Political News

ఏపీకి ఈసీ నుంచి ముగ్గురు అధికారులు.. తేడా వ‌స్తే.. అంతే!

ఏపీలో ఎన్నిక‌ల‌ను ప్ర‌తిష్టాత్మకంగా తీసుకున్న కేంద్ర ఎన్నిక‌ల సంఘం.. ఎలాంటి అవ‌క‌త‌వ‌క‌లు రాకుండా చ‌ర్య‌లు చేప‌డుతోంది. ఈ క్ర‌మంలో  సంఘం ఏపీకి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులను నియమిం చింది. సాధారణ ఎన్నికల అబ్జర్వర్ గా రామ్ మోహన్ మిశ్రా, స్పెషల్ పోలీస్ అబ్జర్వర్ గా రిటైర్డ్ ఐపీఎస్ దీపక్ మిశ్రా, రిటైర్డ్ ఐఆర్ఎస్ అధికారి నీనా నిగమ్ ను ఎన్నికల వ్యయ పరిశీలకుడిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

రామ్మోహన్ మిశ్రా 1987వ బ్యాచ్ కు చెందిన ఐఏఎస్ అధికారి కాగా.. దీపక్ మిశ్రా 1984 బ్యాచ్, నీనా నిగమ్ 1983 బ్యాచ్ కు చెందిన ఐపీఎస్ అధికారులు. ఈ ముగ్గురు అధికారులు వచ్చే వారం ఏపీలో పర్యటించ నున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాష్ట్రంలో ఏర్పాట్లను వీరు క్షుణ్ణంగా పరిశీలిస్తారు. ఎన్నికల నిర్వహణలో ఈసీ మార్గదర్శకాలను పటిష్టంగా అమలు జరిగేలా చర్యలు చేపట్టనున్నారు.

రాష్ట్ర సరిహద్దు ప్రాంతాలు, సమస్యాత్మక ప్రాంతాలతో పాటు ఓటర్లను ఆకర్షించే గిఫ్ట్స్, తాయిలాల ని యంత్రణపై వీరు ప్ర‌త్యేకంగా దృష్టి సారిస్తారు. ఎపీలో ఎక్కడెక్కడ పొరపాట్లు జరుగుతున్నాయనే అంశా లపై వీరు కేంద్ర ఎన్నికల సంఘానికి నివేదించనున్నారు.  ఎన్నికల కోడ్ నేపథ్యంలో రాజకీయ పార్టీలకు చెందిన నేతల వ్యవహారశైలి, ప్రచారం వంటి అంశాలపై ఈసీ ప్రత్యేక దృష్టి సారించింది.

ఇప్పటికే రాజకీయ పార్టీల ప్రచారానికి సంబంధించి అనేక నిబంధనలు విధించిన ఎన్నికల కమిషన్‌.. తాజాగా ఇంటింటి ప్రచారానికి సంబంధించి కొన్ని షరతులను విధించింది. ఈ మేరకు రాజకీయ పార్టీల ప్రతినిధులతో సచివాలయంలోని ఈసీ కార్యాలయంలో సీఈవో ముఖేష్ కుమార్ మీనా ఇటీవల సమావేశం నిర్వహించారు. ఎన్నికల నిబంధనలు, ప్రచార అనుమతులకు సంబంధించి కీలక సూచనలు చేశారు. 

This post was last modified on March 28, 2024 11:48 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

బాబీ గారు… ప్రేక్షకులు ఎప్పుడైనా రైటే

భర్త మహాశయులకు విజ్ఞప్తి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో గెస్టుగా వచ్చిన దర్శకుడు బాబీ మాట్లాడుతూ రవితేజ రొటీన్ సినిమాలు…

7 hours ago

‘ఇవేవీ తెలియకుండా జగన్ సీఎం ఎలా అయ్యాడో’

వైసీపీ అధినేత జగన్‌పై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిపై జగన్ రెండు రోజుల కిందట…

8 hours ago

అఫీషియల్: తెలంగాణ ఎన్నికల్లో జనసేన పోటీ

తెలంగాణలో త్వరలో జరగనున్న మునిసిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ అధికారికంగా ప్రకటించింది.“త్వరలో జరగనున్న తెలంగాణ…

8 hours ago

‘నువ్వు బ‌జారోడివి కాదు’… అనిల్ మీమ్ పంచ్

సినిమాల మీద మీమ్స్ క్రియేట్ చేయ‌డంలో తెలుగు వాళ్ల‌ను మించిన వాళ్లు ఇంకెవ్వ‌రూ ఉండ‌రంటే అతిశ‌యోక్తి కాదు. కొన్ని మీమ్స్…

9 hours ago

జగన్ చేతులు కాల్చాకా నేతలు ఆకులు పట్టుకున్నారు

అమరావతిని ఉద్దేశించి వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపాయి. రాజధానిని సో-కాల్డ్ నగరంగా అభివర్ణిస్తూ,…

11 hours ago

కైట్ కుర్రోళ్లు… ఇప్పటికైనా అర్థం చేసుకోండి

సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు…చిన్నా పెద్దా అని తేడా లేకుండా పతంగులు ఎగరేస్తుంటారు. పండుగ పూట కుటుంబ సభ్యులు, మిత్రులతో…

11 hours ago