తెలంగాణ ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి తెచ్చిన రేవంత్ రెడ్డి.. ఇప్పుడు లోక్సభ ఎన్నికల్లోనూ పార్టీకి ఇక్కడ మెరుగైన ఫలితాలు అందించడం కోసం శ్రమిస్తున్నారు. ఓ వైపు బీఆర్ఎస్ నుంచి నాయకులను చేర్చుకుంటూ ఆ పార్టీని దెబ్బకొడుతున్నారు. మరోవైపు రాహుల్ గాంధీ సభతో కార్యకర్తల్లో జోష్ నింపారు. ఇక లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ప్రధాన పోటీగా భావిస్తున్న బీజేపీపై రేవంత్ ఫోకస్ పెట్టారు. ముందుగా ఆ పార్టీలో ప్రస్తుతం పెద్ద తలకాయను రేవంత్ టార్గెట్ చేసుకున్నారని తెలుస్తోంది.
ప్రస్తుతం బీజేపీ తెలంగాణ అధ్యక్షుడిగా ఉన్న కిషన్ రెడ్డి.. మరోసారి సికింద్రాబాద్ నుంచి గెలుపొందాలనే లక్ష్యంతో సాగుతున్నారు. సికింద్రాబాద్ ఎంపీ స్థానాన్ని చేజార్చుకోవద్దనే పట్టుదలతో ఉన్నారు. ఈ నేపథ్యంలో ముందుగా కిషన్ రెడ్డిపై ఫోకస్ పెట్టి.. ఆయన్ని ఎన్నికల్లో ఓడిస్తే బీజేపీని సైకలాజికల్గా దెబ్బ కొట్టొచ్చనేది రేవంత్ ప్లాన్గా తెలుస్తోంది. అందుకే సికింద్రాబాద్లో కిషన్ రెడ్డి ఓటమి కోసం రేవంత్ స్పెషల్ ఇంట్రస్ట్తో పని చేస్తున్నారని టాక్. ఇప్పటికే అక్కడి పరిస్థితులపై అంచనాకు వచ్చిన రేవంత్.. అక్కడ అనుసరించాల్సిన వ్యూహాలపై పార్టీ నాయకులతో చర్చించినట్లు తెలిసింది.
సిటింగ్ ఎంపీగా ఉన్న కిషన్ రెడ్డి.. సికింద్రాబాద్ నియోజకవర్గానికి చేసిందేమీ లేదనే విషయాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని నాయకులకు రేవంత్ సూచించారు. తాజాగా సికింద్రాబాద్, వరంగల్ లోక్సభ నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ నాయకులు, మంత్రులు, ఎమ్మెల్యేలతో రేవంత్ సమీక్ష నిర్వహించారు. ఇందులో ముఖ్యంగా కిషన్రెడ్డిపై ఉన్న వ్యతిరేకతను సానుకూలతగా మార్చుకోవాలని రేవంత్ సూచించినట్లు సమాచారం. ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి దానం నాగేందర్ను ఎలాగైనా గెలిపించుకోవాలని రేవంత్ కంకణం కట్టుకున్నారు. కిషన్ రెడ్డిని ఓడిస్తే రాష్ట్రంలో కాంగ్రెస్కు మరింత జోష్ వస్తుందని నమ్ముతున్న రేవంత్.. ఆ దిశగా సాగుతున్నారు.
This post was last modified on April 8, 2024 12:27 pm
ప్రపంచంలోని మూర్ఖ పాలకుల జాబితాను తీస్తే.. అందులో మొదటి ముగ్గురు పాలకుల్లో ఒకరుగా నిలుస్తారు కింగ్ జోంగ్ ఉన్. తన…
బాలీవుడ్లో స్టార్ పవర్ కంటే కేవలం కథను నమ్మి సినిమాలు తీసే దర్శకులు చాలా తక్కువ మంది ఉంటారు. అందులో…
నేడు ఉగాది సందర్భంగా కొత్త తెలుగు సంవత్సరం పరాభవ నామ సంవత్సరంగా ప్రారంభమవుతోంది. అయితే “పరాభవం” అనే పదం వినగానే…
ఉద్యోగార్థులకు ఉగాది కానుకగా రాష్ట్ర ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ను విడుదల చేసింది. మొత్తం 10,060 పోస్టులతో ఈ క్యాలెండర్ను విడుదల…
స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ హీరో అవుతాడని చాలా ఏళ్ల ముందే ప్రచారం జరిగింది. సుకుమార్ లాంటి అగ్ర…
రాష్ట్రంలో ప్రతిపక్షం.. బాధ్యతాయుతంగా వ్యవహరించడం లేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్.. ప్రజలుకడుతున్న పన్నులతో…