అవును ఈ విషయం ఇపుడు తెలుగుదేశంపార్టీలో సంచలనంగానే మారింది. ఒకవైపు అమరావతి రాజధాని ప్రాంతంలో భూముల విషయంలో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందని ప్రభుత్వం సిబిఐ విచారణ జరపటానికి ఇప్పటికే కేంద్రానికి సిఫారసు చేసింది. కేంద్ర హోంశాఖ గనుక సానుకూలంగా స్పందిస్తే చంద్రబాబునాయుడుకు ఇబ్బందులు మొదలవ్వటం ఖాయం. ఈ విషయమే కేంద్రం దగ్గర పెండింగ్ లో ఉండగానే తాజాగా ఏపి ఫైబర్ నెట్ స్కాంను కూడా సిబిఐ విచారణ జరిపాలంటూ ప్రభుత్వం కేంద్రానికి సిఫారసు చేసిన విషయం బయటపడింది.
నిజానికి ఇన్ సైడర్ ట్రేడింగ్, ఏపి ఫైబర్ నెట్ లో వేల కోట్ల రూపాయల కుంభకోణం జిరగిందని వైసిపి ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుండే ఆరోపణలు చేస్తోంది. దానికి తగ్గట్లే అధికారంలోకి రాగానే అనేక అంశాలపై మంత్రివర్గం ఉపసంఘంతో విచారణ కూడా చేయించింది. ఇన్ సైడర్ ట్రేడింగ్, ఏపి ఫైబర్ నెట్ వ్యవహారాల్లో భారీ ఎత్తున అవినీతి జరిగిందని ఉపసంఘం కూడా తన నివేదికలో బయటపెట్టింది. ఇన్ సైడర్ ట్రేడింగ్ లో చంద్రబాబు మద్దతుదారులు+ కొందరు టిడిపి సీనియర్లు అండ్ కో అమరావతి ప్రాంతంలో సుమారు 4077 ఎకరాలు సొంతం చేసుకున్నారని తేల్చింది. అలాగే ఫైబర్ నెట్ లో సుమారు రూ. 2 వేల కోట్ల అవినీతి జరిగిందని కూడా రిపోర్టులో చెప్పింది.
ఫైబర్ నెట్ లో ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్నది చినబాబు లోకేషే అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎందుకంటే ఫైబర్ నెట్ వ్యవస్ధ ఐటి శాఖ పరిధిలోనే పనిచేసింది. ఐటి శాఖకు మంత్రి లోకేషే. ఈవిఎంల ట్యాంపరింగ్ లో బుక్కయి జైలుకు కూడా వెళ్ళొచ్చిన వేమూరు హరికృష్ణ ప్రసాద్ ఫైబర్ నెట్ లో కీలక పాత్ర పోషించారు. వైసిపి నేతల ఆరోపణల ప్రకారం వేమూరి చంద్రబాబు, లోకేష్ కు బినామీ. ఈ ఆరోపణతోనే అప్పట్లో వైసిపి ప్రధానంగా లోకేష్ ను టార్గెట్ చేసింది. ఎటూ అధికారంలోకి వచ్చింది కాబట్టి చెప్పినట్లుగానే వెంటనే విచారణ కూడా చేయించింది. మంత్రివర్గ ఉపసంఘం విచారణలో తేలిన విషయాల ఆధారంగా సిబిఐ విచారణకు సిఫారసు చేసింది.
ప్రభుత్వ సిఫారసును గనుక కేంద్ర హోంశాఖ సానుకూలంగా స్పందిస్తే వెంటనే చంద్రబాబు, లోకేష్ పై సిబిఐ విచారణ మొదలవ్వటం ఖాయం. దేశం మొత్తం మీద ఒకేసారి తండ్రి, కొడుకుల మీద సిబిఐ విచారణ జరగటం బహుశా ఏపిలోనే మొదటి కేసవుతుందేమో. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసిన సిఫారసు కార్యరూపంలోకి రావాలంటే ముందు నరేంద్రమోడి ఆమోదం పొందాలి. ఎందుకంటే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రస్తుతం అనారోగ్యంతో ఆసుపత్రిలో ఉన్నారు. ఇదే సమయంలో సోమవారం నుండి మొదలయ్యే పార్లమెంటు సమావేశాలు అక్టోబర్ 1వ తేదీ వరకు జరుగుతుంది. కాబట్టి ఈ సందర్భంగానే మోడి నిర్ణయం తీసుకుంటారా ? లేకపోతే బిజీగా ఉన్న కారణంగా నిర్ణయాన్ని వాయిదా వేస్తారా చూడాల్సిందే.
This post was last modified on September 14, 2020 6:03 pm
దేశంలోని ఐదు రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. ఆయా రాష్ట్రాల్లో కొత్త ప్రభుత్వాలు ఏర్పాటయ్యాయి. తమిళనాడు, కేరళలో ప్రభుత్వాలు…
తెలంగాణ సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ అమలు చేసే విషయం గురించి గత కొద్దిరోజులుగా టాలీవుడ్ లో తీవ్ర వాగ్వాదాలు, ప్రెస్…
హైదరాబాద్ మూసాపేట్ శ్రీరాములు థియేటర్ చాలా పాతది. అందులో మూవీ లవర్స్ కి ఎన్నో జ్ఞాపకాలు ఉన్నాయి. ఆ మధ్య…
నిజమేనండోయ్,… ఏపీ అంటే ఆంధ్ర ప్రదేశ్ మాత్రమే కాదు. అడ్వాన్స్ డ్ ప్రదేశ్ కూడా. ఎందుకో తెలుసా? భవిష్యత్తును కాస్తంత…
తెలంగాణలో తొలి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ పదేళ్ల పాటు రాష్ట్రాన్ని పాలించింది. 2023లో జరిగిన మూడో ఎన్నికలో ఆ…
తమిళనాడు నూతన ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ రాజకీయ తెరంగేట్రం ఆదిలోనే కష్టనష్టాలను చవిచూసింది. ఎన్నికలకు కాస్తంత ముందుగా కరూర్ లో…