Political News

ఇన్‌సైడ్ స్టోరీ: మంగళగిరిలో చేతులెత్తేస్తోన్న వైసీపీ.!

‘మంగళగిరిలో నారా లోకేష్ గెలవడం ఖాయం..’ అని తాజాగా వైసీపీ అంతర్గత సర్వేలో తేలింది. ఈ విషయం ఆ నోటా, ఈ నోటా బయటకు లీక్ అయ్యేసరికి, మంగళగిరి వైసీపీలో లుకలుకలు షురూ అయ్యాయి. ఓడిపోయే సీటుని అంటగట్టారంటూ వైసీపీ అభ్యర్థి, పార్టీ అధినాయకత్వంపై గుస్సా అవుతున్నారట.

నారా లోకేష్ మీద మురుగుడు లావణ్య అనే మహిళా అభ్యర్థిని వైసీపీ రంగంలోకి దించిన సంగతి తెలిసిందే. వాస్తవానికి సిట్టింగ్ ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి బరిలోకి దిగాల్సి వుంది. అయితే, ఆళ్ళ రామకృష్ణారెడ్డిపై స్థానికంగా తీవ్ర వ్యతిరేకత వుండటంతో ఆయన్ని మార్చింది వైసీపీ. టీడీపీ నుంచి కొందరు నాయకుల్ని లాక్కొచ్చి, వారికి టిక్కెట్ ఇచ్చే ప్రయత్నాలు చేశారు.

అధికారికంగా ముగ్గురు అభ్యర్థులు మారారక్కడ. అనధికారికంగా అయితే, అరడజనుకి పైగానే ప్రయోగాలు జరిగినట్లు తెలుస్తోంది. మహిళా అభ్యర్థి.. కాబట్టి, ఆమె గెలుస్తుందనీ, నారా లోకేష్ ఓడిపోవడం ఖాయమనీ వైసీపీ తొలుత భావించింది. మురుగుడు లావణ్య తరఫున తొలుత ప్రచారం అగ్రెసివ్‌గానే సాగింది.

ఇంకోపక్క, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, వైసీపీ వేవ్ కారణంగా 2019 ఎన్నికల్లో స్వల్ప మెజార్టీతో ఓడిపోయారు. ఓడిపోయినాగానీ, అదే నియోజకవర్గంపై ఫోకస్ పెడుతూ వచ్చారు గత ఐదేళ్ళుగా. నారా లోకేష్ వేరే నియోజకవర్గానికి పారిపోతున్నారంటూ వైసీపీ చేసిన ప్రచారాలన్నీ పటాపంచలయ్యాయి.

ఎన్నికలకు సంబంధించి కోడ్ అమల్లోకి రాకముందే, నారా లోకేష్ మంగళగిరిలో ఎగ్రెసివ్ క్యాంపెయిన్ షురూ చేశారు. అది అలా అలా కొనసాగుతూనే వుంది. స్థానికంగా టీడీపీ శ్రేణులు బాగా యాక్టివ్ అయ్యాయి. ఇంటింటి ప్రచారాలు, బహిరంగ సభలు.. వాట్ నాట్.. చాలా యాక్టివ్‌గా టీడీపీ, మంగళగిరిలో వర్క్ చేస్తోంది.

అయితే, వైసీపీ నుంచి మంగళగిరిలో ముఖ్య నాయకుల సందడి కనిపించడంలేదు. మురుగుడు లావణ్య ఒంటరి పోరాటం వల్ల వైసీపీకి పెద్దగా ప్రయోజనం లేకుండా పోయిందాయె. సిట్టింగ్ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి వైసీపీని వీడి, కాంగ్రెస్‌లో చేరే క్రమంలో, నియోజకవర్గానికి వైసీపీ ఏమీ చేయలేదని ఆరోపించారు. తిరిగి ఆయన వైసీపీ గూటికి చేరి, వైసీపీ పాలన గురించి గొప్పగా చెబుతోంటే, నియోజకవర్గ ప్రజలు నవ్వుకుంటున్నారు.
ఎలా చూసినా, మంగళగిరిలో నారా లోకేష్ బంపర్ విక్టరీ ఖాయంగానే కనిపిస్తోంది. ‘మెజార్టీ గురించే ఆలోచిస్తున్నాం.. గట్టిగా కొట్టబోతున్నాం..’ అని తెలుగు తమ్ముళ్ళు మంగళగిరిలో ధీమా వ్యక్తం చేస్తున్నారు.

This post was last modified on April 6, 2024 6:09 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

విమర్శకులను పనితీరుతో కొడుతున్న లోకేష్..!

తనపై విమర్శలు చేసే వారిని సహజంగా ఎవరైనా ప్రతివిమర్శలతో ఎదుర్కొంటారు. మాటకు మాట అంటారు. ఇక రాజకీయాల్లో అయితే ఈ…

42 minutes ago

రండి.. కూర్చుని మాట్లాడుకుందాం: ఏపీకి రేవంత్ రెడ్డి పిలుపు

ఇరు తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న జల వివాదాలపై యాగీ చేసుకోకుండా కూర్చుని మాట్లాడుకుంటే సమస్యలు పరిష్కారం అవుతాయని తెలంగాణ…

43 minutes ago

షమీ కెరీర్ క్లోజ్ అయినట్టేనా?

టీమ్ ఇండియా సీనియర్ పేసర్ మహమ్మద్ షమీ ఇంటర్నేషనల్ కెరీర్ దాదాపు ముగింపు దశకు చేరుకున్నట్లే కనిపిస్తోంది. గతేడాది జరిగిన…

1 hour ago

‘వైసీపీ చేసిన పాపాలను కడుగుతున్నాం’

రెండు రాష్ట్రాల మధ్య జల వివాదాలపై ఏపీ సీఎం చంద్రబాబు మరోసారి స్పందించారు. నీళ్లు వద్దు, గొడవలే కావాలని కొందరు…

10 hours ago

ఎలుకల మందు ఆర్డర్.. డెలివరీ బాయ్ ఏం చేశాడు?

సాధారణంగా ఏదైనా ఆర్డర్ ఇస్తే డెలివరీ బాయ్స్ వెంటనే ఇచ్చేసి వెళ్ళిపోతుంటారు. కానీ తమిళనాడులో జరిగిన ఒక ఘటన మాత్రం…

10 hours ago

అమరావతిలో జ్ఞాన బుద్ధకు మళ్లీ ప్రాణం

ఏపీ రాజధాని అమరావతిలో కీలక ప్రాజెక్టును తిరిగి పట్టాలెక్కించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో సుమారు రూ. 2…

11 hours ago