రాష్ట్రప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అమరావతి రాజధాని పరిధిలో జరిగిందని ప్రభుత్వం భావిస్తున్న ఇన్ సైడర్ ట్రేడింగ్ పై ఏసిబితో విచారణ చేయించాలని డిసైడ్ చేసింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వటం, ఏసిబి కూడా విచారణ మొదలుపెట్టడం మొదలైపోయింది. అమరావతి ప్రాంతంలో వేలాది ఎకరాల్లో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందని ప్రభుత్వం బలంగా నమ్ముతోంది. ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుండి ఈ అంశంపై వైసిపి చంద్రబాబు+మద్దతుదారులపై పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే.
తాము అధికారంలోకి వస్తే ఇన్ సైడర్ ట్రేడింగ్ పై విచారణ చేయిస్తామని జగన్ చెప్పినట్లుగానే ఇపుడు ప్రభుత్వం విచారణ మొదలుపెట్టింది. ముందు ఈ అంశంపై మంత్రివర్గ ఉపసంఘంతో అంతర్గత విచారణ చేయించారు. తర్వాత ఏసిబి విచారణకు కూడా ఆదేశించారు. ఏసిబితో పాటు ఈడి కూడా చాలా రోజులు విచారణ చేసింది. ఇంతలో ఇదే విషయంపై సిట్ తో పాటు సిబిఐ విచారణ జరిపించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మొత్తం 4077 ఎకరాలు చంద్రబాబుతో పాటు ఆయన మద్దతుదారులు, సన్నిహితులు సొంతం చేసుకున్నారంటూ ఆర్ధిక మంత్రి బుగ్గర రాజేంద్రనాధరెడ్డి అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఇచ్చిన విషయం తెలిసిందే.
సరే ప్రస్తుతానికి వస్తే ఒకవైపు సిట్ విచారణతో పాటు సిబిఐ విచారణ జరిపించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకున్నది. సిబిఐ విచారణకు కేంద్రప్రభుత్వానికి సిఫారసు చేసినా ప్రభుత్వం సిట్ విచారణకు రెడీ అయ్యింది. అయితే తమ ప్రభుత్వ హయాంలో జరిగిన విషయాలపై విచారణ జరిపేందుకు లేదంటు టిడిపి నేతలు ఆలపాటి రాజేంద్రప్రసాద్, వర్ల రామయ్యలు కోర్టులో కేసు వేశారు. ఆ కేసు విచారణలో ఉంది. కాబట్టి కోర్టులో తేలేంతవరకు సిట్ విచారణ ముందుకు సాగదన్నది వాస్తవం. అలాగే కేంద్రం అంగీకరించేంత వరకు సిబిఐ విచారణ కూడా సస్పెన్సే.
ఈ నేపధ్యంలోనే ప్రభుత్వం హఠాత్తుగా ఏసిబితో విచారణ జరిపించేందుకు రెడీ అయిపోయింది. ఇప్పటికే పలువురిని ఆదుపులోకి తీసుకున్న ఏసిబి ఇకనుండి విచారణలో జోరు పెంచబోతోంది. చాలామందికి విచారణకు హాజరవ్వాలంటూ నోటీసులిచ్చినట్లు సమాచారం. మరి ఏసిబి విచారణ విషయం ఏమవుతుందో చూడాల్సిందే.
This post was last modified on September 15, 2020 12:28 pm
మోహన్ లాల్ హీరోగా పృథ్వీరాజ్ సుకుమారన్ రూపొందించిన ‘ఎల్2: ఎంపురాన్’ సినిమా మీద ఏ స్థాయిలో అంచనాలు నెలకొన్నాయో తెలిసిందే.…
నవ్యాంధ్రప్రదేశ్ నూతన రాజధానిగా అమరావతిని ఎంపిక చేసింది టీడీపీ అదినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడే. రాష్ట్ర విభజన తర్వాత…
నిన్న క్రిష్ 4 ప్రకటన వచ్చింది. రాకేష్ రోషన్, ఆదిత్య చోప్రాలు సంయుక్త నిర్మాతలుగా వ్యవహరించబోతున్నారు. కొద్దిరోజుల క్రితం బడ్జెట్…
తెలుగు దేశం పార్టీ ఆవిర్భావ వేడుకలను పురస్కరించుకుని మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో శనివారం ఘనంగా వేడుకలు జరిగాయి. టీడీపీ…
ఎంత మంచి సినిమా తీసినా అపోజిషన్ వల్ల ప్రతిసారి వసూళ్లు ప్రభావితం చెందుతున్నాయనే ఆందోళన నిర్మాత నాగవంశీలో పలు సందర్భాల్లో…
వైసీపీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వ్యవహారం అందరికీ తెలిసిందే. ఆయనపై ఇప్పటికి మూడు కేసులు నమో దయ్యాయి.…