Political News

ఎంత క‌ష్ట‌మొచ్చింది సాయిరెడ్డీ!

నాయ‌కులు ఎంత బ‌లవంతులైనా.. ప్ర‌జాబ‌లం లేక‌పోతే.. ప్ర‌జ‌లు స‌మ‌ర్థించ‌క‌పోతే.. ఒట్టిపోతారు. అభాసు పాల‌వుతారు. న‌లుగురు న‌వ్వేలా కూడా అయిపోతారు. ఇప్పుడు నెల్లూరు పార్ల‌మెంటు నియోజ‌క‌వ‌ర్గం నుంచి వైసీపీ టికెట్‌పై బ‌రిలో ఉన్న రాజ్య‌స‌భ స‌భ్యుడు, వైసీపీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి వేణుంబాకం విజ‌య‌సాయిరెడ్డి ప‌రిస్థితి ఇలానే ఏర్ప‌డింది. తాజాగా ఆయ‌న ఎన్నిక‌ల ప్ర‌చారం ప్రారంభించారు. ఈ క్ర‌మంలో నెల్లూరులోని ఉద‌య‌గిరి నియోజ‌క‌వ‌ర్గంలో ఆయ‌న ప్ర‌చార ర‌థం ఎక్కి.. త‌న‌కు ఓట్లు వేయాల‌ని అభ్య‌ర్థించబోయారు.

కానీ, ఇక్క‌డే ప్ర‌జ‌ల నుంచి ఘోర అవ‌మానం ఎదురైంది. ఒక్క‌రంటే ఒక్క‌రు కూడా సాయిరెడ్డి చేసే ప్ర‌సంగం కోసం ఎద‌రు చూడ‌లేదు. అస‌లు ఆగ‌ను కూడా ఆగ‌లేదు. అంతేకాదు.. “మ‌న నాయ‌కుడు మాట్లాడుతున్నారు.. పెద్దాయ‌న మాట్లాడుతున్నారు. ఆగండి” అంటూ.. ప్ర‌చార ర‌థంపై నుంచి ద్వితీయ శ్రేణి నాయ‌కు లు మైకుల్లో బిగ్గ‌ర‌గా అరిచినా.. ప్ర‌యోజ‌నం క‌నిపించ‌లేదు. వ‌చ్చిన వారు వెళ్ల‌డ‌మే త‌ప్ప‌.. వెనుదిరిగి చూసిన వారు లేక‌పోవ‌డం గ‌మ‌నార్హం. సాధార‌ణ జ‌నాలు ఒక్క‌రంటే ఒక్క‌రు కూడా వెన‌క్కి అడుగు తిప్ప‌లేదు.

పోనీ.. సాధార‌ణ జ‌నాల మాట ఎలా ఉన్నా.. వైసీపీ కార్య‌క‌ర్త‌లైనా ఉన్నారా? అంటే.. వారు కూడా ప‌లాయ నం బాటే ప‌ట్టారు. చివ‌రాఖ‌రుకు.. భోజ‌నాలు సిద్ధంగా ఉన్నాయ‌ని.. ప‌దే ప‌దే మైకుల్లో గ‌గ్గోలు పెట్టారు. అయినా కూడా ఎవ‌రూ వెన‌క్కి రాలేదు. “క‌నీసం వెన‌క్కి ర‌మ్మ‌ని బ్ర‌తిమాలుకున్నందుకైనా వెన‌క్కి రావాలి.. అమ్మా.. అమ్మా.. ఒక్క‌సారి వెన‌క్కి చూడండి” అని వేడుకున్నా.. ఎవ‌రూ వెన‌క్కి కూడా చూడ‌లేదు. క‌నీసం ఆగ‌లేదు. దీంతో సాయిరెడ్డి ముఖం బాధాత‌ప్త‌మైంది. చేతిలో ఏవో పేప‌ర్లు ప‌ట్టుకుని ఏదో మాట్లాడాల‌ని ఆయ‌న ప్ర‌య‌త్నం చేసినా.. ఎవ‌రూ ప‌ట్టించుకోలేదు.

ఏం జ‌రిగింది?

సాయిరెడ్డి పాల్గొన్న స‌భ‌లో ఇలా జ‌నాలు వెనుదిరిగిపోవ‌డంపై వైసీపీలోనూ ఆశ్చ‌ర్యం వ్య‌క్త‌మ‌వుతోంది. అయితే.. దీనికి ప్ర‌ధానంగా ప్ర‌భుత్వంపై వ్య‌తిరేక‌తేనా కార‌ణం? అనేది ఒక‌టైతే.. మ‌రోవైపు స‌మ‌యానికి యాత్ర త‌మ నియోజ‌క‌వ‌ర్గానికి రాక‌పోవ‌డం.. పైన ఎండ ఠారెత్తి పోతుండ‌డంతో జ‌నాలు నిల‌వ‌లేని ప‌రిస్థితి నెల‌కొంద‌ని వైసీపీనాయ‌కులు అంటున్నారు. ఇక‌, ఉద‌య‌గిరి ప్ర‌జ‌ల‌కు సాయిరెడ్డి ఎవ‌రో తెలియ‌క‌పోవ‌డం.. ఆయ‌న ప్ర‌జాక్షేత్రంలో తొలి సారి ఎన్నిక‌ల్లో పోటీ చేస్తుండ‌డం కూడా ఆయ‌న ప్ర‌సంగాల‌కు ప్ర‌జ‌లు వెయిట్ చేయ‌లేద‌నే వాద‌న వినిపిస్తోంది. ఏదేమైనా.. వైసీపీ  కీల‌క నేత యాత్ర‌లో ఇంత ఘోర అవ‌మానం ఎదుర‌వడం గ‌మ‌నార్హం.

This post was last modified on March 29, 2024 3:47 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ప్రతిచోట చీపురు పట్టుకొని పవన్ ఊడవాలా?

పాలన అంటే కార్యాలయాల్లో కూర్చుని సమీక్షలు చేయడమే కాదు. ప్రజల మధ్యకు వెళ్లి వారి సమస్యలను ప్రత్యక్షంగా చూడడమే నిజమైన…

11 minutes ago

విమర్శకులను పనితీరుతో కొడుతున్న లోకేష్..!

తనపై విమర్శలు చేసే వారిని సహజంగా ఎవరైనా ప్రతివిమర్శలతో ఎదుర్కొంటారు. మాటకు మాట అంటారు. ఇక రాజకీయాల్లో అయితే ఈ…

2 hours ago

రండి.. కూర్చుని మాట్లాడుకుందాం: ఏపీకి రేవంత్ రెడ్డి పిలుపు

ఇరు తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న జల వివాదాలపై యాగీ చేసుకోకుండా కూర్చుని మాట్లాడుకుంటే సమస్యలు పరిష్కారం అవుతాయని తెలంగాణ…

2 hours ago

షమీ కెరీర్ క్లోజ్ అయినట్టేనా?

టీమ్ ఇండియా సీనియర్ పేసర్ మహమ్మద్ షమీ ఇంటర్నేషనల్ కెరీర్ దాదాపు ముగింపు దశకు చేరుకున్నట్లే కనిపిస్తోంది. గతేడాది జరిగిన…

3 hours ago

‘వైసీపీ చేసిన పాపాలను కడుగుతున్నాం’

రెండు రాష్ట్రాల మధ్య జల వివాదాలపై ఏపీ సీఎం చంద్రబాబు మరోసారి స్పందించారు. నీళ్లు వద్దు, గొడవలే కావాలని కొందరు…

11 hours ago

ఎలుకల మందు ఆర్డర్.. డెలివరీ బాయ్ ఏం చేశాడు?

సాధారణంగా ఏదైనా ఆర్డర్ ఇస్తే డెలివరీ బాయ్స్ వెంటనే ఇచ్చేసి వెళ్ళిపోతుంటారు. కానీ తమిళనాడులో జరిగిన ఒక ఘటన మాత్రం…

11 hours ago