీ మచ్చిక చేసుకోవాలన్న ఏకైక లక్ష్యంతోనే ఇలా చేశారన్న వాదన వినిపిస్తుండడం గమనార్హం. దీనిపై బీజేపీ నాయకులు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.
This post was last modified on April 9, 2024 6:11 pm
ఎనర్జిటిక్ స్టార్ రామ్ డైలమాలో ఉన్నాడు. మాస్ కోసమని వారియర్ చేస్తే జనం తిప్పి కొట్టారు. క్రైమ్ థ్రిల్లర్ ట్రై…
దేశంలో ఫుట్బాల్ దిగ్గజం మెస్సీ ఈవెంట్ ముగిసి మూడు రోజులు అయింది. అయితే కలకత్తా లో జరిగిన గందరగోల పరిణామాలు…
జనవరి 9 డేట్ మీద ప్రభాస్, విజయ్ అభిమానులు యమా ఎగ్జైట్ మెంట్ తో ఎదురు చూస్తున్నారు. రాజా సాబ్,…
బ్లాక్ బస్టర్ సీక్వెల్ గా ప్రేక్షకుల ముందుకొచ్చిన అఖండ తాండవం 2 మొదటి మూడు రోజులు మంచి వసూళ్లే రాబట్టినా,…
డిసెంబరు బాక్సాఫీస్కు వాయిదా నెలగా మారిపోయింది. ఈ నెలకు వివిధ భాషల్లో షెడ్యూల్ అయిన సినిమాలు ఒక్కొక్కటిగా వాయిదా పడడం…
‘కృష్ణగాడి వీర ప్రేమగాథ’ చిత్రంతో టాలీవుడ్లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది పంజాబీ భామ మెహ్రీన్ పిర్జాదా. ఆ తర్వాత ఆమెకు మంచి మంచి…