Political News

క‌డ‌ప స‌హా మూడు చోట్ల హోరా హోరీ..: కాంగ్రెస్ లిస్ట్ ఇదే!

ఏపీలో జ‌రుగుతున్న లోక్ సభ, శాసనసభ ఎన్నికల్లో పోటీ చేయబోతున్న కాంగ్రెస్‌ అభ్యర్థుల తొలి జాబితా విడుదలయింది. అభ్యర్థుల జాబితాను ఏఐసీసీ విడుదల చేసింది. 114 అసెంబ్లీ, 5 లోక్ సభ అభ్యర్థులతో తొలి జాబితాను ప్రకటించారు. కడప లోక్ సభ స్థానం నుంచి షర్మిల పోటీ చేస్తున్నారు. కర్నూలు ఎంపీ అభ్యర్థిగా రాంపుల్లయ్య యాదవ్, రాజమండ్రి ఎంపీ అభ్యర్థిగా గిడుగు రుద్రరాజు, బాపట్ల ఎంపీ అభ్యర్థిగా ఎంపీ జేడీ శీలం, కాకినాడ ఎంపీ అభ్యర్థిగా పల్లంరాజుల పేర్లు ప్రకటించారు.

వీరిలో క‌డ‌ప‌, బాప‌ట్ల‌, కాకినాడ ఎంపీ స్థానాల‌కు అభ్య‌ర్థులుగా ఎంపికైన వారు.. బ‌ల‌మైన నాయ‌కులు కావ‌డం గ‌మ‌నార్హం. క‌డ‌ప నుంచి పోటీ చేయ‌నున్న ష‌ర్మిల వైఎస్ కుటుంబానికి చెందిన నాయ‌కురాలిగా.. పైగా వైఎస్ వార‌సురాలిగా ఇక్క‌డ బ‌ల‌మైన పోటీ ఇవ్వ‌నున్నారు. ముఖ్యంగా వైఎస్ వివేకానంద రెడ్డి కుటుంబం.. ఆమెకు మ‌ద్ద‌తు ఇస్తోంది. దీంతో క‌డ‌ప పార్ల‌మెంటు స్థానంలో హోరా హోరీ పోరు త‌ప్పేలా లేదు.

ఇక‌, బాప‌ట్ల నుంచి బ‌రిలోకి దిగుతున్న జేడీ శీలం కూడా.. సీనియ‌ర్ నాయ‌కుడు, కేంద్ర మాజీ మంత్రి.. ఒక ప్పుడు బాప‌ట్ల నుంచే ఆయ‌న విజ‌యం ద‌క్కించుకున్నారు. ఎస్సీ నేత‌గా, వివాద‌ర‌హిత నాయ‌కుడిగా కూడా ఆయ‌నకు పేరుంది. అమ‌రావ‌తి రాజ‌ధానికి ఆయ‌న మ‌ద్ద‌తు తెలిపారు. ఇక‌, కాకినాడ ఎంపీ అభ్య‌ర్థిగా బ‌రిలోకి దిగుతున్న ప‌ల్లంరాజు కూడా బ‌ల‌మైన నాయ‌కుడు. ఆర్థికంగా కూడా ఆయ‌న బ‌లంగానే ఉన్నారు. ఇక‌, సామాజిక వ‌ర్గం ప‌రంగా కూడా ఆయ‌న‌కు ఫాలోయింగ్ ఉంది. ఎలా చూసుకున్నా.. ఈ మూడు స్థానాల్లో ట‌ఫ్ ఫైట్ త‌ప్పుదు.

This post was last modified on April 2, 2024 3:22 pm

Share

Recent Posts

విజయ్ స్థానాన్ని భర్తీ చేస్తాడా?

తమిళంలో సూపర్ స్టార్ రజినీకాంత్ ఎన్నో ఏళ్ల పాటు నంబర్ వన్ హీరోగా కొనసాగారు. రజినీ ఉండగా ఆయన్ని మించే స్టార్ రాబోడని అంతా…

2 hours ago

విశ్వంభర వెళ్తున్న దారి సరైనదేనా

చిరంజీవి పుట్టినరోజు ఇంకో ఆరు రోజుల్లో రానుంది. రెండు కీలక అప్డేట్స్ కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు. మెగా 158…

4 hours ago

యష్ మాటల్లో పరిణితి పని చేస్తుంది

ఇంకో పది రోజుల్లో టాక్సిక్ విడుదల కానుంది. కెజిఎఫ్ తర్వాత సుమారు నాలుగేళ్ల విలువైన కాలాన్ని దీని కోసమే ఖర్చు…

5 hours ago

వైసీపీ స‌త్తాకు `బ్యాలెట్` టెస్ట్‌?

ఏపీలో వ‌చ్చే సెప్టెంబ‌రులో నిర్వ‌హించాల‌ని భావిస్తున్న స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల‌ను బ్యాలెట్ విధానంలోనే నిర్వ‌హించాల‌ని రాష్ట్ర ఎన్నిక‌ల సంఘం నిర్ణ‌యించింది. దీంతో…

5 hours ago

కేటీఆర్ కార్యకర్తల రక్తాన్ని అమ్ముకున్నారు

తెలంగాణాలో స్థానిక ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య విమర్శలు జోరందుకుంటున్నాయి. దీంతో రాజకీయ వేడి రాజుకుంటుంది.…

5 hours ago

భోగాపురం టూ సింగపూర్… బాబు గారి దిల్ ఖుష్

విజ‌య‌న‌గ‌రం జిల్లాలోని భోగాపురంలో అధునాతన వ‌స‌తుల‌తో నిర్మించిన అల్లూరి సీతారామ‌రాజు అంత‌ర్జాతీయ గ్రీన్ ఫీల్డ్ విమానాశ్ర‌యం కార్య‌కలాపాలు ఆదివారం అర్ధ‌రాత్రి…

8 hours ago