Political News

ఎన్నిక‌ల ఎఫెక్ట్‌: ఉగాది పూజ‌ల్లో తొలిసారి భార‌తి!

ఎన్నిక‌ల వేళ ఆసక్తిక‌ర ప‌రిణామం చోటు చేసుకుంది. గ‌తంలో ఎప్పుడూ లేని విధంగా ఏపీ సీఎం జ‌గ‌న్ స‌తీమ‌ణి వైఎస్ భార‌తి.. ఉగాది పూజ‌ల్లో పాల్గొన్నారు. పండితుల వేద ఆశీర్వ‌చ‌నం తీసుకున్నారు. నెత్తిన అక్ష‌త‌లు కూడా జ‌ల్లించుకున్నారు. ఇవ‌న్నీ పూర్తిగా హిందూ సంప్ర‌దాయానికి చెందిన‌వ‌నే విష‌యం తెలిసిందే. అయితే.. ఆమె ఎప్పుడూ.. ఇలా హిందూపూజ‌ల్లో నేరుగా పాల్గొన‌లేదు. సంక్రాంతి వంటి సంబ‌రాల్లో పాల్గొన్నా.. జ‌గ‌న్ ఒక్క‌రే పండితుల నుంచి ఆశీర్వాదం తీసుకున్నారు.

ఇక‌, వివిధ మ‌తాచార్య‌లు క‌లిసినా.. జ‌గ‌న్ ఒక్క‌రినే ఆశీర్వ‌దించి వెళ్లిపోతారు. కానీ, తాజాగా ఉగాది వేడుక ల్లో వైఎస్ భార‌తి పాల్గ‌న‌డ‌మే కాకుండా.. హిందూ సంప్ర‌దాయం ప్ర‌కారం ఆశీర్వ‌చ‌నం తీసుకోవ‌డం అక్ష త‌లు వేయించుకోవ‌డం గ‌మ‌నార్హం. ప్ర‌స్తుతం మేం సైతం సిద్ధం ఎన్నికల ప్ర‌చారంలో ఉన్న సీఎం జ‌గ‌న్ ఉమ్మ‌డి గుంటూరు జిల్లా శావల్యాపురం మండలం గంటావారిపాలెం వద్ద క్యాంపులో విశ్రాంతి తీసుకుంటున్నారు.

ఈ క్ర‌మంలో ఉగాది సందర్భంగా అక్క‌డే ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించారు. అనంత‌రం వేద పండితులు ఆశీర్వ‌చ‌నాలు అందించారు. ఈ సంద‌ర్భంగా పండితులు అందించిన ఉగాది పచ్చడిని సీఎం దంపతు లు స్వీక‌రించారు.(గ‌తంలో భార‌తి ఇలా తీసుకోక‌పోవ‌డం గ‌మ‌నార్హం.) అనంత‌రం. పండితులు సీఎం దంప‌తుల‌కు శాలువా కప్పి, అక్ష‌తలు చల్లి ఆశీర్వాదం ప‌లికారు. కార్యక్రమంలో పాల్గొన్న నరసరావుపేట ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్, వినుకొండ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

కొస‌మెరుపు: గ‌తంలో ఎన్న‌డూ లేని విధంగా ముఖాన బొట్టు పెట్ట‌డం.. ఆశీర్వ‌చ‌నం తీసుకోవ‌డం.. వంటివాటిని రికార్డు చేసి మ‌రీ మీడియాకు విడుద‌ల చేయ‌డం గ‌మ‌నార్హం. మొత్తంగా ఎన్నిక‌ల నేప‌థ్యంలో అంద‌రినీ మ‌చ్చిక చేసుకోవాల‌న్న ఏకైక ల‌క్ష్యంతోనే ఇలా చేశార‌న్న వాద‌న వినిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం. దీనిపై బీజేపీ నాయ‌కులు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.

This post was last modified on April 9, 2024 6:11 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఎయిర్ అంబులెన్స్ ప్రమాదం: బయటపడుతున్న నిజాలు

జార్ఖండ్‌లో జరిగిన ఎయిర్ అంబులెన్స్ ప్రమాదం ఇప్పుడు అనేక అనుమానాలకు తావిస్తోంది. రాంచీ నుండి ఢిల్లీకి రోగిని తరలిస్తుండగా చత్రా…

1 hour ago

వెంకటేష్ వదులుకుంటే మంచి నిర్ణయమే

ఇంకో ముప్పై నాలుగు రోజుల్లో మలయాళం దృశ్యం 3 విడుదల కానుంది. ఈ భాగంతో కథకు ముగింపు ఇవ్వబోతున్నారు. కొడుకు…

2 hours ago

పునర్విక ప్రాణాలకు లోకేష్ అండ

మంత్రి నారా లోకేష్ తన సహృదయత చాటుకున్నారు. ఎస్‌ఎంఏ టైప్–1 అనే అరుదైన జన్యు వ్యాధితో పోరాడుతున్న కర్నూలుకు చెందిన…

3 hours ago

తారక్ ‘డ్రాగన్’ కోసం మరో హీరో ?

జూనియర్ ఎన్టీఆర్, దర్శకుడు ప్రశాంత్ నీల్ కలయికలో తెరకెక్కుతున్న డ్రాగన్ (ప్రచారంలో ఉన్న టైటిల్) షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ కు…

5 hours ago

15 నిమిషాల దర్శనం… నటి క్లారిటీ

సెలబ్రిటీలు చిన్న వాళ్ళైనా పెద్దోళ్ళయినా ఏదైనా మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి ఉందిప్పుడు. సోషల్ మీడియా జమానాలో చిన్న టంగ్…

7 hours ago

పెద్ద ఒత్తిడిని ‘పెద్ది’ తట్టుకోగలదా

అభిమానుల్లోనే కాదు సినీ ప్రియుల్లోనూ విపరీతమైన అంచనాలు మోస్తున్న సినిమా పెద్ది. చికిరి చికిరి ఛార్ట్ బస్టర్ పుణ్యమాని హిందీలోనూ…

7 hours ago