ప్రస్తుతం ‘మేం సైతం సిద్ధం’ పేరుతో ఎన్నికల ప్రచారం చేస్తున్న సీఎం, వైసీపీ అధినేత జగన్.. చేస్తున్న వ్యాఖ్యల్లో తేడాలు కనిపిస్తున్నాయి. వీటిని నెటిజన్లు, ప్రతిపక్ష నాయకులు కూడా ట్రోల్ చేస్తున్నారు. తాజాగా ఉమ్మడి కర్నూలు జిల్లాలోని ఎమ్మిగనూరు నియోజకవర్గంలో పర్యటించిన జగన్.. ఇక్కడి వైసీపీ అభ్యర్థి బుట్టా రేణుకను ఆయన ప్రజలకు పరిచయం చేశారు. వాస్తవానికి కర్నూలు ప్రజలకు బుట్టా రేణుకను పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే.. ఆమె కర్నూలు ఎంపీగా 2014-19 వరకు పనిచేశారు.
ఇక, ఇప్పుడు కూడా కర్నూలు ఎంపీ అడిగినా.. ఆమెను ఎమ్మిగనూరు స్థానాన్ని ప్రకటించారు. ఇక్కడ నుంచి ఆమె పోటీ చేస్తున్నారు. ఎమ్మిగనూరు సభలో ఆమెను పరిచయం చేసిన సీఎం జగన్.. ఆమె గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బుట్టా రేణుక దగ్గర పెద్దగా డబ్బు లేదు. ఆమె కూడా అంతంత మాత్రమే అని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలే.. ఇప్పుడు ఎదురు దాడి చేస్తున్నాయి. వాస్తవానికి బుట్టా రేణుక.. ఆర్థికంగా స్థితిమంతురాలు. గత ఏడాది తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఒక పార్టీకి 100 కోట్లు విరాళం ఇచ్చారనే వార్తలు వచ్చాయి.
అలాంటి నాయకురాలిని పట్టుకుని అంతంతే అని వ్యాఖ్యానించడాన్ని తప్పుబడుతున్నారు. అంతే కాదు.. ఈ సందర్భంగా బుట్టా రేణుక ఆస్తులపైనా చర్చ జరుగుతోంది. ఆమె భర్త విద్యావ్యాపారంలో తల మునకలుగా ఉన్నారు.
This post was last modified on March 30, 2024 5:28 pm
2009లో అవతార్ సినిమా రిలీజైనపుడు వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ ఎలా షేక్ అయిపోయిందో తెలిసిందే. అప్పటిదాకా ఉన్న అన్ని బాక్సాఫీస్…
ఉప్పెన సినిమా చేసే సమయానికి కృతి శెట్టి వయసు కేవలం 17 ఏళ్లే. అంత చిన్న వయసులోనే ఆమె భారీ…
ఒకప్పుడు అప్పు చేయాలంటే భయపడేవాళ్లు, అది అవసరానికి మాత్రమే తీసుకునేవాళ్లు. కానీ ఇప్పుడు సీన్ మారింది. అప్పు చేయడం తప్పు…
కూలీ సినిమా విడుదలకు ముందు దర్శకుడు లోకేష్ కనకరాజ్ భవిష్యత్ ప్రాజెక్టుల గురించి ఎంత చర్చ జరిగిందో.. ఎన్ని ఊహాగానాలు…
అఖిల్ కెరీర్ను మార్చేస్తుందని.. అతడిని పెద్ద స్టార్ను చేస్తుందని అక్కినేని అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్న సినిమా.. ఏజెంట్. అతనొక్కడే,…
పెట్టుబడులు తీసుకురావడమే లక్ష్యంగా ఏపీ మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అమెరికా సహా పొరుగున ఉన్న…