Political News

పరిటాల కమిట్మెంట్ కు సలాం

ఉమ్మ‌డి అనంత‌పురం జిల్లాలోని కీలక నియోజ‌క‌వ‌ర్గం ధ‌ర్మ‌వ‌రంలో కూట‌మి పార్టీలైన‌.. టీడీపీ-బీజేపీ-జ‌న‌సేన నాయ‌కులు చేతులు క‌లిపాయి. ధ‌ర్మ‌వ‌రం టికెట్.. కూట‌మి పార్టీగా ఉన్న బీజేపీకి వెళ్లింది. దీంతో టీడీపీలో కొంత అల‌జ‌డి రేగినా.. యువ నాయ‌కుడు.. ప‌రిటాల శ్రీరామ్ టికెట్ కోసం కొన్ని రోజులు ర‌గ‌డ చేసినా.. త‌ర్వాత స‌ర్దుకున్నారు. దీంతో ఇప్పుడు ప‌రిస్థితి దారిలో ప‌డింది. ఇక‌, తాజాగా ప‌రిటాల శ్రీరామ్‌, ధ‌ర్మ‌వ‌రం బీజేపీ అభ్య‌ర్థి స‌త్య‌కుమార్ యాద‌వ్‌లు.. క‌లిసి ప్ర‌చారం ప్రారంభించారు. ఆలస్యంగా ప్రచారం ప్రారంభించినప్పటికీ సత్యకుమార్… ఎమ్మెల్యే కేతిరెడ్డిపై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు. ఆయనకు పరిటాల శ్రీరామ్‌ సపోర్ట్‌గా నిలుస్తున్నారు.

సత్యకుమార్ ధర్మవరం వస్తున్న సందర్భంగా పరిటాల శ్రీరామ్ ఆధ్వ‌ర్యంలో నియోజకవర్గంలో వందల వాహనాలతో ప్రదర్శన నిర్వహించారు. జిల్లా సరిహద్దు అయిన బత్తలపల్లి మండలం యర్రాయపల్లి గ్రామం వద్ద సత్యకుమార్‌కు పరిటాల శ్రీరామ్‌తో పాటు టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు ఘన స్వాగతం పలికారన్నారు. ధర్మవరం ముఖద్వార వద్ద భారీ గజమాలను సత్యకుమార్‌కు వేసి ఆహ్వానించారు. దారి పొడువునా పూల వర్షం కురిపించిన అభిమానులకు సత్యకుమార్ కృతజ్ఞతలు తెలిపారు. ప్రచారంలో భాగంగా ముందు పరిటాల శ్రీరామ్ మాట్లాడుతూ.. ధర్మవరం నియోజకవర్గంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో సత్యకుమార్‌కు బాగా తెలుసన్నారు.

అన్ని అంశాలపై అవగాహన చేసుకున్న తర్వాతనే నియోజకవర్గానికి వచ్చారని శ్రీరామ్ తెలిపారు. నియోజ‌క‌వ‌ర్గంలో చేనేతలు, రైతులు, కూలీలు పడుతున్న ఇబ్బందులకు పరిష్కారం దొరకాలంటే.. సత్యకుమార్ ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగు పెట్టాలన్నారు. ఇప్పటికే ఢిల్లీలో ధర్మవరం పేరు వినిపించిందని.. సత్యకుమార్ గెలుపు తర్వాత హస్తినలో ఈ పేరు నిత్యం వినిపిస్తూనే ఉండాలన్నారు. చేనేతల ఇబ్బందుల పరిష్కారం కోసం సత్యకుమార్ కచ్చితంగా చొరవ చూపుతారని విశ్వాసం వ్యక్తం చేశారు. మహిళలకు ఉపాధి అవకాశాల కోసం స్టిచ్చింగ్ యూనిట్ల ఏర్పాటుకు సహకారం అందిస్తారన్నారు.

ముస్లింల కబరస్తాన్, హిందువుల స్మశాన వాటికల సమస్యలు ఉన్నాయన్నారు. బీజేపీ అభ్యర్థి కాబట్టి ముస్లింలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. ఇక్కడ వారి భద్రతకు, రక్షణకు ఎలాంటి ఇబ్బంది లేదని శ్రీరామ్ చెప్పారు. ఎమ్మెల్యే ఇన్ని రోజులు చేసిన అరాచకాలకు ఇక తెర పడే సమయం ఆసన్నమైందన్నారు. ఆయన అవినీతి కోటలు రెండు నెలల తర్వాత కూలుతాయ న్నారు. ఇక్కడ వ్యాపారంలోకి రాజకీయాలు తీసుకొచ్చి హింసించే వైఖరి ఇక ఉండబోదన్నారు. సత్యకుమార్‌ని గెలిపించాల్సిన బాధ్యత ప్రతి టీడీపీ కార్యకర్త తీసుకోవాలని శ్రీరామ్ పిలుపునిచ్చారు.

This post was last modified on April 5, 2024 6:07 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

క్లాస్ రవితేజకు మాస్ చిరు ఛాలెంజ్

సంక్రాంతి బాక్సాఫీస్ వద్ద ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వందల కోట్లతో తీసిన రాజా సాబ్ కు మిశ్రమ స్పందన…

2 hours ago

అనిల్ రావిపూడి కారు సమర్పించుకోవాల్సిందే..

నిన్న రాత్రి నుంచి మెగాస్టార్ చిరంజీవి అభిమానుల ఉత్సాహం మామూలుగా లేదు. చిరు కొత్త సినిమా ‘మన శంకర వరప్రసాద్…

3 hours ago

‘పోలవరం పూర్తయితే ఏపీతో ఎవరూ పోటీ పడలేరు’

పోలవరం అత్యత్భుతమైన ప్రాజెక్టు, ఈ ప్రాజెక్టు పూర్తి అయితే దక్షిణ భారత్‌లో ఏ రాష్ట్రమూ మనతో పోటీ పడలేదు.. అని…

4 hours ago

వరప్రసాదుకి పోలికలు అవసరం లేదు

మెగా కంబ్యాక్ గా అభిమానులు మురిసిపోతున్న మన శంకరవరప్రసాద్ గారు థియేటర్లు ప్రీమియర్ల నుంచి రెగ్యులర్ షోల దాకా చాలా…

4 hours ago

రాజా సాబ్ ను లైట్ తీసుకున్న‌ హిందీ ఆడియ‌న్స్

బాహుబ‌లి, బాహుబ‌లి-2 చిత్రాల‌తో దేశ‌వ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్ర‌భాస్. ఇదంతా రాజ‌మౌళి పుణ్యం అంటూ కొంద‌రు…

9 hours ago

వింటేజ్ మెగాస్టార్ బయటికి వచ్చేశారు

చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…

9 hours ago