Political News

ఏపీలో ఇదో ప్ర‌చార అరాచ‌కం!

వలంటీర్ల‌ను పింఛ‌న్ల పంపిణీ స‌హా.. ఇత‌ర ప‌నుల‌కు కేంద్ర ఎన్నిక‌ల సంఘం దూరం పెట్ట‌డంతో అస‌లు సిస‌లు రాజ‌కీయాలు తెర‌మీదికి వ‌చ్చాయి. వలంటీర్ల కేంద్రంగా సాగుతున్న రాజ‌కీయాల్లో ఇప్పుడు వైసీపీ అనుకూల వ్య‌క్తులు మ‌రింత ప‌రాకాష్ఠ‌కు చేరుకున్నారు. పింఛ‌న్ల పంపిణీకి చంద్ర‌బాబు అడ్డుప‌డుతున్నా డ‌ని, టీడీపీ అరాచ‌కంగా వ్య‌వ‌హ‌రిస్తోంద‌ని చెబుతున్న వైసీపీకి అనుకూలంగా.. మ‌రింత ప్ర‌చారాన్ని అరాచ‌క స్థాయికి చేర్చారు.

న‌డ‌వ‌లేని వారు… మంచంపై అనారోగ్యంతో తీసుకుంటున్న‌వారిని మంచాల‌పైనే మోసుకు వ‌చ్చి.. పింఛ‌న్ కేంద్రాల్లో పింఛ‌న్లు ఇప్పిస్తున్నారు. వీటిని వీడియోలు తీసి సోషల్ మీడియాలో ప్ర‌చారం చేస్తున్నారు. అదే స‌య‌మంలో న‌ల్ల జెండాలు ప‌ట్టుకుని టీడీపీ, చంద్ర‌బాబుకు వ్య‌తిరేకంగా నినాదాలు చేస్తున్నారు. వ‌లంటీ ర్ల‌ను చంద్ర‌బాబు దూరం పెట్టించార‌ని.. అందుకే తాము ఇలా ఇబ్బందులు ప‌డుతున్నామ‌నే ధోర‌ణితో ఇలా ప్రచారం చేస్తున్నారు.

వాస్త‌వానికి ఈసీ అయినా.. ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి అయినా.. పింఛ‌న్ల పంపిణీ విష‌యంలో కొన్ని మార్గ ద‌ర్శ‌కాలు ఇచ్చారు. ఇంటింటికీ పింఛ‌న్లు పంపిణీ చేయాల‌ని అన్నారు. అయితే.. దీనిని కొంద‌రికే ప‌రిమి తం చేశారు. ముఖ్యంగా వితంతువులు, న‌డ‌వ‌లేని వారు.. మంచంలో ఉన్న తీవ్ర అనారోగ్యంతో బాధ‌ప‌డు తున్న‌ వారికి ఇంటికే పంపిణీ చేయాల‌ని చెప్పారు. దీనికి యంత్రాంగం కూడా రెడీ అయింది. అయితే.. ఈ విష‌యాన్ని సాకుగా చూపించి.. వైసీపీ నేత‌లు క్షేత్ర‌స్థాయిలో ప్ర‌చారాన్ని అరాచ‌క స్థాయికి తీసుకువెళ్లారు.

మ‌రి ఇది ఎంత వ‌ర‌కు స‌మంజ‌సం..? అనేది ప్ర‌శ్న‌. ఓడిపోతార‌ని భావించిన వారే ఇలా .. అరాచ‌కాల ప్ర‌చారానికి తెరదీస్తార‌ని నెటిజ‌న్లు వ్యాఖ్యానిస్తున్నారు. నిజానికి ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి కూడా ఇలాంటి చూస్తూ.. గుట‌క‌లు మింగ‌డం.. స‌రికాద‌ని హిత‌వు ప‌లుకుతున్నారు.

This post was last modified on April 3, 2024 3:37 pm

Share

Recent Posts

ధర్మేంద్ర రాజీనామా… బొద్దింకలకు సరిపోదు!

కేంద్ర విద్యా శాఖా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు.…

1 hour ago

మెలోడీ బ్రహ్మ మళ్ళీ రేసులోకి వచ్చినట్టే

ఒకప్పుడు మెలోడీ బ్రహ్మ మణిశర్మ అంటే టాలీవుడ్ ప్రేక్షకులకు ఒక గూస్ బంప్స్ ఎమోషన్. కమర్షియల్ సినిమాలను తన నేపధ్య…

2 hours ago

సంచలనం: కేంద్రమంత్రి ధర్మేంద్ర రాజీనామా!

దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపిన నీట్ ప్రశ్నాపత్రం లీకేజీ, పరీక్షల నిర్వహణలో అక్రమాల వివాదం చివరకు కేంద్ర విద్యాశాఖ మంత్రి…

2 hours ago

అఖిల్ కొడుకుతో సిసింద్రీ-2

‘బాహుబలి’ ప్రభంజనం తర్వాత ఇండియన్ సినిమాలో సీక్వెల్స్, ఫ్రాంఛైజీ సినిమాల జోరు ఎంతగా పెరిగిందో తెలిసిందే. అవసరం ఉన్నా లేకపోయినా పార్ట్-2లు…

2 hours ago

మోడీకి క‌ళ్లు చెదిరేలా స్వాగ‌త ఏర్పాట్లు

ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ మ‌రో వారంలో ఏపీకి రానున్నారు. ఆగ‌స్టు 1వ తేదీన ఆయ‌న విజ‌య‌న‌గ‌రం జిల్లా భోగాపురానికి…

2 hours ago

రాళ్లను మెట్లుగా మార్చి.. అదే మోదీ ప్రత్యేకత..!

నీట్ ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారంపై దేశవ్యాప్తంగా ఆందోళనలు ఉధృతమైన వేళ ప్రధాని నరేంద్ర మోదీ విడుదల చేసిన అర్థరాత్రి సెల్ఫీ…

5 hours ago