Political News

ఇద్ద‌రు మ‌హిళ‌లు త‌ల‌ప‌డుతున్న ఏకైక నియోజ‌క‌వ‌ర్గం!

ఏపీలో 175 అసెంబ్లీ స్థానాలు ఉంటే.. వైసీపీ నుంచి మ‌హిళ‌లు ప‌లు స్థానాల్లో పోటీ చేస్తున్నారు. ఇక‌, టీడీపీ కూటమి నుంచి కూడా.. ప‌లువురు మ‌హిళ‌లు మ‌రికొన్ని స్థానాల్లో పోటీ చేస్తున్నారు. కానీ, ఒకే నియోజ‌క‌వ‌ర్గం లో అటు వైసీపీ నుంచి, ఇటు కూట‌మి నుంచి కేవ‌లం ఇద్ద‌రూ మ‌హిళ‌లే పోటీ చేస్తున్న ఏకైక నియోజ‌క‌వ‌ర్గం గుంటూరు వెస్ట్‌. ఇత‌ర నియోజ‌క‌వ‌ర్గాల్లో పురుష అభ్య‌ర్థుల‌పై మ‌హిళ‌లు, మ‌హిళా అభ్య‌ర్థుల‌పై పురుషులు పోటీ చేస్తున్న నియోజ‌క‌వ‌ర్గాలు ఉన్నాయి.

ప‌త్తికొండ‌(కంగాటి శ్రీదేవి-కేఈ శ్యాంబాబు), పాత‌ప‌ట్నం(రెడ్డి శాంతి-గోవిందు), న‌గ‌రి(రోజా-గాలి భాను ప్ర‌కాష్‌), మంగ‌ళ‌గిరి(లావ‌ణ్య‌-నారా లోకేష్‌), పిఠాపురం(వంగా గీత‌-ప‌వ‌న్ క‌ల్యాణ్‌) వంటివి ఈ కోవ‌లోకే వ‌స్తాయి. అయితే.. గుంటూరు వెస్ట్ నుంచి మాత్రం.. వైసీపీ నుంచి మంత్రి విడ‌ద‌ల ర‌జ‌నీ, టీపీపీ కూట‌మి నుంచి పిడుగురాళ్ల మాధ‌వి పోటీ చేస్తున్నారు. దీంతో ఈ నియోక‌వ‌ర్గం హాట్ టాపిక్ అయింది. ఇద్ద‌రూ కూడా.. ఒకే సామాజికవ‌ర్గానికి(ర‌జ‌కులు) చెందిన వారు. భ‌ర్త‌లు వేర్వేరు సామాజిక వ‌ర్గాల‌కు చెందిన వారు.

పైగా గుంటూరు వెస్ట్ జ‌న‌ర‌ల్ నియోజ‌క‌వ‌ర్గం. అయితే.. వ్యూహాత్మకంగా ఈ టికెట్‌ను వైసీపీ బీసీ నాయ‌కురా లు, మంత్రి ర‌జ‌నీకి కేటాయించింది. ఇక‌, టీడీపీ కూడా.. స్థానిక నేత అయిన మాధ‌వికి ఇచ్చింది. వీరిద్ద‌రూ ఇప్ప‌డు ఇక్క‌డ హోరా హోరీ ప్ర‌చారం చేసుకుంటున్నారు. ర‌జ‌నీ వాస్త‌వానికి చిల‌క‌లూరిపేట నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు. అక్క‌డ ఓడిపోతార‌నే ఉద్దేశంతో వైసీపీ ఆమెను గుంటూరు వెస్ట్‌కు కేటాయించింది. ఇక‌, మాధ‌వి తొలి సారి రాజ‌కీయ‌ల్లోకి వ‌చ్చిన వైద్య వ్యాపారంలో ఉన్న వ్య‌క్తి.

ఇద్ద‌రూ ఉన్న‌త విద్యావంతులే కావ‌డం, ఆర్థికంగా బ‌లంగా ఉన్న వారే కావ‌డం గ‌మ‌నార్హం. ఇదేస‌మ‌యం లో ఇద్ద‌రికీ వారి వారి పార్టీల నుంచి అసంతృప్తి ఎక్కువ‌గానే ఉంది. ఇక్క‌డ నుంచి టికెట్ ఆశించిన వారికి టీడీపీ, వైసీపీలు మొండి చేయి చూపాయి. దీంతో స్థానిక నాయ‌కులు ఆగ్ర‌హంతో ర‌గిలిపోతున్నారు. టికెట్ ప్ర‌క‌టించి.. వారాలు గ‌డిచిపోయినా.. వీరితో మ‌మేకం అయ్యేందుకు, ప్ర‌చారంలో క‌లిసి వ‌చ్చేందుకు నాయ‌కులు ముందుకు రావ‌డం లేదు. అయినా.. ఈ ఇద్ద‌రు మ‌హిళా నేత‌లు ప్ర‌చారం లో దూసుకుపోతున్నారు. దీంతో ఎవ‌రు గెలుస్తారు? ఎవ‌రు ఓడుతారు? అనేది ఆస‌క్తిగా మారింది.

This post was last modified on April 1, 2024 6:55 am

Share

Recent Posts

మమిత బైజు – వయసు తక్కువా… హిట్లు ఎక్కువ!

ఇటీవలే విడుదలైన విశ్వనాథ్ అండ్ సన్స్ లో మమిత బైజు పోషించిన పాత్ర ఆ సినిమా విజయంలో ఎంత కీలక…

16 minutes ago

కేరళం ప్రకృతి వైద్యానికి పవన్ ప్రాధాన్యత

ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రకృతి చికిత్స కోసం శుక్రవారం కేరళం బయలుదేరి వెళ్లనున్నారు. 20 రోజుల పాటు కేరళంలోనే…

21 minutes ago

మల్లెపూల పల్లకి… ఊగుతున్న థియేటర్లు

ఇవాళ విడుదలైన ఇరుముడికి సర్వత్రా పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. చాలా చోట్ల హౌస్ ఫుల్ బోర్డులు కనిపిస్తున్నాయి. అన్ని సెంటర్ల…

2 hours ago

శాశ్వత సెలవు తీసుకున్న షావుకారు జానకి

దక్షిణాది లెజండరీ నటీనటులు ఇటీవలి కాలంలో కన్ను మూయడం సినీ ప్రియులను బాధిస్తోంది. భాగ్యరాజ్ గారి హఠాన్మరణం ఇంకా మర్చిపోక…

3 hours ago

సింగిల్ సింహం అంటారు… ఇదేం రాజకీయం జగన్?

ప్రచార హోరులో తానే సింగిల్ సింహం అని, కృష్ణుడిని, అర్జునుడిని అంటూ గొప్పలు చెప్పుకోవడం రాజకీయాల్లో సాధారణమే. కానీ, ప్రజాసమస్యలపై…

4 hours ago

వివేకా కేసులో ముగియని సునీత పోరాటం

వివేకా హత్య కేసు విచారణ ఏళ్ల తరబడి కొనసాగుతున్న వైనంపై వివేకా తనయురాలు సునీత అసహనం వ్యక్తం చేస్తున్న సంగతి…

4 hours ago