Political News

పిఠాపురంలోనే ఇల్లు: ప‌వ‌న్

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్.. తాజాగా తాను పోటీ చేస్తున్న పిఠాపురం నియోజ‌క‌వ‌ర్గంలో ఎన్నిక‌ల ప్ర‌చారానికి కొబ్బ‌రికాయ కొట్టారు. ఇక్క‌డ నుంచే ఆయ‌న త‌న ప్ర‌చారాన్ని ప్రారంభించారు. వారాహి వాహ‌నానికి అధికారులు అనుమ‌తి లేద‌ని చెప్పారు. దీంతో ప‌వ‌న్‌.. వేరే వాహ‌నంపై ప్ర‌చారం చేశారు. కొద్దిదూరం ప‌ర్య‌టించి.. స్థానికుల‌తో మ‌మేక‌మ‌య్యారు. అంనంత‌రం ఆయ‌న ప్ర‌సంగిస్తూ.. పిఠాపురంలోనే తాను ఇల్లు కట్టుకుంటాన‌ని చెప్పారు. అంతేకాదు.. త‌న‌ను ఈ ఎన్నిక‌ల్లో గెలిపించాల‌ని.. అలా చేస్తే.. అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తాన‌ని ప‌వ‌న్ చెప్పారు.

ఇంకా ఆయ‌న మాట్లాడుతూ.. “పిఠాపురం నుంచి పోటీ చేస్తానని కలలో కూడా అనుకోలేదు. న‌న్ను గెలిపించండి. నియోజకవర్గాన్ని గుండెల్లో పెట్టుకుంటా. అధికారంలోకి రాగానే ఇక్కడి ఆసుపత్రులన్నీ బాగు చేయిస్తా. నైపుణ్యాభివృద్ధి కేంద్రాలు ఏర్పాటు చేస్తా. మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి పెట్టిస్తా. మోడల్‌ నియోజకవర్గంలా తీర్చిదిద్దుతా. పిఠాపురంలోనే ఇల్లు కట్టుకుంటా. నన్ను ఓడించడానికి చిత్తూరు జిల్లా నుంచి ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి వచ్చాడు. మండలానికి ఓ నాయకుడిని పెట్టారు. రూ.వందల కోట్లు ఖర్చు పెట్టేందుకు సిద్ధమయ్యారు. అయినా.. మీపై నాకు విశ్వాసం ఉంది. న‌న్ను గెలిపిస్తార‌ని ఆశిస్తున్నా” అని ప‌వ‌న్ వ్యాఖ్యానించారు.

పొత్తు అందుకే పెట్టుకున్నాం.

అనేక సార్లు నేను రైతుల‌ను క‌లిశా. సాధార‌ణ ప్ర‌జ‌ల‌ను క‌లిశా.. అని ప‌వ‌న్ అన్నారు. ఈ ఐదేళ్ల‌లో ప్ర‌జ‌లు న‌లిగిపోయారు. అన్ని వ‌ర్గాలు విల‌పిస్తున్నాయి. అందుకే ఈ దుర్మార్గమైన పాలనను అంతం చేయడానికే టీడీపీ, బీజేపీ, జనసేన కలిశాయని పవన్‌కల్యాణ్ చెప్పారు. తన కోసం సీటు త్యాగం చేసిన టీడీపీ నియోజకవర్గ ఇన్‌ఛార్జి స‌త్య‌నారాయ‌ణ వర్మకు ప‌వ‌న్ ధన్యవాదాలు తెలిపారు.

అంతా దోచేశారు!

కాకినాడ సెజ్‌కు భూములు ఇచ్చిన రైతులకు మేలు జరగలేదని ప‌వ‌న్ అన్నారు. ఉప్పాడ తీరం కోతకు గురవుతుంటే వైసీపీ నేతలు ఏం చేశారని నిల‌దీశారు. కాకినాడ పోర్టు.. డ్రగ్స్‌, బియ్యం, డీజిల్‌ మాఫియాకు అడ్డాగా మారింది. ఎన్నికల ఖర్చుకు కావాల్సిన డబ్బును ఆ పోర్టులోనే దాచారు. యువతకు రూ.5 వేల జీతం కావాలా? 25 ఏళ్ల భవిష్యత్తు కావాలా? అనేది తేల్చుకోవాలి. సీఎం జగన్ వ‌చ్చి క‌ల్ల‌బొల్లి క‌బుర్లు చెబుతాడు. ఆయ‌న మాయమాటలకు మోసపోకండి. జగన్ ప‌క్కా అవినీతిపరుడు. ఈ విష‌యం నేను ఆది నుంచి చెబుతున్నా. గద్దె దించాల్సిన సమయం వచ్చింది. ప్రజలు ఆలోచించాలి” అని పవన్ పిలుపునిచ్చారు. కాగా ఆదివారం కూడా పిఠాపురంలోనే ప‌వ‌న్ ప‌ర్య‌టించ‌నున్నారు.

This post was last modified on March 31, 2024 7:28 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఎయిర్ అంబులెన్స్ ప్రమాదం: బయటపడుతున్న నిజాలు

జార్ఖండ్‌లో జరిగిన ఎయిర్ అంబులెన్స్ ప్రమాదం ఇప్పుడు అనేక అనుమానాలకు తావిస్తోంది. రాంచీ నుండి ఢిల్లీకి రోగిని తరలిస్తుండగా చత్రా…

1 hour ago

వెంకటేష్ వదులుకుంటే మంచి నిర్ణయమే

ఇంకో ముప్పై నాలుగు రోజుల్లో మలయాళం దృశ్యం 3 విడుదల కానుంది. ఈ భాగంతో కథకు ముగింపు ఇవ్వబోతున్నారు. కొడుకు…

2 hours ago

పునర్విక ప్రాణాలకు లోకేష్ అండ

మంత్రి నారా లోకేష్ తన సహృదయత చాటుకున్నారు. ఎస్‌ఎంఏ టైప్–1 అనే అరుదైన జన్యు వ్యాధితో పోరాడుతున్న కర్నూలుకు చెందిన…

3 hours ago

తారక్ ‘డ్రాగన్’ కోసం మరో హీరో ?

జూనియర్ ఎన్టీఆర్, దర్శకుడు ప్రశాంత్ నీల్ కలయికలో తెరకెక్కుతున్న డ్రాగన్ (ప్రచారంలో ఉన్న టైటిల్) షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ కు…

5 hours ago

15 నిమిషాల దర్శనం… నటి క్లారిటీ

సెలబ్రిటీలు చిన్న వాళ్ళైనా పెద్దోళ్ళయినా ఏదైనా మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి ఉందిప్పుడు. సోషల్ మీడియా జమానాలో చిన్న టంగ్…

7 hours ago

పెద్ద ఒత్తిడిని ‘పెద్ది’ తట్టుకోగలదా

అభిమానుల్లోనే కాదు సినీ ప్రియుల్లోనూ విపరీతమైన అంచనాలు మోస్తున్న సినిమా పెద్ది. చికిరి చికిరి ఛార్ట్ బస్టర్ పుణ్యమాని హిందీలోనూ…

7 hours ago