ఏం ఆలోచిస్తారో? అర్థం కాదు కానీ కొందరు నేతల తీరు.. వారి మాటలు ఆశ్చర్యకరంగానే కాదు.. కూసింత తెలివి ఉన్నప్పటికీ ఇలా ఎలా మాట్లాడతారు? అన్న సందేహం కలిగేలా ఉంటాయి. ఏపీలో జరుగుతున్న ఎన్నికల్లో మాజీ మంత్రి వైఎస్ వివేకా దారుణ హత్య ఉదంతం హాట్ టాపిక్ గా మారటం తెలిసిందే. ఈ అంశంపై జరుగుతున్న చర్చ అంతా ఇంతా కాదు. అధికార పార్టీకి ఇబ్బందికరంగా మారిన ఈ అంశంపై ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మేనమామ కం ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి నోటి నుంచి వచ్చిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.
కాస్తంత ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఉదంతం వైఎస్సార్ జిల్లాలోని వీరపునాయునిపల్లి మండలం మొయిళ్లకాల్వలో చోటు చేసుకుంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏర్పాటు చేసిన సభలో తన పక్కనే కూర్చున్న అవినాశ్ రెడ్డిని చూపిస్తూ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. రవీంద్రనాథ్ మాటల్ని యథాతధంగా.. ఎలాంటి వ్యాఖ్యలు.. వ్యాఖ్యానాలు లేకుండా ఇస్తాం. వాటిని చదివిన తర్వాత మీకు.. మీ మనసుకు ఏమనిపిస్తే అదే సరైనది.
తన ప్రసంగంలో భాగంగా రవీంద్రనాధ్ రెడ్డి ఏమన్నారంటే.. ‘‘హత్య జరిగిన తర్వాత శివప్రకాశ్ రెడ్డి ఫోన్ చేస్తే అవినాశ్ ఘటనాస్థలానికి వెళ్లాడు. గంగిరెడ్డి ఏదో చేస్తుంటూ అవినాశ్ అమాయకంగా నిలబడి చూస్తూ ఉండిపోయారు. అంతే తప్పించి.. హత్యకు సంబంధించిన ఆధారాల్ని అవినాశ్ తుడవలేదు. హత్యలో గంగిరెడ్డి పాత్ర అయితే కచ్ఛితంగా ఉంది. గంగిరెడ్డి.. వివేకానందరెడ్డి ఇద్దరు చాలా సన్నిహితంగా ఉండేవారు. ఒకటే మంచంలో పడుకొని.. ఒకటే పళ్లెంలో తినేంత సన్నిహితులు. గంగిరెడ్డి తుడిచేస్తుంటే అవినాశ్ ఆపలేకపోయి ఉండొచ్చు. ఎందుకంటే ఎంతో సన్నిహితంగా ఉండే వ్యక్తి ఏదో చేస్తున్నాడని అనుకొని ఉండొచ్చు. అక్కడ అమాయకంగా నిలబడిపోయిన అవినాశ్.. ఈ విషయం ప్రజలకు తెలియజేసే కార్యక్రమం చేశారు’ అంటూ వ్యాఖ్యానించారు.
తనకు బాబాయ్ అయ్యే వివేకా దారుణంగా హత్యకు గురైనప్పుడు.. క్రైం సీన్ లో ఉన్న వారెవరు వాటిని ముట్టుకోకూడదని.. అక్కడి ఆధారాలు చెదిరిపోకుండా చూడాలన్న ఆలోచన చిన్న పిల్లాడికైనా ఉంటుంది. మరి.. అవినాశ్ లాంటి వ్యక్తికి అలాంటి ఆలోచన తట్టకపోవటం ఏమిటి? అన్నది అసలు ప్రశ్న. దీనికి సమాధానం వెతకితే చాలానే చిక్కుముళ్లు ఇట్టే వీడిపోతాయన్నది మర్చిపోకూడదు.
ఈ మధ్య రిలీజ్ డేట్ ప్రకటించాక ఎంత ప్లాన్డ్ గా పనులు చేసినా చివరి నిమిషం వరకు వాయిదా ఉండదన్న…
మలయాళంలో బ్లాక్ బస్టర్ అవ్వొచ్చేమో కానీ తెలుగులో మాత్రం దృశ్యం 3ని ఫ్లాప్ గానే పరిగణించాలి. తక్కువ బిజినెస్ చేయడం…
మీలాగా మేం ఫామ్ హౌస్లో పడుకోవట్లే - అంటూ తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క.. బీఆర్ఎస్ పార్టీపై ఓ…
స్వతంత్ర దేశంలో చావు కూడా పెళ్లిలాంటిదే అన్నట్టుగా వైసీపీ నాయకులకు ఎక్కడ ఎలా వ్యవహరించాలో తెలియడం లేదన్న విమర్శలు వస్తున్నాయి.…
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) ఇంచార్జీ మీనాక్షి నటరాజన్ కు నిజంగానే షాక్…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేష్లు.. కూటమి ప్రభుత్వంలో కీలక రోల్ పోషిస్తున్న విషయం తెలిసిందే.…