తెలంగాణ ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి తెచ్చిన రేవంత్ రెడ్డి.. ఇప్పుడు లోక్సభ ఎన్నికల్లోనూ పార్టీకి ఇక్కడ మెరుగైన ఫలితాలు అందించడం కోసం శ్రమిస్తున్నారు. ఓ వైపు బీఆర్ఎస్ నుంచి నాయకులను చేర్చుకుంటూ ఆ పార్టీని దెబ్బకొడుతున్నారు. మరోవైపు రాహుల్ గాంధీ సభతో కార్యకర్తల్లో జోష్ నింపారు. ఇక లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ప్రధాన పోటీగా భావిస్తున్న బీజేపీపై రేవంత్ ఫోకస్ పెట్టారు. ముందుగా ఆ పార్టీలో ప్రస్తుతం పెద్ద తలకాయను రేవంత్ టార్గెట్ చేసుకున్నారని తెలుస్తోంది.
ప్రస్తుతం బీజేపీ తెలంగాణ అధ్యక్షుడిగా ఉన్న కిషన్ రెడ్డి.. మరోసారి సికింద్రాబాద్ నుంచి గెలుపొందాలనే లక్ష్యంతో సాగుతున్నారు. సికింద్రాబాద్ ఎంపీ స్థానాన్ని చేజార్చుకోవద్దనే పట్టుదలతో ఉన్నారు. ఈ నేపథ్యంలో ముందుగా కిషన్ రెడ్డిపై ఫోకస్ పెట్టి.. ఆయన్ని ఎన్నికల్లో ఓడిస్తే బీజేపీని సైకలాజికల్గా దెబ్బ కొట్టొచ్చనేది రేవంత్ ప్లాన్గా తెలుస్తోంది. అందుకే సికింద్రాబాద్లో కిషన్ రెడ్డి ఓటమి కోసం రేవంత్ స్పెషల్ ఇంట్రస్ట్తో పని చేస్తున్నారని టాక్. ఇప్పటికే అక్కడి పరిస్థితులపై అంచనాకు వచ్చిన రేవంత్.. అక్కడ అనుసరించాల్సిన వ్యూహాలపై పార్టీ నాయకులతో చర్చించినట్లు తెలిసింది.
సిటింగ్ ఎంపీగా ఉన్న కిషన్ రెడ్డి.. సికింద్రాబాద్ నియోజకవర్గానికి చేసిందేమీ లేదనే విషయాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని నాయకులకు రేవంత్ సూచించారు. తాజాగా సికింద్రాబాద్, వరంగల్ లోక్సభ నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ నాయకులు, మంత్రులు, ఎమ్మెల్యేలతో రేవంత్ సమీక్ష నిర్వహించారు. ఇందులో ముఖ్యంగా కిషన్రెడ్డిపై ఉన్న వ్యతిరేకతను సానుకూలతగా మార్చుకోవాలని రేవంత్ సూచించినట్లు సమాచారం. ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి దానం నాగేందర్ను ఎలాగైనా గెలిపించుకోవాలని రేవంత్ కంకణం కట్టుకున్నారు. కిషన్ రెడ్డిని ఓడిస్తే రాష్ట్రంలో కాంగ్రెస్కు మరింత జోష్ వస్తుందని నమ్ముతున్న రేవంత్.. ఆ దిశగా సాగుతున్నారు.
This post was last modified on April 8, 2024 12:27 pm
తను స్వతహాగా రష్యన్ అయినా.. పుట్టి పెరిగింది రష్యాలోనే అయినా.. పవన్ కళ్యాణ్ను పెళ్లి చేసుకున్నాక పూర్తిగా ఒక తెలుగింటి…
జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ మధ్య ఎంత స్నేహం ఉందో తెలిసిందే. ఆర్ఆర్ఆర్ షూటింగ్, ప్రమోషన్స్ టైంలో కనిపించినంతగా ఇప్పుడు…
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో చాలామంది హాలీవుడ్ సినిమాల నుంచి స్ఫూర్తి పొంది కథలు, సన్నివేశాలు తీర్చిదిద్దుకున్న వాళ్లే. ఇప్పుడు ఇండియా…
అక్కినేని నాగేశ్వరరావు మనవడు సుమంత్ను చూస్తే పెద్ద స్టార్ కావడానికి అవసరమైన అన్ని లక్షణాలు ఉన్నట్లే కనిపిస్తాడు. ఆరడుగుల ఆజానుబాహుడు,…
పోలవరం జిల్లా ఈర్లపల్లి గ్రామానికి చెందిన 10వ తరగతి విద్యార్ధిని ముర్రం శివాని ఆత్మహత్య చేసుకుంది. దీనికి సంబంధించిన కారణాలు…
తెలంగాణలో ఆక్రమ కట్టడాలకు సింహ స్వప్నంగా మారిన హైడ్రా విధానంపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. తమ మాటంటే హైడ్రాకు…