కీలకమైన అసెంబ్లీ ఎన్నికల వేళ.. వైసీపీకి భారీ షాక్ తగిలింది. నిన్న మొన్ననే.. సీఎం జగన్.. ఎమ్మిగనూరు నుంచి పోటీ చేస్తున్న పార్టీ కీలక నాయకురాలు.. బీసీ మహిళ బుట్టా రేణుకను ఉద్దేశించి మాట్లాడారు. ఈ సమయంలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. బుట్టమ్మ ఆస్తులు కూడా అంతంత మాత్రమే
అన్నారు. అయితే.. ఆ అంతంత మాత్రం ఆస్తులు ఎంతెంత ఉన్నాయనేది అందరికీ తెలిసిందే. మెరిడియన్ స్కూల్ పేరుతో హైదరాబాద్లో విద్యావ్యాపారం సహా.. కల్యాణ మండపాలు కూడా కట్టించారు.
ఇవి కాక..గుర్రాలరేసుల్లోనూ పెట్టుబడులు పెట్టారు. సరే.. ఇవన్నీ ఎలా ఉన్నా..ఇప్పుడు బుట్టా రేణుకకు భారీ షాక్ ఇస్తూ.. ఆమె ఆస్తులను వేలం వేసేందుకు హైదరాబాద్లోని ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ సంస్థ రెడీ అయింది. దీంతో ఒక్కసారిగా ఎమ్మిగనూరులోనే కాకుండా.. వైసీపీలోనూ కలకలం రేగింది. బుట్టా రేణుక భాగస్వామిగా ఉన్న బుట్టా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేటు లిమిటెడ్, మరికొన్ని సంస్థల ఆస్తులను మే 6న ఈ-వేలం వేయనున్నట్లు హైదరాబాద్లోని ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ ప్రకటించింది.
వ్యాపార అవసరాల నిమిత్తం ఈమె కొన్నేళ్ల కిందట ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ నుంచి రూ.340 కోట్ల రుణాన్ని తీసుకున్నారు. కొవిడ్ సమయంలో పలు వ్యాపారాలు దెబ్బతినగా, కొన్నింటిని మూసివేయాల్సి వచ్చింది. ఆ ప్రభావం బుట్టా ఇన్ఫ్రాతోపాటు ఇతర సంస్థలపై పడింది. రుణ బకాయిలు పేరుకుపోవడంతో తాకట్టు పెట్టిన ఆస్తులను వేలం వేయాలని ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ సంస్థ నిర్ణయించింది.
బకాయిల చెల్లింపు అంశంపై నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్(ఎన్సీఎల్టీ)లో ఉంది. ఈ నేపథ్యంలో వేలం ప్రకటన ఇవ్వడం గమనార్హం. విషయం ఎన్సీఎల్టీలో ఉండగా వేలం ప్రకటన విడుదల చేయడం నిబంధనలకు విరుద్ధమని అంటున్నా.. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో అంటే.. ఎగవేస్తారన్న వాదన బలంగా వినిపించినప్పుడు.. వేలం వేసే అధికారం ఆర్బీఐ ఆర్థిక సంస్థలకు కల్పించింది.
This post was last modified on April 6, 2024 7:26 am
ఎక్కువ సినిమాలు తీస్తున్న నిర్మాణ సంస్థలు ఏవంటే మనకు వెంటనే గుర్తొచ్చే బ్యానర్లు సితార, మైత్రి, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ…
ఎన్నికలు ముగిసిపోయి ఫలితాలు ఎలా ఉంటాయోననే ఆసక్తితో జనం ఎదురు చూస్తున్న వేళ కేవలం ఒక్క రోజు మద్దతు కోసం…
సినిమా చిన్నదైనా పెద్దదైనా ఫలితం ఎలా వచ్చినా థియేటర్ కు ఓటిటి మధ్య కనీస గ్యాప్ ఉండటం చాలా అవసరం.…
శాసనసభ ఎన్నికలలో అనూహ్యంగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీకి లోక్ సభ ఎన్నికలు పరీక్షగా నిలుస్తున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో…
ఏపీలో ఎన్నికలు ముగిసిన తర్వాత.. ఒకవైపు తీవ్రమైన హింస చెలరేగిన విషయం తెలిసిందే. ఇదెలా ఉన్నా అధికార, ప్రతిపక్ష నాయకులు…
ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల పోలింగ్ అనంతరం.. పల్నాడు, తిరుపతి, తాడిపత్రి ప్రాంతాల్లో చెలరేగిన హింసపై చంద్రబాబు ఆవేదన వ్యక్తం…