ప్రస్తుతం ‘మేం సైతం సిద్ధం’ పేరుతో ఎన్నికల ప్రచారం చేస్తున్న సీఎం, వైసీపీ అధినేత జగన్.. చేస్తున్న వ్యాఖ్యల్లో తేడాలు కనిపిస్తున్నాయి. వీటిని నెటిజన్లు, ప్రతిపక్ష నాయకులు కూడా ట్రోల్ చేస్తున్నారు. తాజాగా ఉమ్మడి కర్నూలు జిల్లాలోని ఎమ్మిగనూరు నియోజకవర్గంలో పర్యటించిన జగన్.. ఇక్కడి వైసీపీ అభ్యర్థి బుట్టా రేణుకను ఆయన ప్రజలకు పరిచయం చేశారు. వాస్తవానికి కర్నూలు ప్రజలకు బుట్టా రేణుకను పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే.. ఆమె కర్నూలు ఎంపీగా 2014-19 వరకు పనిచేశారు.
ఇక, ఇప్పుడు కూడా కర్నూలు ఎంపీ అడిగినా.. ఆమెను ఎమ్మిగనూరు స్థానాన్ని ప్రకటించారు. ఇక్కడ నుంచి ఆమె పోటీ చేస్తున్నారు. ఎమ్మిగనూరు సభలో ఆమెను పరిచయం చేసిన సీఎం జగన్.. ఆమె గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బుట్టా రేణుక దగ్గర పెద్దగా డబ్బు లేదు. ఆమె కూడా అంతంత మాత్రమే అని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలే.. ఇప్పుడు ఎదురు దాడి చేస్తున్నాయి. వాస్తవానికి బుట్టా రేణుక.. ఆర్థికంగా స్థితిమంతురాలు. గత ఏడాది తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఒక పార్టీకి 100 కోట్లు విరాళం ఇచ్చారనే వార్తలు వచ్చాయి.
అలాంటి నాయకురాలిని పట్టుకుని అంతంతే అని వ్యాఖ్యానించడాన్ని తప్పుబడుతున్నారు. అంతే కాదు.. ఈ సందర్భంగా బుట్టా రేణుక ఆస్తులపైనా చర్చ జరుగుతోంది. ఆమె భర్త విద్యావ్యాపారంలో తల మునకలుగా ఉన్నారు.
This post was last modified on March 30, 2024 5:28 pm
‘సప్తసాగరాలు దాటి’ అనే చిన్న సినిమాతో రుక్మిణి వసంత్ అనే కన్నడ అమ్మాయి ఎంత మంచి పేరు సంపాదించిందో తెలిసిందే.…
ఒక భాష నుంచి ఆల్ టైమ్ హిట్ వస్తే.. ఆ ఇండస్ట్రీ అందుకు ఎంతో గర్విస్తుంది. ఆ సినిమా మాది…
నియోజకవర్గాల పునర్విభజన వేళ... దక్షిణాది రాష్ట్రాల నుంచి ఓ రకమైన భయాందోళన అయితే వ్యక్తం అవుతోంది. 2011 జనాభా లెక్కల…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చాక, ఆయన చేసిన చిత్రాల్లో అభిమానులను అత్యంత అలరించింది ఓజీనే. సినిమా…
ఈ ఏడాది దీపావళికి విడుదల కాబోతున్న రామాయణ పార్ట్ 1 మీద ఏ స్థాయిలో అంచనాలున్నాయో తెలిసిందే. ఇటీవలే రిలీజైన…
ఏపీలో అధికార కూటమికి సారధ్యం వహిస్తున్న తెలుగు దేశం పార్టీ (టీడీపీ)లో బుధవారం ఓ కీలక పరిణామం చోటుచేసుకుంది. ఓ…