Political News

రేవంత్ ను కలిసిన నందమూరి వారసురాలు

నంద‌మూరి కుటుంబం నుంచి రాజ‌కీయ అరంగేట్రం చేసిన రెండో మ‌హిళ‌.. నంద‌మూరి సుహాసిని. తొలి మ‌హిళ‌, ప్ర‌స్తుతం బీజేపీ ఏపీ అధ్య‌క్షురాలిగా ఉన్న పురందేశ్వ‌రి. అయితే.. సుహాసిని తాజాగా కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకునే అవ‌కాశం క‌నిపిస్తోంది. ఆమె నేరుగా సీఎం రేవంత్ రెడ్డిని క‌లుసుకున్నారు. రేవం త్ నివాసానికి వెళ్లిన నంద‌మూరి సుహాసిని పుష్పగుచ్ఛం అందించారు. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛా ర్జీ దీపాదాస్ మున్షీ, మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి సమక్షంలో ఆమె రేవంత్ ను కలిశారు.

అయితే.. ప్ర‌స్తుత లోక్ సభ ఎన్నికల సమయంలో రేవంత్ ను నంద‌మూరి సుహాసిని కలవడం ఆసక్తి కరం గా మారింది. పైగా.. ఇలా క‌లుస్తున్న వారంతా నాలుగు రోజుల్లోనో.. వారం రోజుల్లోనో పార్టీలు మారుతున్న విష‌యం తెలిసిందే. ఇక‌, ఇప్పుడు నంద‌మూరి సుహాసిని విష‌యం కూడా ఇంతేన‌ని రాజ‌కీయ వ‌ర్గాలు భావిస్తున్నారు. ఆమె కూడా త్వ‌ర‌లోనే.. పార్టీ తీర్థం పుచ్చుకునే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది. ప్ర‌స్తుతం నంద‌మూరి సుహాసిని తెలంగాణ టీడీపీ ఉపాధ్యక్షురాలిగా ఉన్నారు.

ఎవ‌రీ సుహాసిని?

మాజీ మంత్రి, అన్న‌గారు ఎన్టీఆర్ కుమారుడు నంద‌మూరి హ‌రికృష్ణ పెద్ద కుమార్తె సుహాసిని. ఫ్యాష‌న్ డిజైన‌ర్‌గా వృత్తిని ప్రారంభించిన ఆమె.. తొలినాళ్ల‌లో సినిమాల‌కు కూడా పనిచేశారు. త‌ర్వాత‌.. కుటుంబా నికే ప‌రిమిత‌మ‌య్యారు. 2018 ఎన్నికల్లో తొలిసారి టీడీపీ కండువా క‌ప్పుకొన్న సుహాసిని.. మహాకూటమిలో భాగంగా టీడీపీ తరపున కూకట్ పల్లి నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. ఆమె త‌ర‌ఫున అప్ప‌ట్లో నంద‌మూరి బాల‌కృష్ణ కూడా ప్ర‌చారం చేశారు. కానీ, ఆమె ఘోరంగా ఓడిపోయారు. ఇక, ప్ర‌స్తుత ఏపీ ఎన్నిక‌ల్లో అసెంబ్లీ టికెట్ కోసం ప్ర‌య‌త్నించినా.. అది ద‌క్క‌లేదు. ఇక‌, ఇప్పుడు ఆమె కాంగ్రెస్‌లోకి ప‌య‌నించ‌నున్నారు. ఇదే జ‌రిగితే.. ఇక‌, తెలంగాణ టీడీపీకి ఆమె రాజీనామా చేయ‌క‌త‌ప్ప‌దు.

This post was last modified on March 30, 2024 9:30 pm

Share

Recent Posts

వివేకా హత్యకు రూ.40 కోట్ల సుపారీ?

కడప ఎంపీ, వైసీపీ అధినేత జగన్ సోదరుడు వైఎస్ అవినాష్ రెడ్డి గృహాల్లో ఈడీ సోదాలతో మాజీ మంత్రి వైఎస్…

39 minutes ago

మెగాస్టార్ ప్రస్థానం… టాలీవుడ్ మాస్ సంతకం

తెలుగు సినిమా పుట్టిన తర్వాత ఎందరో లెజెండ్స్ ప్రేక్షకుల హృదయాల మీద చెరిగిపోని సంతకం చేశారు. చిత్తూరు నాగయ్య నుంచి…

49 minutes ago

సందీప్ వంగ ‘చిరు’ ఫ్యానిజం… ఇది చాలా లోతు బాసూ

అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్, యానిమల్ ఇలా తీసింది మూడు సినిమాలే అయినా ప్యాన్ ఇండియా లెవెల్ లో పాపులారిటీ…

1 hour ago

చిరంజీవి కాకా… అదిరింది కానుక

ఈ సంవత్సరం మన శంకరవరప్రసాద్ గారుతో మూడు వందల కోట్ల బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకున్న మెగాస్టార్ చిరంజీవి వచ్చే…

1 hour ago

ప్యారడైజ్ నిర్ణయం ఇరుముడికి వరం

ఒక్కోసారి మనం తీసుకునే నిర్ణయాలు పక్కవాళ్ళకు మేలు చేస్తాయి. ఇండస్ట్రీలో కూడా ఇది సర్వ సాధారణం. కాకపోతే ఈ ప్రయోజనం…

2 hours ago

గవర్నర్ గా యనమల రామకృష్ణుడు?

కేంద్రంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. జంతర్ మంతర్ దెబ్బకు కేంద్ర విద్యా శాఖ మంత్రి రాజీనామా చేయడం తెలిసిందే.…

4 hours ago