తెలుగు సంవత్సరాదిని పురస్కరించుకుని వివిధ రాజకీయ పార్టీలు పంచాంగ పఠనం కార్యక్రమాన్ని ని ర్వహించాయి. ఈ క్రమంలో మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలోనూ పంచాంగ పఠనం నిర్వహిం చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబు సహా పలువురు నాయకులు పాల్గొన్నారు. ఇక, సహ జంగానే పంచాంగ పఠన కర్తలు.. ఏ పార్టీ కార్యక్రమంలో పాల్గొంటే ఆ పార్టీ పాటే పాడుతుంటారు. దీనిని ఎవరూ తప్పుబట్టరు.
ఇలానే.. తాజాగా టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ప్రముఖ ప్రవచన కర్త.. చిర్రావూరి పంచాంగాన్ని పఠించి వినిపించారు. దీనిలో ఆయన చంద్రబాబు కూటమి పార్టీ.. ఏపీలో 128 అసెంబ్లీ స్తానాల్లో విజయం దక్కించుకోవడం ఖాయమని చెప్పారు. అదేవిధంగా పార్లమెంటు ఎన్నికల్లో 24 స్థానాల్లో విజయం దక్కించుకుంటుందని పేర్కొన్నారు. మొత్తంగా ఏపీలో అధికారం చేపట్టేది టీడీపీదేనని చిర్రావూరి వివరించారు. ప్రస్తుతం చంద్రబాబుకు జాతకం మారిందని చెప్పారు.
గత ఐదేళ్ల కిందట ఏర్పడిన గ్రహ స్థితులు ఇప్పుడు మారాయని. రాజ్యపూజ్యంతోపాటు.. అదికార శక్తి కూ డా వచ్చిందనిచెప్పారు. క్రోధి నామ సంవత్సరంలో వృశ్చిక రాశి అయిన.. చంద్రబాబుకు రాజయోగం పడుతోందని చిర్రావూరి ప్రకటించారు. భారీ మెజారిటీతో అధికారంలోకి రావడమే కాకుండా.. ప్రజల మ న్ననలు కూడా లభిస్తున్నాయని తెలిపారు. అమరావతి రాజధాని నిర్మాణం ఈ ఏడాది వడివడిగా ముందుకు సాగుతుందని తెలిపారు. రాజధాని ప్రాంతంలో టీడీపీ విజయం తథ్యమని చెప్పారు. మొత్తగా ఈ ఏడాది టీడీపీకి అదృష్ట యోగం పట్టనుందని వివరించారు.
This post was last modified on April 9, 2024 3:55 pm
ఒక్క చిన్న ఇన్స్ టా పోస్ట్ తో ప్రభాస్ సోషల్ మీడియాని ఊపేస్తున్నాడు. హలో డార్లింగ్స్ చివరికి చాలా ప్రత్యేకం…
ఎక్కువ సినిమాలు తీస్తున్న నిర్మాణ సంస్థలు ఏవంటే మనకు వెంటనే గుర్తొచ్చే బ్యానర్లు సితార, మైత్రి, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ…
ఎన్నికలు ముగిసిపోయి ఫలితాలు ఎలా ఉంటాయోననే ఆసక్తితో జనం ఎదురు చూస్తున్న వేళ కేవలం ఒక్క రోజు మద్దతు కోసం…
సినిమా చిన్నదైనా పెద్దదైనా ఫలితం ఎలా వచ్చినా థియేటర్ కు ఓటిటి మధ్య కనీస గ్యాప్ ఉండటం చాలా అవసరం.…
శాసనసభ ఎన్నికలలో అనూహ్యంగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీకి లోక్ సభ ఎన్నికలు పరీక్షగా నిలుస్తున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో…
ఏపీలో ఎన్నికలు ముగిసిన తర్వాత.. ఒకవైపు తీవ్రమైన హింస చెలరేగిన విషయం తెలిసిందే. ఇదెలా ఉన్నా అధికార, ప్రతిపక్ష నాయకులు…