రాష్ట్రప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అమరావతి రాజధాని పరిధిలో జరిగిందని ప్రభుత్వం భావిస్తున్న ఇన్ సైడర్ ట్రేడింగ్ పై ఏసిబితో విచారణ చేయించాలని డిసైడ్ చేసింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వటం, ఏసిబి కూడా విచారణ మొదలుపెట్టడం మొదలైపోయింది. అమరావతి ప్రాంతంలో వేలాది ఎకరాల్లో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందని ప్రభుత్వం బలంగా నమ్ముతోంది. ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుండి ఈ అంశంపై వైసిపి చంద్రబాబు+మద్దతుదారులపై పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే.
తాము అధికారంలోకి వస్తే ఇన్ సైడర్ ట్రేడింగ్ పై విచారణ చేయిస్తామని జగన్ చెప్పినట్లుగానే ఇపుడు ప్రభుత్వం విచారణ మొదలుపెట్టింది. ముందు ఈ అంశంపై మంత్రివర్గ ఉపసంఘంతో అంతర్గత విచారణ చేయించారు. తర్వాత ఏసిబి విచారణకు కూడా ఆదేశించారు. ఏసిబితో పాటు ఈడి కూడా చాలా రోజులు విచారణ చేసింది. ఇంతలో ఇదే విషయంపై సిట్ తో పాటు సిబిఐ విచారణ జరిపించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మొత్తం 4077 ఎకరాలు చంద్రబాబుతో పాటు ఆయన మద్దతుదారులు, సన్నిహితులు సొంతం చేసుకున్నారంటూ ఆర్ధిక మంత్రి బుగ్గర రాజేంద్రనాధరెడ్డి అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఇచ్చిన విషయం తెలిసిందే.
సరే ప్రస్తుతానికి వస్తే ఒకవైపు సిట్ విచారణతో పాటు సిబిఐ విచారణ జరిపించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకున్నది. సిబిఐ విచారణకు కేంద్రప్రభుత్వానికి సిఫారసు చేసినా ప్రభుత్వం సిట్ విచారణకు రెడీ అయ్యింది. అయితే తమ ప్రభుత్వ హయాంలో జరిగిన విషయాలపై విచారణ జరిపేందుకు లేదంటు టిడిపి నేతలు ఆలపాటి రాజేంద్రప్రసాద్, వర్ల రామయ్యలు కోర్టులో కేసు వేశారు. ఆ కేసు విచారణలో ఉంది. కాబట్టి కోర్టులో తేలేంతవరకు సిట్ విచారణ ముందుకు సాగదన్నది వాస్తవం. అలాగే కేంద్రం అంగీకరించేంత వరకు సిబిఐ విచారణ కూడా సస్పెన్సే.
ఈ నేపధ్యంలోనే ప్రభుత్వం హఠాత్తుగా ఏసిబితో విచారణ జరిపించేందుకు రెడీ అయిపోయింది. ఇప్పటికే పలువురిని ఆదుపులోకి తీసుకున్న ఏసిబి ఇకనుండి విచారణలో జోరు పెంచబోతోంది. చాలామందికి విచారణకు హాజరవ్వాలంటూ నోటీసులిచ్చినట్లు సమాచారం. మరి ఏసిబి విచారణ విషయం ఏమవుతుందో చూడాల్సిందే.
This post was last modified on September 15, 2020 12:28 pm
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…
టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…
పార్వతీపురం మన్యం జిల్లా, భామినిలో నేడు నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాలు వచ్చాయి. తొలినాళ్లలో తీసిన చాలా సినిమాలు బ్లాక్ బస్టర్…
ప్రపంచమంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న సమావేశం ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్లో జరిగింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, భారత ప్రధాని నరేంద్ర…