వైసీపీ ప్రభుత్వంపై మాజీ సీఎం, బీజేపీ నాయకుడు నల్లారి కిరణ్కుమారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రా లిక్కర్ స్కాం ముందు ఢిల్లీలో వెలుగుచూసిన లిక్కర్ కుంభకోణం బలాదూర్ అని వ్యాఖ్యానించారు. తాజా పార్లమెంటు ఎన్నికల్లో కిరణ్ కుమార్ రెడ్డి.. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని రాజంపేట నియోజకవర్గం నుంచి బీజేపీ టికెట్పై ఉమ్మడి మిత్రపక్షాల అభ్యర్థిగా రంగంలోకి దిగారు. ఈ క్రమంలో ఆయన గత రెండు రోజులుగా ఇక్కడే పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.
ఢిల్లీలో గత ఏడాది వెలుగు చూసిన లిక్కర్ కుంభకోణంలో ఆ రాష్ట్రం సీఎం, ఆప్ నేత అరవింద్ కేజ్రీవాల్ అరెస్టయిన విషయం తెలిసిందే. ఇక, ఇదే కేసులో తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె కవిత ప్రస్తుతం తీహార్ జైల్లో ఉన్నారు. వీటిని ప్రస్తావిస్తూ.. కిరణ్ కుమార్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. “ఆంధ్రా లిక్కర్ స్కాం ముందు ఢిల్లీ లిక్కర్ స్కాం బలాదూర్” అని కిరణ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యానించారు.
ఇక, మంత్రి, సీనియర్ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై విమర్శలు గుప్పించారు. “చిన్న చిన్న కాంట్రాక్టులతో పెద్దిరెడ్డి కుటుంబం ప్రస్థానం మొదలుపెట్టింది. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మిథున్ రెడ్డి రాజకీయాలను డబ్బు సంపాదన కోసమే పూర్తిగా వినియోగించుకుంటున్నారు. ఈ పదేళ్లలో ప్రభుత్వ ధనాన్ని, ప్రజల ధనాన్ని లూటీ చేయడం తప్ప వీళ్లు చేసిందేమీ లేదు. రాజకీయాన్ని ఒక వ్యాపారంలా తయారుచేశారు“ అని కిరణ్ నిప్పులు చెరిగారు.
మిథున్రెడ్డి కౌంటర్
మాజీ సీఎం కిరణ్కు సిట్టింగ్ ఎంపీ, వైసీపీనేత మిథున్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. ఒకాయన పదేళ్ల తర్వాత హైదరాబాద్ నుంచి ఎంపీగా పోటీ చేయడానికి సూట్ కేసుతో వచ్చారు జూన్ 4 తర్వాత మళ్లీ అదే సూట్ కేసుతో హైదరాబాద్ తిరిగి వెళ్లేలా ప్రజలు తీర్పు ఇస్తారు అని సిట్టింగ్ ఎంపీ మిథున్ రెడ్డి స్పష్టం చేశారు. అంతేకాదు.. మదనపల్లె, పీలేరు, పుంగనూరు ప్రాంతాల్లో ముస్లింలు ఎక్కువమంది ఉన్నారని, ఇలాంటి పరిస్థితుల్లో కిరణ్కి సానుభూతితో ఓటు వేసినా అది బీజేపీకి ఓటు వేసినట్టేనని అన్నారు.
This post was last modified on April 1, 2024 6:51 am
అమెరికాలో గ్రీన్కార్డ్ కోసం ఎదురుచూస్తున్న కాగ్నిజెంట్ ఉద్యోగులకు మరో సమస్య ఎదురైంది. అమెరికా కార్మిక శాఖ కాగ్నిజెంట్ నుంచి వచ్చే…
ఐక్యరాజ్య సమితి విడుదల చేసిన కొత్త మ్యాప్ వివాదాస్పదంగా మారింది. భారత దేశంలో భాగమైన అరుణాచల్ ప్రదేశ్ ని స్వతంత్ర…
కరోనా సమయంలో ‘‘భలే మంచి ఓటీటీ బేరము’’ అని పాడుకున్నాయి టాలీవుడ్ నిర్మాణ సంస్థలు. మిగతా భాషల చిత్రాలకు కూడా…
రాష్ట్రంలో కూటమి సర్కారు ఏర్పడి రెండున్నరేళ్లు పూర్తయింది. అయితే.. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే మళ్లీ అధికారం ఎవరికి దక్కుతుంది? అనే…
ఏపీ విపక్షం(ప్రధాన కాదు) వైసీపీలో అంతర్గత పోరు ఎక్కువగా సాగుతోంది. దీనికి తోడు.. వైసీపీ అధినేత జగన్కు అత్యంత సన్నిహితంగా…
ఒకటి కాదు.. రెండు కాదు... ఏకంగా వేలు.. లక్షల్లోనే ఉద్యోగాలకు ప్రతిష్టాత్మక సంస్థలు మంగళం పాడుతున్నాయి. ప్రపంచ ప్రఖ్యాత ఫోక్స్…