ఏపీలో 175 అసెంబ్లీ స్థానాలు ఉంటే.. వైసీపీ నుంచి మహిళలు పలు స్థానాల్లో పోటీ చేస్తున్నారు. ఇక, టీడీపీ కూటమి నుంచి కూడా.. పలువురు మహిళలు మరికొన్ని స్థానాల్లో పోటీ చేస్తున్నారు. కానీ, ఒకే నియోజకవర్గం లో అటు వైసీపీ నుంచి, ఇటు కూటమి నుంచి కేవలం ఇద్దరూ మహిళలే పోటీ చేస్తున్న ఏకైక నియోజకవర్గం గుంటూరు వెస్ట్. ఇతర నియోజకవర్గాల్లో పురుష అభ్యర్థులపై మహిళలు, మహిళా అభ్యర్థులపై పురుషులు పోటీ చేస్తున్న నియోజకవర్గాలు ఉన్నాయి.
పత్తికొండ(కంగాటి శ్రీదేవి-కేఈ శ్యాంబాబు), పాతపట్నం(రెడ్డి శాంతి-గోవిందు), నగరి(రోజా-గాలి భాను ప్రకాష్), మంగళగిరి(లావణ్య-నారా లోకేష్), పిఠాపురం(వంగా గీత-పవన్ కల్యాణ్) వంటివి ఈ కోవలోకే వస్తాయి. అయితే.. గుంటూరు వెస్ట్ నుంచి మాత్రం.. వైసీపీ నుంచి మంత్రి విడదల రజనీ, టీపీపీ కూటమి నుంచి పిడుగురాళ్ల మాధవి పోటీ చేస్తున్నారు. దీంతో ఈ నియోకవర్గం హాట్ టాపిక్ అయింది. ఇద్దరూ కూడా.. ఒకే సామాజికవర్గానికి(రజకులు) చెందిన వారు. భర్తలు వేర్వేరు సామాజిక వర్గాలకు చెందిన వారు.
పైగా గుంటూరు వెస్ట్ జనరల్ నియోజకవర్గం. అయితే.. వ్యూహాత్మకంగా ఈ టికెట్ను వైసీపీ బీసీ నాయకురా లు, మంత్రి రజనీకి కేటాయించింది. ఇక, టీడీపీ కూడా.. స్థానిక నేత అయిన మాధవికి ఇచ్చింది. వీరిద్దరూ ఇప్పడు ఇక్కడ హోరా హోరీ ప్రచారం చేసుకుంటున్నారు. రజనీ వాస్తవానికి చిలకలూరిపేట నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు. అక్కడ ఓడిపోతారనే ఉద్దేశంతో వైసీపీ ఆమెను గుంటూరు వెస్ట్కు కేటాయించింది. ఇక, మాధవి తొలి సారి రాజకీయల్లోకి వచ్చిన వైద్య వ్యాపారంలో ఉన్న వ్యక్తి.
ఇద్దరూ ఉన్నత విద్యావంతులే కావడం, ఆర్థికంగా బలంగా ఉన్న వారే కావడం గమనార్హం. ఇదేసమయం లో ఇద్దరికీ వారి వారి పార్టీల నుంచి అసంతృప్తి ఎక్కువగానే ఉంది. ఇక్కడ నుంచి టికెట్ ఆశించిన వారికి టీడీపీ, వైసీపీలు మొండి చేయి చూపాయి. దీంతో స్థానిక నాయకులు ఆగ్రహంతో రగిలిపోతున్నారు. టికెట్ ప్రకటించి.. వారాలు గడిచిపోయినా.. వీరితో మమేకం అయ్యేందుకు, ప్రచారంలో కలిసి వచ్చేందుకు నాయకులు ముందుకు రావడం లేదు. అయినా.. ఈ ఇద్దరు మహిళా నేతలు ప్రచారం లో దూసుకుపోతున్నారు. దీంతో ఎవరు గెలుస్తారు? ఎవరు ఓడుతారు? అనేది ఆసక్తిగా మారింది.
This post was last modified on April 1, 2024 6:55 am
ఇంకో ముప్పై నాలుగు రోజుల్లో మలయాళం దృశ్యం 3 విడుదల కానుంది. ఈ భాగంతో కథకు ముగింపు ఇవ్వబోతున్నారు. కొడుకు…
మంత్రి నారా లోకేష్ తన సహృదయత చాటుకున్నారు. ఎస్ఎంఏ టైప్–1 అనే అరుదైన జన్యు వ్యాధితో పోరాడుతున్న కర్నూలుకు చెందిన…
జూనియర్ ఎన్టీఆర్, దర్శకుడు ప్రశాంత్ నీల్ కలయికలో తెరకెక్కుతున్న డ్రాగన్ (ప్రచారంలో ఉన్న టైటిల్) షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ కు…
సెలబ్రిటీలు చిన్న వాళ్ళైనా పెద్దోళ్ళయినా ఏదైనా మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి ఉందిప్పుడు. సోషల్ మీడియా జమానాలో చిన్న టంగ్…
అభిమానుల్లోనే కాదు సినీ ప్రియుల్లోనూ విపరీతమైన అంచనాలు మోస్తున్న సినిమా పెద్ది. చికిరి చికిరి ఛార్ట్ బస్టర్ పుణ్యమాని హిందీలోనూ…
హైదరాబాద్లోని పంజాగుట్ట పోలీసులు యూట్యూబర్ అన్వేష్ (నా అన్వేషణ)పై లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ప్రస్తుతం అన్వేష్ విదేశాల్లో ఉన్నారని…