ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల.. ప్రస్తుత పార్లమెంటు ఎన్నికల్లో కడప నుంచి పోటీ చేయడం ఖాయమైంది. దీనికి ఇక అధికారిక ప్రకటనే తరువాయి. దీంతో తొలిసారి కడపలో రెండు వైఎస్ కుటుంబాలే పోటీ చేసు కుంటున్న పరిస్థితి నెలకొంది. నిజానికి ఇప్పటి వరకు వైఎస్ కుటుంబం అంటే.. కడపకు కంచుకోట. అలాంటి కుటుంబంలో ఎప్పుడూ రెండు పక్షాలు తెరమీదికి వచ్చింది లేదు. కానీ, తొలిసారి వైఎస్ కుటుం బ చరిత్రలో కడప సీటు హాట్ హాట్గానే కాదు.. సలసల మరిగే పరిస్థితి నెలకొంది.
ప్రస్తుతం కడప పార్లమెంటు ఎంపీగా వైఎస్ అవినాష్ రెడ్డి ఉన్నారు. ఈయన వరుసకు షర్మిలకు తమ్ము డు అవుతాడు. వీరంతా ఒకే వంశ వృక్షానికి చెందిన వారు. పైగా వైఎస్ కుటుంబానికి చెందిన వారే. ఈ నేపథ్యంలో షర్మిల పోటీ ఇక్కడ ఆసక్తిగా మారింది. కడప నుంచి ఆమె గెలుపు గుర్రం ఎక్కుతారా? లేదా? అనేది కీలక పరిణామంగా కూడా మారింది. వైఎస్ వివేకానందరెడ్డి హత్య వెనుక అవినాష్ రెడ్డి ఉన్నాడనే ది సీబీఐ కూడా చెబుతున్న మాట.
దీనిని ఇక్కడివారు ఎంత వరకు నమ్ముతున్నారనేది ఎన్నికల్లో తేలిపోతుంది. ఒకవేళ అవినాష్రెడ్డి గెలు పుగుర్రం ఎక్కితే.. వివేకా హత్య పరిణామాలపైనా ప్రభావం పడుతుంది. ఇదిలావుంటే.. షర్మిల పోటీతో కీలకమైన ఏడు నియోజకవర్గాలపై ప్రభావం పడుతుందనేది కూడా వాస్తవం. కడప పార్లమెంటు పరిధిలో బద్వేల్, కడప, పులివెందుల, కమలాపురం, జమ్మలమడుగు, ప్రొద్దుటూరు, మైదుకూరు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి.
ఈ నియోజకవర్గాలన్నీ కూడా వైసీపీకే కాదు.. ఈ నియోజకవర్గాల నుంచి బరిలో నిలిచిన ఆ పార్టీ నాయకు లకు కూడా శత్రుదుర్భేద్యాలు. పైగా కమలాపురం వంటి నియోజకవర్గంలో షర్మిల సొంత మేనమామ రవీంద్రనాథ్రెడ్డి(విజయమ్మ తమ్ముడు) పోటీలో ఉన్నారు. ఇలాంటి కడప పార్లమెంటు స్థానంలో వైఎస్ షర్మిలను ఇక్కడి ప్రజలు నమ్మినా.. ఆమె విషయంలో సానుబూతి చూపించినా.. ఈ ఏడు నియోజకవర్గాల్లోనూ వైసీపీ చిత్తుగా ఓడిపోతుంది. ఇందులో డౌట్లేదు.
కానీ, నమ్మక పోతే.. రెండు రకాలుగా వైసీపీకి లాభం. వివేకా హత్య వెనుక వైసీపీ నాయకులు ఉన్నారన్న వాదనను ప్రజలు అంగీకరించలేదనే బలమైన సంకతాలు ఇవ్వడంతో పాటు.. వైఎస్ షర్మిల రాజకీయ భవితవ్యానికి కూడా పెద్ద గండి ఏర్పడేలా చేస్తుంది. అంతేకాదు.. షర్మిల తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్నందున ఆమెకు మరింత ఇబ్బందిగా కూడా మారుతుంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.
This post was last modified on April 2, 2024 10:25 am
2009లో అవతార్ సినిమా రిలీజైనపుడు వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ ఎలా షేక్ అయిపోయిందో తెలిసిందే. అప్పటిదాకా ఉన్న అన్ని బాక్సాఫీస్…
ఉప్పెన సినిమా చేసే సమయానికి కృతి శెట్టి వయసు కేవలం 17 ఏళ్లే. అంత చిన్న వయసులోనే ఆమె భారీ…
ఒకప్పుడు అప్పు చేయాలంటే భయపడేవాళ్లు, అది అవసరానికి మాత్రమే తీసుకునేవాళ్లు. కానీ ఇప్పుడు సీన్ మారింది. అప్పు చేయడం తప్పు…
కూలీ సినిమా విడుదలకు ముందు దర్శకుడు లోకేష్ కనకరాజ్ భవిష్యత్ ప్రాజెక్టుల గురించి ఎంత చర్చ జరిగిందో.. ఎన్ని ఊహాగానాలు…
అఖిల్ కెరీర్ను మార్చేస్తుందని.. అతడిని పెద్ద స్టార్ను చేస్తుందని అక్కినేని అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్న సినిమా.. ఏజెంట్. అతనొక్కడే,…
పెట్టుబడులు తీసుకురావడమే లక్ష్యంగా ఏపీ మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అమెరికా సహా పొరుగున ఉన్న…