ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కి కేంద్ర హోం మంత్రిత్వ శాఖ జెడ్ క్యాటగిరి భద్రత కల్పించింది. సీఆర్పీఎఫ్ బలగాలతో లోకేష్కు భద్రత కల్పిస్తున్నట్లు హోంశాఖ ఉత్తర్వులలో పేర్కొంది. దీంతో కీలకమైన ఎన్నికల వేళ.. స్థానిక అధికారులు.. పోలీసుల నుంచి అడుగడుగునా తనిఖీలు తప్పినట్టే అయిందని అంటున్నారు సీనియర్ నాయకులు.
అక్టోబర్ 2016 ఏఓబి ఎన్ కౌంటర్ తరువాత లోకేష్ కి జెడ్ క్యాటగిరి భద్రత కల్పించాలని నాటి ఎస్ఆర్సీ( సెక్యూరిటీ రివ్యూ కమిటీ ) ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. మరోవైపు 2019 అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి అధికారంలోకి వచ్చిన వైసిపి ప్రభుత్వం వచ్చిన వెంటనే లోకేష్కు భద్రత తగ్గించింది. సెక్యూరిటీ రివ్యూ కమిటీ గతంలో చేసిన సిఫార్సులు పక్కన పెట్టిన వైసీపీ ప్రభుత్వం.. లోకేష్ కి వై క్యాటగిరి భద్రత మాత్రమే కల్పిస్తూ వస్తోంది.
ఈ నేపథ్యంలో తాజాగా కేంద్ర హోం శాఖ నారా లోకేష్కు ‘జడ్’ కేటగిరీ భద్రత కల్పించింది. ఆదివారం నుంచి ఆయన చుట్టూ కేంద్ర రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్పేఎఫ్)లోని వీఐపీ వింగకు చెందిన సాయుధ కమాండర్లు 33 మంది రక్షణగా నిలుస్తారు. నారా లోకేష్ ఎక్కడికి వెళ్లినా.. ఆయన వెంటే నడుస్తారు. ఆయనను వెన్నంటే ఉంటారు. నారా లోకేష్ను కలుసుకోవాలంటే.. రెండంచెల భద్రతను దాటి వెళ్లాల్సి ఉంటుంది.
ఎలా వచ్చింది?
ఈ మధ్య రిలీజ్ డేట్ ప్రకటించాక ఎంత ప్లాన్డ్ గా పనులు చేసినా చివరి నిమిషం వరకు వాయిదా ఉండదన్న…
మలయాళంలో బ్లాక్ బస్టర్ అవ్వొచ్చేమో కానీ తెలుగులో మాత్రం దృశ్యం 3ని ఫ్లాప్ గానే పరిగణించాలి. తక్కువ బిజినెస్ చేయడం…
మీలాగా మేం ఫామ్ హౌస్లో పడుకోవట్లే - అంటూ తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క.. బీఆర్ఎస్ పార్టీపై ఓ…
స్వతంత్ర దేశంలో చావు కూడా పెళ్లిలాంటిదే అన్నట్టుగా వైసీపీ నాయకులకు ఎక్కడ ఎలా వ్యవహరించాలో తెలియడం లేదన్న విమర్శలు వస్తున్నాయి.…
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) ఇంచార్జీ మీనాక్షి నటరాజన్ కు నిజంగానే షాక్…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేష్లు.. కూటమి ప్రభుత్వంలో కీలక రోల్ పోషిస్తున్న విషయం తెలిసిందే.…