Political News

ఏపీలో ఇదో ప్ర‌చార అరాచ‌కం!

వలంటీర్ల‌ను పింఛ‌న్ల పంపిణీ స‌హా.. ఇత‌ర ప‌నుల‌కు కేంద్ర ఎన్నిక‌ల సంఘం దూరం పెట్ట‌డంతో అస‌లు సిస‌లు రాజ‌కీయాలు తెర‌మీదికి వ‌చ్చాయి. వలంటీర్ల కేంద్రంగా సాగుతున్న రాజ‌కీయాల్లో ఇప్పుడు వైసీపీ అనుకూల వ్య‌క్తులు మ‌రింత ప‌రాకాష్ఠ‌కు చేరుకున్నారు. పింఛ‌న్ల పంపిణీకి చంద్ర‌బాబు అడ్డుప‌డుతున్నా డ‌ని, టీడీపీ అరాచ‌కంగా వ్య‌వ‌హ‌రిస్తోంద‌ని చెబుతున్న వైసీపీకి అనుకూలంగా.. మ‌రింత ప్ర‌చారాన్ని అరాచ‌క స్థాయికి చేర్చారు.

న‌డ‌వ‌లేని వారు… మంచంపై అనారోగ్యంతో తీసుకుంటున్న‌వారిని మంచాల‌పైనే మోసుకు వ‌చ్చి.. పింఛ‌న్ కేంద్రాల్లో పింఛ‌న్లు ఇప్పిస్తున్నారు. వీటిని వీడియోలు తీసి సోషల్ మీడియాలో ప్ర‌చారం చేస్తున్నారు. అదే స‌య‌మంలో న‌ల్ల జెండాలు ప‌ట్టుకుని టీడీపీ, చంద్ర‌బాబుకు వ్య‌తిరేకంగా నినాదాలు చేస్తున్నారు. వ‌లంటీ ర్ల‌ను చంద్ర‌బాబు దూరం పెట్టించార‌ని.. అందుకే తాము ఇలా ఇబ్బందులు ప‌డుతున్నామ‌నే ధోర‌ణితో ఇలా ప్రచారం చేస్తున్నారు.

వాస్త‌వానికి ఈసీ అయినా.. ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి అయినా.. పింఛ‌న్ల పంపిణీ విష‌యంలో కొన్ని మార్గ ద‌ర్శ‌కాలు ఇచ్చారు. ఇంటింటికీ పింఛ‌న్లు పంపిణీ చేయాల‌ని అన్నారు. అయితే.. దీనిని కొంద‌రికే ప‌రిమి తం చేశారు. ముఖ్యంగా వితంతువులు, న‌డ‌వ‌లేని వారు.. మంచంలో ఉన్న తీవ్ర అనారోగ్యంతో బాధ‌ప‌డు తున్న‌ వారికి ఇంటికే పంపిణీ చేయాల‌ని చెప్పారు. దీనికి యంత్రాంగం కూడా రెడీ అయింది. అయితే.. ఈ విష‌యాన్ని సాకుగా చూపించి.. వైసీపీ నేత‌లు క్షేత్ర‌స్థాయిలో ప్ర‌చారాన్ని అరాచ‌క స్థాయికి తీసుకువెళ్లారు.

మ‌రి ఇది ఎంత వ‌ర‌కు స‌మంజ‌సం..? అనేది ప్ర‌శ్న‌. ఓడిపోతార‌ని భావించిన వారే ఇలా .. అరాచ‌కాల ప్ర‌చారానికి తెరదీస్తార‌ని నెటిజ‌న్లు వ్యాఖ్యానిస్తున్నారు. నిజానికి ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి కూడా ఇలాంటి చూస్తూ.. గుట‌క‌లు మింగ‌డం.. స‌రికాద‌ని హిత‌వు ప‌లుకుతున్నారు.

This post was last modified on April 3, 2024 3:37 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

‘ధూరందర్’ దర్శకుడు… మాములోడు కాదు

బాలీవుడ్‌లో స్టార్ పవర్ కంటే కేవలం కథను నమ్మి సినిమాలు తీసే దర్శకులు చాలా తక్కువ మంది ఉంటారు. అందులో…

21 minutes ago

పరాభవ నామ సంవత్సరం అర్థం ఇదే..

నేడు ఉగాది సందర్భంగా కొత్త తెలుగు సంవత్సరం పరాభవ నామ సంవత్సరంగా ప్రారంభమవుతోంది. అయితే “పరాభవం” అనే పదం వినగానే…

30 minutes ago

ఉగాది రోజు కూటమి కొలువుల కానుక

ఉద్యోగార్థులకు ఉగాది కానుకగా రాష్ట్ర ప్రభుత్వం జాబ్ క్యాలెండర్‌ను విడుదల చేసింది. మొత్తం 10,060 పోస్టులతో ఈ క్యాలెండర్‌ను విడుదల…

34 minutes ago

దేవికి ఎల్లమ్మ అంత నచ్చిందా

స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ హీరో అవుతాడని చాలా ఏళ్ల ముందే ప్రచారం జరిగింది. సుకుమార్ లాంటి అగ్ర…

5 hours ago

జీతం తీసుకొని సభకు రారా కేసీఆర్ సారు

రాష్ట్రంలో ప్ర‌తిప‌క్షం.. బాధ్య‌తాయుతంగా వ్య‌వ‌హ‌రించ‌డం లేద‌ని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నాయ‌కుడు కేసీఆర్‌.. ప్ర‌జ‌లుక‌డుతున్న ప‌న్నుల‌తో…

9 hours ago

‘మహేష్’ వివాదంపై స్పందించిన శ్రీలీల

ఇటీవల ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ప్రి రిలీజ్ ఈవెంట్ సందర్భంగా జరిగిన ఒక పరిణామానికి సంబంధించి ఓ వీడియో సోషల్…

11 hours ago