వలంటీర్లను పింఛన్ల పంపిణీ సహా.. ఇతర పనులకు కేంద్ర ఎన్నికల సంఘం దూరం పెట్టడంతో అసలు సిసలు రాజకీయాలు తెరమీదికి వచ్చాయి. వలంటీర్ల కేంద్రంగా సాగుతున్న రాజకీయాల్లో ఇప్పుడు వైసీపీ అనుకూల వ్యక్తులు మరింత పరాకాష్ఠకు చేరుకున్నారు. పింఛన్ల పంపిణీకి చంద్రబాబు అడ్డుపడుతున్నా డని, టీడీపీ అరాచకంగా వ్యవహరిస్తోందని చెబుతున్న వైసీపీకి అనుకూలంగా.. మరింత ప్రచారాన్ని అరాచక స్థాయికి చేర్చారు.
నడవలేని వారు… మంచంపై అనారోగ్యంతో తీసుకుంటున్నవారిని మంచాలపైనే మోసుకు వచ్చి.. పింఛన్ కేంద్రాల్లో పింఛన్లు ఇప్పిస్తున్నారు. వీటిని వీడియోలు తీసి సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. అదే సయమంలో నల్ల జెండాలు పట్టుకుని టీడీపీ, చంద్రబాబుకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. వలంటీ ర్లను చంద్రబాబు దూరం పెట్టించారని.. అందుకే తాము ఇలా ఇబ్బందులు పడుతున్నామనే ధోరణితో ఇలా ప్రచారం చేస్తున్నారు.
వాస్తవానికి ఈసీ అయినా.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అయినా.. పింఛన్ల పంపిణీ విషయంలో కొన్ని మార్గ దర్శకాలు ఇచ్చారు. ఇంటింటికీ పింఛన్లు పంపిణీ చేయాలని అన్నారు. అయితే.. దీనిని కొందరికే పరిమి తం చేశారు. ముఖ్యంగా వితంతువులు, నడవలేని వారు.. మంచంలో ఉన్న తీవ్ర అనారోగ్యంతో బాధపడు తున్న వారికి ఇంటికే పంపిణీ చేయాలని చెప్పారు. దీనికి యంత్రాంగం కూడా రెడీ అయింది. అయితే.. ఈ విషయాన్ని సాకుగా చూపించి.. వైసీపీ నేతలు క్షేత్రస్థాయిలో ప్రచారాన్ని అరాచక స్థాయికి తీసుకువెళ్లారు.
మరి ఇది ఎంత వరకు సమంజసం..? అనేది ప్రశ్న. ఓడిపోతారని భావించిన వారే ఇలా .. అరాచకాల ప్రచారానికి తెరదీస్తారని నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు. నిజానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కూడా ఇలాంటి చూస్తూ.. గుటకలు మింగడం.. సరికాదని హితవు పలుకుతున్నారు.
This post was last modified on April 3, 2024 3:37 pm
ఎనిమిదేళ్ల క్రితం 2019లో తెలుగు రాష్ట్రాలను కుదిపేసిన సంఘటన దిశాపై జరిగిన అఘాయిత్యం. ఒక వైద్య విదార్థినిని నలుగురు కరుడు…
వైయస్ కుటుంబంలో ఆస్తి తగాదాలు ఇంకా సమసిపోయినట్లు కనిపించడం లేదు. అన్నా చెల్లెళ్ళ మధ్య దూరం తరిగిన సూచనలు కానరావడం…
ప్యారడైజ్ మీద ఉన్న క్రేజ్ దృష్ట్యా దానికి పోటీగా నిలబడేందుకు పెద్ద సినిమాలు సాహసం చేయడం లేదు. అనుమాన పక్షి…
గజ్వేల్ నియోజకవర్గం.. తెలంగాణ మాజీ సీఎం, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ కంచుకోట. అయితే.. ఇక్కడే పాగా వేయాలని.. వచ్చే…
తమిళంలో డెబ్యూతోనే సూపర్ హిట్ అందుకున్న సుహాస్ గురించి చెన్నై మండాడి సక్సెస్ మీట్ లో దర్శకుడు చేసిన కామెంట్స్…
అక్టోబర్ 2 ఆదర్శ కుటుంబం ఏకె 47 వస్తుందో లేదో ఖచ్చితంగా చెప్పలేం కానీ సందీప్ కిషన్ సిగ్మా రిలీజవుతోంది.…