వలంటీర్లను పింఛన్ల పంపిణీ సహా.. ఇతర పనులకు కేంద్ర ఎన్నికల సంఘం దూరం పెట్టడంతో అసలు సిసలు రాజకీయాలు తెరమీదికి వచ్చాయి. వలంటీర్ల కేంద్రంగా సాగుతున్న రాజకీయాల్లో ఇప్పుడు వైసీపీ అనుకూల వ్యక్తులు మరింత పరాకాష్ఠకు చేరుకున్నారు. పింఛన్ల పంపిణీకి చంద్రబాబు అడ్డుపడుతున్నా డని, టీడీపీ అరాచకంగా వ్యవహరిస్తోందని చెబుతున్న వైసీపీకి అనుకూలంగా.. మరింత ప్రచారాన్ని అరాచక స్థాయికి చేర్చారు.
నడవలేని వారు… మంచంపై అనారోగ్యంతో తీసుకుంటున్నవారిని మంచాలపైనే మోసుకు వచ్చి.. పింఛన్ కేంద్రాల్లో పింఛన్లు ఇప్పిస్తున్నారు. వీటిని వీడియోలు తీసి సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. అదే సయమంలో నల్ల జెండాలు పట్టుకుని టీడీపీ, చంద్రబాబుకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. వలంటీ ర్లను చంద్రబాబు దూరం పెట్టించారని.. అందుకే తాము ఇలా ఇబ్బందులు పడుతున్నామనే ధోరణితో ఇలా ప్రచారం చేస్తున్నారు.
వాస్తవానికి ఈసీ అయినా.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అయినా.. పింఛన్ల పంపిణీ విషయంలో కొన్ని మార్గ దర్శకాలు ఇచ్చారు. ఇంటింటికీ పింఛన్లు పంపిణీ చేయాలని అన్నారు. అయితే.. దీనిని కొందరికే పరిమి తం చేశారు. ముఖ్యంగా వితంతువులు, నడవలేని వారు.. మంచంలో ఉన్న తీవ్ర అనారోగ్యంతో బాధపడు తున్న వారికి ఇంటికే పంపిణీ చేయాలని చెప్పారు. దీనికి యంత్రాంగం కూడా రెడీ అయింది. అయితే.. ఈ విషయాన్ని సాకుగా చూపించి.. వైసీపీ నేతలు క్షేత్రస్థాయిలో ప్రచారాన్ని అరాచక స్థాయికి తీసుకువెళ్లారు.
మరి ఇది ఎంత వరకు సమంజసం..? అనేది ప్రశ్న. ఓడిపోతారని భావించిన వారే ఇలా .. అరాచకాల ప్రచారానికి తెరదీస్తారని నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు. నిజానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కూడా ఇలాంటి చూస్తూ.. గుటకలు మింగడం.. సరికాదని హితవు పలుకుతున్నారు.
This post was last modified on April 3, 2024 3:37 pm
ప్రపంచ వేదిక మీద సగర్వంగా ఆస్కార్ అందుకున్న ఎంఎం కీరవాణి మీద ఇప్పుడు అతి పెద్ద బాధ్యత ఉంది. వారణాసికి…
నిఖిల్ ఎంత గ్యాప్ వస్తున్నా లెక్క చేయకుండా అత్యధిక సమయం కేటాయించిన ప్యాన్ ఇండియా మూవీ స్వయంభు. ఇప్పటికే విపరీతమైన…
తెలుగులో సినిమాలు చేస్తున్నంత వరకు సగటు గ్లామర్ హీరోయిన్లలో ఒకరి లాగే ఉండేది తాప్సి పన్ను. కానీ తర్వాత బాలీవుడ్కు…
నిధి అగర్వాల్ పేరుకు బాలీవుడ్ హీరోయినే కానీ.. ఆమె తెలుగు వారికే ఎక్కువ చేరువ అయింది. కెరీర్లో ఎక్కువ సినిమాలు ఇక్కడే…
ముంబై పుణె ఎక్స్ప్రెస్వేలో ఎన్నడూ లేని విధంగా ఒక ఊహించని ఘటన చోటుచేసుకుంది. ఒక గ్యాస్ ట్యాంకర్ బోల్తా పడటంతో…
అఖిల్ లెనిన్ ఏ ముహూర్తంలో మొదలుపెట్టారో కానీ బ్రేకుల మీద బ్రేకులు పడుతూనే ఉన్నాయి. షూటింగ్ మొదలుపెట్టినప్పుడు శ్రీలీల హీరోయిన్…