తెలంగాణ ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి తెచ్చిన రేవంత్ రెడ్డి.. ఇప్పుడు లోక్సభ ఎన్నికల్లోనూ పార్టీకి ఇక్కడ మెరుగైన ఫలితాలు అందించడం కోసం శ్రమిస్తున్నారు. ఓ వైపు బీఆర్ఎస్ నుంచి నాయకులను చేర్చుకుంటూ ఆ పార్టీని దెబ్బకొడుతున్నారు. మరోవైపు రాహుల్ గాంధీ సభతో కార్యకర్తల్లో జోష్ నింపారు. ఇక లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ప్రధాన పోటీగా భావిస్తున్న బీజేపీపై రేవంత్ ఫోకస్ పెట్టారు. ముందుగా ఆ పార్టీలో ప్రస్తుతం పెద్ద తలకాయను రేవంత్ టార్గెట్ చేసుకున్నారని తెలుస్తోంది.
ప్రస్తుతం బీజేపీ తెలంగాణ అధ్యక్షుడిగా ఉన్న కిషన్ రెడ్డి.. మరోసారి సికింద్రాబాద్ నుంచి గెలుపొందాలనే లక్ష్యంతో సాగుతున్నారు. సికింద్రాబాద్ ఎంపీ స్థానాన్ని చేజార్చుకోవద్దనే పట్టుదలతో ఉన్నారు. ఈ నేపథ్యంలో ముందుగా కిషన్ రెడ్డిపై ఫోకస్ పెట్టి.. ఆయన్ని ఎన్నికల్లో ఓడిస్తే బీజేపీని సైకలాజికల్గా దెబ్బ కొట్టొచ్చనేది రేవంత్ ప్లాన్గా తెలుస్తోంది. అందుకే సికింద్రాబాద్లో కిషన్ రెడ్డి ఓటమి కోసం రేవంత్ స్పెషల్ ఇంట్రస్ట్తో పని చేస్తున్నారని టాక్. ఇప్పటికే అక్కడి పరిస్థితులపై అంచనాకు వచ్చిన రేవంత్.. అక్కడ అనుసరించాల్సిన వ్యూహాలపై పార్టీ నాయకులతో చర్చించినట్లు తెలిసింది.
సిటింగ్ ఎంపీగా ఉన్న కిషన్ రెడ్డి.. సికింద్రాబాద్ నియోజకవర్గానికి చేసిందేమీ లేదనే విషయాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని నాయకులకు రేవంత్ సూచించారు. తాజాగా సికింద్రాబాద్, వరంగల్ లోక్సభ నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ నాయకులు, మంత్రులు, ఎమ్మెల్యేలతో రేవంత్ సమీక్ష నిర్వహించారు. ఇందులో ముఖ్యంగా కిషన్రెడ్డిపై ఉన్న వ్యతిరేకతను సానుకూలతగా మార్చుకోవాలని రేవంత్ సూచించినట్లు సమాచారం. ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి దానం నాగేందర్ను ఎలాగైనా గెలిపించుకోవాలని రేవంత్ కంకణం కట్టుకున్నారు. కిషన్ రెడ్డిని ఓడిస్తే రాష్ట్రంలో కాంగ్రెస్కు మరింత జోష్ వస్తుందని నమ్ముతున్న రేవంత్.. ఆ దిశగా సాగుతున్నారు.
This post was last modified on April 8, 2024 12:27 pm
ఇండియన్ సినిమా స్థాయి ఎంత పెరిగినా సరే.. ఇప్పటికీ వెయ్యి కోట్ల బడ్జెట్ అంటేనే చాలా ఎక్కువ. అలాంటిది రామాయణం…
జార్ఖండ్లో జరిగిన ఎయిర్ అంబులెన్స్ ప్రమాదం ఇప్పుడు అనేక అనుమానాలకు తావిస్తోంది. రాంచీ నుండి ఢిల్లీకి రోగిని తరలిస్తుండగా చత్రా…
ఇంకో ముప్పై నాలుగు రోజుల్లో మలయాళం దృశ్యం 3 విడుదల కానుంది. ఈ భాగంతో కథకు ముగింపు ఇవ్వబోతున్నారు. కొడుకు…
మంత్రి నారా లోకేష్ తన సహృదయత చాటుకున్నారు. ఎస్ఎంఏ టైప్–1 అనే అరుదైన జన్యు వ్యాధితో పోరాడుతున్న కర్నూలుకు చెందిన…
జూనియర్ ఎన్టీఆర్, దర్శకుడు ప్రశాంత్ నీల్ కలయికలో తెరకెక్కుతున్న డ్రాగన్ (ప్రచారంలో ఉన్న టైటిల్) షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ కు…
సెలబ్రిటీలు చిన్న వాళ్ళైనా పెద్దోళ్ళయినా ఏదైనా మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి ఉందిప్పుడు. సోషల్ మీడియా జమానాలో చిన్న టంగ్…