త్రిశంకు స్వ‌ర్గంలో రాధా.. రాజ‌కీయాలు ష‌ట్‌డౌన్‌!

వంగ‌వీటి రాధా. ఈ పేరు చెబితే చాలు ఆయ‌న‌కు ప‌రిచ‌యం అక్క‌ర్లేదు. అలాంటి నాయ‌కుడు ఇప్పుడు కీల‌క‌మైన ఎన్నిక‌ల వేళ త్రిశంకు స్వ‌ర్గంలో కొట్టుమిట్టాడుతున్నారు. ఆయ‌న ఇప్పుడు అస‌లు ఏ పార్టీలో ఉన్నారో కూడా తెలియ‌ని ప‌రిస్థితి నెల‌కొంది. వాస్త‌వానికి అధికారికంగా ఆయ‌న టీడీపీలోనే ఉన్నారు. కానీ, అలా ఆ పార్టీ క్లెయిమ్ చేసుకోవ‌డంలేదు. అస‌లు పార్టీలో రాధా పేరు త‌లుచుకునేవారు కూడా లేరు. అంతేకాదు.. అస‌లు రాధా గురించిన చ‌ర్చ‌కూడా జ‌ర‌గ‌డం లేదు.

దీనికి కార‌ణం.. ఆయ‌న టీడీపీ నేత‌ల‌తో కాకుండా.. వైసీపీ నాయ‌కుల‌తో రెండేళ్లుగా చెట్టాప‌ట్టాలేసుకుని తిర‌గ‌డ‌మే. ముఖ్యంగా టీడీపీ అధినేత చంద్ర‌బాబుకుటుంబాన్ని దూషించిన మాజీ మంత్రి కొడాలి నాని, ఎమ్మెల్యే వ‌ల్ల‌భ‌నేని వంశీల‌తో ఆయ‌న త‌ర‌చుగా ఫొటోల‌కు ఫోజులిస్తున్నారు. వివిధ కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటున్నారు. దీంతో చంద్ర‌బాబు పైకి చెప్ప‌క‌పోయినా.. ఆయ‌న‌ను పార్టీలో దూరం పెట్టారు. ఇక‌, ఇప్పుడు అసెంబ్లీ ఎన్నిక‌ల వేళ ఆయ‌న టికెట్ అడిగింది లేదు.. పార్టీ ఇచ్చిందీ లేదు.

మ‌రోవైపు జ‌న‌సేన‌లో చేరుతున్నారంటూ.. వంగ‌వీటి రాధాపై ప్ర‌చారం జ‌రిగింది. అది కూడా సాకారం కాలేదు. రెండు రోజుల కింద‌ట మ‌చిలీప‌ట్నం ఎంపీ, కాపు నాయ‌కుడు వ‌ల్ల‌భ‌నేని బాల‌శౌరితో క‌లిసి ప‌లు కార్య‌క్ర‌మాల్లో రాధా పాల్గొన్నారు. దీంతో రాధాకు ఉమ్మ‌డి కృష్ణా జిల్లాలోని అవ‌నిగ‌డ్డ నియోజ‌క‌వ‌ర్గం టికెట్ ఇస్తున్నారంటూ ప్ర‌చారం జ‌రిగింది. వాస్త‌వానికి జ‌న‌సేన‌కు కేటాయించిన 21 స్థానాల్లో నిన్న‌టి వ‌ర‌కు 18 స్థానాలు ప్ర‌క‌టించారు. తాజాగా ఒక స్థానం ప్ర‌క‌టించారు.

మ‌రో రెండు ఖాళీగా ఉన్నాయి. వీటిలో అవ‌నిగ‌డ్డ కూడా ఉంది. అయితే.. అంద‌రూ చెబుతున్న‌ట్టుగా రాధా పేరు అయితే.. జ‌న‌సేన ఎక్క‌డా ప‌రిశీల‌న‌లో తీసుకున్న‌ట్టు క‌నిపించ‌డం లేదు. ఈ సీటును టీడీపీ నాయ‌కుడు, సీనియ‌ర్ నేత మండ‌లి బుద్ధ‌ప్ర‌సాద్‌కు కేటాయించే అవ‌కాశం ఉంద‌ని స‌మాచారం. దీంతో రాధా ప‌రిస్థితి త్రిశంకు స్వ‌ర్గంలో కొట్టుమిట్టాడుతోంది. ఇదే జ‌రిగితే..  రెండు ఎన్నిక‌ల్లో ఆయ‌న‌కు టికెట్ లేకుండా పోయిన‌ట్టు అవుతుంద‌నిప‌రిశీల‌కులు చెబుతున్నారు. రంగా వార‌సుడిగా ఆయ‌న విఫ‌ల‌మ‌య్యార‌ని కాపు నాయ‌కులే చెబుతుండ‌డం గ‌మ‌నార్హం.

Share
Show comments
Published by
Satya

Recent Posts

4 ల‌క్ష‌ల క‌లెక్షన్… థియేట‌ర్‌కు 10 వేలు

తెలంగాణ‌లోని సింగిల్ థియేట‌ర్ల‌లో అద్దె విధానానికి స్వ‌స్తి ప‌లికి ప‌ర్సంటేజీ ప‌ద్ధ‌తిని తీసుకురావాల‌ని ఇక్క‌డి ఎగ్జిబిట‌ర్లు ఎప్ప‌ట్నుంచో డిమాండ్ చేస్తూ…

32 minutes ago

స్నాక్ ప్యాకెట్లకు కలర్ కరువైంది

తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…

40 minutes ago

సూపర్ నిర్ణయం… GO వచ్చినా పాత రేట్లే

తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…

3 hours ago

నానితో క్లాష్… మెగాస్టార్ ఒప్పుకోరేమో

అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…

3 hours ago

పెద్ది మెడకు పర్సెంటేజ్ గొడవ

తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…

5 hours ago

‘నీట్’ గా పేపర్ అమ్మేశారట!

నీట్ యూజీ పేపర్ లీక్ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా 22 మంది లక్షల విద్యార్థుల…

5 hours ago