రాష్ట్రప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అమరావతి రాజధాని పరిధిలో జరిగిందని ప్రభుత్వం భావిస్తున్న ఇన్ సైడర్ ట్రేడింగ్ పై ఏసిబితో విచారణ చేయించాలని డిసైడ్ చేసింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వటం, ఏసిబి కూడా విచారణ మొదలుపెట్టడం మొదలైపోయింది. అమరావతి ప్రాంతంలో వేలాది ఎకరాల్లో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందని ప్రభుత్వం బలంగా నమ్ముతోంది. ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుండి ఈ అంశంపై వైసిపి చంద్రబాబు+మద్దతుదారులపై పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే.
తాము అధికారంలోకి వస్తే ఇన్ సైడర్ ట్రేడింగ్ పై విచారణ చేయిస్తామని జగన్ చెప్పినట్లుగానే ఇపుడు ప్రభుత్వం విచారణ మొదలుపెట్టింది. ముందు ఈ అంశంపై మంత్రివర్గ ఉపసంఘంతో అంతర్గత విచారణ చేయించారు. తర్వాత ఏసిబి విచారణకు కూడా ఆదేశించారు. ఏసిబితో పాటు ఈడి కూడా చాలా రోజులు విచారణ చేసింది. ఇంతలో ఇదే విషయంపై సిట్ తో పాటు సిబిఐ విచారణ జరిపించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మొత్తం 4077 ఎకరాలు చంద్రబాబుతో పాటు ఆయన మద్దతుదారులు, సన్నిహితులు సొంతం చేసుకున్నారంటూ ఆర్ధిక మంత్రి బుగ్గర రాజేంద్రనాధరెడ్డి అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఇచ్చిన విషయం తెలిసిందే.
సరే ప్రస్తుతానికి వస్తే ఒకవైపు సిట్ విచారణతో పాటు సిబిఐ విచారణ జరిపించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకున్నది. సిబిఐ విచారణకు కేంద్రప్రభుత్వానికి సిఫారసు చేసినా ప్రభుత్వం సిట్ విచారణకు రెడీ అయ్యింది. అయితే తమ ప్రభుత్వ హయాంలో జరిగిన విషయాలపై విచారణ జరిపేందుకు లేదంటు టిడిపి నేతలు ఆలపాటి రాజేంద్రప్రసాద్, వర్ల రామయ్యలు కోర్టులో కేసు వేశారు. ఆ కేసు విచారణలో ఉంది. కాబట్టి కోర్టులో తేలేంతవరకు సిట్ విచారణ ముందుకు సాగదన్నది వాస్తవం. అలాగే కేంద్రం అంగీకరించేంత వరకు సిబిఐ విచారణ కూడా సస్పెన్సే.
ఈ నేపధ్యంలోనే ప్రభుత్వం హఠాత్తుగా ఏసిబితో విచారణ జరిపించేందుకు రెడీ అయిపోయింది. ఇప్పటికే పలువురిని ఆదుపులోకి తీసుకున్న ఏసిబి ఇకనుండి విచారణలో జోరు పెంచబోతోంది. చాలామందికి విచారణకు హాజరవ్వాలంటూ నోటీసులిచ్చినట్లు సమాచారం. మరి ఏసిబి విచారణ విషయం ఏమవుతుందో చూడాల్సిందే.
This post was last modified on September 15, 2020 12:28 pm
కరణం బలరామకృష్ణమూర్తి.. రాజకీయ ఉద్ధండుడిగా పేరొందిన ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన నేత. కుమారుడు కరణం వెంకటేష్ను ఎమ్మెల్యేగా చూసుకోవాలన్న…
నియోజకవర్గాల పునర్విభజన అనూహ్య పరిణామాల నేపథ్యంలో అలా వెనక్కెళ్లిపోయింది. దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాలకు తీరని అన్యాయం అంటూ కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా…
బ్లాక్ బస్టర్ సినిమాల వెనుక కొన్ని వేల మంది కష్టం దాగి ఉంటుంది. కాకపోతే ప్రేక్షకులకది అనవసరం. థియేటర్ లో…
ప్రతి నెల ఒకటో తారీకు కోసం ఉద్యోగులు ఎదురు చూడడం సహజం. కారణం నెలంతా కష్టపడితే జీవితాలు అకౌంట్ లో…
తెలంగాణలో కొత్త పార్టీ పెట్టేందుకు రెడీ అయిన మాజీ సీఎం, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్.. తనయ కవిత.. నిన్న…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు మంగళవారం సాయంత్రం 5 గంటలకే అన్ని పార్టీలు..…