Political News

వ‌లంటీర్ల నిషేధంపై చంద్ర‌బాబు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

ఏపీలో ప్ర‌భుత్వ కార్య‌క్ర‌మాల‌కు, పింఛ‌న్ల పంపిణీ స‌హా ఇత‌ర ఏ కార్య‌క్ర‌మాల‌కైనా వ‌లంటీర్ల‌ను వినియోగిం చ‌రాదంటూ.. కేంద్ర ఎన్నిక‌ల సంఘం ఉత్త‌ర్వులు జారీ చేసింది. ఇప్ప‌టికే రాష్ట్ర వ్యాప్తంగా వ‌లంటీర్లు త‌మ ఫోన్ల‌ను, వేలిముద్ర‌లు తీసుకునే డివైజ్‌ల‌ను అధికారుల‌కు అప్ప‌గించేశారు. ఈ ప‌రిణామాల‌పై చంద్ర‌బాబు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

ఏపీలో ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున రేపు (ఏప్రిల్ 1) నెలవారీ పింఛన్లు ఇస్తారా, లేదా? అనే అంశంపై ప్రజల్లో ఆందోళన నెలకొందన్నారు. అయితే, కేంద్ర ఎన్నికల సంఘం ఏపీ ప్రజలకు ఊరటనిచ్చింది. పెన్షన్ల పంపిణీకి తమకేమీ అభ్యంతరం లేదని, అయితే, పెన్షన్లు అందించేందుకు వాలంటీర్లను వినియోగించవద్దని స్పష్టం చేసిందని చంద్ర‌బాబు అన్నారు.

ఈసీ నిర్ణయంపై రాష్ట్ర సీఎస్, రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారికి లేఖ రాశారు. వాలంటీర్లతో పెన్షన్ల పంపిణీకి కేంద్ర ఎన్నికల సంఘం అభ్యంతరాలు తెలిపిన నేపథ్యంలో… ఏపీలో పెన్షన్ల పంపిణీకి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని చంద్రబాబు కోరారు. లబ్ధిదారులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా, డోర్ టు డోర్ విధానంలో పెన్షన్ లు అందించేలా ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ప్రభుత్వ ఖజానాలో నిధులు లేని కారణంగా పెన్షన్ల పంపిణీ నిలిచిపోకూడదని చంద్రబాబు పేర్కొన్నారు. ప్రభుత్వం వెంటనే అవసరమైన నిధులు కేటాయించి పెన్షన్ల పంపిణీ పూర్తి చేయాలని తెలిపారు.

మార్కాపురం జిల్లా ఏర్పాటు చేస్తాం!

బీజేపీ-జ‌న‌సేన‌-టీడీపీ కూట‌మి అధికారంలోకి వచ్చాక మార్కాపురం కేంద్రంగా కొత్త జిల్లాను ప్రకటిస్తామని చంద్ర‌బాబు హామీ ఇచ్చారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో ప్రకాశం జిల్లాలో అనేక అభివృద్ధి పనులు చేపట్టామని, రామాయపట్నం పోర్టుకు అన్ని అనుమతులు తెచ్చామని వెల్లడించారు. కానీ వైసీపీ ప్రభుత్వం వచ్చాక రామాయపట్నం పోర్టు పనులు ఆగిపోయాయని ఆరోపించారు. జిల్లాలో సుబాబుల్ ఎక్కువగా పండిస్తారని ఏషియన్ పల్ప్ పరిశ్రమను తెచ్చానని, వైసీపీ ప్రభుత్వం వచ్చాక ఏషియన్ పల్ప్ పరిశ్రమ పారిపోయిందని తెలిపారు. నవరత్నాలు అని చెప్పి నవ మోసాలు చేశారని మండిపడ్డారు.

This post was last modified on April 1, 2024 2:15 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

రెహమాన్ నిజంగా లైవ్ ఇస్తున్నారా

పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…

5 hours ago

4 ల‌క్ష‌ల క‌లెక్షన్… థియేట‌ర్‌కు 10 వేలు

తెలంగాణ‌లోని సింగిల్ థియేట‌ర్ల‌లో అద్దె విధానానికి స్వ‌స్తి ప‌లికి ప‌ర్సంటేజీ ప‌ద్ధ‌తిని తీసుకురావాల‌ని ఇక్క‌డి ఎగ్జిబిట‌ర్లు ఎప్ప‌ట్నుంచో డిమాండ్ చేస్తూ…

6 hours ago

స్నాక్ ప్యాకెట్లకు కలర్ కరువైంది

తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…

6 hours ago

సూపర్ నిర్ణయం… GO వచ్చినా పాత రేట్లే

తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…

8 hours ago

నానితో క్లాష్… మెగాస్టార్ ఒప్పుకోరేమో

అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…

8 hours ago

పెద్ది మెడకు పర్సెంటేజ్ గొడవ

తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…

10 hours ago