ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కి కేంద్ర హోం మంత్రిత్వ శాఖ జెడ్ క్యాటగిరి భద్రత కల్పించింది. సీఆర్పీఎఫ్ బలగాలతో లోకేష్కు భద్రత కల్పిస్తున్నట్లు హోంశాఖ ఉత్తర్వులలో పేర్కొంది. దీంతో కీలకమైన ఎన్నికల వేళ.. స్థానిక అధికారులు.. పోలీసుల నుంచి అడుగడుగునా తనిఖీలు తప్పినట్టే అయిందని అంటున్నారు సీనియర్ నాయకులు.
అక్టోబర్ 2016 ఏఓబి ఎన్ కౌంటర్ తరువాత లోకేష్ కి జెడ్ క్యాటగిరి భద్రత కల్పించాలని నాటి ఎస్ఆర్సీ( సెక్యూరిటీ రివ్యూ కమిటీ ) ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. మరోవైపు 2019 అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి అధికారంలోకి వచ్చిన వైసిపి ప్రభుత్వం వచ్చిన వెంటనే లోకేష్కు భద్రత తగ్గించింది. సెక్యూరిటీ రివ్యూ కమిటీ గతంలో చేసిన సిఫార్సులు పక్కన పెట్టిన వైసీపీ ప్రభుత్వం.. లోకేష్ కి వై క్యాటగిరి భద్రత మాత్రమే కల్పిస్తూ వస్తోంది.
ఈ నేపథ్యంలో తాజాగా కేంద్ర హోం శాఖ నారా లోకేష్కు ‘జడ్’ కేటగిరీ భద్రత కల్పించింది. ఆదివారం నుంచి ఆయన చుట్టూ కేంద్ర రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్పేఎఫ్)లోని వీఐపీ వింగకు చెందిన సాయుధ కమాండర్లు 33 మంది రక్షణగా నిలుస్తారు. నారా లోకేష్ ఎక్కడికి వెళ్లినా.. ఆయన వెంటే నడుస్తారు. ఆయనను వెన్నంటే ఉంటారు. నారా లోకేష్ను కలుసుకోవాలంటే.. రెండంచెల భద్రతను దాటి వెళ్లాల్సి ఉంటుంది.
ఎలా వచ్చింది?
This post was last modified on March 31, 2024 12:40 pm
వైసీపీ పాలనా కాలంలో తిరుమల శ్రీవారి పరకామణిలో 900 డాలర్ల చోరీ జరిగిన విషయం తెలిసిందే. ఈ పరిణామం తిరుమల…
నేటి రాజకీయ నాయకులలో చాలామందిలో పారదర్శకత కోసం భూతద్దం వేసి వెతికినా కనిపించదు. జవాబుదారీతనం గురించి మాట్లడుకునే అవసరం లేదు.…
ప్రభాస్ సినిమా అంటే బడ్జెట్లు.. బిజినెస్ లెక్కలు.. వసూళ్లు అన్నీ భారీగానే ఉంటాయి. కొంచెం మీడియం బడ్జెట్లో తీద్దాం అని…
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్లో 5,757…
అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…