‘మంగళగిరిలో నారా లోకేష్ గెలవడం ఖాయం..’ అని తాజాగా వైసీపీ అంతర్గత సర్వేలో తేలింది. ఈ విషయం ఆ నోటా, ఈ నోటా బయటకు లీక్ అయ్యేసరికి, మంగళగిరి వైసీపీలో లుకలుకలు షురూ అయ్యాయి. ఓడిపోయే సీటుని అంటగట్టారంటూ వైసీపీ అభ్యర్థి, పార్టీ అధినాయకత్వంపై గుస్సా అవుతున్నారట.
నారా లోకేష్ మీద మురుగుడు లావణ్య అనే మహిళా అభ్యర్థిని వైసీపీ రంగంలోకి దించిన సంగతి తెలిసిందే. వాస్తవానికి సిట్టింగ్ ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి బరిలోకి దిగాల్సి వుంది. అయితే, ఆళ్ళ రామకృష్ణారెడ్డిపై స్థానికంగా తీవ్ర వ్యతిరేకత వుండటంతో ఆయన్ని మార్చింది వైసీపీ. టీడీపీ నుంచి కొందరు నాయకుల్ని లాక్కొచ్చి, వారికి టిక్కెట్ ఇచ్చే ప్రయత్నాలు చేశారు.
అధికారికంగా ముగ్గురు అభ్యర్థులు మారారక్కడ. అనధికారికంగా అయితే, అరడజనుకి పైగానే ప్రయోగాలు జరిగినట్లు తెలుస్తోంది. మహిళా అభ్యర్థి.. కాబట్టి, ఆమె గెలుస్తుందనీ, నారా లోకేష్ ఓడిపోవడం ఖాయమనీ వైసీపీ తొలుత భావించింది. మురుగుడు లావణ్య తరఫున తొలుత ప్రచారం అగ్రెసివ్గానే సాగింది.
ఇంకోపక్క, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, వైసీపీ వేవ్ కారణంగా 2019 ఎన్నికల్లో స్వల్ప మెజార్టీతో ఓడిపోయారు. ఓడిపోయినాగానీ, అదే నియోజకవర్గంపై ఫోకస్ పెడుతూ వచ్చారు గత ఐదేళ్ళుగా. నారా లోకేష్ వేరే నియోజకవర్గానికి పారిపోతున్నారంటూ వైసీపీ చేసిన ప్రచారాలన్నీ పటాపంచలయ్యాయి.
ఎన్నికలకు సంబంధించి కోడ్ అమల్లోకి రాకముందే, నారా లోకేష్ మంగళగిరిలో ఎగ్రెసివ్ క్యాంపెయిన్ షురూ చేశారు. అది అలా అలా కొనసాగుతూనే వుంది. స్థానికంగా టీడీపీ శ్రేణులు బాగా యాక్టివ్ అయ్యాయి. ఇంటింటి ప్రచారాలు, బహిరంగ సభలు.. వాట్ నాట్.. చాలా యాక్టివ్గా టీడీపీ, మంగళగిరిలో వర్క్ చేస్తోంది.
అయితే, వైసీపీ నుంచి మంగళగిరిలో ముఖ్య నాయకుల సందడి కనిపించడంలేదు. మురుగుడు లావణ్య ఒంటరి పోరాటం వల్ల వైసీపీకి పెద్దగా ప్రయోజనం లేకుండా పోయిందాయె. సిట్టింగ్ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి వైసీపీని వీడి, కాంగ్రెస్లో చేరే క్రమంలో, నియోజకవర్గానికి వైసీపీ ఏమీ చేయలేదని ఆరోపించారు. తిరిగి ఆయన వైసీపీ గూటికి చేరి, వైసీపీ పాలన గురించి గొప్పగా చెబుతోంటే, నియోజకవర్గ ప్రజలు నవ్వుకుంటున్నారు.
ఎలా చూసినా, మంగళగిరిలో నారా లోకేష్ బంపర్ విక్టరీ ఖాయంగానే కనిపిస్తోంది. ‘మెజార్టీ గురించే ఆలోచిస్తున్నాం.. గట్టిగా కొట్టబోతున్నాం..’ అని తెలుగు తమ్ముళ్ళు మంగళగిరిలో ధీమా వ్యక్తం చేస్తున్నారు.
This post was last modified on April 6, 2024 6:09 pm
స్థానిక ఎన్నికలపై జనసేన త్రిముఖ వ్యూహాన్ని అనుసరిస్తోంది. ఈ నేపథ్యంలో జనసేన పార్టీ అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్..…
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో విద్యార్థి మృతి చెందాడు. నిన్న వైజాగ్ ప్రైవేటు స్కూల్లో టీచర్ కొట్టిన దెబ్బలకు యూకేజీ విద్యార్థి…
నిర్మాత దిల్ రాజు అన్నట్టు వందల సినిమాలు తీయకపోయినా కెవిఎన్ ప్రొడక్షన్స్ అనేది ఇప్పుడు అన్ని బాషల ఇండస్ట్రీలో హాట్…
మెగాస్టార్ చిరంజీవి కొత్త సినిమా ‘కాాకా’ నుంచి ఇటీవల రిలీజ్ చేసిన టైటిల్ గ్లింప్స్ మెగా అభిమానులనే కాక సామాన్య…
కింగ్ సైజ్ ఫిలిం మేకర్ అని ఎవరికైనా బిరుదు ఇవ్వాల్సి వస్తే అందరి మదిలో మెదిలే ఒకే ఒక్క పేరు…
మాస్ రాజా రవితేజ నిఖార్సయిన హిట్టు కొట్టి నాలుగేళ్లయింది. ఈ నాలుగేళ్లలో ఆయన ఆరు చిత్రాలతో పలకరించాడు. వీటిలో కొన్ని…