చంద్రబాబు. ఈ పేరు కష్టానికి చిరునామా.. విజన్కు మారుపేరు. రాబోయే 25 ఏళ్ల తర్వాత ఎలా ఉంటానే విషయాన్ని ముందుగానే లెక్కలు వేసుకుని.. దానికి తగిన విధంగా ఇప్పటి నుంచే ప్లాన్ చేసుకునే నాయకుడిగా చంద్రబాబుకు మంచి పేరుంది. ఆది నుంచి ఆయన రాజకీయ జీవితం.. పూల పాన్పుపై ప్రయాణ మైతే కాదు. ‘కష్టం-లక్ష్యం’ అనే ఈ రెండు పట్టాలే ప్రాతిపదికగా.. చంద్రబాబు రాజకీయ ప్రయాణం సాగింది. ఇప్పుడు 75 సంవత్సరాల వయసులోనూ చంద్రబాబు ఇదే ప్రయాణం కొనసాగిస్తున్నారు.
గత నాలుగున్నరేళ్లుగా చంద్రబాబు ఎంతో కష్టపడ్డారు. అయితే.. ఇప్పుడు ఈ 50 రోజుల కష్టం వేరేగా కనిపి స్తోంది. గత నాలుగు రోజులుగా చంద్రబాబును పరిశీలిస్తే.. ఆయన నిద్రపోతున్నది కేవలం 4 గంటే నాలు గే గంటలు. మిగిలిన సమయం అంతా కూడా పార్టీకోసమే ఆయన పనిచేస్తున్నారు. ఒకవైపు టికెట్లు రాలేదని రగడ, మరోవైపు టికెట్లు ఇచ్చినవారు ఏమేరకు ప్రజలను కలుస్తున్నారు..? వారి గ్రాఫ్ ఎలా ఉంది? వంటి అనేక విషయాలను పరిశీలిస్తున్నారు.
ఇంకోవైపు.. వ్యక్తిగతంగా తన నియోజకవర్గం కుప్పంపైనా ప్రత్యేక దృష్టి పెడుతున్నారు చంద్రబాబు. ఇక, కీలక నియోజకవర్గాల్లో వైసీపీ వేస్తున్న వ్యూహాలు, తాను అనుసరించాల్సిన ప్రతి వ్యూహాలు.. ఇలా ఒకటా రెండా.. లెక్కకు మిక్కిలిగా చంద్రబాబు ప్రతి క్షణం కష్టపడుతున్నారు. ఇప్పుడు ఈ ప్రస్తావన ఎందుకు వస్తోందంటే.. టికెట్లు ప్రకటించిన తర్వాత. కూడా ఇప్పటికీ 50 నియోజకవర్గాల్లో టీడీపీ నేతలు ముందుకు రాలేదు. తమకు టికెట్ ప్రకటించారని.. ప్రజలకు తమ మొహం చూపించాలని కూడా అనుకోలేదు.
కారణాలు ఏవైనా.. ఇలా చేయడం సరికాదనే వాదన వినిపిస్తోంది. ఎన్నికలకు 40 రోజులకు పైగానే సమ యం ఉందని.. కాబట్టి ఇప్పుడే వెళ్తే.. సొమ్ములు కరిగిపోతాయని అనుకుంటున్న నాయకులు.. ఇప్పటి నుంచి కేడర్ను పోషించలేమని చెబుతున్న నేతలు కూడా కనిపిస్తున్నారు. మరికొందరు విజిట్ చేస్తున్నారు. ఉదయం సాయంత్రం, వాక్కోసం వెళ్లినట్టు వెళ్తున్నారు. దీంతో చంద్రబాబు కష్టం ప్రస్తావనకు వస్తోంది. కీలకమైన ఎన్నికల సమయంలో చంద్రబాబు క్షణ కాలం కూడా వేస్ట్ చేయకుండా ముందుకు సాగుతున్నారు. మరి ఈ స్ఫూర్తి నాయకులు కూడా తీసుకుంటేనే గెలుపు గుర్రం ఎక్కుతారని అంటున్నారు పరిశీలకులు.
This post was last modified on March 30, 2024 11:57 am
జార్ఖండ్లో జరిగిన ఎయిర్ అంబులెన్స్ ప్రమాదం ఇప్పుడు అనేక అనుమానాలకు తావిస్తోంది. రాంచీ నుండి ఢిల్లీకి రోగిని తరలిస్తుండగా చత్రా…
ఇంకో ముప్పై నాలుగు రోజుల్లో మలయాళం దృశ్యం 3 విడుదల కానుంది. ఈ భాగంతో కథకు ముగింపు ఇవ్వబోతున్నారు. కొడుకు…
మంత్రి నారా లోకేష్ తన సహృదయత చాటుకున్నారు. ఎస్ఎంఏ టైప్–1 అనే అరుదైన జన్యు వ్యాధితో పోరాడుతున్న కర్నూలుకు చెందిన…
జూనియర్ ఎన్టీఆర్, దర్శకుడు ప్రశాంత్ నీల్ కలయికలో తెరకెక్కుతున్న డ్రాగన్ (ప్రచారంలో ఉన్న టైటిల్) షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ కు…
సెలబ్రిటీలు చిన్న వాళ్ళైనా పెద్దోళ్ళయినా ఏదైనా మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి ఉందిప్పుడు. సోషల్ మీడియా జమానాలో చిన్న టంగ్…
అభిమానుల్లోనే కాదు సినీ ప్రియుల్లోనూ విపరీతమైన అంచనాలు మోస్తున్న సినిమా పెద్ది. చికిరి చికిరి ఛార్ట్ బస్టర్ పుణ్యమాని హిందీలోనూ…