వైసీపీ ప్రభుత్వంపై మాజీ సీఎం, బీజేపీ నాయకుడు నల్లారి కిరణ్కుమారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రా లిక్కర్ స్కాం ముందు ఢిల్లీలో వెలుగుచూసిన లిక్కర్ కుంభకోణం బలాదూర్ అని వ్యాఖ్యానించారు. తాజా పార్లమెంటు ఎన్నికల్లో కిరణ్ కుమార్ రెడ్డి.. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని రాజంపేట నియోజకవర్గం నుంచి బీజేపీ టికెట్పై ఉమ్మడి మిత్రపక్షాల అభ్యర్థిగా రంగంలోకి దిగారు. ఈ క్రమంలో ఆయన గత రెండు రోజులుగా ఇక్కడే పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.
ఢిల్లీలో గత ఏడాది వెలుగు చూసిన లిక్కర్ కుంభకోణంలో ఆ రాష్ట్రం సీఎం, ఆప్ నేత అరవింద్ కేజ్రీవాల్ అరెస్టయిన విషయం తెలిసిందే. ఇక, ఇదే కేసులో తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె కవిత ప్రస్తుతం తీహార్ జైల్లో ఉన్నారు. వీటిని ప్రస్తావిస్తూ.. కిరణ్ కుమార్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. “ఆంధ్రా లిక్కర్ స్కాం ముందు ఢిల్లీ లిక్కర్ స్కాం బలాదూర్” అని కిరణ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యానించారు.
ఇక, మంత్రి, సీనియర్ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై విమర్శలు గుప్పించారు. “చిన్న చిన్న కాంట్రాక్టులతో పెద్దిరెడ్డి కుటుంబం ప్రస్థానం మొదలుపెట్టింది. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మిథున్ రెడ్డి రాజకీయాలను డబ్బు సంపాదన కోసమే పూర్తిగా వినియోగించుకుంటున్నారు. ఈ పదేళ్లలో ప్రభుత్వ ధనాన్ని, ప్రజల ధనాన్ని లూటీ చేయడం తప్ప వీళ్లు చేసిందేమీ లేదు. రాజకీయాన్ని ఒక వ్యాపారంలా తయారుచేశారు“ అని కిరణ్ నిప్పులు చెరిగారు.
మిథున్రెడ్డి కౌంటర్
మాజీ సీఎం కిరణ్కు సిట్టింగ్ ఎంపీ, వైసీపీనేత మిథున్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. ఒకాయన పదేళ్ల తర్వాత హైదరాబాద్ నుంచి ఎంపీగా పోటీ చేయడానికి సూట్ కేసుతో వచ్చారు జూన్ 4 తర్వాత మళ్లీ అదే సూట్ కేసుతో హైదరాబాద్ తిరిగి వెళ్లేలా ప్రజలు తీర్పు ఇస్తారు అని సిట్టింగ్ ఎంపీ మిథున్ రెడ్డి స్పష్టం చేశారు. అంతేకాదు.. మదనపల్లె, పీలేరు, పుంగనూరు ప్రాంతాల్లో ముస్లింలు ఎక్కువమంది ఉన్నారని, ఇలాంటి పరిస్థితుల్లో కిరణ్కి సానుభూతితో ఓటు వేసినా అది బీజేపీకి ఓటు వేసినట్టేనని అన్నారు.
This post was last modified on April 1, 2024 6:51 am
2009లో అవతార్ సినిమా రిలీజైనపుడు వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ ఎలా షేక్ అయిపోయిందో తెలిసిందే. అప్పటిదాకా ఉన్న అన్ని బాక్సాఫీస్…
ఉప్పెన సినిమా చేసే సమయానికి కృతి శెట్టి వయసు కేవలం 17 ఏళ్లే. అంత చిన్న వయసులోనే ఆమె భారీ…
ఒకప్పుడు అప్పు చేయాలంటే భయపడేవాళ్లు, అది అవసరానికి మాత్రమే తీసుకునేవాళ్లు. కానీ ఇప్పుడు సీన్ మారింది. అప్పు చేయడం తప్పు…
కూలీ సినిమా విడుదలకు ముందు దర్శకుడు లోకేష్ కనకరాజ్ భవిష్యత్ ప్రాజెక్టుల గురించి ఎంత చర్చ జరిగిందో.. ఎన్ని ఊహాగానాలు…
అఖిల్ కెరీర్ను మార్చేస్తుందని.. అతడిని పెద్ద స్టార్ను చేస్తుందని అక్కినేని అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్న సినిమా.. ఏజెంట్. అతనొక్కడే,…
పెట్టుబడులు తీసుకురావడమే లక్ష్యంగా ఏపీ మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అమెరికా సహా పొరుగున ఉన్న…