ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కి కేంద్ర హోం మంత్రిత్వ శాఖ జెడ్ క్యాటగిరి భద్రత కల్పించింది. సీఆర్పీఎఫ్ బలగాలతో లోకేష్కు భద్రత కల్పిస్తున్నట్లు హోంశాఖ ఉత్తర్వులలో పేర్కొంది. దీంతో కీలకమైన ఎన్నికల వేళ.. స్థానిక అధికారులు.. పోలీసుల నుంచి అడుగడుగునా తనిఖీలు తప్పినట్టే అయిందని అంటున్నారు సీనియర్ నాయకులు.
అక్టోబర్ 2016 ఏఓబి ఎన్ కౌంటర్ తరువాత లోకేష్ కి జెడ్ క్యాటగిరి భద్రత కల్పించాలని నాటి ఎస్ఆర్సీ( సెక్యూరిటీ రివ్యూ కమిటీ ) ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. మరోవైపు 2019 అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి అధికారంలోకి వచ్చిన వైసిపి ప్రభుత్వం వచ్చిన వెంటనే లోకేష్కు భద్రత తగ్గించింది. సెక్యూరిటీ రివ్యూ కమిటీ గతంలో చేసిన సిఫార్సులు పక్కన పెట్టిన వైసీపీ ప్రభుత్వం.. లోకేష్ కి వై క్యాటగిరి భద్రత మాత్రమే కల్పిస్తూ వస్తోంది.
ఈ నేపథ్యంలో తాజాగా కేంద్ర హోం శాఖ నారా లోకేష్కు ‘జడ్’ కేటగిరీ భద్రత కల్పించింది. ఆదివారం నుంచి ఆయన చుట్టూ కేంద్ర రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్పేఎఫ్)లోని వీఐపీ వింగకు చెందిన సాయుధ కమాండర్లు 33 మంది రక్షణగా నిలుస్తారు. నారా లోకేష్ ఎక్కడికి వెళ్లినా.. ఆయన వెంటే నడుస్తారు. ఆయనను వెన్నంటే ఉంటారు. నారా లోకేష్ను కలుసుకోవాలంటే.. రెండంచెల భద్రతను దాటి వెళ్లాల్సి ఉంటుంది.
ఎలా వచ్చింది?
This post was last modified on March 31, 2024 12:40 pm
తెలుగులో ఇప్పుడు ఏదైనా ఒక మంచి పాట రిలీజైతే సంగీత ప్రియులు ఓవైపు దాన్ని ఆస్వాదిస్తూనే, మరోవైపు ఆ సాంగ్…
వైసీపీ అధినేత జగన్పై టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు విమర్శలు గుప్పించడం అందరికీ తెలిసిందే. తరచుగా ఎక్కడ అవకాశం ఉన్నా..…
సినీ రంగంలో ఒకరు చేయాల్సిన పాత్ర ఇంకొకరికి వెళ్లడం చాలా కామన్ విషయం. కొన్నిసార్లు కొందరు ఆర్టిస్టులను ఎంచుకుని, వారు…
కొన్ని కార్యక్రమాల వేళ.. కొన్ని అంశాలకు ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. విశాఖపట్నంలోని ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాల సందర్భంగా భారీ…
ఏపీ సీఎం చంద్రబాబు అనుకున్నది సాధించడంలో దిట్ట. అది సమస్య అయినా, లేక అభివృద్ధి కార్యక్రమమైనా.. విషయం ఏదైనా చంద్రబాబు…
తెలుగుదేశం పార్టీ నేతలకు సీఎం, పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. ప్రజలు మీ…