Political News

గంగిరెడ్డి తుడిచేస్తుంటే.. అవినాశ్ రెడ్డి చూస్తూ ఉండిపోయారట

ఏం ఆలోచిస్తారో? అర్థం కాదు కానీ కొందరు నేతల తీరు.. వారి మాటలు ఆశ్చర్యకరంగానే కాదు.. కూసింత తెలివి ఉన్నప్పటికీ ఇలా ఎలా మాట్లాడతారు? అన్న సందేహం కలిగేలా ఉంటాయి. ఏపీలో జరుగుతున్న ఎన్నికల్లో మాజీ మంత్రి వైఎస్ వివేకా దారుణ హత్య ఉదంతం హాట్ టాపిక్ గా మారటం తెలిసిందే. ఈ అంశంపై జరుగుతున్న చర్చ అంతా ఇంతా కాదు. అధికార పార్టీకి ఇబ్బందికరంగా మారిన ఈ అంశంపై ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మేనమామ కం ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి నోటి నుంచి వచ్చిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.

కాస్తంత ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఉదంతం వైఎస్సార్ జిల్లాలోని వీరపునాయునిపల్లి మండలం మొయిళ్లకాల్వలో చోటు చేసుకుంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏర్పాటు చేసిన సభలో తన పక్కనే కూర్చున్న అవినాశ్ రెడ్డిని చూపిస్తూ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. రవీంద్రనాథ్ మాటల్ని యథాతధంగా.. ఎలాంటి వ్యాఖ్యలు.. వ్యాఖ్యానాలు లేకుండా ఇస్తాం. వాటిని చదివిన తర్వాత మీకు.. మీ మనసుకు ఏమనిపిస్తే అదే సరైనది.

తన ప్రసంగంలో భాగంగా రవీంద్రనాధ్ రెడ్డి ఏమన్నారంటే.. ‘‘హత్య జరిగిన తర్వాత శివప్రకాశ్ రెడ్డి ఫోన్ చేస్తే అవినాశ్ ఘటనాస్థలానికి వెళ్లాడు. గంగిరెడ్డి ఏదో చేస్తుంటూ అవినాశ్ అమాయకంగా నిలబడి చూస్తూ ఉండిపోయారు. అంతే తప్పించి.. హత్యకు సంబంధించిన ఆధారాల్ని అవినాశ్ తుడవలేదు. హత్యలో గంగిరెడ్డి పాత్ర అయితే కచ్ఛితంగా ఉంది. గంగిరెడ్డి.. వివేకానందరెడ్డి ఇద్దరు చాలా సన్నిహితంగా ఉండేవారు. ఒకటే మంచంలో పడుకొని.. ఒకటే పళ్లెంలో తినేంత సన్నిహితులు. గంగిరెడ్డి తుడిచేస్తుంటే అవినాశ్ ఆపలేకపోయి ఉండొచ్చు. ఎందుకంటే ఎంతో సన్నిహితంగా ఉండే వ్యక్తి ఏదో చేస్తున్నాడని అనుకొని ఉండొచ్చు. అక్కడ అమాయకంగా నిలబడిపోయిన అవినాశ్.. ఈ విషయం ప్రజలకు తెలియజేసే కార్యక్రమం చేశారు’ అంటూ వ్యాఖ్యానించారు.

తనకు బాబాయ్ అయ్యే వివేకా దారుణంగా హత్యకు గురైనప్పుడు.. క్రైం సీన్ లో ఉన్న వారెవరు వాటిని ముట్టుకోకూడదని.. అక్కడి ఆధారాలు చెదిరిపోకుండా చూడాలన్న ఆలోచన చిన్న పిల్లాడికైనా ఉంటుంది. మరి.. అవినాశ్ లాంటి వ్యక్తికి అలాంటి ఆలోచన తట్టకపోవటం ఏమిటి? అన్నది అసలు ప్రశ్న. దీనికి సమాధానం వెతకితే చాలానే చిక్కుముళ్లు ఇట్టే వీడిపోతాయన్నది మర్చిపోకూడదు.

This post was last modified on April 7, 2024 10:32 am

Share

Recent Posts

వైసీపీ ఓటు బ్యాంకు స్థిర‌మేనా..?

వైసీపీ ఓటు బ్యాంకు స్థిర‌మేనా? ఆ పార్టీ చెబుతున్న‌ట్టు 40 శాతం ఓటు బ్యాంకు వ‌చ్చే ఎన్నిక‌ల వ‌ర‌కు అలానే…

8 minutes ago

థియేటర్లకు జై కొడుతున్న తెలుగు ప్రేక్షకులు

జూన్ నుంచి టాలీవుడ్ బాక్సాఫీస్ కళకళలాడుతోంది. ఎలాంటి టికెట్ రేట్ల పెంపు పంచాయితీ లేకుండా ఉన్న ధరలతోనే ప్రతి ఒక్కరు…

9 minutes ago

కాక్రోచులను వెనక్కి తరిమిన వారెవరు?

విద్యార్థి ఉద్య‌మాల‌కు తెర‌దీసిన కాక్రోచ్ జ‌న‌తా పార్టీ(సీజేపీ) నాయ‌కులు, కార్య‌క‌ర్త‌ల‌కు తొలిసారి ప‌రాభవం ఎదురైంది. ఇటీవ‌ల నీట్ ప్ర‌శ్న ప‌త్రం…

22 minutes ago

పూర్ణ డాన్సులో రజినీకాంత్ కనిపించట్లేదు

ఎలా కనుక్కున్నారో కానీ త్రివిక్రమ్ శ్రీనివాస్ గుంటూరు కారం సినిమాలో కుర్చీ మడతపెట్టి పాట కోసం క్యారెక్టర్ ఆర్టిస్టు పూర్ణతో కొన్ని…

1 hour ago

క‌ళ్లు చెదిరే ధ‌ర‌… రాయ‌దుర్గంలో ఎక‌రా 264 కోట్లు!

హైద‌రాబాద్ న‌గ‌రంలోని రాయ‌దుర్గం భూముల్లో కొంత భాగాన్ని ప్ర‌భుత్వం వేలం వేసింది. అయితే.. మునుపెన్న‌డూ లేని విధంగా క‌ళ్లు చెదిరే…

1 hour ago

ఆ వివాదాస్పద ఐపీఎస్ ఇంట పెళ్లికి జగన్

హైదరాబాద్‌లో జరిగిన ఓ వివాహ వేడుకకు వైసీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం జగన్ హాజరయ్యారు. సీనియర్ ఐపీఎస్ అధికారి…

1 hour ago