తెలుగు సంవత్సరాదిని పురస్కరించుకుని వివిధ రాజకీయ పార్టీలు పంచాంగ పఠనం కార్యక్రమాన్ని ని ర్వహించాయి. ఈ క్రమంలో మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలోనూ పంచాంగ పఠనం నిర్వహిం చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబు సహా పలువురు నాయకులు పాల్గొన్నారు. ఇక, సహ జంగానే పంచాంగ పఠన కర్తలు.. ఏ పార్టీ కార్యక్రమంలో పాల్గొంటే ఆ పార్టీ పాటే పాడుతుంటారు. దీనిని ఎవరూ తప్పుబట్టరు.
ఇలానే.. తాజాగా టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ప్రముఖ ప్రవచన కర్త.. చిర్రావూరి పంచాంగాన్ని పఠించి వినిపించారు. దీనిలో ఆయన చంద్రబాబు కూటమి పార్టీ.. ఏపీలో 128 అసెంబ్లీ స్తానాల్లో విజయం దక్కించుకోవడం ఖాయమని చెప్పారు. అదేవిధంగా పార్లమెంటు ఎన్నికల్లో 24 స్థానాల్లో విజయం దక్కించుకుంటుందని పేర్కొన్నారు. మొత్తంగా ఏపీలో అధికారం చేపట్టేది టీడీపీదేనని చిర్రావూరి వివరించారు. ప్రస్తుతం చంద్రబాబుకు జాతకం మారిందని చెప్పారు.
గత ఐదేళ్ల కిందట ఏర్పడిన గ్రహ స్థితులు ఇప్పుడు మారాయని. రాజ్యపూజ్యంతోపాటు.. అదికార శక్తి కూ డా వచ్చిందనిచెప్పారు. క్రోధి నామ సంవత్సరంలో వృశ్చిక రాశి అయిన.. చంద్రబాబుకు రాజయోగం పడుతోందని చిర్రావూరి ప్రకటించారు. భారీ మెజారిటీతో అధికారంలోకి రావడమే కాకుండా.. ప్రజల మ న్ననలు కూడా లభిస్తున్నాయని తెలిపారు. అమరావతి రాజధాని నిర్మాణం ఈ ఏడాది వడివడిగా ముందుకు సాగుతుందని తెలిపారు. రాజధాని ప్రాంతంలో టీడీపీ విజయం తథ్యమని చెప్పారు. మొత్తగా ఈ ఏడాది టీడీపీకి అదృష్ట యోగం పట్టనుందని వివరించారు.
This post was last modified on April 9, 2024 3:55 pm
ప్రతి అభిమానికీ తన ఆరాధ్య కథానాయకుడిని తెరపై ఒకలా చూసుకోవాలనే ఆశ ఉంటుంది. తన హీరో బలాన్ని గుర్తించి.. తన…
రాజకీయాలలో ప్రజలకు అవసరమైన పనులు చేయడం ఎంత ముఖ్యమో… అందుకు సంబంధించిన క్రెడిట్ తీసుకోవడం కూడా అంతే ముఖ్యం. అయితే,…
అభిమానానికి ఏదీ అడ్డు కాదు అనడానికి ఇది ఉదాహరణ. కంటి చూపు లేని ఒక వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి మీద…
సినిమాను ప్రమోట్ చేయడంలో భాగంగా.. ఈ మధ్య సినీ జనాలు స్టేజ్ల మీద పెద్ద పెద్ద స్టేట్మెంట్లు ఇవ్వడం రివాజుగా…
టాలీవుడ్ సెన్సేషన్ శ్రీలీల ప్రస్తుతం కెరీర్ పరంగా గడ్డు కాలాన్ని ఎదుర్కొంటోంది. 'ధమాకా' సినిమాతో ఓ రేంజ్ క్రేజ్ సంపాదించుకున్న…
శర్వానంద్ చాలా ఏళ్లుగా సరైన విజయం లేక ఇబ్బంది పడుతున్నాడు. సంక్రాంతి పోటీలోకి తెచ్చిన తన కొత్త సినిమా ‘నారీ…