తెలుగు సంవత్సరాదిని పురస్కరించుకుని వివిధ రాజకీయ పార్టీలు పంచాంగ పఠనం కార్యక్రమాన్ని ని ర్వహించాయి. ఈ క్రమంలో మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలోనూ పంచాంగ పఠనం నిర్వహిం చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబు సహా పలువురు నాయకులు పాల్గొన్నారు. ఇక, సహ జంగానే పంచాంగ పఠన కర్తలు.. ఏ పార్టీ కార్యక్రమంలో పాల్గొంటే ఆ పార్టీ పాటే పాడుతుంటారు. దీనిని ఎవరూ తప్పుబట్టరు.
ఇలానే.. తాజాగా టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ప్రముఖ ప్రవచన కర్త.. చిర్రావూరి పంచాంగాన్ని పఠించి వినిపించారు. దీనిలో ఆయన చంద్రబాబు కూటమి పార్టీ.. ఏపీలో 128 అసెంబ్లీ స్తానాల్లో విజయం దక్కించుకోవడం ఖాయమని చెప్పారు. అదేవిధంగా పార్లమెంటు ఎన్నికల్లో 24 స్థానాల్లో విజయం దక్కించుకుంటుందని పేర్కొన్నారు. మొత్తంగా ఏపీలో అధికారం చేపట్టేది టీడీపీదేనని చిర్రావూరి వివరించారు. ప్రస్తుతం చంద్రబాబుకు జాతకం మారిందని చెప్పారు.
గత ఐదేళ్ల కిందట ఏర్పడిన గ్రహ స్థితులు ఇప్పుడు మారాయని. రాజ్యపూజ్యంతోపాటు.. అదికార శక్తి కూ డా వచ్చిందనిచెప్పారు. క్రోధి నామ సంవత్సరంలో వృశ్చిక రాశి అయిన.. చంద్రబాబుకు రాజయోగం పడుతోందని చిర్రావూరి ప్రకటించారు. భారీ మెజారిటీతో అధికారంలోకి రావడమే కాకుండా.. ప్రజల మ న్ననలు కూడా లభిస్తున్నాయని తెలిపారు. అమరావతి రాజధాని నిర్మాణం ఈ ఏడాది వడివడిగా ముందుకు సాగుతుందని తెలిపారు. రాజధాని ప్రాంతంలో టీడీపీ విజయం తథ్యమని చెప్పారు. మొత్తగా ఈ ఏడాది టీడీపీకి అదృష్ట యోగం పట్టనుందని వివరించారు.
కేవలం పది కోట్ల బడ్జెట్లో తెరకెక్కిన సినిమా.. అబ్సెషన్. ఈ హాలీవుడ్ హార్రర్ మూవీ విడుదలైనప్పటి నుంచి వరల్డ్ వైడ్…
స్టార్ హీరో సినిమాల రిపీట్ వేల్యూకి ప్రధానంగా దోహదం చేసేది పాటలే. ఫైట్లు, ఎలివేషన్లు, యాక్షన్ ఎపిసోడ్లు ఎక్కువ లేని…
సంక్రాంతికి రిలీజైన మన శంకరవరప్రసాద్ గారులో ప్రాణ స్నేహితులుగా నటించిన చిరంజీవి, వెంకటేష్ మొదటిసారి స్క్రీన్ పంచుకుని ఎంత పెద్ద…
హెడింగ్ చూడగానే ఏవో ముళ్లచెట్ల వల్ల ఎవరికో ఏదో అయిపోయి షూటింగ్ బ్రేక్ పడిందని అనుకోకండి. ఇక్కడ అడ్డంకులనే కోణంలో…
రాష్ట్రంలో అటవీ సంపదను కాపాడడంతోపాటు.. వన్యప్రాణుల సంరక్షణకు సైతం ప్రాధాన్యం ఇస్తున్న ఉప ముఖ్యమంత్రి, అటవీ శాఖ మంత్రి పవన్…
హీరోయిన్లు కెరీర్లో కొంచెం కుదురుకోగానే పెళ్లి ఎప్పుడు అనే ప్రశ్న ఎదురవుతుంది మీడియా నుంచి. ఆ తంతు పూర్తయ్యాక తల్లెప్పుడు…