‘మంగళగిరిలో నారా లోకేష్ గెలవడం ఖాయం..’ అని తాజాగా వైసీపీ అంతర్గత సర్వేలో తేలింది. ఈ విషయం ఆ నోటా, ఈ నోటా బయటకు లీక్ అయ్యేసరికి, మంగళగిరి వైసీపీలో లుకలుకలు షురూ అయ్యాయి. ఓడిపోయే సీటుని అంటగట్టారంటూ వైసీపీ అభ్యర్థి, పార్టీ అధినాయకత్వంపై గుస్సా అవుతున్నారట.
నారా లోకేష్ మీద మురుగుడు లావణ్య అనే మహిళా అభ్యర్థిని వైసీపీ రంగంలోకి దించిన సంగతి తెలిసిందే. వాస్తవానికి సిట్టింగ్ ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి బరిలోకి దిగాల్సి వుంది. అయితే, ఆళ్ళ రామకృష్ణారెడ్డిపై స్థానికంగా తీవ్ర వ్యతిరేకత వుండటంతో ఆయన్ని మార్చింది వైసీపీ. టీడీపీ నుంచి కొందరు నాయకుల్ని లాక్కొచ్చి, వారికి టిక్కెట్ ఇచ్చే ప్రయత్నాలు చేశారు.
అధికారికంగా ముగ్గురు అభ్యర్థులు మారారక్కడ. అనధికారికంగా అయితే, అరడజనుకి పైగానే ప్రయోగాలు జరిగినట్లు తెలుస్తోంది. మహిళా అభ్యర్థి.. కాబట్టి, ఆమె గెలుస్తుందనీ, నారా లోకేష్ ఓడిపోవడం ఖాయమనీ వైసీపీ తొలుత భావించింది. మురుగుడు లావణ్య తరఫున తొలుత ప్రచారం అగ్రెసివ్గానే సాగింది.
ఇంకోపక్క, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, వైసీపీ వేవ్ కారణంగా 2019 ఎన్నికల్లో స్వల్ప మెజార్టీతో ఓడిపోయారు. ఓడిపోయినాగానీ, అదే నియోజకవర్గంపై ఫోకస్ పెడుతూ వచ్చారు గత ఐదేళ్ళుగా. నారా లోకేష్ వేరే నియోజకవర్గానికి పారిపోతున్నారంటూ వైసీపీ చేసిన ప్రచారాలన్నీ పటాపంచలయ్యాయి.
ఎన్నికలకు సంబంధించి కోడ్ అమల్లోకి రాకముందే, నారా లోకేష్ మంగళగిరిలో ఎగ్రెసివ్ క్యాంపెయిన్ షురూ చేశారు. అది అలా అలా కొనసాగుతూనే వుంది. స్థానికంగా టీడీపీ శ్రేణులు బాగా యాక్టివ్ అయ్యాయి. ఇంటింటి ప్రచారాలు, బహిరంగ సభలు.. వాట్ నాట్.. చాలా యాక్టివ్గా టీడీపీ, మంగళగిరిలో వర్క్ చేస్తోంది.
అయితే, వైసీపీ నుంచి మంగళగిరిలో ముఖ్య నాయకుల సందడి కనిపించడంలేదు. మురుగుడు లావణ్య ఒంటరి పోరాటం వల్ల వైసీపీకి పెద్దగా ప్రయోజనం లేకుండా పోయిందాయె. సిట్టింగ్ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి వైసీపీని వీడి, కాంగ్రెస్లో చేరే క్రమంలో, నియోజకవర్గానికి వైసీపీ ఏమీ చేయలేదని ఆరోపించారు. తిరిగి ఆయన వైసీపీ గూటికి చేరి, వైసీపీ పాలన గురించి గొప్పగా చెబుతోంటే, నియోజకవర్గ ప్రజలు నవ్వుకుంటున్నారు.
ఎలా చూసినా, మంగళగిరిలో నారా లోకేష్ బంపర్ విక్టరీ ఖాయంగానే కనిపిస్తోంది. ‘మెజార్టీ గురించే ఆలోచిస్తున్నాం.. గట్టిగా కొట్టబోతున్నాం..’ అని తెలుగు తమ్ముళ్ళు మంగళగిరిలో ధీమా వ్యక్తం చేస్తున్నారు.
This post was last modified on April 6, 2024 6:09 pm
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…