తెలుగు సంవత్సరాదిని పురస్కరించుకుని వివిధ రాజకీయ పార్టీలు పంచాంగ పఠనం కార్యక్రమాన్ని ని ర్వహించాయి. ఈ క్రమంలో మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలోనూ పంచాంగ పఠనం నిర్వహిం చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబు సహా పలువురు నాయకులు పాల్గొన్నారు. ఇక, సహ జంగానే పంచాంగ పఠన కర్తలు.. ఏ పార్టీ కార్యక్రమంలో పాల్గొంటే ఆ పార్టీ పాటే పాడుతుంటారు. దీనిని ఎవరూ తప్పుబట్టరు.
ఇలానే.. తాజాగా టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ప్రముఖ ప్రవచన కర్త.. చిర్రావూరి పంచాంగాన్ని పఠించి వినిపించారు. దీనిలో ఆయన చంద్రబాబు కూటమి పార్టీ.. ఏపీలో 128 అసెంబ్లీ స్తానాల్లో విజయం దక్కించుకోవడం ఖాయమని చెప్పారు. అదేవిధంగా పార్లమెంటు ఎన్నికల్లో 24 స్థానాల్లో విజయం దక్కించుకుంటుందని పేర్కొన్నారు. మొత్తంగా ఏపీలో అధికారం చేపట్టేది టీడీపీదేనని చిర్రావూరి వివరించారు. ప్రస్తుతం చంద్రబాబుకు జాతకం మారిందని చెప్పారు.
గత ఐదేళ్ల కిందట ఏర్పడిన గ్రహ స్థితులు ఇప్పుడు మారాయని. రాజ్యపూజ్యంతోపాటు.. అదికార శక్తి కూ డా వచ్చిందనిచెప్పారు. క్రోధి నామ సంవత్సరంలో వృశ్చిక రాశి అయిన.. చంద్రబాబుకు రాజయోగం పడుతోందని చిర్రావూరి ప్రకటించారు. భారీ మెజారిటీతో అధికారంలోకి రావడమే కాకుండా.. ప్రజల మ న్ననలు కూడా లభిస్తున్నాయని తెలిపారు. అమరావతి రాజధాని నిర్మాణం ఈ ఏడాది వడివడిగా ముందుకు సాగుతుందని తెలిపారు. రాజధాని ప్రాంతంలో టీడీపీ విజయం తథ్యమని చెప్పారు. మొత్తగా ఈ ఏడాది టీడీపీకి అదృష్ట యోగం పట్టనుందని వివరించారు.
This post was last modified on April 9, 2024 3:55 pm
కెజిఎఫ్ తర్వాత చాలా పెద్ద గ్యాప్ తీసుకున్న హీరో యష్ ఏరికోరి చేస్తున్న ప్యాన్ ఇండియా మూవీ టాక్సిక్. ఇలాంటి…
సెలబ్రిటీలు ఏదైనా విషయం గురించి స్పందిస్తే చాలు దాన్ని చిలవలు పలవలు చేయడానికో టీమ్ సోషల్ మీడియాలో రెడీగా ఉంటుంది.…
సినిమా విడుదల ఎప్పుడో తేలకుండానే పైరసీ బారిన పడిన జన నాయకుడు గొడవ రకరకాల మలుపులు తిరుగుతోంది. ముందు లాయర్ తరపున…
సౌత్ మ్యూజిక్ లో సెన్సేషన్ అంటే అనిరుధ్ రవిచందర్ పేరే ముందు గుర్తొస్తుంది. తను పని చేస్తున్నాడని తెలిస్తే చాలు…
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ పార్టీని ప్రక్షాళన చేసే దిశగా అడుగులు పడుతున్నాయి. పార్టీలో సంస్థాగతంగా పనిచేస్తున్న వారిని గత…
2029 పార్లమెంటు ఎన్నికల నాటికి దేశంలో నియోజకవర్గాలను పునర్విభజించాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్న విషయం తెలిసిందే. ఇటు అసెంబ్లీ,…