ఏపీలో జరుగుతున్న లోక్ సభ, శాసనసభ ఎన్నికల్లో పోటీ చేయబోతున్న కాంగ్రెస్ అభ్యర్థుల తొలి జాబితా విడుదలయింది. అభ్యర్థుల జాబితాను ఏఐసీసీ విడుదల చేసింది. 114 అసెంబ్లీ, 5 లోక్ సభ అభ్యర్థులతో తొలి జాబితాను ప్రకటించారు. కడప లోక్ సభ స్థానం నుంచి షర్మిల పోటీ చేస్తున్నారు. కర్నూలు ఎంపీ అభ్యర్థిగా రాంపుల్లయ్య యాదవ్, రాజమండ్రి ఎంపీ అభ్యర్థిగా గిడుగు రుద్రరాజు, బాపట్ల ఎంపీ అభ్యర్థిగా ఎంపీ జేడీ శీలం, కాకినాడ ఎంపీ అభ్యర్థిగా పల్లంరాజుల పేర్లు ప్రకటించారు.
వీరిలో కడప, బాపట్ల, కాకినాడ ఎంపీ స్థానాలకు అభ్యర్థులుగా ఎంపికైన వారు.. బలమైన నాయకులు కావడం గమనార్హం. కడప నుంచి పోటీ చేయనున్న షర్మిల వైఎస్ కుటుంబానికి చెందిన నాయకురాలిగా.. పైగా వైఎస్ వారసురాలిగా ఇక్కడ బలమైన పోటీ ఇవ్వనున్నారు. ముఖ్యంగా వైఎస్ వివేకానంద రెడ్డి కుటుంబం.. ఆమెకు మద్దతు ఇస్తోంది. దీంతో కడప పార్లమెంటు స్థానంలో హోరా హోరీ పోరు తప్పేలా లేదు.
ఇక, బాపట్ల నుంచి బరిలోకి దిగుతున్న జేడీ శీలం కూడా.. సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి.. ఒక ప్పుడు బాపట్ల నుంచే ఆయన విజయం దక్కించుకున్నారు. ఎస్సీ నేతగా, వివాదరహిత నాయకుడిగా కూడా ఆయనకు పేరుంది. అమరావతి రాజధానికి ఆయన మద్దతు తెలిపారు. ఇక, కాకినాడ ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్న పల్లంరాజు కూడా బలమైన నాయకుడు. ఆర్థికంగా కూడా ఆయన బలంగానే ఉన్నారు. ఇక, సామాజిక వర్గం పరంగా కూడా ఆయనకు ఫాలోయింగ్ ఉంది. ఎలా చూసుకున్నా.. ఈ మూడు స్థానాల్లో టఫ్ ఫైట్ తప్పుదు.
This post was last modified on April 2, 2024 3:22 pm
తను స్వతహాగా రష్యన్ అయినా.. పుట్టి పెరిగింది రష్యాలోనే అయినా.. పవన్ కళ్యాణ్ను పెళ్లి చేసుకున్నాక పూర్తిగా ఒక తెలుగింటి…
జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ మధ్య ఎంత స్నేహం ఉందో తెలిసిందే. ఆర్ఆర్ఆర్ షూటింగ్, ప్రమోషన్స్ టైంలో కనిపించినంతగా ఇప్పుడు…
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో చాలామంది హాలీవుడ్ సినిమాల నుంచి స్ఫూర్తి పొంది కథలు, సన్నివేశాలు తీర్చిదిద్దుకున్న వాళ్లే. ఇప్పుడు ఇండియా…
అక్కినేని నాగేశ్వరరావు మనవడు సుమంత్ను చూస్తే పెద్ద స్టార్ కావడానికి అవసరమైన అన్ని లక్షణాలు ఉన్నట్లే కనిపిస్తాడు. ఆరడుగుల ఆజానుబాహుడు,…
పోలవరం జిల్లా ఈర్లపల్లి గ్రామానికి చెందిన 10వ తరగతి విద్యార్ధిని ముర్రం శివాని ఆత్మహత్య చేసుకుంది. దీనికి సంబంధించిన కారణాలు…
తెలంగాణలో ఆక్రమ కట్టడాలకు సింహ స్వప్నంగా మారిన హైడ్రా విధానంపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. తమ మాటంటే హైడ్రాకు…