వలంటీర్లను పింఛన్ల పంపిణీ సహా.. ఇతర పనులకు కేంద్ర ఎన్నికల సంఘం దూరం పెట్టడంతో అసలు సిసలు రాజకీయాలు తెరమీదికి వచ్చాయి. వలంటీర్ల కేంద్రంగా సాగుతున్న రాజకీయాల్లో ఇప్పుడు వైసీపీ అనుకూల వ్యక్తులు మరింత పరాకాష్ఠకు చేరుకున్నారు. పింఛన్ల పంపిణీకి చంద్రబాబు అడ్డుపడుతున్నా డని, టీడీపీ అరాచకంగా వ్యవహరిస్తోందని చెబుతున్న వైసీపీకి అనుకూలంగా.. మరింత ప్రచారాన్ని అరాచక స్థాయికి చేర్చారు.
నడవలేని వారు… మంచంపై అనారోగ్యంతో తీసుకుంటున్నవారిని మంచాలపైనే మోసుకు వచ్చి.. పింఛన్ కేంద్రాల్లో పింఛన్లు ఇప్పిస్తున్నారు. వీటిని వీడియోలు తీసి సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. అదే సయమంలో నల్ల జెండాలు పట్టుకుని టీడీపీ, చంద్రబాబుకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. వలంటీ ర్లను చంద్రబాబు దూరం పెట్టించారని.. అందుకే తాము ఇలా ఇబ్బందులు పడుతున్నామనే ధోరణితో ఇలా ప్రచారం చేస్తున్నారు.
వాస్తవానికి ఈసీ అయినా.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అయినా.. పింఛన్ల పంపిణీ విషయంలో కొన్ని మార్గ దర్శకాలు ఇచ్చారు. ఇంటింటికీ పింఛన్లు పంపిణీ చేయాలని అన్నారు. అయితే.. దీనిని కొందరికే పరిమి తం చేశారు. ముఖ్యంగా వితంతువులు, నడవలేని వారు.. మంచంలో ఉన్న తీవ్ర అనారోగ్యంతో బాధపడు తున్న వారికి ఇంటికే పంపిణీ చేయాలని చెప్పారు. దీనికి యంత్రాంగం కూడా రెడీ అయింది. అయితే.. ఈ విషయాన్ని సాకుగా చూపించి.. వైసీపీ నేతలు క్షేత్రస్థాయిలో ప్రచారాన్ని అరాచక స్థాయికి తీసుకువెళ్లారు.
మరి ఇది ఎంత వరకు సమంజసం..? అనేది ప్రశ్న. ఓడిపోతారని భావించిన వారే ఇలా .. అరాచకాల ప్రచారానికి తెరదీస్తారని నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు. నిజానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కూడా ఇలాంటి చూస్తూ.. గుటకలు మింగడం.. సరికాదని హితవు పలుకుతున్నారు.
అమరావతిని ఏపీకి శాశ్వత రాజధానిగా కాకుండా చేయడం ఇక ఏ ఒక్కరి వల్ల సాధ్యం కాదు. ఒక వేళ కూటమి…
నెల్లూరు జిల్లా వైసీపీలో మాజీ మంత్రుల సెల్ఫ్ గోల్ రాజకీయాలు పార్టీని, వారి కార్యకర్తలను తీవ్ర స్థాయిలో ఇబ్బందికి గురిచేస్తున్నాయి.…
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రాజకీయ వ్యవహారాల ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ పరిస్థితి ఏమవుతుంది? అనేది ఆసక్తిగా మారింది. మధ్యప్రదేశ్ నుంచి…
ఒకప్పుడు టాలీవుడ్ లో స్టార్ స్టేటస్ తో నెంబర్ వన్ స్థానం ఎంజాయ్ చేసిన హీరోయిన్ పూజా హగ్దేకు సక్సెస్…
ఒక దిగ్గజంసెలవు తీసుకున్నారు. తమిళ సినీ ప్రస్థానాన్ని కొత్త మలుపు తిప్పి తెలుగులోనూ అశేష అభిమానులను సొంతం చేసుకున్న దర్శకులు…
వర్షాకాలం ఇంకా ప్రారంభం కానే లేదు. అప్పుడే ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. తెలంగాణ రాజధాని హైదరాబాద్…