ప్రస్తుతం ‘మేం సైతం సిద్ధం’ పేరుతో ఎన్నికల ప్రచారం చేస్తున్న సీఎం, వైసీపీ అధినేత జగన్.. చేస్తున్న వ్యాఖ్యల్లో తేడాలు కనిపిస్తున్నాయి. వీటిని నెటిజన్లు, ప్రతిపక్ష నాయకులు కూడా ట్రోల్ చేస్తున్నారు. తాజాగా ఉమ్మడి కర్నూలు జిల్లాలోని ఎమ్మిగనూరు నియోజకవర్గంలో పర్యటించిన జగన్.. ఇక్కడి వైసీపీ అభ్యర్థి బుట్టా రేణుకను ఆయన ప్రజలకు పరిచయం చేశారు. వాస్తవానికి కర్నూలు ప్రజలకు బుట్టా రేణుకను పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే.. ఆమె కర్నూలు ఎంపీగా 2014-19 వరకు పనిచేశారు.
ఇక, ఇప్పుడు కూడా కర్నూలు ఎంపీ అడిగినా.. ఆమెను ఎమ్మిగనూరు స్థానాన్ని ప్రకటించారు. ఇక్కడ నుంచి ఆమె పోటీ చేస్తున్నారు. ఎమ్మిగనూరు సభలో ఆమెను పరిచయం చేసిన సీఎం జగన్.. ఆమె గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బుట్టా రేణుక దగ్గర పెద్దగా డబ్బు లేదు. ఆమె కూడా అంతంత మాత్రమే అని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలే.. ఇప్పుడు ఎదురు దాడి చేస్తున్నాయి. వాస్తవానికి బుట్టా రేణుక.. ఆర్థికంగా స్థితిమంతురాలు. గత ఏడాది తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఒక పార్టీకి 100 కోట్లు విరాళం ఇచ్చారనే వార్తలు వచ్చాయి.
అలాంటి నాయకురాలిని పట్టుకుని అంతంతే అని వ్యాఖ్యానించడాన్ని తప్పుబడుతున్నారు. అంతే కాదు.. ఈ సందర్భంగా బుట్టా రేణుక ఆస్తులపైనా చర్చ జరుగుతోంది. ఆమె భర్త విద్యావ్యాపారంలో తల మునకలుగా ఉన్నారు.
ఏపీ సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. గతంలో ఐదేళ్లు పాలించిన జగన్.. నానుస్తూ వచ్చి.. చివరకు తనకు సాధ్యంకాదని…
వెంకటేష్, అనిల్ రావిపూడి అయిదోసారి చేతులు కలిపిన మల్టీస్టారర్ ఇటీవలే ప్రారంభమైన సంగతి తెలిసిందే. వెంకీకి తోడుగా కళ్యాణ్ రామ్…
పెళ్లయిన తర్వాత.. భార్యాభర్తల మధ్య గొడవలు జరగడం కామన్. ఈ క్రమంలో ఒకప్పుడు భార్యలను చంపే భర్తల వ్యవహారాలు పెద్ద…
కెరీర్ తొలి నాళ్లలో పెద్దగా అవకాశాలు లేనపుడు దక్షిణాదిన వచ్చే ప్రతి ఛాన్సునూ మహా ప్రసాదం అనుకుంటారు. స్టార్ ఇమేజ్…
మెగా హీరోల సినిమాలకు సంబంధించి ఏ ఈవెంట్ అయినా.. అందులో ఎక్కడో ఒక చోట పవర్ స్టార్ పవన్ కళ్యాణ్…
హైదరాబాద్ శిల్పకళా వేదికలో జరిగిన పెద్ది సక్సెస్ మీట్ కోసం వేలాది అభిమానులు తరలివచ్చారు. ఈ సినిమాకు సంబంధించి ఇదే…