ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక, కేటాయింపు వంటి విషయాల్లో జనసేన అధినేత పవన్ సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో టీడీపీ నుంచి జనసేనలో చేరిన వారికి టికెట్లు కేటాయిస్తున్నారు. తాజాగా.. ఉమ్మడి కడప జిల్లాలోని ఎస్సీ నియోజకవర్గం రైల్వే కోడూరులో జనసేన అధినేత మార్పుకు శ్రీకారం చుట్టారు. ఇక్కడ నుంచి పోటీ చేసే జనసేన అభ్యర్థిగా అరవ శ్రీధర్ పేరును పవన్ ఖరారు చేశారు.
వాస్తవానికి రెండో జాబితాలో రైల్వే కూడూరు స్థానాన్ని.. జనసేనకు కేటాయించారు. దీంతో తొలుత యన మల భాస్కర రావు పేరు ప్రకటించారు. దీంతో ఆయన పని ప్రారంభించారు. నియోజకవర్గంలో పర్యటిం చారు. అయితే.. రెండు వారాలు గడిచేసరికి.. క్షేత్ర స్థాయి నుంచి వచ్చిన నివేదికలు, జిల్లా నాయకుల అభిప్రాయాలను పవన్ పరిశీలించారు. ఈ క్రమంలో యనమల స్థానంలో అభ్యర్థిని మార్చాలని నిర్ణయించారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఉన్న సమయంలోనే రైల్వే కోడూరు నియోజక వర్గ పరిస్థితిని అక్కడి జనసేన, తెలుగుదేశం పార్టీ కీలక నాయకులు.. పవన్కు వివరించారు. ఈ క్రమం లో రైల్వే కోడూరు స్థానం జనసేన అభ్యర్థిగా అరవ శ్రీధర్ పేరును ఖరారు చేశారు. ఈయన టీడీపీ నాయ కుడు. ప్రస్తుతం పంచాయతీ సర్పంచ్గా ఉన్నాడు. ముక్కావారిపల్లె గ్రామ సర్పంచ్ గా టీడీపీ మద్దతుతో ఆయన విజయం దక్కించుకున్నారు. ఈ క్రమంలోనే ఆయన రెండు రోజుల కిందట జనసేన తీర్థం పుచ్చుకున్నారు. ఇప్పుడు ఆయనకే పవన్ టికెట్ ఇవ్వడం గమనార్హం.
ఇండస్ట్రీ, ప్రేక్షకుల్లో టాపిక్ పాతదే అయినా మరోసారి కొత్త డిబేట్ మొదలయ్యింది. లెనిన్ ప్రమోషన్లలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో నిర్మాత…
ఈ నెల విడుదలవుతున్న సినిమాల్లో చెన్నై లవ్ స్టోరీ మీద మంచి అంచనాలున్నాయి. దర్శకుడు రవి నంబూరి అయినప్పటికీ, కథ…
సలార్ లో వరదరాజ మన్నార్ గా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన మలయాళ హీరో పృథ్విరాజ్ సుకుమారన్ ఆ తర్వాత తెలుగులో…
మొన్న విడుదలైన రావు బహదూర్ సినిమాకు కొందరు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఫస్ట్ హాఫ్ మరీ నెమ్మదిగా ఉన్నా సెకండాఫ్…
తెలుగులో ఒకప్పుడు చిన్న సినిమాల కథానాయకుడిగా చాలా ఏళ్ల పాటు కెరీర్ను నడిపించాడు శివాజీ. కానీ తర్వాత అతడి మనసు…
ఏపీలో ప్రతిపక్షంగా ఉన్న వైసీపీలో చీలిక రానుందా? ఆ పార్టీ నాయకులు చీలిపోవడమో.. లేక కూటమిలోని ఓ పార్టీలో చేరిపోవడమో…