Political News

ఏపీకి ఈసీ నుంచి ముగ్గురు అధికారులు.. తేడా వ‌స్తే.. అంతే!

ఏపీలో ఎన్నిక‌ల‌ను ప్ర‌తిష్టాత్మకంగా తీసుకున్న కేంద్ర ఎన్నిక‌ల సంఘం.. ఎలాంటి అవ‌క‌త‌వ‌క‌లు రాకుండా చ‌ర్య‌లు చేప‌డుతోంది. ఈ క్ర‌మంలో  సంఘం ఏపీకి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులను నియమిం చింది. సాధారణ ఎన్నికల అబ్జర్వర్ గా రామ్ మోహన్ మిశ్రా, స్పెషల్ పోలీస్ అబ్జర్వర్ గా రిటైర్డ్ ఐపీఎస్ దీపక్ మిశ్రా, రిటైర్డ్ ఐఆర్ఎస్ అధికారి నీనా నిగమ్ ను ఎన్నికల వ్యయ పరిశీలకుడిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

రామ్మోహన్ మిశ్రా 1987వ బ్యాచ్ కు చెందిన ఐఏఎస్ అధికారి కాగా.. దీపక్ మిశ్రా 1984 బ్యాచ్, నీనా నిగమ్ 1983 బ్యాచ్ కు చెందిన ఐపీఎస్ అధికారులు. ఈ ముగ్గురు అధికారులు వచ్చే వారం ఏపీలో పర్యటించ నున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాష్ట్రంలో ఏర్పాట్లను వీరు క్షుణ్ణంగా పరిశీలిస్తారు. ఎన్నికల నిర్వహణలో ఈసీ మార్గదర్శకాలను పటిష్టంగా అమలు జరిగేలా చర్యలు చేపట్టనున్నారు.

రాష్ట్ర సరిహద్దు ప్రాంతాలు, సమస్యాత్మక ప్రాంతాలతో పాటు ఓటర్లను ఆకర్షించే గిఫ్ట్స్, తాయిలాల ని యంత్రణపై వీరు ప్ర‌త్యేకంగా దృష్టి సారిస్తారు. ఎపీలో ఎక్కడెక్కడ పొరపాట్లు జరుగుతున్నాయనే అంశా లపై వీరు కేంద్ర ఎన్నికల సంఘానికి నివేదించనున్నారు.  ఎన్నికల కోడ్ నేపథ్యంలో రాజకీయ పార్టీలకు చెందిన నేతల వ్యవహారశైలి, ప్రచారం వంటి అంశాలపై ఈసీ ప్రత్యేక దృష్టి సారించింది.

ఇప్పటికే రాజకీయ పార్టీల ప్రచారానికి సంబంధించి అనేక నిబంధనలు విధించిన ఎన్నికల కమిషన్‌.. తాజాగా ఇంటింటి ప్రచారానికి సంబంధించి కొన్ని షరతులను విధించింది. ఈ మేరకు రాజకీయ పార్టీల ప్రతినిధులతో సచివాలయంలోని ఈసీ కార్యాలయంలో సీఈవో ముఖేష్ కుమార్ మీనా ఇటీవల సమావేశం నిర్వహించారు. ఎన్నికల నిబంధనలు, ప్రచార అనుమతులకు సంబంధించి కీలక సూచనలు చేశారు. 

This post was last modified on March 28, 2024 11:48 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

జెట్ స్పీడ్ రావిపూడికి ‘చిరు’ మద్దతు

మెగాస్టార్ లాంటి సీనియర్ హీరోతో సినిమా అంటే ఏ దర్శకుడైనా తొందరరపడకుండా ఆచితూచి అడుగులు వేస్తాడు. కానీ అనిల్ రావిపూడి…

5 minutes ago

పాలస్తీన్‌లోని 10 మంది భారతీయులను రక్షించిన ఇజ్రాయెల్

పాలస్తీన్‌లోని వెస్ట్ బ్యాంక్ ప్రాంతంలో చిక్కుకున్న 10 మంది భారతీయ కార్మికులను ఇజ్రాయెల్ రక్షించింది. ఈ కార్మికులు ఒక నెల…

8 minutes ago

చంద్రుడిపై నీటి ఆనవాళ్లు.. భవిష్యత్తులో ప్రయోజనమా?

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) చేపట్టిన చంద్రయాన్-3 మిషన్ మరో కీలక ఆవిష్కరణ చేసింది. చంద్రుని ధృవ ప్రాంతాల్లో…

58 minutes ago

అల్లు అర్జున్ సినిమాలో అమరన్ హీరో ?

పుష్ప 2 ది రూల్ రిలీజై మూడు నెలలు దాటిపోయాక అల్లు అర్జున్ కొత్త సినిమా ఎప్పుడు మొదలవుతుందాని అభిమానులు…

1 hour ago

విజ‌య‌సాయి బీజేపీ ఎంట్రీ ముహూర్తం ఫిక్స్ .. ?

ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వైసీపీ అధినేత‌, మాజీ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డికి ఒక‌ప్పుడు ఎంతో…

2 hours ago

స్మగ్లర్ల బుర్రా.. బంగారానికి కొత్త మాయలు!

ఇటీవల కన్నడ నటి రాన్యా రావు అక్రమ బంగారం స్మగ్లింగ్ కేసు పెద్ద చర్చకు దారితీసింది. ఓ టాప్ పోలీసు…

2 hours ago