Political News

జనసేనాని స్ట్రైక్ రేట్ వ్యూహం వెనుక అసలు కథ ఇదీ.!


ఎన్ని సీట్లు తీసుకున్నామన్నది కాదు.. ఎంత స్ట్రైక్ రేట్‌తో అభ్యర్థుల్ని గెలిపించుకున్నామన్నదే ముఖ్యమని కొన్నాళ్ళ క్రితం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పార్టీ శ్రేణులతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. అప్పటికి టీడీపీ – జనసేన మధ్య సీట్ల పంపిణీపై చర్చలు ఓ కొలిక్కి రాలేదు.

60 సీట్లకు పైనే టీడీపీ నుంచి జనసేన తీసుకుంటుందనే ప్రచారం జరుగుతున్న రోజులవి. కట్ చేస్తే, జనసేనకు కూటమి నుంచి దక్కిన సీట్లు కేవలం 21 మాత్రమే. ఇవి అసెంబ్లీ సీట్లు. రెండు ఎంపీ సీట్లు కూడా జనసేనకు దక్కాయి. వాస్తవానికి తొలుత అనుకున్నది 24 అసెంబ్లీ, మూడు లోక్ సభ సీట్లు.

బీజేపీ పొత్తులోకి రావడంతో, జనసేన మూడు అసెంబ్లీ, ఓ లోక్ సభ సీటుని త్యాగం చేయాల్సి వచ్చింది. సరే, అది పంపకాల క్రమంలో జరిగే సర్దుబాట్ల వ్యవహారం. అది వేరే చర్చ. ఇంతకీ, ఈ స్ట్రైక్ రేట్ వ్యవహారమేంటి.? అభ్యర్థుల ఎంపికలో, జనసేనాని వ్యూహాలు ఎలా వున్నాయి.?

ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలకే ఎక్కువగా జనసేనాని సీట్లు కేటాయించారు. సందీప్ పంచకర్లకు సీటు దక్కలేదు.. పోతిన మహేష్ కూడా టిక్కెట్ దక్కించుకోలేకపోయారు. చెప్పుకుంటూ పోతే లిస్టు పెద్దదే. చివరి నిమిషం వరకూ వల్లభనేని బాలశౌరి టిక్కెట్ కోసం ఎదురుచూడాల్సి వచ్చింది.

చివరి నిమిషంలో పార్టీలో చేరుతున్న నేతలకు, పిలిచి జనసేనాని టిక్కెట్లు ఇస్తుండడం అందర్నీ విస్మయానికి గురిచేస్తోంది. అయితే, ఇదంతా స్ట్రైక్ రేట్ కోణంలో చేస్తున్న వ్యూహాత్మ రాజకీయమని జనసేన పార్టీ నుంచి అందుతున్న అత్యంత విశ్వసనీయ సమాచారం.

ముందైతే, ఓటు బ్యాంకుని చూపించుకోవాలి.. అంటే, ఓట్ల శాతం. జనసేన పార్టీకి శాశ్వత ఎన్నికల గుర్తింపుకి ఇది అత్యంత కీలకం. ఓట్ల శాతం, సీట్లు.. ఇవన్నీ జనసేనాని ‘స్ట్రైక్ రేట్’ ఆలోచనలకు తగ్గట్టుగా వుంటే, ఎన్నికల తర్వాత జనసేన పార్టీ అత్యంత వేగంగా బలం పుంజుకోనుందన్నది రాజకీయ విశ్లేషకుల అంచనా.

ఇదే విషయాన్ని టిక్కెట్ ఆశించి భంగపడ్డ నేతలతో జనసేనాని పవన్ కళ్యాణ్ చెబుతూ వస్తున్నారట.

This post was last modified on April 2, 2024 3:05 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

`ఏఐ`లో ఏపీ దూకుడు.. పార్ల‌మెంటు సాక్షిగా కేంద్రం!

ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉంద‌ని కేంద్ర ప్ర‌భుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్ప‌త్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…

41 minutes ago

అధికారంలో ఉన్నాం ఆ తమ్ముళ్ల బాధే వేరుగా ఉందే…!

అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…

3 hours ago

డాలర్లు, మంచి లైఫ్ కోసం విదేశాలకు వెళ్ళాక నిజం తెలిసింది

డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…

6 hours ago

జగన్ ఇలానే ఉండాలంటూ టీడీపీ ఆశీస్సులు

వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవ‌రినీ దెబ్బతీయరు.…

9 hours ago

టీం ఇండియా ఇప్పటికైన ఆ ప్లేయర్ ను ఆడిస్తుందా?

రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…

9 hours ago

చరిత్ర ఎన్నోసార్లు హెచ్చరిస్తూనే ఉంది

కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…

12 hours ago