Political News

ఏపీలో ఇదో ప్ర‌చార అరాచ‌కం!

వలంటీర్ల‌ను పింఛ‌న్ల పంపిణీ స‌హా.. ఇత‌ర ప‌నుల‌కు కేంద్ర ఎన్నిక‌ల సంఘం దూరం పెట్ట‌డంతో అస‌లు సిస‌లు రాజ‌కీయాలు తెర‌మీదికి వ‌చ్చాయి. వలంటీర్ల కేంద్రంగా సాగుతున్న రాజ‌కీయాల్లో ఇప్పుడు వైసీపీ అనుకూల వ్య‌క్తులు మ‌రింత ప‌రాకాష్ఠ‌కు చేరుకున్నారు. పింఛ‌న్ల పంపిణీకి చంద్ర‌బాబు అడ్డుప‌డుతున్నా డ‌ని, టీడీపీ అరాచ‌కంగా వ్య‌వ‌హ‌రిస్తోంద‌ని చెబుతున్న వైసీపీకి అనుకూలంగా.. మ‌రింత ప్ర‌చారాన్ని అరాచ‌క స్థాయికి చేర్చారు.

న‌డ‌వ‌లేని వారు… మంచంపై అనారోగ్యంతో తీసుకుంటున్న‌వారిని మంచాల‌పైనే మోసుకు వ‌చ్చి.. పింఛ‌న్ కేంద్రాల్లో పింఛ‌న్లు ఇప్పిస్తున్నారు. వీటిని వీడియోలు తీసి సోషల్ మీడియాలో ప్ర‌చారం చేస్తున్నారు. అదే స‌య‌మంలో న‌ల్ల జెండాలు ప‌ట్టుకుని టీడీపీ, చంద్ర‌బాబుకు వ్య‌తిరేకంగా నినాదాలు చేస్తున్నారు. వ‌లంటీ ర్ల‌ను చంద్ర‌బాబు దూరం పెట్టించార‌ని.. అందుకే తాము ఇలా ఇబ్బందులు ప‌డుతున్నామ‌నే ధోర‌ణితో ఇలా ప్రచారం చేస్తున్నారు.

వాస్త‌వానికి ఈసీ అయినా.. ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి అయినా.. పింఛ‌న్ల పంపిణీ విష‌యంలో కొన్ని మార్గ ద‌ర్శ‌కాలు ఇచ్చారు. ఇంటింటికీ పింఛ‌న్లు పంపిణీ చేయాల‌ని అన్నారు. అయితే.. దీనిని కొంద‌రికే ప‌రిమి తం చేశారు. ముఖ్యంగా వితంతువులు, న‌డ‌వ‌లేని వారు.. మంచంలో ఉన్న తీవ్ర అనారోగ్యంతో బాధ‌ప‌డు తున్న‌ వారికి ఇంటికే పంపిణీ చేయాల‌ని చెప్పారు. దీనికి యంత్రాంగం కూడా రెడీ అయింది. అయితే.. ఈ విష‌యాన్ని సాకుగా చూపించి.. వైసీపీ నేత‌లు క్షేత్ర‌స్థాయిలో ప్ర‌చారాన్ని అరాచ‌క స్థాయికి తీసుకువెళ్లారు.

మ‌రి ఇది ఎంత వ‌ర‌కు స‌మంజ‌సం..? అనేది ప్ర‌శ్న‌. ఓడిపోతార‌ని భావించిన వారే ఇలా .. అరాచ‌కాల ప్ర‌చారానికి తెరదీస్తార‌ని నెటిజ‌న్లు వ్యాఖ్యానిస్తున్నారు. నిజానికి ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి కూడా ఇలాంటి చూస్తూ.. గుట‌క‌లు మింగ‌డం.. స‌రికాద‌ని హిత‌వు ప‌లుకుతున్నారు.

This post was last modified on April 3, 2024 3:37 pm

Share

Recent Posts

2000 కోట్లు అంటే చాలా పెద్ద స్టేట్‌మెంట్

ఇంకో నాలుగు రోజుల్లో విడుదల కాబోతున్న టాక్సిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ మల్లారెడ్డి యునివర్సిటిలో ఘనంగా జరిగింది. తెలుగు…

29 minutes ago

చిరు అభిమానుల‌కు కొడాలి నాని వ‌ల‌

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేత‌ల్లో ఒక‌రైన కొడాలి నానికి తెలుగుదేశం అన్నా, జ‌న‌సేన అన్నా ఎంత కోప‌మో ప్ర‌త్యేకంగా…

2 hours ago

ఆ భవనాలు కూల్చేస్తామంటోన్న హైడ్రా రంగనాథ్

హైడ్రా కూల్చివేతలపై చాలామంది ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. మరికొంత మంది మాత్రం నాలాలపై, చెరువలు…

3 hours ago

మాస్ రాజా తాప‌త్ర‌యమే కానీ… వాళ్లు చూస్తారా?

మాస్ రాజా ర‌వితేజ కొత్త సినిమా ఇరుముడి తెలుగు రాష్ట్రాల‌తో పాటు తెలుగు వాళ్లుండే ప్ర‌తి చోటా ఇర‌గాడేస్తోంది. తెలుగులో…

4 hours ago

నాగ చైతన్య అయితే సెట్ అయ్యేదా

బాక్సాఫీస్ వద్ద వీర విహారం చేస్తున్న ఇరుముడి ఎక్కడికి వెళ్తుందో ఎవరికి అంతు చిక్కడం లేదు. పాజిటివ్ టాక్ రావడంలో…

4 hours ago

రాకా సెట్లో మంచు లక్ష్మి… వావ్ వావ్ వావ్

అట్లీ దర్శకత్వంలో అల్లు అర్జున్ కొత్త సినిమా ‘రాకా’ మొదలైనపుడే అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. సన్ పిక్చర్స్ ప్రొడక్షన్లో…

7 hours ago