Political News

కొత్త నాయకులను తయారుచేసుకుంటాం – కేటీఆర్

తెలంగాణ‌లో నిన్న మొన్న‌టి వ‌ర‌కు తిరుగులేని ఆధిప‌త్యం ప్ర‌ద‌ర్శించిన బీఆర్ ఎస్ పార్టికి ప్ర‌స్తుతం క‌ష్ట కాలం న‌డుస్తోంది. ఒక్కొక్కరుగా కాదు.. మంద‌లు మంద‌లుగా నాయ‌కులు పారిపోతున్నారు. పార్టీ నుంచి జారిపోతున్నారు. ఇలాంటి స‌మ‌యంలో ఎవ‌రికైనా.. ఏ పార్టీ అధినేత‌కైనా.. ఒకింత బాధ‌గానే ఉంటుంది. ఇదే బాధను బీఆర్ ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ కూడా వ్య‌క్తం చేశారు. అయితే.. ఆయ‌న కొంత ప‌దునైన వ్యాఖ్య‌లే వాడారు. “పోతున్న వారంతా రాజ‌కీయ బేహారులు” అని తిట్టిపోశారు.

“శూన్యం నుంచి సునామీ సృష్టించి, అసాధ్యం అనుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన ధీశాలి కేసీఆర్. ఒక్కడుగా బయల్దేరి, లక్షల మంది సైన్యాన్ని తయారు చేసి, ఎన్నో అవమానాలు, ద్రోహాలు, కుట్రలు, కుతంత్రాలు అన్నింటిని ఛేదించిన ధీరత్వం కేసీఆర్. అలాంటి ధీరుడు కేసీఆర్ ను కొన్ని కప్పదాట్లు, ద్రోహపు ఎత్తుగడలతో దెబ్బ తీయాలనుకునే రాజకీయ బేహారులకు తెలంగాణ ప్రజలే జవాబు చెపుతారు” అని కేటీఆర్ వ్యాఖ్యానించారు.

అంతేకాదు.. ప్రజల ఆశీర్వాదం, మద్దతుతో 14 ఏళ్లు పోరాడి, ఉద్యమ పార్టీగా తెలంగాణను సాధించి… తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్ర దశను, దిశను మార్చి కోట్లాది మంది జీవితాల్లో వెలుగులు నింపిన కేసీఆర్ ను, బీఆర్ఎస్ పార్టీని ప్రజలే గుండెల్లో పెట్టుకుని కాపాడుకుంటారని కేటీఆర్ అన్నారు. పార్టీలో నికార్సైన కొత్త తరం నాయకత్వాన్ని తయారు చేస్తామని, పోరాటపంథాలో కదం తొక్కుదామని ఆయన  పేర్కొన్నారు.

ఇదిలావుంటే.. తాజాగా మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యే, కేసీఆర్‌కు అత్యంత స‌న్నిహితుడ‌నే పేరు తెచ్చుకు న్న ఇంద్ర‌క‌ర‌ణ్‌రెడ్డి సైతం బీఆర్ ఎస్‌కు రాజీనామా చేశారు. ఆయ‌న కూడా త్వ‌ర‌లోనే కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారు. ఇదిలావుంటే.. కేటీఆర్ వ్యాఖ్య‌లు చేస్తున్న స‌మ‌యంలో ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి పార్టీ స‌భ్య‌త్వానికి రాజీనామా ప్ర‌క‌టించ‌డం గ‌మ‌నార్హం.

This post was last modified on March 29, 2024 2:10 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

`ఏఐ`లో ఏపీ దూకుడు.. పార్ల‌మెంటు సాక్షిగా కేంద్రం!

ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉంద‌ని కేంద్ర ప్ర‌భుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్ప‌త్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…

1 hour ago

అధికారంలో ఉన్నాం ఆ తమ్ముళ్ల బాధే వేరుగా ఉందే…!

అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…

4 hours ago

డాలర్లు, మంచి లైఫ్ కోసం విదేశాలకు వెళ్ళాక నిజం తెలిసింది

డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…

7 hours ago

జగన్ ఇలానే ఉండాలంటూ టీడీపీ ఆశీస్సులు

వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవ‌రినీ దెబ్బతీయరు.…

10 hours ago

టీం ఇండియా ఇప్పటికైన ఆ ప్లేయర్ ను ఆడిస్తుందా?

రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…

10 hours ago

చరిత్ర ఎన్నోసార్లు హెచ్చరిస్తూనే ఉంది

కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…

12 hours ago